power center
-
ఒడిశాలో 1,600 మెగావాట్ల విద్యుత్ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్లో మార్చి నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఒడిశాలోని కోణార్క్లో జరుగుతున్న మూడో జాతీయ మైనింగ్ మంత్రుల సదస్సులో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డితో కలిసి ఆ రాష్ట్ర సీఎం మోహన్ చరణ్ మాఝీకి ఆయన విజ్ఞాపన లేఖను అందజేశారు. నైనీ బ్లాకు ఏర్పాటుకు ఒడిశా సీఎం కార్యాలయం మద్దతు ఇచి్చనందుకు ఆయన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. నైనీ గనికి సమీపంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో విద్యుత్ కేంద్రం స్థాపనకు భూమిని కేటాయించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరగా, ఒడిశా సీఎం సానుకూలంగా స్పందించి సహకరిస్తామని హామీ ఇచ్చారు.‘గత జూలై 24న మీతో జరిగిన సమావేశాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆ చర్చలు ఫలవంతమయ్యాయి’అని భట్టి సంతోషం వ్యక్తం చేశారు. నైనీ గనిలో ఉత్పత్తయిన బొగ్గును 1000 కి.మీ. దూరంలో ఉన్న మంచిర్యాల జిల్లా జైపూర్లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్కు తరలిస్తే రవాణా ఖర్చులు పెరిగి విద్యుత్ ధరలూ భారీగా పెరుగుతాయి. ఈ నేపథ్యంలో నైనీ గనికి సమీపంలో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఉత్పత్తయ్యే బొగ్గును అక్కడే వినియోగించాలని నిర్ణయించామని భట్టి తెలిపారు. 20వ ఎలక్ట్రిక్ పవర్ సర్వే ప్రకారం వచ్చే మూడు దశాబ్దాలపాటు థర్మల్ విద్యుత్కు భారీ డిమాండ్ ఉంటుందన్నారు. బొగ్గు గనుల దగ్గరే కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు.దీంతో బొగ్గు రవాణా ఖర్చులను తగ్గించడంతోపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా, పర్యావరణ పర్యవేక్షణకు అవకాశం ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరారు. సింగరేణి, ఒడిశా అధికారుల మధ్య జరిగిన చర్చల్లో ప్రాథమికంగా జరపాడ/తుకుడ, హండప్ప/బని నాలిని ప్రాంతాల్లో విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తే రెండు రాష్ట్రాలకూ ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయానికి వచ్చారన్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలతోపాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. 10 ప్రాజెక్టులకు నిధులిప్పించండి తెలంగాణ చేపడుతున్న పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్థిక సాయంతోపాటు అనుమతులు ఇప్పించేందుకు సహకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని కోరారు. ప్రభుత్వం చేపడుతున్న పది ప్రాజెక్టులకు మొత్తం రూ.1,63,559 కోట్ల వ్యయం కానుందని తెలిపా రు. మైనింగ్ మంత్రుల సమావేశంలో ఆయా ప్రాజెక్టుల ఆర్థిక అంచనాలు, అనుమతుల ప్రతిపాదనల తో కూడిన వినతిపత్రాన్ని కిషన్రెడ్డికి అందజేశారు. 32 ఖనిజ బ్లాకులను వేలం వేస్తాంసున్నపురాయి, మాంగనీసు వంటి 32 మేజర్ ఖనిజ బ్లాకులను 2024–25, 2025–26 సంవత్సరాలకు సంబంధించి వేలం వేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. 