Solar light
-
అద్భుతమైన అరోరా...ఔరా అనేలా : నెట్టింట హల్ చల్
ప్రపంచ వ్యాప్తంగా అరుదుగా కనిపించే అరోరా అద్భుతంగా ఆవిష్కృతమైంది. ఐరోపాలోని చాలా ప్రాంతాల్లో గులాబీ, పర్పుల్ రంగుల్లో అద్భుతమైన ఖగోళ కాంతి ప్రదర్శన, అరోరా బొరియాలిస్ ఆకాశంలో ప్రకాశించింది. దీంతో నెటిజన్లు తెగ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎక్స్లో తెగ వైరల్ అవుతున్నాయి.Strongest Aurora in last 20 years was visible last evening. This was how it looked on top of Jungfraujoch, Switzerland Video via webcams on https://t.co/BwS7eM6IEY#solarstorm pic.twitter.com/rqG5S2poKb— Backpacking Daku (@outofofficedaku) May 11, 2024 రెండు దశాబ్దాల తరువాత అత్యంత శక్తివంతమైన సౌర తుఫాను భూమిని తాకిన తర్వాత శుక్రవారం నాడు నార్తర్న్ లైట్లు ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా కనిపించాయి. భూ అయస్కాంత తుఫాను, భూ అయస్కాంత క్షేత్రాన్ని తాకినప్పుడు అరోరా ఏర్పడుతుంది. సూర్యుడు, భూ అయస్కాంత క్షేత్రాల ప్లాస్మా కణాల మధ్య పరస్పర చర్యల వల్ల ఇవి ఆవిష్కృతమవుతాయి. Guys I’m actually in tears I thought I’d never get to see the northern lights 😍😭 pic.twitter.com/kk8unLfhwE— Jimin’s Toof (B-ChimChim) Semi-IA (@ForeverPurple07) May 11, 2024 చాలామంది యూజర్లు అరోరాను వీక్షించిన తరువాత తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలతోపాటు, ఇటలీ, ఫ్రాన్స్. రష్యా అంతటా, ప్రత్యేకించి మాస్కో ప్రాంతంలో ఇవి దర్శనమిచ్చాయి. అలాగే సరాటోవ్ , వొరోనెజ్లో, దక్షిణ సైబీరియాలో కూడా కనిపించాయి. ఉత్తర జార్జియాకు చెందిన యూజర్ కూడా అరోరా బొరియాలిస్ అద్భుత చిత్రాలను పంచుకున్నారు. ఈ అందమైన దృశ్యాన్ని చూసిన వారు "చాలా చాలా అదృష్టవంతులు" అని ఒకరు, నాకు కన్నీళ్లు ఆగడం లేదంటూ మరొకరు భావోద్వేగానికి లోను కావడం విశేషం. నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్లాండ్, అలాస్కా వంటి భూమి, అయస్కాంత ధ్రువాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో నార్తర్న్ లైట్లు సాధారణంగా కనిపిస్తాయి. మరోవైపు భూమి అయస్కాంత క్షేత్రంలో మార్పులతో వచ్చే పరిణామాలపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఉపగ్రహ ఆపరేటర్లు, విమానయాన సంస్థలు , పవర్ గ్రిడ్లకు సూచించారు. -
Telangana: సచివాలయం కింద చెరువు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కొత్త సచివాలయం సకల హంగులతో సిద్ధమవుతోంది. భవనం భూగర్భంలో ఏకంగా ఓ మినీ రిజర్వాయర్ను నిర్మించారు. రెండున్నర లక్షల లీటర్ల సామర్ధ్యంతో ఈ స్టోరేజీ ట్యాంకును సిద్ధం చేశారు. మరోవైపు సచివాలయంలో వినియోగించే దీపాలకు అవసరమైన విద్యుత్తును సోలార్ పద్ధతిలో ఉత్పత్తి చేయబోతున్నారు. ఇందుకోసం భవనం రూఫ్ టాప్లో భారీ సౌర ఫలకాలను ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే సచివాలయం ప్రధాన ద్వారం ముందు వంద అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మిస్తున్నారు. వేయి అడుగుల పొడవుండే ఈ రోడ్డు చివరలో రెండు వరసల్లో ఏకంగా 300 కార్లను నిలిపి ఉంచేలా పార్కింగ్ వసతి అందుబాటులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయ భవనం వచ్చే నెల 17న ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలుండగా, ప్రాంగణంలోనూ మరిన్ని ప్రత్యేకతలు