recording dance
-
బరితెగించిన టీడీపీ నేతలు .. బాలకృష్ణ ఇలాకాలో రికార్డింగ్ డాన్స్ లు
-
అనకాపల్లి జిల్లాలో అశ్లీల నృత్యాల కలకలం
-
విశాఖలో నడిరోడ్డుపై అశ్లీల నృత్యాలు
-
Chittoor: రికార్డింగ్ డాన్స్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి
చిత్తూరు అర్బన్: చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో అభాసుపాలవుతున్నారు. ఇటీవల ఓ బైకు నడిపిన ఆయన రెండు చేతులు వదిలేస్తూ.. జాతీయ రహదారిపై చేసిన స్టంట్లు, దాన్ని వీడియోలు తీయించి వైరల్ చేసిన తీరు చూసి జనం నవ్వుకున్నారు. దీనిపై యువత తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించకపోవడం, హెల్మెట్ పెట్టుకోకపోవడం, కనీసం రోడ్డుపై స్టంట్లు చేసేప్పుడు పోలీసుల అనుమతి తీసుకోవాలనే అవగాహనలేకపోవడం ఏంటని విద్యావంతుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వివాదం నుంచి బయటపడకముందే తాజాగా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇందులో జగన్మోహన్ నాయుడు రికార్డింగ్ డ్యాన్సు చూస్తూ కనిపించారు. ఇద్దరు యువతులతో కలిసి ఆయన వేసిన కుప్పి గంతులు చూపరులకు వెగటుపుట్టస్తున్నాయి. బెంగళూరులో డిస్కోలు, పబ్బులు, మద్యం బార్లలో పిచ్చి గంతులు వేసే వ్యక్తి, బాధ్యతారహితంగా వ్యవహరించే మనిషి నాయకుడైతే ఎలా ఉంటుందో తెలుసుకోండి..! అంటూ పలువురు ఈ వీడియోలను ట్రోల్ చేశారు. సైకిల్ పోవాలి అనే హ్యాష్ట్యాగ్తో ఈ వీడియో వైరల్ కావడంతో టీడీపీ కార్యకర్తలు అంతర్మథనంలో పడ్డారు. తమ అభ్యర్థి నిర్వాకాలతో పార్టీ పరువు బజారున పడిందని తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు. భవిష్యత్లో సదరు అభ్యర్థి ఇంకేం వీడియోలతో నవ్వులపాలు చేస్తాడో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
టీఆర్ఎస్ నాయకుడి ఇంట్లో అర్థరాత్రి రికార్డింగ్ డ్యాన్స్లు
సాక్షి, వికారాబద్: ఓ వైపు కరోనా కట్టడి కోసం ప్రభుత్వం లాక్డౌన్ విధించి.. కఠిన చర్యలు తీసుకుంటుంటే మరోవైపు కొందరు మాత్రం మాకివేం వర్తించవన్నట్లు ప్రవర్తిస్తున్నారు. మరీ ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు తాము ఈ నిబంధనలకు తాము అతీతులమన్నట్లు భావిస్తూ.. ఆంక్షలను తుంగలో తొక్కుతున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లాలో ఓ టీఆర్ఎస్ నాయకుడు లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘించి తన ఇంట్లో రికార్డ్ డ్యాన్స్ కార్యక్రమం నిర్వహించడం పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని దోమ మండలం దిర్సంపల్లి గ్రామానికి చేందిన టీఆర్ఎస్ నాయకుడు ఒకరు లాక్డౌన్ ఆంక్షలు తుంగలో తొక్కి తన ఇంట్లో అర్థరాత్రి రికార్డు డ్యాన్స్లతో హోరెత్తించాడు. వందలమందిని ఆహ్వానించి విందు ఏర్పాటు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్కావడంతో పోలీసులపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. లాక్డౌన్ సందర్భంగా ఆరు దాటితే జనాలను బయటకు అడుగుపెట్టకుండా చూస్తున్న పోలీసులు ఈ విందు-చిందు కార్యక్రమాన్ని పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: మంచె మీదే బీటెక్ విద్యార్థి ఐసోలేషన్.. చెట్టుపైనే -
హైస్కూల్లో రికార్డింగ్ డ్యాన్సు చిందులు రచ్చ..రచ్చ!