2014లో రూ.1958 కోట్లుగా ఉన్న ఖనిజ ఆదాయం 2023–24 నాటికి రూ.5,540 కోట్లకు పెరిగిందన్నారు. జాతీయ ఖనిజ మంత్రుల సమావేశంలో భట్టి ప్రసంగించారు. ‘జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలకు అనుగుణంగా ఖనిజాన్వేషణ, నిర్వహణ ఉండాలి. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ దేశీయంగా ఖనిజ పరిశ్రమలను ప్రోత్సహించాలి. రాష్ట్రంలో మొత్తం 2,552 గనుల లీజుల ఉన్నాయని, చిన్న ఖనిజాల లీజు మంజూరు విషయంలో బ్లాక్ల వేలం విధానంలో అనుసరించే నిబంధనలు పాటిస్తున్నాం’అని భట్టి వెల్లడించారు. జిల్లా మినరల్ ఫౌండేషన్ ద్వారా 2015 నుంచి ఇప్పటివరకు రూ. 5,537 కోట్లు వసూలైందని, ఈ నిధిని ప్రభుత్వ పాఠశాలలతో పాటు పలు ప్రాధాన్యతా రంగాల్లో వినియోగిస్తున్నామన్నారు. -
జల విద్యుత్ కేంద్రం పనుల పరిశీలన
దేవీపట్నం : మండలంలోని అంగుళూరు గ్రా మం వద్ద జరుగుతున్న పోలవరం ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రానికి చెందిన మట్టిపనులను ఏపీ జెన్కో డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 960 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం గల జల విద్యుత్తు కేంద్రం నిర్మాణాన్ని త్వరతగతిన పూర్తిచేయాలని సంకల్పించినట్టు తెలిపారు. ఆ దిశగా మట్టి పనులను వేగవంతం చేయాలని సైట్ అధికారులను ఆయన ఆదేశించారు. ఏపీ జెన్కో సల హాదారుడు ఆదిశేషు మాట్లాడుతూ ప్రస్తుతం రోజుకు 3,800 క్యూబిక్ మీటర్ల మట్టిపని మాత్రమే జరుగుతోందన్నారు. కానీ రోజుకు 30 వేల క్యూబిక్ మీటర్ల మట్టిపని చేస్తే తప్ప నిరే్ధశిత సమయానికి పనులు పూర్తికావన్నారు. ఇందుకనుగుణంగా యంత్రాలను పెంచి పనులు వేగంగా పూర్తిచేయాలని సంబంధిత కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్స్ట్రాయ్ అధికారులను వారు ఆదేశించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న పనులను ఏపీ జెన్కో ఈఈ కొలగాని వీవీఎస్ మూర్తి వివరించారు. కార్యక్రమంలో జెన్కో ఇంజనీర్లు కె.రత్నబాబు, స్వామినాయుడు, కోటేశ్వరరావు, రాజ్కుమార్, రామకృష్ణ, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. -
‘యాదాద్రి విద్యుత్’కు కేంద్రం ఆమోదం!
ప్రాజెక్టు సూచన నిబంధనలను ఆమోదించిన పర్యావరణ శాఖ పర్యావరణ అనుమతుల జారీకి మార్గం సుగమం ఆ తర్వాతే ప్రారంభం కానున్న ప్రాజెక్టు నిర్మాణ పనులు 2018లోగా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా దామరచర్లలో యాదాద్రి సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి పర్యావరణ అనుమతుల జారీకి మార్గం సుగమమైంది. 4000(5ఁ800) మెగావాట్ల భారీ విద్యుదుత్పత్తి సామర్థ్యంతో తెలంగాణ జెన్కో తలపెట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పాటించాల్సిన సూచన నిబంధనలను(టర్మ్ ఆఫ్ రిఫరెన్స్-టీవోఆర్)ను తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. శుక్రవారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ జెన్కో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ డి.