shortly
-
పుతిన్ త్వరలో చనిపోతారు
కీవ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై వదంతుల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ప్రకటన చేశారు. ఆయన తొందరలోనే చనిపోతారని వ్యాఖ్యానించారు. రెండు దేశాల మద్య యుద్ధం అప్పుడే ముగుస్తుందన్నారు. పారిస్లో ఓ ఇంటర్వ్యూలో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మా న్యుయేల్ మాక్రాన్తో బుధవారం భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శాంతి ప్రయత్నాలు జరుగుతున్నా రష్యా మాత్రం సంఘర్షణను ఇంకా లాగుతోందని ఆరోపించారు. ‘‘యుద్ధం కొనసాగాలని రష్యా కోరుకుంటోంది. యుద్ధాన్ని ముగించేలా దానిపై ఒత్తిడి తేవాల్సిన అవసరముంది’’ అన్నారు. పుతిన్ ఆరోగ్యంపై కొన్ని నెలలుగా ఊహాగానాలు, వదంతులు వినిపిస్తున్నాయి. ఆయన ఎడ తెరిపి లేకుండా దగ్గుతున్న వీడియోలు, చేతులు, కాళ్లు అసంకల్పితంగా కదలడం వంటివి పుకార్లకు మరింత బలం చేకూర్చాయి. 2022లో రష్యా మాజీ రక్షణ మంత్రి సెర్గీ షొయిగుతో భేటీ సందర్భంగా పుతిన్ టేబుల్ పట్టుకొని కుర్చీలో కూర్చున్న వీడియో వైరలైంది. ఆయన పార్కిన్సన్, కేన్సర్తో పోరా డుతున్నట్టు కొన్ని నివేదికలు కూడా వచ్చాయి. క్రెమ్లిన్ మాత్రం ఈ వార్తలను ఖండించింది. -
నేడు వైఎస్ఆర్ " లా నేస్తం " నిధులు విడుదల
-
కాసేపట్లో నరసాపురం చేరుకోనున్న సీఎం వైఎస్ జగన్
-
ఉర్జిత్ పటేల్ సంతకంతో తొలి నోట్
ముంబై: భారతీయ రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకంతో తొలినోట్ విడుదల కానుంది. గవర్నర్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన తొలి సంతకంతో ఇరవై రూపాయల నోటు త్వరలోనే వినియోగంలోకి రానుంది. ఉర్జిత్ సంతకం చేసిన రూ.20 నోట్లను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. మహాత్మాగాంధీ-2005 సిరీస్లో వస్తున్న ఈ నోట్లపై నంబర్ ప్యానల్స్పై ఆర్ ఇంగ్లీష్ అక్షరంతోపాటు, డాక్టర్ ఉర్జిత్ ఆర్.పటేల్, గవర్నర్, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా, 2016 అని నోట్లపై ముద్రించినట్టు ఆర్బీఐ తెలిపింది. ఈ నోట్ల డిజైన్, భద్రత ఫీచర్లు గాంధీ-2005 సిరీస్ నోట్ల మాదిరిగానే ఉంటాయని కేంద్ర బ్యాంకు ప్రకటించింది. మొదటి మూడు ఆల్ఫా-న్యూమరిక్ అక్షరాలు (ఎడమ నుండి కుడికి ఆరోహణ పరిమాణంలో) పెరుగుతూ వస్తాయి. అయితే తొలి మూడు సంఖ్యలు సున్నాతో ప్రారంభం కానున్నాయి. అలాగే నోట్ కు ఎడమవైపు దీర్ఘ చతురస్రాకారంలో ఉండే ఐటిడెంటిఫికేషన్ మార్క్ ను తొలగిస్తున్నట్టు వెల్లడించింది. అయితే రివర్స్ సైడ్ రంగుల్లో ఎలాంటి మార్పు ఉండబోదని, కానీ ఆఫ్ సెట్ ప్రింటింగ్ కారణంగా ముఖ భాగం రంగు తక్కువ ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.