Satyababu
-
‘‘మోస్ట్ అవైటెడ్ మూవీ’’లో ప్రభాస్ సినిమాలకి టాప్ ప్లేస్
ఒక ఏడాదిలో విడుదలైన సినిమాల నుంచి ప్రేక్షకాదరణను అనుసరించి టాప్ హిట్స్, టాప్ ఫ్లాప్స్ అంటూ జాబితాలు ప్రకటించడం మామూలే. అయితే ఇప్పుడిప్పుడే కొత్త ఏడాదిలో అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రాలను కూడా గుర్తించి జాబితాలు ప్రకటించడం ట్రెండీగా మారింది. సినిమాలకు సంబంధించి రేటింగ్ పరంగా అత్యంత విశ్వసనీయత కలిగిన ఆన్లైన్ వేదికగా పేరున్న ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (ఐఎండిబి). ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఐఎండీబీ కస్టమర్ల పేజ్ వ్యూస్ ఆధారంగా 2025లో మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాను తాజాగా ప్రకటించింది. సినిమాలు, టీవీ షోలు ప్రముఖులపై సమాచారం కోసం ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన ఐఎండిబి పేజ్కి ప్రపంచవ్యాప్తంగా 250 మిలియన్లకు పైగా నెలవారీ సందర్శకులున్నారు. తమ వీక్షకుల ద్వారా ఈ మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాను ప్రకటించింది. ఆ జాబితా ప్రకారం అత్యధిక సంఖ్యాకులైన ప్రేక్షకులు ఎదురు చూస్తున్న వాటిలో నెం.1గా నిలిచింది సికందర్.ఐఎండిబి విడుదల చేసిన 2025 మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ను పరిశీలిస్తే...1. సికందర్, 2. టాక్సిక్,3. కూలీ,4. హౌస్ ఫుల్ 5. బాఘీ, 6.రాజా సాబ్, 7. వార్ 2 8. ఎల్2: ఎంపురాన్ 9. దేవా 10. చావా 11. కన్నప్ప 12. రెట్రో 13. థగ్ లైఫ్ 14. జాట్ 15. స్కై ఫోర్స్ 16. సితారే జమీన్ పర్ 17. థామా 18. కాంతారా ఏ లెజెండ్: చాప్టర్ 1 , 19. ఆల్ఫా 20. తండెల్ఈ జాబితాలోని 20 టైటిల్స్ లో 11 హిందీ సినిమాలు, మూడు తమిళ, తెలుగు, రెండు కన్నడ, ఒకటి మలయాళ సినిమా కావడం గమనార్హం. హౌస్ ఫుల్ 5 (నెం.4), కన్నప్ప (నెం.11), స్కై ఫోర్స్ (నెం.15) వంటి మూడు చిత్రాల్లో అక్షయ్ కుమార్ నటించగా, రష్మిక మందన్న3 సినిమాలు సికందర్ (నెం.1), చావా (నెం.10), థమా (నెం.17)లలో, మోహన్ లాల్, ప్రభాస్, పూజా హెగ్డే, కియారా అద్వానీ లు రెండేసి చిత్రాల్లో నటిస్తున్నారు.నెంబర్ వన్ కావడం సంతోషంగా ఉంది...మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్లో నెం.1 గా నిలిచినందుకు సికందర్ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘2025 ఐఎండిబి మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ లో సికందర్ అగ్రస్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సల్మాన్ ఖాన్ తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. అతని ఎనర్జీ, అంకితభావం సికందర్ సినిమాను మాటల్లో వర్ణించలేని విధంగా తీర్చిదిద్దాయి. అందుకు సహకరించిన నిర్మాత సాజిద్ నదియాడ్ వాలాకు ధన్యవాదాలు. సికిందర్ లో ప్రతి సన్నివేశం చెరగని ముద్ర వేసేలా తీర్చిదిద్దాం. ప్రేక్షకులతో ఎప్పటికీ నిలిచిపోయేలా ప్రతి క్షణాన్ని డిజైన్ చేయడం కోసం నేను మనస్పూర్తిగా పనిచేశాను’’ అంటూ చెప్పారు. -
కిక్ బాక్సింగ్తో రష్మిక...ఫ్లెక్సిబులిటీ కోసం జాన్వీ...!
బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా సినీ తారలంతా ఇప్పుడు వర్కవుట్స్ మీద దృష్టి పెడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఫిట్గా కనిపిస్తున్నారు. తారలే స్వయంగా ఇంటర్వ్యూల్లో వెల్లడించిన ప్రకారం... కొందరు తారల గ్లామర్–ఫిట్నెస్ రొటీన్ ఇదీ...ఫ్లెక్సిబులిటీ కోసం ఈ బ్యూటీ... చుట్టమల్లే చుట్టేత్తాంది తుంటరి చూపు అంటూ టాలీవుడ్ దేవరను ప్రేక్షకుల్ని ఒకేసారి కవ్వించిన జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ తెరపై గ్లామర్ డోస్ని విజృంభించి పంచే హీరోయిన్స్లో టాప్లో ఉంటుంది. తన తల్లి శ్రీదేవిలా కాకుండా పూర్తిగా అందాల ఆరబోతనే నమ్ముకున్న ఈ క్యూటీ...దీని కోసం ఫిజిక్ ను తీరైన రీతిలో ఉంచుకోవాల్సిన అవసరాన్ని కూడా గుర్తించింది. తన శరీరపు ఫ్లెక్సిబిలిటీని పెంచుకోవడానికి స్ట్రెచింగ్, ట్రెడ్మిల్ లపై దృష్టి పెడుతుంది. తన ఫిట్నెస్ రొటీన్లో బెంచ్ ప్రెస్లు, డెడ్లిఫ్ట్లు, స్క్వాట్లు, షోల్డర్ ప్రెస్లు పుల్–అప్ల ద్వారా బాడీ షేప్ని తీర్చిదిద్దుకుంటుంది. టిని ఆమె రోజువారీ వ్యాయామాలు ఆమె టోన్డ్ ఫిజిక్ను నిర్వహించడానికి మాత్రమే కాదు ఆమె కండరాలలో బలాన్ని పెంపొందించడానికి కూడా సహాయపడతాయి.‘కిక్’ ఇచ్చేంత అందం...వత్తుండాయి పీలింగ్సూ, వచ్చి వచ్చి చంపేత్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్సూ... అంటూ పుష్పరాజ్ మాత్రమే కాదు ప్రేక్షకులు సైతం తనను చూసి పిచ్చెత్తిపోవాలంటే ఏం చేయాలో రష్మికకు తెలుసు. అందుకే వారానికి 4–5 సార్లు జిమ్కి వెళుతుందామె. ఆమె ఫిట్నెస్ రొటీన్లో స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్ ట్రైనింగ్, కార్డియోతో పాటు ముఖ్యంగా నడుం దగ్గర ఫ్యాట్ని పెంచనీయని, అదే సమయంలో క్లిష్టమైన డ్యాన్స్ మూమెంట్స్కి ఉపకరించే కోర్ వర్కౌట్లు కూడా ఉంటాయి. అంతేకాకుండా ఫిట్గా ఉండటానికి ఇంట్లో పవర్ యోగా, స్విమ్మింగ్ చేస్తుంది. ఇటీవలే రష్మిక తన ఫిట్నెస్ మెనూలో అధిక–తీవ్రత గల కిక్బాక్సింగ్ సెషన్లను కూడా చేర్చుకుంది, ఇది తన ఒత్తిడిని తగ్గించడానికి, కేలరీలను బర్న్ చేయడానికి ఆమె జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది.దీపికా...అందం వెనుక...జవాన్ సినిమాలో దీపికా పదుకొణెను చూసినవాళ్లు తెరపై నుంచి కళ్లు తిప్పుకోవడం కష్టం. పెళ్లయిన తర్వాత ఈ ఇంతి ఇంతింతై అన్నట్టుగా మరింతగా గ్లామర్ హీట్ను పుట్టిస్తోంది. ఇంతగా తన అందాన్ని తెరపై పండించడానికి తీరైన ఆకృతి చాలా అవసరమని తెలిసిన దీపిక.. దీని కోసం బ్లెండింగ్ యోగా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కార్డియోను సాధన చేస్తుంది. అవే కాదు... స్విమ్మింగ్, పిలాటిస్, వెయిట్ ట్రైనింగ్ కూడా చేస్తుంది, ఆమె శారీరక థృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యతనిస్తూ తన వర్కవుట్ రొటీన్ను డిజైన్ చేసుకుంటుంది.కార్డియో...ఆలియా...