ప్రభాకర్ రావు నేతృత్వంలో డెరైక్టర్(ప్రాజెక్టులు) రాధాకృష్ణ, చీఫ్ ఇంజనీర్ అజయ్ బృందం ఈ సమావేశంలో పాల్గొని కేంద్ర పర్యావరణ శాఖ విధించే షరతులకు లోబడి ప్రాజెక్టు నిర్మాణాన్ని జరుపుతామని అంగీకరించడంతో టీఓఆర్ను ఆమోదించాలని నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి గతంలో జరిగిన రెండు సమావేశాల్లో ఈ ప్రాజెక్టు టీవోఆర్ను ఆమోదించేందుకు పర్యావరణ నిపుణుల కమిటీ అంగీకరించలేదు. వాస్తవానికి గత అక్టోబర్ 29న జరిగిన సమావేశంలో ఏకంగా ఈ ప్రాజెక్టును మరో ప్రాంతానికి తరలించాలని లేక ప్రాజెక్టు డిజైన్నే మార్చే అంశాన్ని పరిశీలించాలని తెలంగాణ జెన్కో యాజమాన్యానికి సూచిం చింది. ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలం మధ్యలో నుంచి కృష్ణా నదిలోకి ప్రవహిస్తున్న ‘అన్నమేరు వాగు’ వెళ్తుండడమే ఇందుకు కారణం. అయితే, దీనిపై నిపుణుల కమిటీ.. ఓ ఉప కమిటీని క్షేత్ర స్థాయి పర్యటనకు పంపించింది. ఈ ఉప కమిటీ క్షేత్ర స్థాయి పర్యటన జరిపి ప్రాజెక్టు నిర్మించేందుకు షరతులతో కూడిన అనుమతులు జారీ చేయాలని సిఫారసు చేసింది. ప్రధానంగా ప్రాజెక్టు నిర్మాణం వల్ల అన్నమేరు వాగు కలుషితం కాకుండా సంరక్షించేందుకు రక్షణ గోడల నిర్మాణంతో పాటు ఇతర సాంకేతిక షరతులను విధిం చింది. ఈ షరతులను జెన్కో యాజమాన్యం అంగీకరించినా కూడా గత డిసెంబర్ 18న జరిగిన సమావేశంలో విద్యుత్ కేంద్ర నిర్మాణాన్ని నిపుణుల కమిటీ ఆమోదించకుండా నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఎట్టకేలకు శుక్రవారం జరిగిన మూడో సమావేశంలో ప్రాజెక్టు నిర్మాణ టీవోఆర్ను ఆమోదించడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఇక ఈ ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతులను కోరుతూ త్వరలో జెన్కో యాజమాన్యం కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకోనుంది. ఇదే నిపుణుల కమిటీ ఈ ప్రతిపాదనలను పరిశీలించి అనుమతుల జారీ అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాతే ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. 2018 ముగిసేలోగా దామరచర్ల విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. -
జెడ్పీలో మరో పవర్ సెంటర్
సాక్షి ప్రతినిధి, విజయనగరం : జెడ్పీలో మరో పవర్ సెంటర్ తయారవుతోంది. చైర్పర్సన్ వర్గీయులు జీర్ణించుకోలేని పరిస్థితి ఎదురైంది. నిబంధన లేకపోయినప్పటికీ వైస్ చైర్మన్కు ప్రత్యేక చాం బర్ ఏర్పాటు చేయాల ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. జెడ్పీలో ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు ప్రత్యర్థులు వ్యూహాత్మకంగా వేసిన ఎత్తుగడ ఫలితమే ఈ పరిణామనని తెలుస్తోంది. మొన్నటి వరకు డీఈఈ శ్రీనివాస్ కుమార్ను అడ్డంపెట్టుకుని ఆటాడుకున్న ప్రత్యర్థులు ఇప్పుడేకంగా వైస్ చైర్మన్ చాంబర్ను వేదికగా చేసుకుని పవర్ చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి జెడ్పీలో నాట కీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రిజర్వుడ్ మహిళ చైర్పర్సన్ అయ్యారు కదా, ఇంకేముంది జెడ్పీలో చక్రం తిప్పొచ్చని కొంతమంది టీడీపీ నాయకులు తొలుత భావించారు. ఆమెను కుర్చీకి పరిమితం చేసి పవర్ చెలాయించొచ్చని ఆశపడ్డారు. అందుకు తగ్గట్టుగానే ప్రమాణ స్వీకారం చేసేంతవరకు సమష్టిగా ముందుకెళ్లారు. కానీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి తనకున్న విద్యా, విషయ పరిజ్ఞానంతో పాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ఎవరి