చిత్తూరు, గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె జెడ్పీ హైస్కూల్ వివాదం కాస్త రచ్చకెక్కింది. డిసెంబర్ 31న రాత్రి హైస్కూల్లో రికార్డింగ్ డ్యాన్సు కార్యక్రమం నిర్వహించడంతో పాటు పలు అసాంఘిక కార్యకలాపాలు జరిగాయంటూ హెడ్మాస్టర్పై కొందరు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మరోవైపు– హెడ్మాస్టర్..కొందరు తనపై కక్ష కట్టి, వేధించడంతోపాటు, విధులకు భంగం కలిగిస్తున్నారంటూ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పరస్పరం ఫిర్యాదులతో ఈ ఉదంతం మరింత వేడెక్కింది. వివరాలు..స్థానిక జెడ్పీ హైస్కూల్లో గత ఏడాది డిసెంబర్ 31న రాత్రి పెద్ద ఎత్తున డీజే(రికార్డింగ్ డ్యాన్సులు) నిర్వహించారు. యూత్ అంతా డ్యాన్సులతో చిందులేశారు. పవిత్రమైన పాఠశాలల్లో అర్ధరాత్రి వరకు ఇలాంటి కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారంటూ కొందరు అడ్డుకోవడంతో అప్పట్లో వాగ్వాదానికి దారితీసింది. ఈ ఘటనపై కొందరు సోషియల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టారు. అంతేకాకుండా హెడ్మాస్టర్ హైస్కూల్లో అనైతిక కార్యకలాపాలకు రూములు ఇస్తున్నాడని, గతంలోనూ విద్యార్థులచేత పలు చేయరాని పనులు చేయించారని, కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా హైస్కూల్ను మద్యం సేవించడానికి, రికార్డింగ్ డ్యాన్సులకు, జూదం నిర్వహించుకోవడానికి ఇచ్చారని ఆరోపిస్తూ కొందరు గ్రామస్తులు ఇటీవలే కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇదలా ఉంచితే, కొంత కాలంగా హైస్కూల్లో కొందరు ఉపాధ్యాయుల విధులకు భంగం కలిగిస్తుండడంతో పాటు తమను అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నారని పేర్కొంటూ హెడ్మాస్టర్ కోటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై కొందరు నాయకులు అసభ్యకరమైన పోస్టింగ్లు సామాజిక మాధ్యమాల్లో పెట్టారని, గత నెల 31న తాను సెలవుపై వెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరు ఆకతాయిలు ప్రహరీ గోడపై కూర్చుని అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారని, వీరికి కొందరు నాయకులు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. పాఠశాల విద్యాకమిటీ ఎన్నికలు నిర్వహించినప్పటి నుంచి కొందరు తమపై కక్షగట్టారని, ఈ సంఘటనపై విచారణ చేసి నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. కేసు నమోదు చేశాం హైస్కూల్ వివాదంపై హెడ్మాస్టర్ ఫిర్యాదు మేరకు రెడ్డిరాజా అనే వ్యక్తిపై ప్రస్తుతానికి కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నాం. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. గ్రామస్తులు, విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను కూడా విచారణ చేస్తాం. ఇందులో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉంటే వారిపై కూడా కేసులు నమోదు చేస్తాం.– చిన్నరెడ్డెప్ప, ఎస్ఐ, గుర్రంకొండ -