ఆర్ఆర్ఆర్ సినిమాలో మెరిసిన బ్యూటీ క్వీన్ అలియా భట్ తాజాగా జిగ్రా మూవీతో ప్రేక్షకుల్ని మెప్పించింది. అటు గ్లామర్, ఇటు యాక్షన్ రెండింటినీ పండించే ఈ థర్టీ ప్లస్ హీరోయిన్.. ఫిట్గా ఉండటానికి కార్డియో అవసరమని అర్థం చేసుకుంది. అది ట్రెడ్మిల్పై నడుస్తున్నా లేదా స్పిన్నింగ్ చేసినా, ఆమె స్టామినాను పెంచుకోవడంపైనే దృష్టి పెడుతుంది వర్కవుట్స్లో ఆటల్ని కూడా మిళితం చేసే అలియా తాజాగా పికిల్ బాల్ ఫ్యాన్ క్లబ్లోని సెలబ్రిటీస్ లిస్ట్లో తానూ చేరింది.కత్తిలా..కత్రినా..తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన కనిపించిన మల్లీశ్వరి కత్రినా కైఫ్...నాజూకు తానికి మరోపేరులా కనిపిస్తుంది. మైనేమ్ ఈజ్ షీలా, చికినీ చమేలీ వంటి పాటల్లో కళ్లు తిరిగే స్టెప్స్తో అదరగొట్టిన కత్రినా.. తన వ్యాయామాల్లో డ్యాన్స్, పిలాటì స్, యోగా, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ల సమ్మేళనాన్ని పొందుపరిచింది. అందమైన ఆ‘కృతి’...ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ సరసన నటించిన సీత...కృతి సనన్ అంతకు ముందు దోచెయ్ సినిమా ద్వారానూ తెలుగు తెరకు చిరపరిచితమే. అద్భుతమైన షేప్కి కేరాఫ్ అడ్రస్లా కనిపించే ఈ పొడగరి... తన శరీరాన్ని సన్నగా బలంగా ఉంచుకోవడానికి పిలాటిస్, కోర్ వర్కౌట్లతో శ్రమిస్తుంటుంది. వ్యాయామాల ద్వారా తన పోస్చర్ను మెరుగుపరచడానికి కూడా ఈమె తగు ప్రాధాన్యత ఇస్తుంది. -
3 కోట్ల బడ్జెట్.. 136 కోట్ల కలెక్షన్స్.. ‘పుష్ప2’ని మించిన హిట్!
రపరపరపరప అన్నట్టుగా వరుసపెట్టి విలన్లను మాత్రమే కాదు అంతకు ముందు సినిమాలు నెలకొల్పిన ప్రతీ రికార్డ్నూ నరుక్కుంటూ పోయాడు పుష్ప2. అంతకు ముందు వరకూ ఠీవీగా నిలుచున్న అనేక మంది నెంబర్ వన్ హీరోలు సైతం తమ స్థాయి గురించి తాము సందేహించుకునేలా చేశాడు అల్లు అర్జున్. అయితే అసలైన హిట్ ఇది కాదని, కనీ వినీ ఎరుగని కలెక్షన్లు సాధించినప్పటికీ పుష్ప2 అత్యద్భుతమైన హిట్ గా చెప్పలేమని ట్రేడ్ పండితులు కొందరు తీర్మానిస్తున్నారు.అంతేకాదు ఆ మాట కొస్తే గత ఏడాది సినిమాల్లో కలెక్షన్ల పరంగా రికార్డ్స్ బద్ధలు కొట్టిన పలు సినిమాలు కూడా హిట్స్ కిందకు రావని అంటున్నారు. ఒకే ఒక సినిమా మాత్రం టాప్ హిట్గా స్పష్టం చేస్తున్నారు. దీనికి గాను వారు అందిస్తున్న విశ్లేషణ ఏమిటంటే...గత ఏడాది భారతీయ సినిమాకు చెప్పుకోదగ్గ అద్భుతమైన సంవత్సరంగా మార్చడంలో పలు టాప్ మూవీస్ కీలకపాత్ర పోషించాయి. ప్రపంచవ్యాప్తంగా రూ. 1,000 కోట్ల మార్కును అధిగమించిన రెండు సినిమాలు పుష్ప 2: ది రూల్, కల్కి 2898... రెండూ గత ఏడాదిలోనే విడుదలయ్యాయి. అదే విధంగా శ్రద్ధా కపూర్ రాజ్కుమార్ రావుల హర్రర్ కామెడీ స్ట్రీ 2 కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 850 కోట్లకు పైగా వసూలు చేయడం ద్వారా గత ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చిత్రంగా అవతరించింది.