అడుగు జాడల్లో కాకుండా స్వతంత్రంగా నడిచే ప్రయత్నం చేస్తున్నారు. జెడ్పీలో ఏం జరిగినా తనకు తెలియాలన్న ధోరణితో ముందుకెళ్తున్నారు. పలు విషయా ల్లో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నా రు. ఓవర్ టేక్ చేసి ముందుకెళుతున్న వారికి చెక్ పెడుతున్నారు. అందుకు డీఈఈ శ్రీనివాస్ కుమార్ ఉదంతాన్నే తీసుకోవచ్చు. ఇది మింగుడు పడని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు డీఈఈ శ్రీనివాస్ను అస్త్రంగా ప్రయోగించారు. ఆయ న ద్వారా వ్యవహారాలు నడిపేందుకు ప్రయత్నించారు. వారు వేసిన ప్రతి ఎత్తుగడలను తిప్పికొడుతూ డీఈఈ దూకుడుకు చైర్పర్సన్ బ్రేకులు వేశారు. జిల్లాలో ఇదొక పెద్ద చర్చనీయాంశమయ్యింది. చెప్పాలంటే గత నెల అంతా జెడ్పీలో హైడ్రామా నడిచింది. చివరికి చైర్పర్సన్ వర్గీయులే పైచేయి సాధించారు. జెడ్పీలో తమ మార్క్ పాలన సాగడానికి లైన్ క్లియర్ చేసుకున్నారు. దీంతో ఆమెకు వ్యతిరేకంగా పావులు కదిపిన ఎమ్మెల్యేలంతా కంగుతిన్నారు. దీంతో ఆ ఎమ్మెల్యేలు మరో ఎత్తుగడ వేశారు. జెడ్పీ వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తిని అస్త్రంగా ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఎప్పుడూ లేని విధంగా జెడ్పీలో ఆయనొక చాంబర్ ఏర్పాటయ్యేలా తెరవెనుక పావులు కదిపారని సమాచారం. పంచాయతీరాజ్ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు దృష్టికి తీసుకెళ్లి వారనుకున్నట్టుగా ఆదేశాలిప్పించగలిగారు. ఇటీవల ఓ సమావేశంలో మంత్రి అయ్యన్నపాత్రుడు అందరి మధ్యలో వైస్ చైర్మన్కు ప్రత్యేక రూమ్లో ఒక కుర్చీ వేయాలని చైర్పర్సన్కు చెప్పినట్టు తెలిసింది. దీంతో కాదనలేక ఆమె సరే అనేశారు. కాకపోతే, పీఆర్ మంత్రి ఆదేశాలు చైర్పర్సన్ వర్గీయులకు మింగుడు పడడం లేదు. పరిపాలన సక్రమంగా సాగుతున్న సమయంలో ఈ ఆదేశాలేంటని లోలోపల మథనపడుతున్నట్టు తెలిసింది. నిబంధనల్లో ఎక్కడా వైస్ చైర్మన్కు చాంబర్ ఏర్పాటు చేయాలని లేదని, గతంలో ఎప్పుడూ ఇటువంటి ఏర్పాట్లు చేయలేదని కాసింత అసంతృప్తి చెందినట్టు తెలియవచ్చింది. చాంబర్ ఏర్పాటులో జాప్యం జరుగుతుండడంతో వైస్ చైర్మన్ నుంచి ఒత్తిడి పెరుగుతోంది. దీంతో జెడ్పీలో ఉన్న పాత భవనంలో తప్పని పరిస్థితుల్లో చాంబర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, దానికి వైస్ చైర్మన్ అంగీకరించలేదని సమాచారం. పాత భవనంలో కాకుండా జెడ్పీ పరిపాలన భవనంపైన ప్రస్తుతం ఖాళీగా ఉన్న మరో చాంబర్ ను కేటాయించాలని కోరినట్టు సమాచారం. ఈ డిమాండ్ చైర్పర్సన్ వర్గీయులను మరింత జీర్ణించుకోలేకుండా చేసింది. ఇదంతా ప్రత్యర్థులు ఆడుతున్న నాటకమని, మరో పవర్ సెంటర్గా వైస్ చైర్మన్ చాంబర్ వేదికగా చేసుకునే ఎత్తుగడ అని జెడ్పీలోనే కాకుండా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.మొత్తానికి టీడీపీ నాయకులు ఎత్తుకు పైఎటత్తులు వేస్తుండడంతో జెడ్పీలో రాజకీయ హైడ్రామా నడుస్తోంది. ఇదెక్కడికి దారితీస్తుందో చూడాలి. ఏదేమైనా జెడ్పీలో మరో పవర్ సెంటర్ ఏర్పాటైతే అధికారులకు ఇబ్బందులు తప్పవు. ఎవరి మాట వినాలో, వినకపోతే ఎవరికి ఆగ్రహానికి గురికావలసి వస్తుందో తెలియని పరిస్థితి. -
రాష్ట్ర బిజెపిలో "పవర్ సెంటర్" ప్రాబ్లమ్స్