reservations quota
-
కులగణన వివరాలేవి?
సాక్షి, బళ్లారి: రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తేయాలని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ మరోసారి డిమాండ్ చేశారు. దళితులు, ఆదివాసీలకు వారి జనాభాకు తగ్గట్టుగా అవకాశాలు దక్కేందుకు వీలుగా నైష్పత్తిక రిజర్వేషన్ల పద్ధతి తేవాలన్నారు. 2011లో మోదీ సర్కారు చేపట్టిన కులగణన వివరాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తద్వారా బీసీలకు మెరుగైన రిజర్వేషన్లు కల్పించేందుకు వీలవుతుందని అభిప్రాయపడ్డారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బాల్కీ, హుమ్నాబాద్ల్లో ఆయన ప్రచార సభల్లో మాట్లాడారు. ఓబీసీలపై మోదీ కేవలం మాటల్లోనే ప్రమ ఒలకబోస్తారని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వస్తే వెంటనే కులగణన వివరాలు బయట పెడతామని చెప్పారు. ప్రతి పనికి 40 కమీషన్ తీసుకుంటున్న బీజేపీ సర్కారుకు ఇంటికి సాగనంపాలని పిలుపునిచ్చారు. ‘‘రాష్ట్రంలో బీజేపీకి 40 సీట్లు కూడా రావు. ఉద్యోగ నియామకాల్లోనూ భారీ అవినీతి జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ అవినీతి విధానాలను, మోదీ, అదానీ బంధాన్ని గురించి లోక్సభలో ప్రశ్నిస్తే నా సభ్యత్వం తొలగించారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెబితే దేశవ్యాప్తంగా ఆ పార్టీ పతనానికి నాంది అవుతుంది’’ అన్నారు. రాహుల్ కులగణన డిమాండ్కు పలు విపక్షాలు మద్దతిచ్చాయి. జేడీ(యూ) నేత, బిహార్ సీఎం నితీశ్కుమార్తో పాటు ఎస్పీ, బీఎస్పీ్ట, ఆప్, బీజేపీ మిత్రపక్షం లోక్ జనశక్తి పార్టీ ఇందుకు మద్దతు పలికాయి. దేశవ్యాప్తంగా తాజాగా కులగణన చేపట్టాలంటూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆ లేఖను ఆయన తాజాగా ట్వీట్ చేశారు. -
జనరల్ కోటా నుంచే ఈడబ్ల్యూఎస్: కేంద్రం
న్యూఢిల్లీ: సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అమలవుతున్న 50 శాతం రిజర్వేషన్ కోటాలో ఎలాంటి కోత లేదని, కేవలం జనరల్ కోటా నుంచే ఈడబ్ల్యూఎస్కు స్థానం కల్పించామని కేంద్రం సుప్రీంకోర్టులో స్పష్టంచేసింది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉన్న 50 శాతం రిజర్వేషన్ స్వాతంత్య్రతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని కేంద్రప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టు సీజే జస్టిస్ లలిత్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించారు. ప్రవేశాలు, ఉద్యోగాల్లో ఆర్థికంగా బలహీనమైన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు కేంద్రం 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్న విషయం విదితమే. రిజర్వేషన్ కల్పనకు ఆర్థిక పరిస్థితి గీటురాయి కాదని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను కోర్టు సమరి్థంచాలనుకుంటే అంతకుముందుగా ఇందిరా సహానీ(మండల్) తీర్పును çసమీక్షించాలని తమిళనాడు ప్రభుత్వం కోరింది. ఇదీ చదవండి: పట్టణ శ్రేయస్సు ముఖ్యం -
రైల్వేలో పేదల కోటా కింద 23 వేల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: అగ్రవర్ణాల పేదల(ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్ను అమలుచేయబోయే తొలి ప్రభుత్వ విభాగంగా భారతీయ రైల్వే నిలవబోతోందని ఆ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాబోయే రెండేళ్లలో దాదాపు 23,000 మందికి ఈ కోటా కింద ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు. ఆరు నెలల్లోగా 1.31 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామనీ, రాబోయే రెండేళ్లలో మరో లక్ష ఉద్యోగుల్ని తీసుకుంటామని పేర్కొన్నారు. 2019–20 మధ్యకాలంలో 53 వేల మంది, 2020–21 కాలంలో 46 వేల మంది ఉద్యోగులు రైల్వేశాఖ నుంచి పదవీ విరమణ చేయబోతున్నారని తెలిపారు. -
ఉద్యోగుల పిల్లలకూ రిజర్వేషన్లా?