అధికార పార్టీ అశ్లీల రికార్డింగ్ డ్యాన్స్.. రచ్చ
కోల్కతా : తృణముల్ కాంగ్రెస్ ఎంపీ మిమి చక్రవర్తి మంగళవారం లోక్సభలో ప్రమాణం స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె నియోజకవర్గమైన జాధవ్పూర్లో టీఎంసీ కార్యకర్తలు బుధవారం ఏర్పాటు చేసిన రికార్డింగ్ డ్యాన్స్ రచ్చగా మారింది. డ్యాన్స్లో భాగంగా యువతి అసభ్యకరమైన దుస్తులను వేసుకొని అదే పనిగా అక్కడి యువకులను రెచ్చగెట్టే రీతిలో ప్రదర్శన చేయడం వివాదాస్పదమైంది. ఓ అధికార పార్టీ అత్యంత అసభ్యకరంగా, అశ్లీలంగా రికార్డ్ డ్యాన్స్ ప్రదర్శన నిర్వహించడంపై ప్రత్యర్థి పార్టీలు భగ్గుమంటున్నాయి. ఓ మహిళా ఎంపీని అభినందించేందుకు ఉద్దేశించిన కార్యక్రమంలో రికార్డు డ్యాన్స్ల పేరిట అశ్లీల నృత్యాలు చేయిస్తారా? అని మండిపడుతున్నాయి. ఆశించినరీతిలో లోక్సభ ఫలితాలు రాకపోవడంతో రాష్ట్రంలో ఎక్కడా వేడుకలు చేయొద్దని బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ టీఎంసీ కార్యకర్తలను ఆదేశించారు. ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. ఈ అశ్లీల నృత్య ప్రదర్శనను నిర్వహించడం గమనార్హం. ఈ వేడుకలో అత్యధిక సంఖ్యలో టీఎంసీ కార్యకర్తలే పాల్గొన్నారు. ఈ మొత్తం వీడియోనూ ఫోన్లలో రికార్డు చేసిన కొందరు యువకులు సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్గా మారింది. బీజేపీ నాయకుడు సునీప్దాస్ ఈ వీడియోపై స్పందిస్తూ..' ఇందులో నాకు కొత్తగా ఏమి కన్పించడం లేదు. టీఎంసీలో ముందు నుంచే ఈ కల్చర్ అంతర్భాగంగా ఉంద’ని విమర్శించారు. మమతాబెనర్జీకి తెలియకుండా టీఎంసీ కార్యకర్తలు ఏ పని చేయరని, ఇప్పటికైనా ఈ సంఘటనపై మిమి చక్రవర్తి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. -
వినాయక చవితి వేడుకల్లో అశ్లీల నృత్యాలు
సాక్షి, విజయవాడ: వినాయక చవితి వేడుకల్లో మహిళలతో అశ్లీల నృత్యాలు చేయించడం విజయవాడలో కలకలం రేపింది. నగర శివార్లలోని నున్నలో కొందరు యువకులు ఈ వికృత చర్యకు పాల్పడ్డారు. ఓ వినాయక మండపం వద్ద అర్ధరాత్రి నలుగురు మహిళలతో అశ్లీల నృత్యాలు చేయించారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. నలుగురు మహిళలతో పాటు, ఈ ఘటనతో సంబంధం ఉన్న 8 మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై 290,294 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
తెలుగు తమ్ముళ్ల అశ్లీల నృత్యాలు
-
జాతర పేరుతో రికార్డింగ్ డ్యాన్సులు
-
రికార్డింగ్ డాన్సుకు ఆటంకం కలిగిస్తుందని..