జోడించారు. వెరసి ఇదో ప్రత్యేక నిర్మాణంగా నిలవనుంది. వాన నీటిని ఒడిసిపట్టేలా.. వాన నీటిని ఒడిసి పట్టేందుకు వీలుగా సచివాలయం కింద రిజర్వాయర్ నిర్మించారు. భవనం నలువైపుల నుంచి వాన నీటిని ఇందులోకి తరలించేందుకు ప్రత్యేక పైప్లైన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. సచివాలయంలో దాదాపు 9 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో పచి్చక బయళ్లుంటాయి. భవనం ముందు వైపు రెండు వైపులా మూడెకరాల చొప్పున రెండు, మధ్య కోర్ట్యార్డు, ఇతర ప్రాంతాల్లో కలిపి మరో మూడెకరాల మేర లాన్లుంటాయి. వాటి నిర్వహణకు భారీగా నీటి వినియోగం అవసరమవుతుంది. భూగర్భ నీటిని పొదుపు చేసే క్రమంలో పచి్చకబయళ్లకు వాననీటిని వాడే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేశారు. బయట రోడ్డు లెవల్ కంటే సచివాలయం ప్రాంగణం బేస్ ఐదడుగుల ఎత్తున ఉంటుంది. దాని మీద భవన నిర్మాణం జరిగింది. దీంతో ఎక్కడా వాననీరు నిలిచిపోయే పరిస్థితి ఉండదు. పార్కింగ్కు వీలుగా రోడ్డు విస్తరణ సచివాలయ ప్రధాన ద్వారం ముందున్న రోడ్డును వంద అడుగులకు విస్తరించేందుకు వీలుగా ఫుట్పాత్పై ఉన్న దాదాపు 40 చెట్లను తొలగించనున్నారు. ఈ మేరకు సంబంధిత కమిటీ అనుమతి ఇచ్చింది. ఆ చెట్లను సంజీవయ్య పార్కులో (ట్రాన్స్లొకేట్) తిరిగి నాటనున్నారు. కాగా సచివాలయానికి వివిధ పనులపై వచ్చే వారి వాహనాలు నిలిపేందుకు లోపల విశాలమైన పార్కింగ్ యార్డులున్నాయి. అవి సరిపోని పక్షంలో, ఈ వంద అడుగుల రోడ్డు చివరలో నిలిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు. ఇక సాయంత్రం వేళ సాగర తీరానికి వచ్చే పర్యాటకులకు ప్రస్తుతం పార్కింగ్ ఇబ్బందులున్నాయి. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఆ కొత్త రోడ్డులో రెండు వరుసల్లో 300 కార్లు నిలిపేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. సౌర వెలుగులు పది లక్షల చదరపు అడుగుల సువిశాల భవనంలో వేల సంఖ్యలో విద్యుత్ దీపాల వినియోగం ఉంటుంది. దీంతో కరెంటు ఖర్చు ఎక్కువే అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కొంతమేర పొదుపు చేసేందుకు సౌర విద్యుత్తు వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. భవనం రూఫ్టాప్లో సౌర ఫలకాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. భవనాన్ని ప్రారంభించిన తర్వాత వీటి ఏర్పాటు మొదలు పెడతారు. ఇందుకోసం ఓ కన్సల్టెంటును కూడా నియమిస్తున్నారు. చదవండి: భారత జాతి విముక్తి కోసమే బీఆర్ఎస్! -
వామ్మో! భగభగమండే సూర్యుని ఉపరితలంపై స్నేక్
సూర్యుని ఉపరితలం మీదుగా ఒక పాము జరజర వెళ్తున్నటు ఒక అద్భుత దృశ్యం కనువిందు చేసింది. ఈ యూరోపియన్ ఆర్బిటర్ ద్వారా ఈ సూర్యునిపై ఈ విచిత్రమైన ఘటన కనిపించిందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పేర్కొంది. ఐతే అవి సూర్యుని అయస్కాంత క్షేతం గుండా వెళ్తున్న చల్లటి వాతావరణ వాయువుల గొట్టంగా పేర్కొంది. అది చూడటానికి అచ్చం భగభగమండే సూర్యుని ఉపరితలంపై పాకుతున్న పాములా కనిపిస్తోంది. దీన్ని పాము రూపంలో ఉన్న ప్లాస్మా అని అది సూర్యునిపై ఒక వైపు నుంచి మరోవైపుకు అయస్కాంత క్షేత్రం ఫిలమెంట్ను అనుసరిస్తుందని స్పేస్ ఏజెన్సీ తెలిపింది. అక్టోబర్ 12న సోలార్ ఆర్బిటర్ సూర్యుని వైపు ప్రయాణిస్తున్నందున ఈ అరుదైన దృశ్యం చూడగలిగామని ముల్లార్డ్ స్పేస్ సైన్స్ లాబోరేటరీ శాస్త్రవేత్త డేవిడ్ లాంగ్ తెలిపారు. అదీగాక అయస్కాంత క్షేత్రం వక్రీకృతమైంది కాబట్టి ఈ దృశ్యాన్ని చూడగలిగామని అన్నారు. సోలార్ ఆర్బిటర్ అనేది ఫిబ్రవరి 2020లో ప్రారంభమైన అమెరికా స్పేస్ ఏజెన్సీ, యూరోపియన్ స్సేస్ ఏజెన్సీల ఉమ్మడి ప్రాజెక్టు. Spot the solar snake slithering across the #Sun! 