న్యూఢిల్లీ: ఉన్నతోద్యోగాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీల పిల్లలు, కుటుంబీకులకు ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడం వెనక హేతుబద్ధత ఏంటని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. క్రీమీలేయర్ను ఎస్సీ, ఎస్టీలకు ఎందుకు వర్తింపజేయరని నిలదీసింది. ‘ పదోన్నతుల్లో రిజర్వేషన్ల వల్ల ఫలానా వ్యక్తి ఓ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యాడునుకోండి. ఆయన కుటుంబ సభ్యులను దళితులుగా భావించి వారికీ పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడం సహేతుకమేనా? దాని వల్ల వారి సీనియారిటీ సైతం త్వరగా పెరుగుతుందిగా’ అని కోర్టు సందేహం వ్యక్తం చేసింది. గురువారం రోజంతా జరిగిన విచారణకు హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పలువురు సీనియర్ లాయర్లు పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటా అమలును సమర్థించారు. ఈ రిజర్వేషన్లు దాదాపుగా నిలిచిపోవడానికి కారణమైన 2006 నాటి ఎం.నాగరాజ్ కేసు తీర్పును సమీక్షించాలని కోరారు. కానీ, సీనియర్ లాయర్ శాంతిభూషణ్, మరో సీనియర్ లాయర్ రాజీవ్ ధావన్ ఈ కోటాను వ్యతిరేకించారు. రిజర్వేషన్ల వల్ల ఉద్యోగ అవకాశాల్లో సమానత్వపు హక్కు ఉల్లంఘనకు గురవుతోందని ఆరోపించారు. ‘ఒక వ్యక్తి క్లాస్–1 అధికారి అయితే, ఇక అతను ఎంతమాత్రం వెనకబడిన తరగతికి చెందడు. కానీ రాజకీయ పార్టీలు దళితులను ఓటుబ్యాంకుగానే పరిగణిస్తున్నాయి’ అని శాంతి భూషణ్ అన్నారు. త్రిపుర, బిహార్, మధ్యప్రదేశ్ లాయర్లు కోటాకు మద్దతుగా వాదించారు. -
‘కోటా కోసం ఆత్మహత్యలు వద్దు’
సాక్షి, ముంబై : మరాఠాలు రిజర్వేషన్ల కోసం ఆత్మహత్యలకు పాల్పడవద్దని బాంబే హైకోర్టు మంగళవారం విజ్ఞప్తి చేసింది. ఈ అంశం న్యాయస్ధానాల పరిధిలో ఉన్నందున సంయమనం పాటించాలని సూచించింది. మరాఠాలు కోటా కోరుతూ హింసకు దిగడం కానీ, ఆత్మహత్యలకు పాల్పడటం కానీ చేయరాదని తాము కోరుతున్నామని జస్టిస్ రంజిత్ మోరే, జస్టిస్ అనుజా ప్రభుదేశాయ్లతో కూడిన డివిజన్ బెంచ్ కోరింది. బీసీ కమిషన్ మరాఠాలకు కోటాపై ఇప్పటివరకూ చేపట్టిన కసరత్తును వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సమర్పించిన క్రమంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కమిషన్ ఏర్పాటు చేసిన ఐదు ఏజెన్సీలు క్రోడీకరించిన సమాచారం, అథ్యయనాలను కమిషన్ నియమించిన నిపుణుల కమిటీ క్రోడీకరిస్తోందని సెప్టెంబర్ 5లోగా కమిటీ తన నివేదికను సమర్పించే అవకాశం ఉందని సీనియర్ న్యాయవాది రవి కదం, ప్రభుత్వ న్యాయవాది అభినందన్ వాగ్యాని కోర్టుకు తెలిపారు. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం కమిషన్ నవంబర్ మాసాంతానికి తన తుది నివేదికను ప్రభుత్వానికి అందచేస్తుందని చెప్పారు. కమిషన్ తన కసరత్తును త్వరితగతిన చేపట్టేలా చూడాలని బెంచ్ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. -
మరాఠా బంద్ అసంపూర్ణం
ముంబై: విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోరు తూ ముంబైలో మరాఠాలు బుధవారం చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారింది. తాజాగా మరో యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో రిజర్వేషన్ల ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారి సంఖ్య రెండుకు చేరింది. మరాఠాలకు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న పలు సంస్థలు ముంబై బంద్కు పిలుపునివ్వడం తెలిసిందే. ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి బస్సులను ధ్వంసం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించి లాఠీ చార్జీ చేశారు. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో మధ్యాహ్నానికే బంద్ను విరమిస్తున్నట్లు చెప్పారు. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం ఫడ్నవిస్ చెప్పారు. -
వసుంధర ప్రభుత్వానికి హైకోర్టు ఝలక్!