అయితే, ఒక దక్షిణ భారతీయ చిత్రం వాటన్నింటినీ అధిగమించి, భారతదేశపు అత్యంత లాభదాయకమైన చిత్రంగా నిలిచింది. విశేషం ఏమిటంటే ప్రధాన తారలు ఎవరూ కనిపించని ఈ చిత్రం కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. ఆ మలయాళ చిత్రం పేరు ప్రేమలు. ఇటీవలి కాలంలో భారతదేశపు అత్యంత లాభదాయకమైన చిత్రంగా ప్రేమలు నిలిచింది. ఈ విషయానన్ని ప్రముఖ ఆంగ్లపత్రిక హిందుస్థాన్ టైమ్స్ వెల్లడించింది. గిరీష్ దర్శకత్వం వహించిన ప్రేమలు చిత్రం సచిన్ అనే యువకుడి చుట్టూ తిరిగే రొమాంటిక్ డ్రామా. హిందుస్థాన్ టైమ్స్ ప్రకారం, ఈ చిత్రం దాని నిర్మాణ బడ్జెట్లో 45 రెట్లు ఎక్కువ లాభాలను ఆర్జించింది. రూ. 3 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ప్రేమలు ప్రపంచవ్యాప్తంగా రూ. 136 కోట్లు వసూలు చేసింది, తద్వారా గత ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన మలయాళ చిత్రంగా నిలవడం మాత్రమే కాదు. అత్యంత లాభదాయకమైన భారతీయ చిత్రంగా కూడా నిలిచింది.మరోవైపు పుష్ప 2: ది రూల్, కల్కి 2898.. స్త్రీ 2 వంటివన్నీ భారీ బడ్జెట్ చిత్రాలనేవి తెలిసిందే. దీని వలన తయారీదారులు తమ ఉత్పత్తి ఖర్చులను త్వరగా రికవరీ చేసుకోవచ్చు. అగ్రతారలైన ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ తదితరులు నటించిన కల్కి 2898.. బడ్జెట్ రూ. 600 కోట్ల పై మాటే. ఫలితంగా ప్రేమలుతో పోలిస్తే తక్కువ లాభాల శాతం వచ్చింది. అదేవిధంగా, అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్ బాక్స్ ఆఫీస్ హిట్ అయినప్పటికీ దాని నిర్మాణ బడ్జెట్ రూ. 350 కోట్లపై మాటే దాంతో భారీ పెట్టుబడి దీని లాభాల మార్జిన్ను తగ్గించింది. అత్యంత లాభదాయకమైన చిత్రాల్లో రెండో స్థానం సాధించిన స్ట్రీ 2 దాని బడ్జెట్కు పది రెట్లు సంపాదించింది. ఈ సినిమా రూ. 90 కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొంది 850 కోట్లకు పైగా కలెక్షన్లు దక్కించుకుంది. -
పీరియడ్స్ అన్నా పట్టించుకోరు... అతనొక్కడే...: నిత్యామీనన్
దక్షిణాదిలో చాలా మందికి ఇష్టమైన నటి నిత్యా మీనన్(Nitya Menen ) తెలుగు సినిమాల్లో కూడా హిట్స్ ద్వారా చాలా మందికి సుపరిచితమే. ఆమెకు దక్షిణాది వ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ నేపధ్యంలో ప్రస్తుతం తన రాబోయే తమిళ చిత్రం కాదలిక్క నేరమిల్లై ప్రమోషన్ కార్యక్రమంలో నిత్యామీనన్ బిజీ బిజీగా ఉంది. అయితే ఈ సందర్భంగా ఆమె చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. ఇటీవల తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె చిత్రపరిశ్రమ తీరుతెన్నుల గురించి తూర్పార బట్టడం ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా నటీమణుల ఆరోగ్యం విషయంలో చిత్ర పరిశ్రమ కనీసపు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తుంది అని ఆమె వ్యాఖ్యానించడం విశేషం. అయితే తన స్నేహితుడు, దర్శకుడు–నటుడు మిస్కిన్ ఒక్కడు మాత్రం ఇందుకు మినహాయింపు అంటూ నిత్య చెప్పుకొచ్చారు.