తమ దేశంలో పర్యటించేందుకు జింబాబ్వే ఆటగాళ్లకు లంచాలు ఇచ్చామనే ఆరోపణలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ ఖండించారు.
జింబాబ్వే పర్యటనపై పాక్
కరాచీ: తమ దేశంలో పర్యటించేందుకు జింబాబ్వే ఆటగాళ్లకు లంచాలు ఇచ్చామనే ఆరోపణలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ ఖాన్ ఖండించారు. జింబాబ్వే బోర్డుకు ఖర్చుల కింద దాదాపు 5 మిలియన్ డాలర్ల (రూ. 3 కోట్ల 20 లక్షలు)ను ఇచ్చినట్టు ఆయన తెలిపారు. పాక్లో ఆడినందుకు జింబాబ్వే క్రికెటర్లకు లంచాలు ఇచ్చారంటూ కథనాలు వచ్చాయి.