జైపూర్: వసుంధర రాజే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. గతేడాది రాజస్థాన్ అసెంబ్లీ తీసుకున్న సరికొత్త నిర్ణయం.. రిజర్వేషన్ల కోటా పెంపు చెల్లదని హైకోర్టు కొట్టిపారేసింది. గుజ్జర్లకు 5 శాతం రిజర్వేషన్, ఆర్థికంగా వెనుకబడిన వారికి 14 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం వసుంధర రాజే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు వ్యతిరేకించింది. వాస్తవానికి రాజస్థాన్ ప్రభుత్వం గత సెప్టెంబర్లో తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర రిజర్వేషన్ల కోటా 50 శాతం మించిపోయింది. గుజ్జర్లకు ప్రత్యేక బీసీ (ఎస్బీసీ) కోటా కింద 5 శాతం, ఆర్థికంగా వెనకబడిన వారికి (ఈబీసీ) 14 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో మొత్తం కోటా 68 శాతానికి చేరుకుంది. వాస్తవానికి చట్టప్రకారం గరిష్ఠంగా మొత్తం రిజర్వేషన్ల కోటా కలిపి 50 శాతం దాటకూడదు. అయితే సమస్యలు రాకూడదని రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల బిల్లును రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్చడం ద్వారా న్యాయపరమైన అడ్డంకులు లేకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. రిజర్వేషన్ల కోటా 50 శాతం మించిపోవడం కారణంగా రాజస్థాన్ ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు వ్యతిరేకిస్తూ.. రిజర్వేషన్ల పెంపును కొట్టివేసింది. -
అక్కడ మొత్తం రిజర్వేషన్లు 68 శాతం!
-
అక్కడ మొత్తం రిజర్వేషన్లు 68 శాతం!
రాజస్థాన్ అసెంబ్లీ తీసుకున్న సరికొత్త నిర్ణయం కారణంగా.. అక్కడి రిజర్వేషన్ల కోటా 50 శాతాన్ని దాటిపోయింది. అసెంబ్లీ రెండు బిల్లులను ఆమోదించింది. దాంతో గుజ్జర్లకు ప్రత్యేక బీసీ (ఎస్బీసీ) కోటా కింద 5 శాతం, ఆర్థికంగా వెనకబడిన వారికి (ఈబీసీ) 14 శాతం రిజర్వేషన్లను ఇవ్వడానికి ఆమోదించారు. దాంతో ఆ రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్ల కోటా 68 శాతానికి చేరుకుంది. వాస్తవానికి చట్టప్రకారం గరిష్ఠంగా మొత్తం రిజర్వేషన్లు కలిపి 50 శాతం దాటకూడదు. అయితే, తాము కొత్తగా ఆమోదించిన రెండు బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూలులో చేర్చడం ద్వారా వాటికి న్యాయపరమైన అడ్డంకులు రాకుండా చూడాలని రాజస్థాన్లోని వసుంధర రాజె ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే.. అసలు రిజర్వేషన్ల వ్యవస్థనే మొత్తం సమీక్షించాలంటూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చెప్పిన ఒక్కరోజు తర్వాతే రాజస్థాన్ సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.