పూటుగా తాగి.. రికార్డు డాన్సులు చేసే.. వారికి అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి అడ్డుగా మారింది. బిడ్డ తరచూ ఏడుస్తూ.. డాన్స్కు అంతరాయం కలిగిస్తుండడాన్ని తల్లితో పాటు ఆమె ప్రియుడు జీర్ణించుకోలేక పోయా రు. తాగిన మైకంలో అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు. తల్లి సూచనతో ప్రియుడు గొంతునులిమి పైకెత్తగా బిడ్డ ఆటోకమ్మీ తగిలి అక్కడే ప్రాణాలు విడిచింది. మదనపల్లె క్రైం: గత నెల 25న వెలుగులోకి వచ్చిన చిన్నారి హత్యకేసును ఎట్టకేలకూ ఛేదించినట్లు రూరల్ సీఐ మురళీ, ఎస్ఐ సునీల్ కుమార్ తెలిపారు. స్థానిక రూరల్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం చిన్నారి శివాని(2) హత్యకేసు వివరాలను ఆయన వెల్లడించారు. ఐరాల మండలం మొరంపల్లెకు చెందిన పి.శాంత(22) నిమ్మనపల్లె మండలం మాసిరెడ్డిగారిపల్లెకు చెందిన బోయకొండను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుంది. వీరికి కృష్ణ(3), శివాని(2) అనే పిల్లలు ఉన్నారు. భర్త ఏడాదిన్నర క్రితం శాంతను వదిలేసి మరో యువతిని పెళ్లి చేసుకోవడంతో శాంత ఒంటరిగా ఉంటోంది. అప్పటి నుంచి మదనపల్లె అమ్మచెరువు మిట్టకు చెందిన రెడ్డిశేఖర్ రికార్డు డాన్స్ గ్రూపులో పనిచేస్తోంది. అదే గ్రూపులో రికార్డు డాన్స్లు వేసే రామసముద్రం గాజులనగర్ కాలనీకి చెందిన ఎస్వీ శ్రీనివాసులు(27)తో శాంత సహజీవనం సాగిస్తోంది. ఇద్దరూ కలిసి శ్రీనివాసులు ఆటోలో పల్లెలు తిరిగి రికార్డులు వేసి వచ్చే ఆదాయంతో బతికేవారు. రోజూ మాదిరిగానే నవంబర్ 22న పుంగనూరు మండలం సుగాలిమిట్టకు రికార్డు డాన్సులు వేసేందుకు వెళ్లారు. అక్కడ పీకల వరకూ మద్యం తాగారు. డాన్సులు వేసే సమయంలో వీరి వెంట ఉన్న చిన్నారి శివాని అనారోగ్యంతో ఏడుస్తోంది. ఇది వారికి అంతరాయంగా మారింది. దీంతో ఆగ్రహించిన తల్లి శాంత.. శివానిని చంపేయాలని ప్రియుడిని ఆదేశించింది. వెంటనే అతను చేతితో గొంతునులిమి పైకి ఎత్తడంతో ఆటో టాప్ కమ్మి తగిలి గాయపడి ప్రాణాలు విడిచింది. ఇంటికి తీసుకెళ్తే స్థానికులు గుర్తించి కొడుతారని చెంబకూరు రోడ్డు మార్గంలో రామసముద్రానికి వెళ్తూ దండువారిపల్లె వంకలో శివాని మృతదేహానికి దుప్పటి చుట్టి మోరీకింద నీటి కాలువలో పడేసి వెళ్లిపోయారు. మరుసటి రోజు పత్రికల్లో ‘చిన్నారి హత్యకేసు వెలుగులోకి రావడంతో పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టామన్నారు. మంగళవారం ఉదయం లాభాల గంగమ్మ గుడి వద్ద అనుమానస్పద స్థితిలో ఆటోలో ఉన్న శాంత, ఆమె ప్రియుడు శ్రీనివాసులను అదుపులోకి తీసుకుని విచారించగా శివాని హత్యకేసు వివరాలు తెలిసినట్లు సీఐ మురళి పేర్కొన్నారు. అనంతరం నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
టీడీపీ ఎంపీపీ అసభ్యకర నృత్యాలు
-
తెలుగు తమ్ముళ్ల రికార్డింగ్ డ్యాన్సులు!!
-
అశ్లీల నృత్యాలతో తెలుగు తమ్ముళ్ల తందనాలు
-
ఈ తెలుగు తమ్ముళ్ల డ్యాన్స్ చూస్తే అవాక్కే!