🐍 This ‘tube’ of cooler atmospheric gases snaking its way through the Sun’s magnetic field was captured by @esasolarobiter’s @EuiTelescope on 5 September, ahead of a large eruption 💥 📹 https://t.co/FJgXYq1vwp #ExploreFarther pic.twitter.com/02uIJMMCBH — ESA Science (@esascience) November 14, 2022 (చదవండి: ప్చ్! పోరాడలేకపోయాం...కనీసం కొట్టేద్దాం: రష్యా బలగాలు) -
Solar Flare: రికార్డు స్థాయిలో సూర్యుడి ఎండ.. జీపీఎస్, విమానాలపై ఎఫెక్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఏప్రిల్ నెలలోనే భానుడు భగభగమని ఉగ్రరూపం చూపిస్తున్నాడు. బుధవారం సూర్యుడి నుంచి సౌరజ్వాలల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. సమాచార ఉపగ్రహాలు, జీపీఎస్వ్యవస్థల్ని దెబ్బతీసే స్థాయిలో సౌరజ్వాలలతో భానుడు విరుచుకుపడ్డాడు. ఈ విషయాన్ని కోల్కత్తా వేదికగా పనిచేసే సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ స్పేస్ సైన్సెస్(CESSI) ఇండియా వెల్లడించింది. కాగా, భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం 9.27 గంటలకు ఒక్కసారిగా భారీ స్థాయిలో సౌరజ్వాలలు వెలువడ్డాయని.. ఇవి సమాచార ఉపగ్రహాలు, జీపీఎస్ వ్యవస్థలను దెబ్బతీసే స్థాయిలో ఈ సౌరజ్వాలలు ఉన్నాయని సెస్సీ(CESSI) వెల్లడించింది. ఈ సందర్బంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అసోసియేట్ ప్రొఫెసర్ దివ్యేందు నంది మాట్లాడుతూ.. సౌర అయస్కాంత క్రియాశీల ప్రాంతమైన ఏఆర్12992 నుంచి బుధవారం ఉదయం 9.27గంటలకు X2.2 తరగతికి చెందిన సౌరజ్వాలలు వెలువడ్డాయని అన్నారు. ఈ సౌరజ్వాలల ప్రభావం భారత్, ఆగ్నేయాసియా, ఆసియా పసిఫిక్ ప్రాంతంపై ప్రభావం చూపించిందని తెలిపారు. దీని వల్ల హైఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ వ్యవస్థలు స్తంభించిపోవడం, ఉపగ్రహాలు, జీపీఎస్పనితీరులో లోపాలు, ఎయిర్లైన్ కమ్యూనికేషన్ వ్యవస్థ ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. అయితే, ఇలాంటి సౌరజ్వాలలు వస్తాయని ఏప్రిల్ 18నే తమ బృందం అంచనా వేసిందని ఆమె చెప్పారు. దీని ప్రభావాన్ని అంచనా వేసేందుకు తమ బృందం ప్రయత్నిస్తోందని వెల్లడించారు. సౌరజ్వాలలు అంటే.. సౌర వ్యవస్థ నుంచి ఒక్కసారిగా శక్తి వెలువడటాన్నే సౌరజ్వాలలు అంటారు. ఈ సౌరజ్వాలల వల్ల రేడియా సిగ్నల్స్, విద్యుత్ గ్రిడ్స్, నేవిగేషన్ సిగ్నల్స్ ప్రభావితమై.. విమానాలకు, వ్యోమగాములకు ముప్పు ఏర్పడే ప్రమాదముంది. ఇక, సౌరజ్వాలల తీవ్రతను బట్టి నాసా.. వీటిని A నుంచి B, C, M, X వంటి తరగతులుగా విభజించింది. కాగా, బుధవారం వచ్చిన ఎక్స్ తరగతి సౌరజ్వాల అన్నింటికన్నా తీవ్రమైనది. The #sun unleashed a massive #solarflare on Wednesday, which has the potential to impact satellite communications and global positioning systems, the Centre of Excellence in Space Sciences India (CESSI) said.@cessi_iiserkol Read:https://t.co/wnIrwm99db — India Ahead News (@IndiaAheadNews) April 20, 2022 -
సోలార్ పవరే... సో బెటరు!
