అందరూ ఊహించినట్టుగానే కేంద్ర ఆర్థిక బడ్జెట్ ప్రసంగంలో పెద్దనోట్ల రద్దు గురించి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ‘ఏ రైట్ కాజ్ నెవర్ ఫెయిల్స్’ (ఒక మంచి పని ఎప్పుడూ విఫలం కాదు) అంటూ జాతిపిత మహాత్మాగాంధీ సూక్తిని ఉటంకించిన ఆయన.. పెద్దనోట్ల రద్దు అనేది సాహసోపేతమైన చర్య అని, దీనివల్ల జీడీపీ (స్థూలజాతీయోత్పత్తి) పెరగడమే కాకుండా స్వచ్ఛంగా, నిజాయితీగా ఉండే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దు (డిమానేటైజేషన్) ప్రభావం రానున్న ఆర్థిక సంవత్సరంపై ఉండబోదని భావిస్తున్నట్టు చెప్పారు. రీమానేటైజేషన్ (కొత్త నోట్లను చలామణిలోకి తీసుకొచ్చే) ప్రక్రియ ఇప్పటికే వేగం అందుకున్నదని, త్వరలోనే సంతృప్తికర స్థాయికి ఇది చేరుకుంటుందని ఆయన చెప్పారు.