sugarcane formers issues
-
‘ఇకపై మీడియాతో మాట్లాడే ప్రసక్తే లేదు’
సాక్షి, బెంగళూరు : ‘నా ప్రతీ మాటను వక్రీకరిస్తున్నారు. ఇకపై మీతో మాట్లాడే ప్రసక్తే లేదు’ అంటూ కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి మీడియా ప్రతినిధులపై అసహనం వ్యక్తం చేశారు. ఓ వర్గం మీడియా(ముఖ్యంగా కన్నడ) తనను అప్రతిష్ట పాలు చేయడానికి కంకణం కట్టుకుందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చెరకు మద్దతు ధర పెంచాలంటూ ఆందోళన చేస్తున్న ఓ మహిళా రైతును ‘అమ్మా.. మీరు ఈ నాలుగేళ్లు ఎక్కడ పడుకున్నారు’ అంటూ కుమారస్వామి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. (మహిళా రైతుపై సీఎం అనుచిత వ్యాఖ్యలు) కాగా కుమారస్వామి వ్యాఖ్యలపై దుమారం రేగడంతో జేడీఎస్ మిత్రపక్షం కాంగ్రెస్ కూడా ఇబ్బందుల్లో పడింది. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష బీజేపీ విమర్శలు గుప్పించడంతో కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్- కాంగ్రెస్ సమన్వయ కమిటీ చైర్మన్ సిద్దరామయ్య రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో జేడీఎస్ చీఫ్ దేవెగౌడకు ఫోన్ చేసి పబ్లిక్ మీటింగుల్లో ఎలా మాట్లాడాలో కుమారస్వామికి చెప్పాలని సూచించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం మీడియాతో మాట్లాడిన కుమారస్వామి.. ‘ మీడియా కారణంగా నేను ఎన్నోసార్లు బాధపడ్డాను. కావాలనే కొంతమంది నా గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. నా ప్రతీ మాటను వక్రీకరిస్తున్నారు. అవసరమనుకుంటే ఒక్కో మీడియా ప్రతినిధితో విడిగా మాట్లాడుతా. అంతేగానీ ఇకపై పత్రికా సమావేశాలకు హాజరుకాను. మీకు ఇష్టమైతే రిపోర్టు చేసుకోండి లేకపోతే లేదు. నేనేం అనుకోను’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మీడియాను దూరం పెట్టడం కుమారస్వామికి కొత్తేం కాదు. ఈ ఏడాది మే నెలలో సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కూడా విధానసభలో మీడియా ప్రతినిధుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. ఈ విషయమై విమర్శలు రావడంతో జూలైలో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. -
మహిళా రైతుపై సీఎం అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఓ మహిళా రైతుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘అమ్మా.. ఈ నాలుగేళ్లు మీరు ఎక్కడ పడుకున్నారు’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. చెరకు కనీస మద్దతు ధర పెంచాలంటూ ఉత్తర కర్ణాటక చెరకు రైతులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ మహిళా రైతు కుమారస్వామి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. దీంతో సహనం కోల్పోయిన సీఎం.. ‘వీళ్లంతా నిజమైన రైతులు కాదు.. ఎవరో వారిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉసిగొల్పుతున్నారు’ అంటూ మండిపడ్డారు. కాగా సీఎం కుమారస్వామి వ్యాఖ్యలపై ప్రతిపక్ష బీజేపీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘అవకాశవాది అయిన ఓ సీఎం ప్రజలకు గౌరవం ఇవ్వరు. కుమారస్వామి కూడా అలాంటి వారే. మహిళా రైతును ఇలా ప్రశ్నించడం ద్వారా ఆయన నిజమైన వ్యక్తిత్వమేమిటో బయటపడింది. నిజంగా సిగ్గుచేటు. రాష్ట్రంలోని మహిళలకు ఇది నిజంగా అవమానకరం’ అని బీజేపీ ట్విటర్ వేదికగా విమర్శలు ఎక్కుపెట్టింది. An opportunist CM would never respect the citizens & this is exactly what CM Kumaraswamy is doing. Asking a women where she was sleeping for last 4 years clearly shows the individuality of Kumaraswamy. This is beyond apologising, this is a shame & insult to women of the state. pic.twitter.com/ZFHiMP1G4c — BJP Karnataka (@BJP4Karnataka) November 19, 2018 -
చెరుకు రైతులను ఆదుకోండి: జీవన్రెడ్డి
హైదరాబాద్: ప్రైవేటు చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, చెరుకు రైతులకు రావాల్సిన బకాయిలను ఇప్పించాలని సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చెరుకు రైతులకు, ప్రైవేటు చక్కెర కర్మాగారాల నుంచి రూ.25 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉందన్నారు. ప్రైవేటు చక్కెర ఫ్యాక్టరీలతో ప్రభుత్వం కుమ్మక్కు అయిందనే అనుమానాలు కలుగుతున్నాయని జీవన్రెడ్డి వ్యాఖ్యానించారు.