strict
-
జాగ్రత్త.. అలాంటి కంటెంట్ ప్రసారం చేయొద్దు
న్యూఢిల్లీ: ఓటీటీ, సోషల్ మీడియా ఫ్లాట్ఫారమ్లు కఠిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా అశ్లీల కంటెంట్ను మితిమీరి ప్రసారం చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇలాంటి ఫిర్యాదులకు చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు బుధవారమే కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఓ నోటిఫికేషన్ను రిలీజ్ చేసింది.ఓవర్ ది టాప్(OTT) ఫ్లాట్ఫారమ్లు, సోషల్ మీడియా ఫ్లాట్ఫారమ్లు ఐటీ రూల్స్ (2021) నైతిక విలువలు(Code of Ethics) పాటించాల్సిందే. అలాగే చిన్నారులకు 'ఏ' రేటెడ్ కంటెంట్ అందుబాటులో లేకుండా చూడాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ‘‘ఓటీటీ ప్లాట్ ఫామ్ లు, సోషల్ మీడియాలోని అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్పై ఫిర్యాదులు వస్తున్నాయి. అలాంటి ఫిర్యాదులకు కఠిన చర్యలు తప్పవు. .. ఐటీ రూల్స్ లోని 2021 కోడ్ ఆఫ్ ఎథిక్స్ ను తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. ఈ నిబంధనలు మితిమీరి ఏ కంటెంట్ను ప్రసారం చేయొద్దు’’ అని కేంద్రం హెచ్చరించింది. అలాగే వయసు ఆధారిత కంటెంట్ అందుబాటులో ఉండాలని, స్వీయనియంత్రణ కలిగి ఓటీటీలు నైతిక విలువలను పాటించాలని ఆదేశించింది. సంబంధిత శాఖ సలహాదారు కాంచన్ గుప్తా ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలియజేశారు.Advisory to OTT platforms against nisitha, indecency and obscenity:Ministry of Information & Broadcasting has issued an advisory to online curated content publishers (OTT platforms) and self-regulatory Bodies of OTT platforms, to ensure strict adherence to India’s laws and the… pic.twitter.com/xMjddk9ns0— Kanchan Gupta 🇮🇳 (@KanchanGupta) February 20, 2025ఇటీవల ఇండియాస్ గాట్ లాటెంట్ షోలో ప్రముఖ యూట్యూబర్ రణ్ వీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఇటు పార్లమెంట్ లోనూ చర్చ జరగ్గా..అటు సుప్రీం కోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సమయంలో యూట్యూబ్లాంటి ఫ్లాట్ఫారమ్లలో అభ్యంతరకర కంటెంట్పై నియంత్రణ ఉండాలంటూ సర్వోన్నత న్యాయస్థానం పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇప్పుడు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. -
31st నైట్.. మందుబాబులూ జాగ్రత్త..!
-
ఇక పకడ్బందీగా రీచ్లు
భద్రాచలం: జిల్లాలోని ఇసుక రీచ్లను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ లోకేష్ కుమార్ ఆదేశించారు. మంగళవారం ఐటీడీఏ పీఓ చాంబర్లో టీఎస్ఎండీసీ, ఇరిగేషన్, మైనింగ్, అగ్రికల్చర్, గ్రౌండ్ వాటర్ అధికారులతో ఏర్పాటు చేసిన జిల్లాలోని ఇసుక రీచ్ల సమన్వయ కమిటీ సమావేశంలో ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ..ఇసుక రీచ్లను ఇతర శాఖాధికారులతో ఏర్పాటు చేసిన టీమ్ తరచుగా తనిఖీలు నిర్వహించాలన్నారు. ములకలపల్లి, ముదిగొండ, మధిర, బోనకల్లో అవకతవకలు జరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, నివేదిక మేరకు నిలిపివేయాలని డ్వామా పీడీని ఆదేశించారు. వాజేడు మండలం మోడికుంట ప్రాజెక్ట్ వద్ద 20,280 క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలను టీఎస్ఎమ్డీసీ ద్వారా ఆ¯ŒSలై¯ŒSలో దరఖాస్తు చేసుకున్న వారికే విక్రయించాలని సూచించారు. కొత్తగా వచ్చిన కొండాయిగూడెం, వీరాపురం, భద్రాచలం, ఇసుక రీచ్ల ద్వారా 10.47 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తీసేందుకు టీఎస్ఎండీసీ నిర్వహించాలని తెలిపారు. 2013–14కు గాను సొసైటీల్లో క్యూబిక్ మీటర్కు రూ.40 చొప్పున ఆదాయం వచ్చిన నిధుల నుంచి పరిపాలన ఖర్చుల నిమిత్తం రూ. 3, సభ్యులకు బోనస్గా రూ. 37 లు పంపిణీ చేయాలన్నారు. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాల కోసం వచ్చిన 49 దరఖాస్తులను పరిశీలిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ రాజీవ్గాంధీ, టీఎస్ఎండీసీ డీఓ మల్లయ్య, డ్వామా పీడీ జగత్ కుమార్ రెడ్డి, మై¯Œ్స జేడీ నర్సింహారావు, మధుసూద¯ŒSరెడ్డి, ఇరిగేష¯ŒS ఎస్ఈ, అగ్రికల్చర్ ఏడీ, ఆర్టీఓ, గ్రౌండ్ వాటర్ డీడీ తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యాన్ని సహించం
విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి టీఎస్ఎంఆర్ఈఐ ప్రాజెక్ట్ మేనేజర్ ఎజాస్ అహ్మద్ బాన్సువాడ: మైనార్టీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యనందించేందుకు ప్రారంభించిన మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో సిబ్బంది నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని తెలంగాణ రాష్ట్ర మైనార్టీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సొసైటీ ప్రాజెక్ట్ మేనేజర్ ఎజాస్ అహ్మద్ స్పష్టం చేశారు. బాన్సువాడలోని మైనార్టీ గురుకులాన్ని శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిత్యావసర సరుకులను పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మైనార్టీ గురుకులాకు నిత్యావసర సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లు, భోజన ఏజెన్సీల నిర్వాహకులు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయని, వారిపై ప్రత్యేకంగా విజిలెన్స్ నిఘా ఉంచి చర్యలు తీసుకుంటామన్నారు. ఉపాధ్యాయులు విధులను నిర్లక్ష్యం చేస్తే తొలగించి కొత్త వారిని నియమిస్తామన్నారు. త్వరలో టీఎస్పీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకం జరుగుతుందన్నారు. గురుకులాలు ప్రారంభమై మూడు నెలలవుతోందని, ప్రారంభం కొన్ని ఇబ్బందులుంటాయన్నారు. ఏడాదిలోపు ఒక్కో గురుకులానికి ఐదు ఎకరాల చొప్పున భూమి సేకరించి రూ.20కోట్ల వ్యయంతో భవనాలు నిర్మిస్తామన్నారు. మలావత్ పూర్ణను ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఆయన వెంట విజిలెన్స్ అధికారులు వీరేశం, ఉస్మాన్ అలీ, పాండురంగం, జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు అలీముద్దిన్ బాబా, నాయకులు మహ్మద్ ఎజాస్, శ్రీనివాస్రెడ్డి, నర్సింలు తదితరులున్నారు. -
తల్లిదండ్రులను పట్టించుకోకపోతే కఠిన చర్యలు
ఎస్సై సంతోష్ తల్లి మతిచెందిన కేసులో ఐదుగురు కుమారులపై కేసు అశ్వాపురం : తల్లిదండ్రులను పట్టించుకోకుండా వదిలేసే కొడుకులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్సై హెచ్చరించారు. శుక్రవారం పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొండికుంట గ్రామానికి చెందిన కందిమళ్ల సరోజనమ్మ అనే వద్ధురాలు.. తన కుమారులు పట్టించుకోవడం లేదనే మనోవేదనతో ఏడ్చి, ఏడ్చి మతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారని తెలిపారు. ఆ వద్ధురాలు నిరాహార దీక్ష చేస్తూ మతిచెందడం బాధాకరమన్నారు. నిరాహార దీక్ష చేస్తున్న విషయం ఆలస్యంగా తెలిసిందని, ఆలోపే ఆరోగ్యం క్షీణించి సొమ్మసిల్లి పడిపోయిందని, వైద్యశాలకు తరలిస్తుండగా ప్రాణాలు వదిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. మొండికుంట గ్రామ పంచాయతీ కార్యదర్శి పసుపులేటి కష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. మతదేహాన్ని భద్రాచలంలో పోస్టుమార్టం అనంతరం గ్రామ పెద్దలకు అప్పగించామని తెలిపారు. ఉన్నతధికారుల ఆదేశాల మేరకు వద్ధురాలు మతిచెందడానికి కారణమైన ఐదుగురు కుమారులు కందిమళ్ల సుధాకర్రెడ్డి, అశోక్రెడ్డి, కష్ణారెడ్డి, వెంకటరెడ్డి, శేఖర్రెడ్డిలపై ఐపీసీ 306 ప్రకారం కేసు నమోదు చేశామని వివరించారు. ఐదుగురు కొడుకులు ఉండి ఎవరూ లేని అనాథలా వద్ధురాలు మతిచెందడం దారుణమని ఎస్సై విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్లో ఇలాంటి ఘనటలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. సమావేశంలో ట్రైనీ ఎస్సై కిరణ్, ఏఎస్సై వీరబాబు, కానిస్టేబుళ్లు మంగీలాల్, ఝాన్సీ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 12 ఎంఎన్జి 26 : విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎసై సంతోష్