ముంబై: ‘వాన రాకడ, ప్రాణం పోకడ’ జాబితాలో ‘కరెంట్’ను కూడా చేర్చారు మహారాష్ట్ర సతార జిల్లాలోని మన్యచివాడి గ్రామస్థులు. ఆ ఊళ్లో కరెంటు అనేది ఉన్నప్పటికీ ఎప్పుడు ఉంటుందో మాత్రం ఎవరికీ తెలియదు. చీకటే చీకటి! రైతుల పొలాలు దెబ్బతింటున్నాయి. వ్యాపారుల వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. పిల్లల చదువులు దెబ్బతింటున్నాయి. సుదీర్ఘమైన కరెంటు కోతలు భరించలేక గ్రామప్రజలు ఎక్కే గడప, దిగేగడపలా ఎన్నో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారు. ‘చూద్దాం, చేద్దాం’ అనే మాటలు తప్ప సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఇక ఇలా కాదనుకొని మహిళలు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ‘ఎవరో ఇవ్వడం ఏమిటీ, కరెంట్ మనమే తయారు చేసుకుందాం’ అని ఒకరు ప్రతిపాదించినప్పుడు– ‘అవేమైనా రొట్టెలా మనమే తయారు చేసుకోవడానికి’ అని అనుకునేంత అమాయకులు కూడా ఉన్నారు. వారు సోలార్ పవర్ గురించి వినింది లేదు! రకరకాల మాటల తరువాత అందరూ సోలార్ పవర్కే ఓటు వేశారు. ఆ తరువాత సోలార్ పవర్ నిపుణులతో చర్చించారు. ఒక కార్యచరణ ప్రణాళిక రూపొందించుకున్నారు. మొదట గ్రామ వీధుల్లోకి సోలార్ పవర్ లైట్లు వచ్చాయి. ఆ తరువాత ప్రతి ఇంటికి ‘సోలార్ యూనిట్’ ఆలోచన చేశారు. అయితే ఒక్కో యూనిట్కి సుమారు ఆరువేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఊళ్లో బీదాబిక్కీ ఉంటారు కాబట్టి అంత మొత్తాన్ని అందరూ భరించే పరిస్థితి లేదు. దీంతో మహిళా స్వయం సహాయక బృందాలు ఆ ఖర్చులో ఎక్కువ భాగాన్ని భరించాయి. గ్రామపంచాయితీ, దాతలు తమ వంతుగా సహాయపడ్డారు. ఎట్టకేలకు ఊరు చీకటి నుంచి విముక్తి అయింది...‘సోలార్ గ్రామ్’గా మారింది. ఇప్పుడు ఆ ఊళ్లో కరెంటు కోత అనే మాట వినబడదు. ‘ఒకప్పుడు మా ఊరికి కోడలుగా రావడానికి భయపడేవారు. కరెంటులాంటి మౌలిక సదుపాయాలు లేని ఊరు అనే పేరు ఉండేది. గ్రామ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండేది. అయితే పవర్ అనేది గ్రామ అభివృద్ధికి ఎంత కీలకం అనే విషయం అర్ధమైంది’ అంటుంది సంగీత అనే మహిళ. ‘చీకటిని తిట్టుకుంటూ కూర్చోకు...చిరుదీపమైనా వెలిగించు’ అనే మంచిమాట ఉంది. చిరుదీపం ఏమి ఖర్మ....శక్తిమంతమైన సోలార్ దీపాన్నే వెలిగించారు గ్రామ మహిళలు. ఆ వెలుగులు ఊరకే పోలేదు. ఊరి అభివృద్ధికి గట్టి ఇంధనం అవుతున్నాయి. మన్యచివాడి ఇప్పుడు ఆదర్శ గ్రామం అయింది. ఈ చిన్న గ్రామం గురించి ఎప్పుడూ వినని వాళ్లు కూడా ఇప్పుడు గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఈ విజయానికి ప్రధాన కారణం...చిన్నా,పెద్దా తేడా లేకుండా ఊళ్లో ప్రతి ఒక్కరూ సోలార్ ప్రాజెక్ట్లో భాగం కావడం. చదవండి: ఎవరీ రాణి కమలాపతి.. ఈమె పేరును ఆ రైల్వేస్టేషన్కు ఎందుకు పెట్టారు..? -
సోలార్ పరికరాలను సందర్శించిన సుధీర్రెడ్డి
-
సోలార్ దీపాలు సర్దుకున్నారు..!
శ్రీకాకుళం మందస: తిత్లీ తుపానును కొంతమంది తమ స్వార్థం కోసం వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సాయాన్ని.. పరికరాలను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైద్య సేవలకు అంతరాయం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో అందజేసిన సోలార్ దీపాలను కొంతమంది ఉద్యోగులు పక్కదారి పట్టించారనే విషయం ఇప్పుడు చర్చనీ యాంశమైంది.