breaking news
suman shetty
-
ఈసారి ఇద్దరు కెప్టెన్స్.. సుమన్ ప్రమాణ స్వీకారం!
దివ్వెల మాధురి బిగ్బాస్ (Bigg Boss Telugu 9) ఇంటి మహారాణిలా ఫీలైపోతుంది. సున్నితంగా చెప్పేదగ్గర కూడా ఆర్డర్లు జారీ చేస్తోంది. అటు భరణి-దివ్యల బంధం రోజురోజూకి బలపడుతోంది. మరి హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో నిన్నటి (అక్టోబర్ 16) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..నా ఆరోగ్యం పాడైపోతోందిలైట్లు ఆఫ్ అయ్యాక మాట్లాడకూడదు, గుసగుసలు వినిపించకూడదు. పొద్దున సాంగ్ కంటే ముందే లేచినవారు మౌనంగా ఉండాలి.. అంటూ రూల్స్ పెట్టింది మాధురి (Divvala Madhuri). ఇదేమైనా బిగ్బాస్ రూలా? అని రీతూ అనడంతో మాధురి గయ్యిమని లేచింది. నా ఆరోగ్యం పోతుంది.. నా రూల్స్ ఒప్పుకోకపోతే పోండి అని అరిచేసింది. ఇష్టమొచ్చినట్లు అరిస్తే ఎవరూ పడరు... నచ్చకపోతే మీరే వెళ్లిపోండి అని ఇచ్చిపడేసింది.దొంగతనాలకు రెడీ అవుతున్న రమ్యఇక రమ్య ఆర్డర్ చేసిన వంటకాలన్నీ పంపించాడు బిగ్బాస్. సుమన్తో కలిసి కడుపునిండా ఆరగించింది. ఈ క్రమంలో సంజనాతో దొంగతనాలు చేస్తా.. సంజన 2.0 అవుతా అంది. మరోవైపు భరణి.. రీతూతో క్లోజ్గా ఉండటం నచ్చలేదని దివ్యతో అన్నాడు. నువ్వు టాస్కులో ఎంతో సాయం చేశావ్.. అయినా సంబంధం లేకుండా తర్వాతి రోజే నిన్ను నామినేట్ చేస్తే ఏం అనుకోవాలి? ఇంత జరిగాక ఆమె పక్కన కూర్చుని జోకులేసి నవ్వుకుంటుంటే ఎలా తీసుకోవాలి? అని ప్రశ్నించాడు. రీతూతోనే కాదు, వేరేవాళ్లతోనూ మాట్లాడానని దివ్య అంది.ఏడ్చేసిన భరణి- దివ్యచెప్పాలనిపించింది చెప్పాను. నిన్ను కంట్రోల్ చేసేంత సీన్ ఏం లేదు. వింటావా? వినవా? నీ ఇష్టం అని భరణి అన్నాడు. దీంతో.. ఎందుకిలా అపార్థం చేసుకుంటున్నారంటూ దివ్య చిన్నపిల్లలా ఏడ్చేసింది. ఆమెనలా చూసి భరణి కళ్లలోనూ నీళ్లు తిరిగాయి. మీరు ఏడవకండంటూ దివ్య భరణిని ఓదార్చింది. తర్వాత బిగ్బాస్ వైల్డ్కార్డులను కెప్టెన్సీ కంటెండర్లుగా ప్రకటించాడు. వీరు మిగతావారి నుంచి ఐదుగురిని సెలక్ట్ చేసుకుని గేమ్ ఆడాలన్నాడు. అందులో గెలిచి కంటెండర్షిప్ కాపాడుకోవాలన్నారు. ఇద్దరు కెప్టెన్స్అలా సంజన, భరణి, దివ్య, తనూజ, సుమన్ (Suman Shetty)ను ఎంపిక చేసుకుని బాల్ టాస్క్ ఆడారు. ఇందులో రమ్య, గౌరవ్, శ్రీనివాస్.. చాలా బాగా ఆడారు. ఇందులో వైల్డ్ కార్డులతో పాటు చివరి వరకు సుమన్ నిలిచి కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. సూపర్ పవర్ ఉన్న నిఖిల్ కూడా కెప్టెన్సీ రేసులో నిలబడ్డాడు. లైవ్లో కెప్టెన్సీ టాస్క్ ఈపాటికే అయిపోయింది. గౌరవ్, సుమన్ గెలిచి కొత్త కెప్టెన్లుగా నిలిచారు. నీతి, నిజాయితీగా ఉంటానంటూ సుమన్ ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. తనను తక్కువ అంచనా వేసినవాళ్లకు తన సత్తా ఏంటో చూపించాడు. ఒకేసారి ఇద్దరు కెప్టెన్లు ఉండటమనేది తెలుగు బిగ్బాస్ చరిత్రలోనే ఇది తొలిసారి కావడం విశేషం!చదవండి: సినీ ఇండస్ట్రీలో వివక్ష? ప్రేమలు బ్యూటీ ఆన్సరిదే! -
దెబ్బలు తగిలించుకున్న రమ్య.. ఆ ముగ్గురిలో ఒకరే కెప్టెన్!
