Qatar open
-
యూకీ జోడీ సంచలనం
దోహా: ఖతర్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీలో భారత డబుల్స్ స్టార్స్ యూకీ బాంబ్రీ, రోహన్ బోపన్నలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్లో యూకీ బాంబ్రీ (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జోడీ ఏకంగా ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ జంటను బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... రోహన్ బోపన్న (భారత్)–నునో బోరెజెస్ (పోర్చుగల్) ద్వయం క్వార్టర్ ఫైనల్లో ఇంటిదారి పట్టింది. ప్రపంచ నంబర్వన్ జంట మార్సెలో అరెవాలో (ఎల్ సాల్వడార్)–మాట్ పావిక్ (క్రొయేషియా)లతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో యూకీ–డోడిగ్ 2–6, 6–3, 10–8తో విజయం సాధించింది. 74 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో యూకీ–డోడిగ్ ఆరు డబుల్ ఫాల్ట్లు చేసింది. తమ సర్విస్ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థుల సర్వీస్ను ఒకసారి బ్రేక్ చేసింది. అయితే ‘సూపర్ టైబ్రేక్’లో యూకీ–డోడిగ్ ద్వయం పైచేయి సాధించింది. జూలియన్ క్యాష్–లాయిడ్ గ్లాస్పూల్ (బ్రిటన్)లతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో బోపన్న–బోర్జెస్ 4–6, 7–6 (7/5), 7–10తో ‘సూపర్ టైబ్రేక్’లో ఓటమి పాలయ్యారు. -
జొకోవిచ్కు చుక్కెదురు
దోహా: కెరీర్లో 100వ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఈ ఏడాది బరిలోకి దిగిన మూడో టోర్నమెంట్లోనూ సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్కు నిరాశ ఎదురైంది. ఖతర్ ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో మూడో సీడ్గా పోటీపడ్డ జొకోవిచ్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. ప్రపంచ మాజీ ఆరో ర్యాంకర్, 2021 వింబుల్డన్ టోర్నీ రన్నరప్ మాటియో బెరెటిని (ఇటలీ)తో జరిగిన మ్యాచ్లో 37 ఏళ్ల జొకోవిచ్ 6–7 (4/7), 2–6తో ఓడిపోయాడు.గతంలో జొకోవిచ్తో ఆడిన నాలుగుసార్లూ ఓడిపోయిన బెరెటిని ఐదో ప్రయత్నంలో తొలిసారి గెలుపొందడం విశేషం. 93 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో జొకోవిచ్ 9 ఏస్లు... బెరెటిని 13 ఏస్లు సంధించారు. బెరెటిని సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసేందుకు వచి్చన అవకాశాలను జోకోవిచ్ చేజార్చుకోగా... బెరెటిని తన ప్రత్యర్థి సర్వీస్ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. -
బోపన్న జోడీ సంచలనం