అక్టోబర్ 10వ తేదీ రాత్రి భయంకరమైన తుపాను జిల్లాపై విరుచుకుపడింది. ప్రజలు సర్వం కోల్పోయారు. ప్రభుత్వ ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లింది. విద్యుత్ వ్యవస్థ నాశనమైంది. అనేక గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి. పరిస్థితిని గమనించిన సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి లోతేటి శివశంకర్ అత్యవసరశాఖగాగుర్తింపు ఉన్న వైద్యశాఖకు సోలార్ విద్యుత్ దీపాలను పంపిణీ చేశారు. విద్యుత్ లేకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రులు, సబ్ సెంటర్లకు, ఆశావర్కర్లకు ల్యాంపులను అందజేశారు. వీటి వెలుతురులో ప్రజలకు సేవలందించాలని ఆదేశించారు. ఒక్కో సబ్ సెంటర్కు 10 నుంచి 15 సోలార్ దీపాలు సమకూర్చారు. అయితే వీటిని కొంతమం ది పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఇప్పుడు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రజా సేవకంటే.. స్వసేవకే ప్రాధాన్యతను ఇచ్చినట్టు తెలుస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు కొంతమంది సోలార్ దీపాలు ఉచితంగా వచ్చాయనుకుని వారితో పాటు వారి బంధువులకు కూడా పంచేసుకున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ ల్యాంపులు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి. వీటిని ఉచితంగా పంపిణీ చేసినట్టు వైద్యశాఖ ఉద్యోగులు భావించారు. అయితే వీటిని ఉచితంగా సరఫరా చేయలేదని... అత్యవసర సేవల నిమిత్తం పంపించామని ఐటీడీఏ పీవో తాజాగా ఓ ప్రకటన చేశారు. వైద్యశాఖకు అందించిన సోలార్ దీపాలు ఉచితం కా>దని, విద్యుత్ వెలుగులు రాగానే రీకలెక్ట్ చేసుకుంటామని స్పష్టం చేయడంతో దీపాలు పంచుకున్న ఉద్యోగులకు మింగుడు పడని పరిస్థితి ఏర్పడింది. పంపిణీ సమయంలో సోలార్ ల్యాంపుల బాధ్యత ఎవరు తీసుకున్నారు.. ఎవరి సంతకాలతో బయటకు వెళ్లాయి.. ప్రస్తుతం ఎవరెవరి దగ్గర ఉన్నాయోనని తెలుసుకోవడానికి ఉద్యోగులు కిందామీదా పడుతున్నారు. సోలార్ దీపాల లెక్కతేలకపోతే చర్యలు అత్యవసర పరిస్థితి కావడంతో సోలార్ దీపాలను వైద్యశాఖకు అందించాం. పూర్తిస్థాయిలో విద్యుత్ రాగానే వీటిని తిరిగి తీసుకుంటాం. ఏ ఒక్కటీ విడిచిపెట్టం. ఎవరైన చేతివాటం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే తుపాను సాయంలో జరిగిన సంఘటనల్లో బాధ్యులను సస్పెండ్ చేయడం జరిగింది. సోలార్ ల్యాంపుల లెక్క సక్రమంగా ఉండాలి. లేకపోతే బాధ్యులపై తప్పక చర్యలు తీసుకుంటాం. –లోతేటి శివశంకర్, ప్రాజెక్టు అధికారి, ఐటీడీఏ -
సౌర వెలుగులు
♦ మోమిన్పేట ప్రాంతంలో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ♦ రోజుకు 7.5 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా ఏర్పాటు ♦ ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న 3.5 మెగావాట్లు జిల్లాలో సౌర వెలుగులు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే పరిగి ప్రాంతంలో మెగా సౌర విద్యుత్ ప్లాంట్ ఉత్పత్తికి సిద్ధమవుతుండగా మోమిన్పేట సమీపంలోనూ మూడు సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటవుతున్నాయి. గతంలోనే ఇక్కడ ఏర్పాటు చేసిన ఓ ప్లాంట్ నుంచి 3.5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా మరో మూడు మెగావాట్లసామర్థ్యం కలిగిన రెండు చిన్నసోలార్ విద్యుత్ ప్లాంట్లు తుది రూపు దిద్దుకుంటున్నాయి. - మోమిన్పేట మోమిన్పేటకు సమీపంలో ఫోటాన్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్ కంపెనీ రూ.12 కోట్లతో ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. వెల్చాల్ గ్రామ శివారులో పెన్నార్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్ కంపెనీ రూ.55 కోట్లతో 30 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ప్లాంట్ నుంచి 2.5 మెగా వాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. రావులపల్లి గ్రామ శివారులో ఒరిస్సా పవర్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్ సంస్థ రూ.62 కోట్లతో 30 ఎకరాల విస్తీర్ణంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి మూడు మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మోమిన్పేట : మోమిన్పేట మండలంలో సోలార్ వెలుగులు మరింతగా విరజిమ్మనున్నాయి. ఇక్కడ ఇప్పటికే సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం రోజుకు 3.5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా నూతనంగా ఇంకో మూడు మెగావాట్ల విద్యుత్ ఇంకొన్ని రోజులలో ఉత్పత్తి కానుంది. ప్రస్తుతం మోమిన్పేటకు సమీపంలో రోజుకు ఒక మెగావాట్ (5000 యూనిట్లు) విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, వెల్చాల్ గ్రామంలో 2.