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) హౌస్లో కల్యాణ్ కెప్టెన్సీ ముగియనుంది. మరో కెప్టెన్ను ఎంచుకునేందుకు సమయం ఆసన్నమైంది. వైల్డ్కార్డ్ కంటెస్టెంట్లను కెప్టెన్సీ కంటెండర్లుగా ప్రకటించాడు బిగ్బాస్. కాకపోతే ఆ కండెండర్షిప్ను కాపాడుకునే బాధ్యత మీదే అని ఓ మెలిక పెట్టాడు. వైల్డ్ కార్డులు ఎంచుకున్న హౌస్మేట్స్తో తలపడి గెలిచి కంటెండర్షిప్ కాపాడుకోవాలన్నాడు.కెప్టెన్సీ కంటెండర్లుగా ఆ ముగ్గురుగార్డెన్ ఏరియాలో బాల్తో గోల్ చేయమని గేమ్ పెట్టాడు. ఇందులో అందరూ పోటాపోటీగా ఆడారు. ఒకరినొకరు తోసుకునే క్రమంలో కిందామీదా పడ్డారు. భరణిని అదుపు చేసే క్రమంలో రమ్య కిందపడిపోయింది. ఈ సమయంలో తన తలకు చిన్న దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. వయొలెన్స్ వద్దని వైల్డ్ కార్డ్స్ అంటుంటే.. స్టార్ట్ చేసిందే మీ వాళ్లు అని మండిపడింది తనూజ. ఈ గేమ్స్ తర్వాత ఫైనల్గా సుమన్, గౌరవ్ (Gaurav Gupta) కెప్టెన్సీ కంటెండర్లయ్యారని తెలుస్తోంది. హౌస్లో అడుగుపెట్టినప్పుడు నాగార్జున.. నిఖిల్కు ఇచ్చిన పవర్ ద్వారా అతడు కూడా కెప్టెన్సీ కంటెండరయ్యాడు. మరి ఈ ముగ్గురిలో ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి! చదవండి: బిగ్బాస్ 'ఆయేషా' రెండుసార్లు బ్రేకప్.. -
వైల్డ్ కార్డ్స్ చేతిలో 'పవర్'.. ఈసారి నామినేషన్స్లో ఎవరంటే?