దోహా: ఖతర్ ఓపెన్ ఏటీపీ–500 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–నునో బోర్జెస్ (పోర్చుగల్) జోడీ సంచలన విజయంతో శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్లో బోపన్న–బోర్జెస్ ద్వయం 7–6 (7/2), 7–6 (7/4)తో రెండో సీడ్ సిమోన్ బొలెలీ–ఆండ్రియా వావాసోరి (ఇటలీ) జంటను బోల్తా కొట్టించింది. 89 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో బోపన్న ద్వయం ఏడు ఏస్లు సంధించింది. మ్యాచ్ మొత్తంలో రెండు జంటలు తమ సర్వీస్లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్లు అనివార్యమయ్యాయి. టైబ్రేక్లో బోపన్న–బోర్జెస్ పైచేయి సాధించి విజయాన్ని అందుకోవడంతోపాటు క్వార్టర్ ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నారు. -
అనిసిమోవా అదరహో
దోహా: ఎనిమిదేళ్ల క్రితం మహిళల టెన్నిస్లో భవిష్యత్ తారగా గుర్తింపు తెచ్చుకున్న అమెరికా ప్లేయర్ అమండా అనిసిమోవా ఎట్టకేలకు తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని అందుకుంది. గ్రాండ్స్లామ్ తర్వాత రెండో అత్యున్నత శ్రేణి అయిన మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) 1000 సిరీస్ టోర్నీలో ఆమె మొదటిసారి విజేతగా అవతరించింది. ఖతర్ ఓపెన్లో 23 ఏళ్ల అనిసిమోవా చాంపియన్గా నిలిచింది. దోహాలో జరిగిన సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 41వ ర్యాంకర్ అనిసిమోవా 6–4, 6–3తో 2017 ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ ఎలెనా ఒస్టాపెంకో (లాత్వియా)పై గెలిచింది. అనిసిమోవాకు 5,97,000 డాలర్ల (రూ. 5 కోట్ల 17 లక్షలు) ప్రైజ్మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 2002లో మోనికా సెలెస్ తర్వాత ఖతర్ ఓపెన్లో విజేతగా నిలిచిన రెండో అమెరికా ప్లేయర్గా అనిసిమోవా గుర్తింపు పొందింది. ఈ గెలుపుతో అనిసిమోవా నేడు విడుదలయ్యే డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్లో కెరీర్ బెస్ట్ 18వ ర్యాంక్ను అందుకుంటుంది. ఓవరాల్గా అనిసిమోవా కెరీర్లో ఇది మూడో సింగిల్స్ టైటిల్. 2019లో బొగోటా ఓపెన్లో, 2022లో మెల్బోర్న్ ఓపెన్లో ఆమె టైటిల్స్ సాధించింది. -
బోపన్న–ఎబ్డెన్ జోడీకి టైటిల్
భారత సీనియర్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న తన కెరీర్లో 23వ డబుల్స్ టైటిల్ను సాధించాడు. దోహాలో శుక్రవారం జరిగిన ఖతర్ ఓపెన్ ఏటీపీ–250 టోరీ్నలో రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ విజేతగా నిలిచింది. గంటా 39 నిమిషాలపాటు జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–7 (5/7), 6–4, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో కాన్స్టంట్ లెస్టిన్ (ఫ్రాన్స్)–బోటిక్ జాండ్షుల్ప్ (నెదర్లాండ్స్) జోడీపై గెలిచింది. తొలి సెట్ను టైబ్రేక్లో కోల్పోయిన బోపన్న జోడీ ఆ తర్వాత రెండో సెట్ను నెగ్గి మ్యాచ్లో నిలిచింది. అనంతరం నిర్ణాయక సూపర్ టైబ్రేక్లో తొలుత పది పాయింట్లు స్కోరు చేసి టైటిల్ను సొంతం చేసుకుంది.బోపన్న–ఎబ్డెన్లకు 72,780 డాలర్ల (రూ. 60 లక్షల 32 వేలు) ప్రైజ్మనీ దక్కింది. -
ముర్రేకు 'చెక్' పెట్టాడు!