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. నూతనంగా మండల పరిధిలోని రావులపల్లిలో మూడు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనులు చివరి దశకు వచ్చాయి. ఇంకొన్ని రోజులలో ఉత్పత్తి ప్రారంభించనున్నారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని ముమ్మరం చేస్తుంది. సౌర విద్యుత్ ప్లాంట్ల వల్ల మండలంలో లోఓల్టేజీతోపాటు విద్యుత్ కోతలకు అస్కారం లేకుండా నిరంతరంగా విద్యుత్ సరఫరాకు మార్గం సుగమమైంది. ఏడెకరాల విస్తీర్ణంలో... మండల కేంద్రానికి సమీపంలో ఫోటాన్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్ వారు రూ.12 కోట్లతో ఏడెకరాల విస్తీర్ణంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఒక మెగావాట్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. వెల్చాల్ గ్రామ శివారులో పెన్నార్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్ వారు రూ.55 కోట్లతో 30 ఎకరాల విస్తీర్ణంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి 2.5 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. రావులపల్లి శివారులో ఒడిశా పవర్ ఎనర్జీ సిస్టమ్ లిమిటెడ్ వారు రూ.62కోట్లతో 30 ఎకరాల విస్తీర్ణంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసి 3 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసేందుకు పను లు చివరి దశకు చేరుకున్నాయి. ప్రస్తు తం ఉత్పత్తి విద్యుత్ను సబ్స్టేషన్కు అనుసంధానం చేసే పనులు జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తి కాగానే ఉత్పత్తిని ప్రారంభించనున్నారు. మండలంలో మూడు అదనపు సబ్ స్టేషన్లు... మండలంలో ప్రస్తుతం ఒక 33/11కేవీ సబ్స్టేషన్ మాత్రమే ఉంది. ఆదనంగా 33/11 కేవీల మూడు సబ్స్టేషన్లు, 133/11కేవీ ఒక సబ్ స్టేషన్ మంజూరుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో ప్రభుత్వం రెండు సబ్స్టేషన్లు మంజూరు చేసింది. స్థల పరిశీలన జరగడంతో త్వరలో వీటి నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. లోఓల్టేజీ సమస్య తీరింది..: రవికుమార్, ఏఈఈ లోఓల్టేజీ సమస్య తీరింది. రెండేళ్లుగా 3.5మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. గతంలో లోఓల్టేజీతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడేది. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు లేవు. రైతులకు నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తున్నాం. రావులపల్లిలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ను సదాశివపేట సబ్స్టేషన్కు అనుసంధానం చేస్తున్నారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో సోలార్ వెలుగులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శంషాబాద్ విమానాశ్రయం వద్ద రూ.25 కోట్లతో జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జీహెచ్ఐఏఎల్) ఏర్పాటు చేసిన 5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటులో ఉత్పత్తి ప్రారంభమైంది. దీంతో విమానాశ్రయంలోని టెర్మినల్కు అవసరమైన విద్యుత్లో 30 శాతం ఈ ప్లాంటు సమకూరుస్తుంది. రెండు మూడేళ్లలో ప్లాంటు సామర్థ్యాన్ని 30 మెగావాట్లకు చేర్చాలన్నది కంపెనీ ప్రణాళిక. -
వేదాంత్... సామాన్యుడు కాదు..!