నిక్కచ్చిగా మాట్లాడడానికి ప్రసిద్ది చెందిన నిత్య... సినిమా షూటింగ్లో తాను ఎదుర్కున్న అనుభవాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. చిత్రనిర్మాతలు తమ బృందం అనారోగ్యం విషయంలో. అలాగే నటీమణులు పీరియడ్స్ నొప్పితో ఉన్నామని చెప్పినా పట్టించుకోరని పని మాత్రమే పట్టించుకుంటారని ఆమె వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ ‘‘సినిమా పరిశ్రమలో చాలా చోట్ల అమానవీయత ఉంటుంది. ఎంత జబ్బుపడినా, ఎంత కష్టమైనా ఏదో ఒకటి చేసి షూటింగ్కి రావాలని సినిమా నిర్మాత దర్శకులు ఆశిస్తారు. అంతే. మనం దానికి అలవాటు పడ్డాం. ఏది ఎలా జరిగినా మనం కష్టపడాలి తప్పదు ’’ అంటూ చెప్పారు.అయితే ఆమె 2020లో చేసిన చిత్రం సైకో కోసం చిత్రీకరణలో ఉన్నప్పుడు ఆమెకు ఓ వైవిధ్యభరిత అనుభవం ఎదురైంది. మొదటి రోజు షూట్లోనే తనకు పీరియడ్స్ వచ్చిందని, చాలా నొప్పిగా అనిపించిందని ఆమె గుర్తు చేసుకుంది. ఆ సమయంలో దర్శకుడు మిస్కిన్ ఎంతగా తనని అర్థం చేసుకున్నాడో అని ఆశ్చర్యపోయానని కూడా నిత్య తెలిపింది. నాకు పీరియడ్స్ ఉందని మొదటిసారిగా ఒక మగ దర్శకుడికి నోరు విప్పి చెప్పాను. అప్పుడు అది నా మొదటి రోజు కాదా? అని అతను అడిగాడు. అప్పుడే నాకు అతనిలోని సానుభూతి అనిపించింది. నేను ఆశించినట్టే, అనుకున్నట్టే.. ‘‘అయితే మీరు విశ్రాంతి తీసుకోవచ్చు’’ అని అతను అన్నాడు. అంతేకాదు ఏమీ చేయవద్దు. ఆ రోజు నిత్య అసౌకర్యానికి గురవుతున్నట్లు తాను అర్ధం చేసుకున్నానని ఆమె చేయకూడని పనిని చేయడం తనకు ఇష్టం లేదని మిస్కిన్ చెప్పాడట, ఆమె ఇబ్బంది లేకుండా వచ్చినప్పుడు మాత్రమే షాట్ చేయడానికి ఇష్టపడతానని అన్నాడట.ఈ సినిమాతో పాటు ధనుష్ దర్శకత్వం వహించిన ఇడ్లీ కడైలో నిత్యనే ప్రధాన పాత్రలో కూడా కనిపించనున్నారు. ఆమె డియర్ ఎక్సెస్ అనే చిత్రం కోసం అలాగే తదుపరి చిత్రంలో విజయ్ సేతుపతితో కలిసి నటిస్తోంది. -
కిలో బియ్యం.. రూ. 2,200!
రూపాయికే కిలో బియ్యం సంగతి తెలుసు. కాని కిలో రూ.2,200కు దొరికే బియ్యం గురించి విన్నారా? పాతిక రూపాయలకు దొరికే కోలాల గురించి తెలుసు.. రూ.8 వేలు పలికే సాఫ్ట్ డ్రింక్ గురించి తెలుసా? పదో ఇరవయ్యో పెడితే పొట్ట నింపేసే రొట్టెముక్కలు చూసే ఉంటారు. కానీ రూ.300 ఖర్చు చేయించే బ్రెడ్ గురించి విన్నారా? పర్స్ వీకైనా.. స్ట్రాంగ్ బాడీ కావాలనుకునే నగరవాసులు.. డైట్ సప్లిమెంట్స్కు ‘రైట్ రైట్’ అంటున్నారు. దీంతో ఒకప్పుడు బాడీబిల్డర్లను మాత్రమే దృష్టిలో పెట్టుకున్న ఈ ఉత్పత్తులు ఇప్పుడు సిటీలో ఫిట్నెస్ ఫీవర్ని, ‘ప్యాక్’ ఇష్టులనూ టార్గెట్ చేస్తున్నాయి. - ఎస్.సత్యబాబు వ్యక్తి బాడీ వెయిట్లో ప్రతి కిలోకూ అవసరమైన 1.2 కి.గ్రాల ప్రొటీన్ రెగ్యులర్ ఫుడ్ ద్వారా అందకపోతే, దేహానికి అత్యంత అవసరమైన ఒమెగా 2, ఒమెగా 6 ఫ్యాట్స్ ఆహారం ద్వారా లభించకపోతే.. ఉదయపు ఎండ అందించే డి విటమిన్ సరిపడా దక్కకపోతే... సప్లిమెంట్ తప్పదు. విటమిన్లు, పోషక లోపాలను వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్స్తో భర్తీ చేసుకోవడం సహజమైన విషయమే. అయితే షేప్ కోసం సప్లిమెంట్స్ అనేది లేటెస్ట్ ట్రెండ్. సప్లిమెంట్.. గిఫ్ట్ ‘ప్యాక్’ సిక్స్ప్యాక్ కోరుకున్నవాళ్లు తినే అన్నం, తాగే నీళ్లు సైతం నియంత్రించుకుంటున్నారు. దీంతో పోషక లోపాల భర్తీకి సప్లిమెంట్స్ తప్పడం లేదు. సాధారణ రీతిలో అయితే దాదాపు 6 నెలలు పట్టే శారీరక సామర్థ్యాన్ని వారంలోనే సంతరించుకోవడానికి వీటిపై ఆధారపడుతున్నారు. వ్యక్తికి 50 గ్రాముల ప్రొటీన్ సమకూరాలంటే కనీసం 200-300 కి.