remonetisation
-
మార్కెట్లోకి వచ్చిన కొత్త నోట్లెన్నో తెలుసా?
న్యూఢిల్లీ : పెద్దనోట్ల రద్దు అనంతరం కొత్త కొత్త కరెన్సీ నోట్లు మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రీమానిటైజేషన్ ప్రక్రియ ప్రారంభించినప్పటి నుంచి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా సుమారు 12 లక్షల విలువైన కొత్త కరెన్సీ నోట్లను మార్కెట్లోకి తీసుకొచ్చిందని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఫిబ్రవరి 24 వరకు మొత్తం 11,64,100 కొత్త కరెన్సీ నోట్లను చలామణిలోకి తెచ్చినట్టు ఆర్బీఐ వెల్లడించినట్టు ఆయన లోక్ సభకు తెలిపారు. ఈ మొత్తం ఇప్పటికి మరికొంత పెరిగి ఉంటుందని చెప్పారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆర్థికమంత్రి ఈ వివరాలు వెల్లడించారు. అయితే ఎన్ని పాత నోట్లు వచ్చాయనే వివరాలను మాత్రం మంత్రి తెలుపలేదు. ప్రతి కరెన్సీ నోటు నకిలీదో కాదో పరిశీలించాల్సి ఉందని, అనంతరం నకిలీ నోట్లను, మంచి వాటిని వేరు చేయాలన్నారు. ఇదొక పెద్ద ప్రక్రియని, ఈ పనంతా ముగిసిన అనంతరం సమగ్రమైన నివేదికను సభకు అందిస్తామన్నారు. అదేవిధంగా నికర ప్రత్యక్ష పన్ను వసూళ్ల వివరాలను ప్రకటించారు. గతేడాది డిసెంబర్ లో రూ.1,40,824 కోట్ల నికర ప్రత్యక్ష పన్ను వసూలయ్యాయని చెప్పారు. కాగ 2015 డిసెంబర్ లో ఈ పన్నులు రూ.1,35,660 కోట్లు మాత్రమే. -
పెద్దనోట్ల రద్దుపై బడ్జెట్లో జైట్లీ కామెంట్!
-
పెద్దనోట్ల రద్దుపై బడ్జెట్లో జైట్లీ కామెంట్!
న్యూఢిల్లీ: అందరూ ఊహించినట్టుగానే కేంద్ర ఆర్థిక బడ్జెట్ ప్రసంగంలో పెద్దనోట్ల రద్దు గురించి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ‘ఏ రైట్ కాజ్ నెవర్ ఫెయిల్స్’ (ఒక మంచి పని ఎప్పుడూ విఫలం కాదు) అంటూ జాతిపిత మహాత్మాగాంధీ సూక్తిని ఉటంకించిన ఆయన.. పెద్దనోట్ల రద్దు అనేది సాహసోపేతమైన చర్య అని, దీనివల్ల జీడీపీ (స్థూలజాతీయోత్పత్తి) పెరగడమే కాకుండా స్వచ్ఛంగా, నిజాయితీగా ఉండే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు (డిమానేటైజేషన్) ప్రభావం రానున్న ఆర్థిక సంవత్సరంపై ఉండబోదని భావిస్తున్నట్టు చెప్పారు. రీమానేటైజేషన్ (కొత్త నోట్లను చలామణిలోకి తీసుకొచ్చే) ప్రక్రియ ఇప్పటికే వేగం అందుకున్నదని, త్వరలోనే సంతృప్తికర స్థాయికి ఇది చేరుకుంటుందని ఆయన చెప్పారు. గత ఏడాది నవంబర్ 8న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెద్దనోట్లను రద్దుచేసిన సంగతి తెలిసిందే. రూ. వెయ్యి, రూ. 500 నోట్లు రద్దు చేయడంతో ప్రజలు పాతనగదును మార్చుకోవడానికి బ్యాంకుల వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొత్త కరెన్సీ అందుబాటులోకి రావడంతో బ్యాంకులు నగదు ఉపసంహరణపై ఆంక్షలు ఎత్తివేయడంతో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలకు, సామాన్యులకు కేంద్ర బడ్జెట్లో మరిన్ని ఉపశమన చర్యలు ప్రకటిస్తారని అందరూ ఆశిస్తున్నారు. -
మరిన్ని రూ. 500 నోట్లు వస్తున్నాయ్!
-
మరిన్ని రూ. 500 నోట్లు వస్తున్నాయ్!
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు తర్వాత భారీ ప్రయోజనాలు ఇపుడు కనిపిస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం ప్రకటించారు. రీమానిటైజేషన్ ప్రక్రియం వేగం పుంజుకుందనీ రిజర్వ్ బ్యాంకు దగ్గర పెద్ద మొత్తంలో కరెన్సీ అందుబాటులో ఉందనీ పేర్కొన్నారు. ముఖ్యంగా రూ.500 నోట్ల చెలామణి పెరిగిందనీ, మరిన్ని నోట్లను అందుబాటులోకి తేనున్నామని ఆర్థికమంత్రి ప్రకటించారు. డిమానిటైజేషన్ తర్వాత దేశంలో అశాంతి అలజడికి సంబంధించి ఒక్క సంఘటన కూడా నమోదు కాలేదని జైట్లీ స్పష్టం చేశారు. విమర్శకుల అంచనాలను తలదన్ని అన్ని రంగాలు అభివృద్ధిని సాధించాయాటూ ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు. ఈ మేరకు బ్యాంకుల్లో గుర్తించదగిన ప్రభావం ఇప్పటికే కనిపిందని జైట్లీ చెప్పారు. అన్ని విభాగాలలో పరోక్ష పన్నుల వసూలు గణనీయంగా పెరిగిందన్నారు. డిసెంబర్ 19 నాటికి డైరెక్ట్ టాక్స్ 14.4 శాతం, కేంద్ర పరోక్ష పన్నులు వరకు 26.2 శాతం, కేంద్ర వాణిజ్య పన్ను 43.3 శాతం పెరుగుదలను నమోదు చేసినట్టు చెప్పారు. అలాగే గత సంవత్సరంతో పోలిస్తే రబీ విత్తనాలు 6.3 శాతం పెరిగినట్టు ఆర్థిక మంత్రి చెప్పారు. -
గాంధీ విగ్రహం ఎదుట విపక్షాల ఆందోళన