ఆ కుర్రాడు అందరిలా కాదు.. తన తోటి చదువుకునే పిల్లలకు భిన్నంగా కనిపించేవాడు. పదకొండేళ్ళ వయసులోనే తన ప్రతిభతో ఔరా అనిపించుకున్నాడు. మన దేశంకోసం ఉచిత విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నదే అతని ఆశయం.. ఆకాంక్ష. అందుకు మార్గాలను అన్వేషించాలనే కృత నిశ్చయం అతడికి అతి చిన్న వయసులోనే మొగ్గ తొడిగింది. గ్రామాల్లో స్నేహితుల కరెంటు కష్టాలను దగ్గరగా చూసిన అతడు వారికోసం ఉచిత విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించాడు. ఎప్పుడూ ఎల్ ఈ డీలు, అయిస్కాంతాలు, తదితర వస్తువులతో బిజీగా కనిపించే ఆ కుర్రాడిపేరు వేదాంత్ ధిరేన్ థాకర్. ఆరో తరగతి చదివేప్పుడే అతడి ఆలోచనా విధానం లో ఓ ప్రత్యేకత.... అతడి చేతిలో ఆటవస్తువులు చూస్తే తల్లితండ్రులకు ఆశ్చర్యం.... వేదాంత్ తన ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు చిన్న వయసులోనే ప్రయత్నాలు ప్రారంభించాడు. పదకొండేళ్ళ వయసులో వేస్ట్ వస్తువులతో ఉచిత విద్యుత్ ఉత్పత్తికి బీజాలు నాటాడు. మహరాష్ట్రకు చెందిన పదకొండేళ్ళ వేదాంత్ ఆరేళ్ళ వయసులో తన తండ్రి ల్యాప్ టాప్ పాడవడంతో దానినుంచీ తీసిన బ్యాటరీని వృధాగా పారేయకూడదనుకున్నాడు. ఆలోచన వచ్చిందే తడవు ఆ బ్యాటరీ వినియోగంతో తాను అనుకున్న విద్యుత్ ఉత్పత్తికి దారులు వెతికాడు. గ్రామాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాల్లో కరెంటు లేక పిల్లలు రాత్రి సమయాల్లో చదువుకోలేని స్థితిని మార్చాలనుకున్నాడు. ఆవిషయంపై దృష్టి సారించాడు. సెలవుల్లో సమయాన్ని వృధాగా పోనివ్వకుండా గ్రామాలకోసం ఉచిత విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రయోగాలను చేస్తుండేవాడు. అందులో భాగంగానే వేదాంత్.. వేస్ట్ బ్యాటరీస్ కు సోలార్ సిస్టమ్ ను వాడి విద్యుత్ ను ఉత్పత్తి చేసే విధానాన్ని మొదటిసారి 2014 లో కనుగొన్నాడు. బ్యాటరీల్లో సోలార్ సిస్టమ్ ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేసి లైట్ వెలిగించి అనుకున్నది సాధించాడు. పాత బ్యాటరీలను ఉపయోగించి సోలార్ సాయంతో విద్యుత్ ను ఉత్పత్తి చేయొచ్చన్న విషయాన్ని వేదాంత్ పదకొండేళ్ళ ప్రాయంలోనే కనుగొన్నాడు. ఇటువంటి విద్యుత్ తో గ్రామాల్లోని పిల్లల జీవితాల్లో విద్యుత్ వెలుగులు కురిపించాలన్నది అతని ఆకాంక్ష. వేదాంత్ ఆలోచనను అతని తండ్రి ధిరేన్ థాకర్ కూడ ప్రోత్సహించారు. ఆరేళ్ళ వయసునుంచే ప్రయోగాలను ప్రారంభించిన వేదాంత్ బ్యాటరీలు, డైనమోస్, మోటార్లు, ఐస్కాంతాలు వినియోగిస్తూ ఏడేళ్ళ వయసులో ఎలక్ట్రానిక్ టాయ్ బోట్, సౌండ్ ప్రొడ్యూసింగ్ డివైజ్ తోపాటు, పదకొండేళ్ళ వయసులో రిమోట్ ఆపరేటెడ్ బోట్ తయారు చేశాడు. ఇటీవల రిమోట్ తో డోర్ ను తెరిచే విధానాన్ని కూడ కనుగొన్నాడు. అంతేకాదు విద్యుత్ ఉత్పత్తిని చేసేందుకు పేటెంట్ ను తీసుకున్నాడు. ప్రస్తుతం కంప్యూటర్ ఇంజనీర్ గా ఉన్న వేదాంత్ తండ్రి థిరేన్ కూడ ఎలక్ట్రానిక్స్ విషయంలో అత్యంత శ్రద్ధ వహించడం వేదాంత్ కు కలసి వచ్చింది. భవిష్యత్తులో ఇంజనీరింగ్ చదివి, మొత్తం దేశానికే ఫ్రీ కరెంట్ ఉత్పత్తి మార్గాలను కనుగొనాలని కలలు కంటున్నాడు వేదాంత్. అతడి కల సాకారం అయితే దేశంలోని విద్యుత్ కు దూరంగా ఉన్న ఎన్నో గ్రామాల్లో వెలుగులు నిండే అవకాశం ఉంది. -
ఫోటో... విభిన్న సమయాల్లో..!
అందం అనేది చూసే కళ్లను బట్టే కాదు... చూసే సమయాన్ని బట్టి కూడా మారిపోతూ ఉంటుంది. ప్రత్యేకించి మానవ నిర్మితాలపై ప్రకృతి ప్రభావం వాటి అందాన్ని మార్చేసేంతగా ఉంటుంది. కొన్ని నిర్మాణాలు వర్షం పడుతున్నప్పుడు అద్భుతమనిస్తాయి, మరికొన్ని వెన్నెల్లోనూ చూడదగినవై ఉంటాయి. అంతే కాదు.. సూర్యకాంతిని బట్టి కూడా వాటి అందం మారిపోతూ ఉంటుంది. తన ఫోటోగ్రఫీ ప్రతిభను చాటుకోవడానికి ఈ పాయింట్ను ఆధారంగా చేసుకొన్నాడు రిచర్డ్ సిల్వర్ అనే అమెరికన్ ఫోటోగ్రాఫర్. ఒక భవనం లేదా నిర్మాణం అందం అనేది ప్రతి నిమిషానికీ మారిపోతూ ఉంటుందనేది