దోహా:గత కొంతకాలంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న బ్రిటన్ స్టార్, వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు ఆండీ ముర్రేకు సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ బ్రేక్ వేశాడు. ఖతార్ ఓపెన్లో భాగంగా పురుషుల సింగిల్స్ ఫైనల్లో జొకోవిచ్ 6-3, 5-7, 6-4 తేడాతో ముర్రేపై గెలిచి టైటిల్ ను నిలబెట్టుకున్నాడు. ఇదే క్రమంలో ముర్రే 28 వరుస విజయాలకు జొకోవిచ్ చెక్ పెట్టాడు. హోరాహోరీగా సాగిన తుది పోరులో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన జొకోవిచ్ తన పూర్వ వైభవాన్ని చాటుకున్నాడు. గతంలో ముర్రేపై ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటూ టైటిల్ ను వరుసగా రెండోసారి చేజిక్కించుకున్నాడు. ఈ విజయంపై జొకోవిచ్ హర్షం వ్యక్తం చేశాడు. 2017లో టైటిల్తో శుభారంభం చేయడం ఆనందంగా ఉందన్నాడు. -
సానియా జోడీ జైత్రయాత్రకు బ్రేక్
దోహా: ప్రపంచ మహిళల టెన్నిస్ డబుల్స్ నంబర్ వన్ జోడీ చరిత్రకు మరికొన్ని అడుగుల దూరంలో నిలిచిపోయింది. ఖతార్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో ఓటమితో మహిళల డబుల్స్ లో 41 వరుస విజయాల జైత్రయాత్రకు బ్రేక్ పడింది. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్స్ లో సానియా మిర్జా(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) 2-6, 6-4, 10-5 తేడాతో రష్యా ద్వయం ఎలినా వెస్నినా- డారియా కసాట్కినా చేతిలో ఓటమి పాలయ్యారు. గతేడాది నుంచి ఇప్పటివరకు 13 టోర్నమెంట్లలో ఓటమనేది లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్-స్విస్ జోడీకి పెద్ద షాక్ తగిలింది. 1994 తర్వాత వరుసగా ఎక్కువ మ్యాచ్లు(28) గెలిచిన రికార్డును మాత్రమే అందుకున్న సానియా-హింగిస్ ద్వయం, 1990లో జానా నవోత్నా-ఎలీనా సుకోవా నెలకొల్పిన 44 మ్యాచ్ల రికార్డును ఛేదించే క్రమంలో కేవలం కొన్ని అడుగులదూరంలో(41 విజయాలు) వెనుదిరిగారు. దీంతో సానియా-హింగిస్ లు మహిళల డబుల్స్ లో అత్యధిక వరుస విజయాల రికార్డులో మూడో స్థానంతోనే సరిపెట్టుకున్నారు. కాగా, మహిళల డబుల్స్లో ప్రపంచ రికార్డు లక్ష్యం మాత్రం చాలా పెద్దగా ఉంది. 1983- 85 మధ్య కాలంలో మార్టినా నవ్రతిలోవా-ఫామ్ ష్రివర్లు వరుసగా 109 మ్యాచ్ల్లో నెగ్గడం ఆల్ టైమ్ రికార్డుగా ఉంది. -
ఖతార్ ఓపెన్కు షరపోవా దూరం
మాస్కో: త్వరలో ప్రారంభం కానున్న ఖతార్ ఓపెన్ కు రష్యన్ స్టార్ టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి మరియా షరపోవా దూరం కానుంది. గత కొంతకాలంగా గాయంతో బాధపడుతున్న షరపోవా.. ఖతార్ ఓపెన్లో పాల్గొనడం లేదని ఆ టోర్నీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఇటీవల ఆస్ట్రేలియా ఓపెన్ సందర్భంగా సెరెనా విలియమ్స్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్ అనంతరం గాయం కారణంగా మరియా ఏ పోటీల్లోనూ పాల్గొనలేదు. గత వారం జరిగిన ఫెడ్ కప్ లో షరపోవాకు రష్యన్ స్క్వాడ్ లో చోటు కల్పించినా ఆమె వైదొలిగింది. 'నేను ఖతార్ ఓపెన్ లో పాల్గొనడానికి సిద్ధంగా లేను. నా ఎడమ మోచేతి గాయంతో బాధపడుతున్నా. దాంతో టోర్నీకి దూరంగా కావాల్సి వస్తుంది' అని ఖతార్ ఓపెన్ నిర్వహకులు అందజేసిన నివేదికలో షరపోవా పేర్కొంది. టెన్నిస్ కు ఎక్కువ మంది అభిమానులున్న దోహాలో తాను ఆడకపోవడం నిరాశగురౌతున్నట్లు తెలిపింది. ఈ టోర్నీలో వచ్చే ఏడాది ఆడతానని ఆశిస్తున్నట్లు షరపోవా పేర్కొంది.