ఆదివారం ఎపిసోడ్తో ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. వీళ్లలో మాధురి, రమ్య మోక్ష, ఆయేషా, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా, శ్రీనివాస సాయి ఉన్నారు. వస్తూవస్తూనే వీళ్లకు పవర్స్ ఇచ్చిన బిగ్బాస్.. ఈ వారం నామినేషన్లోనూ అదిరిపోయే ఛాన్స్ ఇచ్చాడు. దీంతో ఈసారి గట్టిగానే వాదోపవాదనలు జరిగాయి. అందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఇంతకీ ఆరోవారం ఎవరెవరు నామినేట్ అయ్యారు?(ఇదీ చదవండి: ప్రియుడిని పరిచయం చేసిన 'జగద్ధాత్రి' సీరియల్ నటి)వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ని ఈ వారం నామినేట్ చేసే అవకాశం లేదు. అయితే 'ఫైర్ బాల్' అనేది ఏర్పాటు చేసిన పైపు నుంచి పడుతుంది. బజర్ మోగే సమయానికి అది ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాళ్లు.. ఇప్పటికే హౌసులో ఉన్నవాళ్లలో ఒకరికి ఇవ్వొచ్చు. అలా బాల్ అందుకున్న కంటెస్టెంట్.. పాతవాళ్లలో ఒకరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. అలా తనూజ.. సుమన్ శెట్టి, రాము.. పవన్ని నామినేట్ చేసినట్లు ప్రోమోలో చూపించారు.అయితే 'ఫైర్ బాల్' పోటీలో పికెల్స్ పాప రమ్య గట్టిగానే పోరాడింది. అలానే నిఖిల్ కూడా బాల్ అందుకున్నాడు. అలా ఈసారి భరణి, తనూజ, పవన్, దివ్య, రాము, సుమన్ శెట్టి నామినేట్ అయినట్లు తెలుస్తోంది. వీళ్లలో సుమన్ శెట్టి గతవారం డేంజర్ జోన్లో ఉన్నాడు. చివరవరకు వచ్చినప్పటికీ శ్రీజ ఎలిమినేట్ కావడంతో సేవ్ అయిపోయాడు. ఈసారైనా గేమ్స్ ఆడి సేఫ్ జోన్లోకి వస్తాడా? లేదంటే బయటకొచ్చేస్తాడా అనేది చూడాలి. లేదంటే మాత్రం దివ్యపై వేటు పడిన ఆశ్చర్యపోనక్కర్లేదు.ఈ వారం నామినేట్ అయినోళ్లుభరణిపవన్దివ్యరాముసుమన్తనూజ(ఇదీ చదవండి: ఎందుకు అరుస్తున్నావ్? ఫస్ట్రోజే ఏడ్చేసిన దువ్వాడ మాధురి!) -
ఇంగ్లిష్ వచ్చా? ఎక్కడినుంచి వచ్చావ్? నోరు పారేసుకున్న సంజనా
గతంలో గౌతమ్ సీక్రెట్ రూమ్కు వెళ్లొచ్చి నెగెటివ్ అయ్యాడు. అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అంటూ ఓవర్ డైలాగ్స్, ఓవర్ కాన్ఫిడెన్స్తో విమర్శలపాలయ్యాడు. ఇప్పుడు సంజనా పరిస్థితి కూడా అలాగే ఉన్నట్లు కనిపిస్తోంది. మిడ్వీక్ ఎలిమినేట్ అయి వీకెండ్లో మళ్లీ హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చిన సంజనా.. బ్రేకులు ఫెయిలైన బండిలా నోటికేదొస్తే అది మాట్లాడేస్తోంది. మొన్న తనూజను చీప్ అంటూ తిట్టిన ఆమె ఇప్పుడు రాముపై మాటలు వదిలింది. అసలేం జరిగిందో నేటి (సెప్టెంబర్ 30) ఎపిసోడ్ హైలైట్స్లో చూసేద్దాం..