రిచర్డ్ సిల్వర్ అభిప్రాయం. వాటిపై పడే సూర్యకాంతి అందాన్ని మార్చేస్తూ ఉంటుంది. ఆ విధంగా మారే అందాలన్నింటినీ తన కెమెరా ద్వారా క్యాప్చర్ చేసి ‘టైమ్ స్లైస్’ ఫోటోలను ఆవిష్కరిస్తున్నాడీయన. ఒక్కో నిర్మాణాన్నీ విభిన్నమైన వాతావరణాల మధ్య అనేక ఫోటోలుగా తీసి, అలాంటి ఫోటోలన్నింటినీ కలిపి ఈ టైమ్స్లైస్ ఫోటోలను రూపొందిస్తారు. కంటికి ఒక ఫోటోలానే కనిస్తున్నా.. అందులో భిన్నమైన సమయాల్లో తీసిన ‘స్లైస్’లు ఉంటాయి. ప్రపంచ ప్రసిద్ధి పొందిన నిర్మాణాలను ఈ విధమైన టైమ్స్లైస్ ఫోటోలుగా చిత్రీకరిస్తూ తన ప్రత్యేకతను నిరూపించుకొంటున్నాడు ఆ ఛాయాచిత్రకారుడు. -
ఇదోరకం జబ్బండీ
నూటికొక్కరికి జబ్బొస్తే అయ్యో అంటాం. నూటికి 80 మంది జబ్బుపడితే ఏం చెప్పాలో డాక్టర్లకే తెలియడం లేదు. ఇది తిండిలేక వచ్చే జబ్బు కాదు, తిండి ఎక్కువైనా వచ్చే జబ్బు అంతకన్నా కాదు. పోనీ ఏసీ గదుల్లోనే ఉంటూ ఆరోగ్యంగా ఉందామనుకునే వాళ్లంటే ఈ జబ్బుకు మరింత మంట. పోనీ జబ్బు ఉందో లేదో తెలుసుకోవాలన్నా పెద్దగా లక్షణాలు కనిపించవు. ఇదేంటని ఆరా తీస్తే..‘డి’ విటమిన్ లోపం. పొద్దున్నే కాసేపు ప్రత్యక్ష నారాయణుడ్ని దర్శించుకోని పాపం ఇప్పుడు సిటీవాసులను పీడిస్తోంది. ఎక్కడ కందిపోతామోనని ఎండ కన్నెరగకపోతే.. మీరూ ఈ రోగాన్ని ఆహ్వానించినట్టే. కేవలం ఎండలో తిరగక పోవడంతో వచ్చే జబ్బు ఇది. చూడ్డానికి చాలా చిన్న సమస్యగా ఉంది గానీ, నగరంలో లక్షలాది మంది ‘డి’విటమిన్ లోపంతో బాధపడుతున్నారు.ఎక్కువగా స్కూలు చిన్నారుల్లో ఇది కనిపిస్తోంది. ఇటీవల ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యులకు రక్తపరీక్షలు చేస్తే 90 శాతం మందిలో డి విటమిన్ లోపం ఉందని తేలింది. ఈ జబ్బును అశ్రద్ధ చేస్తే చాలా ప్రమాదం ఉంటుందని అంటున్నారు ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డా.చంద్రశేఖర్రెడ్డి. హైదరాబాద్ లాంటి నగరంలో 80 శాతం మంది ‘డి’ విటమిన్ లోపంతో బాధపడుతున్నారని ఆయన అంటున్నారు. చిన్నపిల్లలు, పాలిస్తున్న తల్లులు, గర్భిణులు, వృద్ధులు ఎక్కువగా ‘డి’ విటమిన్ లోపంతో బాధపడుతున్నారని చెబుతున్నారు. శరీరంలో 30 నానో గ్రామ్స్ (పర్ మిల్లీ లీటర్) కంటే తక్కువగా ‘డి’ విటమిన్ ఉంటే లోపం ఉన్నట్టు. ప్రతి 100 మందికి 80 మంది డి విటమిన్ బాధితులే 90 శాతం మంది బాధితులు సూర్యకాంతి అందకనేనగరంలో 70 లక్షల నుంచి 80 లక్షల మంది బాధితులు ఉన్నట్టు అంచనా40 శాతం మంది చిన్నారులు, మహిళలున్నారు 10 శాతం మంది వృద్ధులు డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారు ‘డి’ విటమిన్ లోపంతో సమస్యలు * ఎముకలు పటుత్వాన్ని కోల్పోతాయి * కండరాలు తీవ్రంగా నొప్పి కలిగిస్తుంటాయి * శారీరక అలసట కలుగుతుంది * చిన్నారులు రికెట్స్ వ్యాధి బారిన పడతారు * ఒళ్లు నీరసంగా అనిపిస్తుంది.. పని మీద ఏకాగ్రత ఉండదు * వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది * తాజా పరిశోధనల ప్రకారం గుండెపోటుకూ ‘డి’ విటమిన్ లోపం కారణమవుతోంది * మధుమేహం రావడానికి సైతం అవకాశం ఉంది సూర్యకాంతి మందు * సూర్యకాంతి ద్వారా మాత్రమే శరీరానికి కావాల్సినంత డి విటమిన్ లభిస్తుంది * రోజూ కనీసం 45 నిమిషాలు ఎండలో తిరిగితే చాలు * నల్లటి చర్మం ఉన్నవారిలో ఈ విటమిన్ లోపం ఎక్కువగా ఉంటుందని తేలింది. బ్లాక్ స్కిన్ ఉన్నవారిలో మెల నోసైట్స్ అనే పదార్థం ఉండటంతో వారి శరీరంలోకి సూర్యకాంతి తొందరగా వెళ్లదు. * మూర్ఛ వ్యాధికి మందులు వాడే వారిలోనూ డి విటమిన్ లోపం ఉంటుంది * సాల్మన్, మెకరల్, ట్యూనా చేపలు తినడం వల్ల డి విటమిన్ను కొద్దివరకూ పొందచ్చు * పుట్టగొడుగులు, కాడ్లివర్ ఆయిల్లోనూ డి విటమిన్ ఉంటుంది * డి విటమిన్ 30 నుంచి 100 నానోగ్రామ్స్ (పర్ మిల్లీ లీటర్) ఉంటే సరిపోయినట్టు * కేవలం రక్త పరీక్ష ద్వారానే డి విటమిన్ లోపం తెలుసుకోగలం