గ్రా. బాయిల్డ్ చికెన్ తినాలి. దీని కన్నా సప్లిమెంట్స్ వాడకమే తేలికని ‘ప్యాక్’ ప్రియులు భావిస్తున్నారు. ఇవి చాక్లెట్, స్ట్రాబెర్రీ, వె నీలా తదితర ఫ్లేవర్స్తో రుచికరంగా దొరుకుతున్నాయి కూడా. సాధనానంతరం ప్యాక్-పోషణలో కూడా సప్లిమెంట్స్ అవసరమే. మితిమీరితే...అనర్థాలే... ఈ ఆహార ప్రత్యామ్నాయాలు శరవేగంగా శక్తిని అందించినా, అలవాటైతే వదలడం అంత తేలికకాదని వైద్యులు అంటున్నారు. పరిమితికి మించిన వినియోగం హార్మోన్ల పనితీరును అస్తవ్యస్తం చేస్తుంది. కొవ్వును కరిగించే ఫ్యాట్ బర్నర్స్ను అధిక మోతాదులో వాడడం ప్రమాదకరం. వైద్య, నిపుణుల పర్యవేక్షణలో, ఉత్పత్తుల గురించి పూర్తిగా తెలుసుకున్నాకే పరిమిత స్థాయిలో వినియోగించాలని సూచిస్తున్నారు. కాస్ట్లీ ‘ప్యాక్స్’... ఆస్ట్రేలియాకు చెందిన ఎక్స్క్లూజివ్ ప్రొటీన్ రైస్ క్వినోరైస్ కిలో రూ.1800. అదే ఆర్గానిక్ అయితే రూ.2200. రోజుకి 100 గ్రాములు సరిపోతుందట. ఓట్స్లా ఉండే పుష్కుష్ కిలో రూ.600 పలుకుతోంది. 20 రోజులు సరిపోయే ప్యూర్ ప్రొటీన్ టిన్ ఒక్కోటి రూ.8000 దాకా, హోల్ గ్రెయిన్స్ బ్రౌన్ బ్రెడ్ రూ.300 ధరల్లో లభిస్తున్నాయి. కూల్డ్రింక్లా అనిపించే ప్రీ-వర్కవుట్ డ్రింక్ నైట్రిక్ ఆక్సైడ్ టిన్ రూ.4,000. పౌడర్ రూపంలోని క్రియేటిన్ ఎనర్జీ లెవల్స్ని శరవేగంగా పెంచుతుంది. ఇవేకాక మాస్ గెయినర్స్, వెయిట్ గెయినర్స్ కూడా లభిస్తున్నాయి. కొన్ని మాల్స్, బేకరీల్లో వెల్నెస్ స్టోర్స్లలోనే ఈ ఉత్పత్తులు దొరుకుతున్నాయి. జిమ్లు, ఫిట్నెస్ స్టూడియోస్, స్పాలకు సప్లయర్లే సరఫరా చేస్తుంటే, బంజారాహిల్స్, పంజగుట్ట, అబిడ్స్ ప్రాంతాల్లో ప్రత్యేక స్టోర్స్ వెలిశాయి. వీ షేప్, సిక్స్ప్యాక్ వంటి ప్రత్యేక లక్ష్యాలతో హెవీ వర్కవుట్స్ చేసేవారికి ఇవి అవసరమవుతాయంటున్నారు ఫిట్నెస్ ట్రైనర్ వెంకట్. వీటి వాడకానికి ముందు వైద్యుల సలహా తప్పనిసరని చెబుతున్నారు. ప్రొటీన్ రొటీన్ ఇదీ... హెవీ ఎక్సర్సైజ్లకు ఆహారం ద్వారా లభించే న్యూట్రిషన్స్ సరిపోవు కాబట్టి సప్లిమెంట్స్ భాగం చేశా. మార్నింగ్ ప్రీ వర్కవుట్ డ్రింక్, వర్కవుట్ తర్వాత 2 స్కూప్స్ ప్రొటీన్ 200 మి.లీ నీటితో తీసుకుంటాను. బ్రేక్ఫాస్ట్గా ఎగ్వైట్స్, 1 మల్టీవిటమిన్ ట్యాబ్లెట్, లంచ్గా 100 గ్రా.చికెన్, క్వినో రైస్, రెండుగంటలు ఆగి ఒక ప్రొటీన్ స్కూప్, లైమ్జ్యూస్తో తీసుకుంటాను. గ్రిల్డ్ ఫిష్తో డిన్నర్ పూర్తి చేసి, 1 ఫిష్ ఆయిల్ క్యాప్సూల్, నిద్రపోయే ముందు తిరిగి 1స్కూప్ ప్రొటీన్. ఇది నా రెగ్యులర్ డైట్ విత్ సప్లిమెంట్స్. - రఘు -
డస్కీ బ్యూటీ..