కనిగిరి: తెలుగు తమ్ముళ్లు లుంగీ డ్యాన్స్, గాంగ్నమ్ చిందులతో రెచ్చిపోయారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో దిమ్మతిరిగే స్టెప్పులతో, అవాక్కయ్యే హావభావాలతో చూసిన వారంతా నోరెళ్లబెట్టే పని చేశారు. రికార్డింగ్ డ్యాన్సులను తలపించేలా చిందులు వేశారు. టీడీపీ ఎమ్మెల్యే కదిరి బాబురావు ఆధ్వర్యంలో స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్హౌస్లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రికార్డింగ్ డ్యాన్స్లను తలపించే పాట కచేరీ ఏర్పాటు చేశారు. ఈ వేదికపై టీడీపీ మండల అధ్యక్షుడు బేరి పుల్లారెడ్డి, కనిగిరి మున్సిపల్ ఛైర్మన్ చినమస్తాన్ ఉండి హుషారెత్తే చిందులతో హోరెత్తించారు. మహిళా డ్యాన్సర్లతో చిందులు వేస్తూ కాస్తంత అభ్యంతరకరంగా కనిపించారు. ఆ సమయంలో ఎమ్మెల్యే కదిరి బాబురావు కూడా స్టేజీ వద్దే కూర్చోవడం గమనార్హం. అధికార పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఈ పాట కచేరికి పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధించకపోవడం మరో విశేషం. కనీసం స్టేజీ వద్దకు కూడా వారు రాలేదు. ఇది అధికార పార్టీ రాజకీయ అహంకారానికి నిదర్శనమని స్థానికులు గుసగుసలాడుకున్నారు. -
మంత్రి వచ్చేవరకు బహిరంగ సభలో అశ్లీల నృత్యాలు
-
కారాగారంలో రికార్డింగ్ డ్యాన్స్!
విచారణకు ఆదేశించిన జైళ్లశాఖ సాక్షి,బెంగళూరు: విజయపురలోని కేంద్రకారాగారంలో నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రామల పేరుతో రికార్డింగ్ డ్యాన్స్ నిర్వహించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వివరాలు... గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్ఫ్రవర్తన కలిగిన ఖైదీలను విజయపుర కేంద్ర కారగారం నుంచి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేదిక పై సినిమా పాటలకు అనుగుణంగా యువతి అసభ్యకర రీతిలో నృత్యం చేస్తుండగా కొంతమంది కారాగార సిబ్బంది ఆమెపై డబ్బులు వెదజెల్లారు. ఈ విషయం వీడియో క్లిప్పుంగుల రూపంలో ఒక రోజు ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్పందించిన జైళ్ల శాఖ ఇందుకు సంబంధించిన పూర్తి నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు గాను విచారణకు ఆదేశించింది. జైళ్ల శాఖ డీజీపీ హెచ్.ఎన్.ఎస్.రావును విచారణాధికారిగా నియమించింది. మరో రెండు రోజుల్లో హెచ్.ఎన్.ఎస్.రావు తన విచారణను ప్రారంభించనున్నారని తెలుస్తోంది. -
రికార్డింగ్ డ్యాన్స్లో డిప్యూటీ మేయర్ చిందులు
సాక్షి, ఏలూరు: ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడిని అక్రమంగా నిర్బంధించి దాడికి పాల్పడ్డారన్న కేసులో పదిహేను నెలల క్రితం అరెస్టయిన ఏలూరు డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఇటీవల ఏలూరులో మేయర్ షేక్ నూర్జహాన్ ఇంటి ఎదుట జరిగిన ఓ పార్టీలో డిప్యూటీ మేయర్తోపాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొని హల్చల్ చేయడం వివాదాస్పదమవుతోంది. రికార్డింగ్ డ్యాన్స్ మాదిరి జరిగిన సినీ విభావరిలో వెంకటరత్నం ఓ యువతితో కలిసి చిందులు వేయడం చర్చనీయాంశమైంది. ఇటీవల చోటుచేసుకున్న ఆ డ్యాన్సుల తాలూకు వీడియోలను పలువురు ఫేస్బుక్, వాట్సాప్లో షేర్ చేసుకున్నారు. -
కార్తీక పౌర్ణమి సందర్భంగా రికార్డు డ్యాన్స్
-
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా అశ్లీల నృత్యాలు
-
సమయం సందర్భం లేకుండా అశ్లీల నృత్యాలు
-
రికార్డింగ్ డ్యాన్సుల్లో.. చిందేసిన ఎమ్మెల్యే!!
-
టీడీపీ నాయకుల స్టెప్పులు కేక..!