సిస్టరాఫ్ డిస్కోశాంతి ‘నాపేరు సుచిత్రా ఆనందన్’ అని పరిచయం చేసుకునే ఆమెని చూస్తే నిన్నటి తరం ఐటమ్ బాంబ్ డిస్కో శాంతి చెల్లెలు అని చెబితే నమ్మడం అంత సులభం కాదు. జఫా, రుషి లాంటి సినిమాల ద్వారా ఇప్పుడిప్పుడే తెరపై మెరుస్తోన్న ఈ డస్కీ బ్యూటీ రియల్ స్టార్ శ్రీహరికి స్వయానా మరదలు అనే విషయం చాలా మందికి తెలియదు. ఓ రెస్టారెంట్ ప్రారంభానికి వచ్చిన ఈ బ్లాక్ బ్యూటీని సిటీప్లస్ పలకరించింది. ఈ సందర్భంగా సుచిత్ర చెప్పిన సంగతులు ఆమె మాటల్లోనే.. - సత్యబాబు మాది పూర్తిగా సినీ నేపథ్యం ఉన్న కుటుంబం అనేది తెలిసిందే కదా. నాన్న, ఇద్దరు అక్కలు.. ఇలా ఇంట్లో అంతా సినీనటులే. ఏడుగురు తోబుట్టువుల్లో ముగ్గురు ఆడపిల్లలం ఉన్నాం. నేను చివరి దాన్ని. మాస్ కమ్యూనికేషన్స్లో మాస్టర్స్ చేశాను. సినీరంగంపై ఎప్పుడూ ఆసక్తి లేదు. జర్నలిస్ట్ కావాలనుకున్నా. అయితే నా కలర్ నచ్చిన ఓ డీజే ఫ్రెండ్ ఫొటోగ్రాఫర్కి పరిచయం చేయడం, నేను మోడల్గా మారడం జరిగిపోయాయి. అలా పూణెలో చదువుతున్నప్పుడే, కాలేజ్ డేస్లోనే మోడల్నయ్యాను. చెన్నైలో వందకు పైగా మోడలింగ్ అసైన్మెంట్స్లో పాల్గొన్నాను. చెట్టినాడ్ శారీస్ వంటివి బాగా పేరు తెచ్చాయి. అయితే సినిమా రంగంలో ఈ కలర్కి ఇంకా అంత క్రేజ్ రాలేదనుకోండి. సిస్టర్ ఒప్పుకోలేదు.. నేను సినిమాల్లోకి రావడం శాంతికి మొదట్లో ఇష్టం లేదు. ఎందుకంటే మా ఇంట్లో ఆడపిల్లలు ఎవరూ టెన్త్ క్లాస్ దాటలేదు. అందుకే అందరూ నేను చదవాలని కోరుకున్నారు. నేను డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఓకే అంది. చిన్నప్పుడు కొంతకాలం భరతనాట్యం నేర్చుకున్నా గానీ అక్క అంత మంచి డ్యాన్సర్ని కాదు. నిజానికి అక్కలా డ్యాన్స్ చేయాలంటే బాబోయ్.. చాలా కష్టం. అప్పట్లో అమీర్పేటలో అక్క డ్యాన్స్ స్కూల్ పెట్టింది కదా అప్పుడు కొన్ని నెలలు తన దగ్గర ట్రైనింగ్ అయ్యా. అయితే ఇటీవల కన్నడ సినిమా గణపలో ఐటమ్ సాంగ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి ఆఫర్లు వస్తే ఐటమ్ సాంగ్స్ చేయడానికీ అభ్యంతరం లేదు. అక్కకి తోడుగా.. ఎంతో ప్రేమించే భర్తను కోల్పోయిన అక్కకు ధైర్యం చెప్పేందుకు మా కుటుంబం అంతా చెన్నై నుంచి వచ్చేశాం. తనతోనే ఉంటున్నాం. ఇక్కడ ఏమైనా ఇబ్బంది కలిగించే జ్ఞాపకాలు గుర్తొస్తే చెన్నై తీసుకెళ్తున్నాం. తనకు తోడుగా ఉండాలనే కోరికతోనే సినిమా ఆఫర్లపై ఇప్పటిదాకా సీరియస్గా ఆలోచించలేదు. ఇక దృష్టి పెట్టాలి. జనవరిలో నేను నటించే తమిళ సినిమా ప్రారంభం అవుతోంది. నాగార్జున, కమల్, అర్జున్ వంటి సీనియర్ హీరోలతో నటించాలని ఉంది. అక్క కొడుకులు శశాంక్, మేఘాంశ్ చాలా కష్టపడుతున్నారు. సినిమాల్లో తమను తాము నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. శశాంక్ ఆప్పుడే షార్ట్ ఫిల్మ్స్ కూడా తీస్తున్నాడు. వారిద్దరూ బావ పేరు నిలబెడతారనే విషయంలో సందేహం లేదు. -
మాట్లాడుకుందాం రా..!
నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినం కుదిరితే కప్పు కాఫీ.. వీలైతే నాలుగు మాటలు.. ఇన్డెప్త్గా ఈ సినిమా డైలాగ్లో మానసిక ఆరోగ్యానికి కావాల్సినంత మెడిసిన్ దొరుకుతుంది. మంచి ఉద్యోగం.. చక్కటి సంపాదన.. కుటుంబం.. ఇన్నీ ఉన్నా చాలామంది హ్యాపీగా ఉండలేకపోతున్నారు. కామన్మ్యాన్ నుంచి కరోడ్పతి వరకు మనసులోని బాధలకు బందీలైపోతున్నారు. ఎదను తొలిచే బాధను మొహమాటంతోనో.. ధైర్యం చాలకో.. ఇతరులతో పంచుకోకుండా అందరిలో ఉన్నా ఒంటరైపోతున్నారు. నాలుగు మాటలతో మానసిక బలాన్ని తిరిగి పొందొచ్చని చెబుతున్నారు సైకాలజిస్ట్లు. ఒత్తిడిని జయించడానికి కౌన్సెలింగ్కు మించిన మందు లేదంటున్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినం సందర్భంగా నాలుగు మంచి మాటలు. - సత్యబాబు ఒక సమస్య తీవ్రమైన మానసిక క్షోభకు దారితీయడానికి దానిని ఇతరులతో పంచుకోకపోవడమే ప్రధాన కారణం. కుటుంబసభ్యులకో.. దగ్గరి స్నేహితుడి కో.. మీ సమస్యలు చెప్పుకుంటే.. గుండె బరువు కాస్త దిగుతుంది. అయితే ఇప్పటి బిజీ లైఫ్లో మనలోని బాధలు చెప్పుకునే వ్యక్తులు కనబడరు. ఒకవేళ చెప్పినా మనల్ని ఎలా అంచనా వేస్తారోనన్న భయంతో చాలా మంది సమస్యలను పెదవి దాటనివ్వడం లేదు. ఏ ఎమోషనైనా షేర్ చేసుకోవడం వల్లే మానసిక ఆరోగ్యం కలుగుతుందని చెబుతున్నారు సైకాలజిస్ట్లు. రిలేషన్ బ్రేకప్స్.. చాలా వరకు తీవ్రమైన మానసిక సమస్యలకు కారణం రిలేషన్షిప్ మెయింటనెన్సే. ఐటీ ఉద్యోగాలు చేస్తున్న భార్యాభర్తల మధ్య ఈగో ప్రాబ్లమ్స్.. చినికి చినికి గాలివానలా మారి తీవ్రస్థాయికి వెళ్తున్నాయి. ఆఫీస్ టెన్షన్స్ ఇంటి కంపౌండ్లోకీ చొరబడి భార్యాభర్తల అనుబంధంపై ప్రభావం చూపుతున్నాయి. టీనేజర్స్లో లవ్ ఫెయిల్యూర్ డిప్రెషన్కు దారి తీస్తున్నాయి. కౌన్సెలింగ్ సెంటర్స్కు వస్తున్న వారిలో చాలా మంది లవ్ ఫెయిల్యూర్సే ఉంటున్నారు. పియర్ ప్రెషర్స్.. వేగంగా ఎదిగే అవకాశాలున్న ఐటీ వంటి రంగాల్లో పనితో పాటు మానసిక ఒత్తిడీ ఎక్కువే. మిగతావాళ్లు ఎదిగిపోతున్నారన్న కంపారిజన్ పియర్ ప్రెషర్కు కారణం అవుతోంది. పాజిటివ్ థింకింగ్ ద్వారా ఈ ప్రాబ్లమ్కు చెక్ పెట్టొచ్చని అంటున్నారు వైద్యులు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి దశలవారీగా ప్రాక్టీస్ చేయాలని సూచిస్తున్నారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాస్త డెవలప్ అయిన తర్వాత ఎలాంటి టెన్షన్ అయినా అధిగమించే శక్తి వస్తుంద ంటున్నారు. కౌన్సెలింగ్ క్యాప్సుల్... మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి కోసం నగరంలో ఎన్నో కౌన్సెలింగ్ సెంటర్లు వెలిశాయి. అలా ఏర్పా టైందే ‘సేవ’ సంస్థ. ఐటీ రంగంలో ఉన్నతస్థానంలో ఉన్న త్యాగరాజన్ ఈ సంస్థ నెలకొల్పారు. పదహారేళ్లుగా నాలుగు మాటలతో ఎందరికో ఉచితంగా మానసిక బలాన్నిస్తున్నారు. ‘పద్మారావునగర్లో మా సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది. మానసిక సమస్యలతో వ్యక్తిగతంగా కలసిన వారికి ఇక్కడ కౌన్సెలింగ్ ఇస్తాం. అలాగే గాంధీ ఆస్పత్రి వంటి పలు హాస్పిటల్స్లో కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేశామ’ని ఆయన తెలిపారు.