వెరైటీ నామినేషన్స్ఈవారం నామినేషన్స్ కాస్త వెరైటీగా ప్లాన్ చేశాడు బిగ్బాస్ (Bigg Boss Telugu 9). హౌస్మేట్స్తో లూడో గేమ్ ఆడించాడు. కాకపోతే డైస్ తిప్పడం.. దాని ప్రకారం ఎవరు పావులు ముందుకు జరపాలన్నది కెప్టెన్ పవన్ చేతిలో పెట్టాడు. దాంతో అతడు తనకు నచ్చిన టీమ్కు ఛాన్సులిచ్చుకుంటూ పోయాడు. అలా ఓ గేమ్లో సుమన్ శెట్టి టీమ్(సుమన్, ఫ్లోరా, రాము రాథోడ్) గెలిచింది. కెప్టెన్సీలో పవన్కు ఫేవర్ చేశావంటూ పాత కారణమే చెప్పి రీతూ చౌదరిని నామినేట్ చేశాడు సుమన్. సుమన్ టీమ్కే మరొకర్ని నామినేట్ చేసే ఛాన్స్ రాగా.. రాము సంజనాను నామినేట్ చేశాడు.ఇంగ్లిష్ వచ్చా?మీ వల్ల హౌస్ హార్మొని చెడిపోతుంది... మేము అమ్మలం కాబట్టి ఇలా చూస్తున్నారు. వాళ్లు అమ్మాయిలు కాబట్టి అలా చూస్తున్నారు అన్న మాట నచ్చలేదని కారణాలు చెప్పాడు. దీనికి సంజనా (Sanjana Galrani) ఒప్పుకోలేదు. దీందో రామ్.. హౌస్లో మోస్ట్ ఆఫ్ ది వయొలెన్స్ అంటూ ఏదో చెప్పబోయాడు. వయొలెన్స్ అంటే అర్థం తెలుసా? ఇంగ్లిష్ తెలుసా? వయొలెన్స్ అంటే కొట్లాట.. అంటూ కించపరిచినట్లు మాట్లాడింది. అక్కడితో ఆగలేదు. ఎక్కడినుంచి వచ్చావో.. నువ్వు ఓపిక అనేది నేర్చుకో అని మరో మెట్టు దిగి మాట్లాడింది.హరీశ్ బెదిరింపులుఎక్కడినుంచి వచ్చావంటే ఏంటి అర్థం? అని రాము నిలదీయగా.. అందులో తపఏపముంది? నాకు తెలుగొచ్చు, మీరు నేర్పించకండి అంటూ ఆవేశంతో ఊగిపోయింది. తర్వాత ఫ్లోరా.. తనను బెదిరించాడంటూ హరీశ్ను నామినేట్ చేసింది. నేను బెదిరించలేదు. తప్పు విషయంలో స్టాండ్ తీసుకుంటే మీకే సమస్యవుతుందని చెప్పాని వివరణ ఇచ్చాడు. అప్పటికీ తగ్గని ఫ్లోరా.. దివ్య మేకప్ సామాన్లు దొంగతనం చేయాలని హరీశ్ చెప్పారు. నామినేషన్స్లో ఆరుగురుకానీ దివ్య బట్టలు దొంగతనం అయినప్పుడు మాత్రం అది చాలా తప్పు అన్నారు. ఇదే డబుల్ ఫేస్ అంటూ బాగానే పాయింట్లు లాగింది. ఇంతలో రాము, తనూజ కూడా హరీశ్పై తమ పాయింట్లు చెప్పేందుకు మధ్యలో వచ్చారు. రీతూ.. శ్రీజను, శ్రీజ.. దివ్యను నామినేట్ చేశారు. ఇక ఈ వారం రీతూ, ఫ్లోరా, సంజనా, శ్రీజ, దివ్య, హరీశ్ నామినేట్ అయ్యారు. ఏదేమైనా మనీష్, ప్రియల ఎలిమినేషన్తో శ్రీజలో మార్పు వచ్చింది. అరుపులతో ఓటింగ్లు పడవు అని అర్థమై సైలెంట్ అయిపోయింది. కోపాన్ని, గొడవలను కాస్త పక్కనపెట్టి ఓర్పుగా ఉండేందుకే ప్రాధాన్యం ఇస్తోంది. చదవండి: దుస్తులు విప్పేసి కొట్టేందుకు యత్నం.. హీరోయిన్పై కేసు -
Bigg Boss 9: ‘సారీ అమ్మా.. ’ అంటూ వెక్కి వెక్కి ఏడ్చిన కమెడియన్
బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్బాస్ 9వ సీజన్ చూస్తుండగానే రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఇంట్లో నుంచి ఇద్దరు బయటకు వెళ్లారు. మూడోవారం నామినేషన్స్లో హరీశ్, ప్రియ, కల్యాణ్, రాము, రీతూ,ఫ్లోరా ఉన్నారు. వీరిలో నుంచి ఒకరు బయటకు వెళ్తారు. ఆ ఒక్కరు ఎవరనేది ఈ వీకెండ్లో తెలిసిపోతుంది. ఇప్పటికి వరకు కండబలం, బుద్ది బలంపై ఫోకస్ చేసిన బిగ్ బాస్.. ఇప్పుడు భావోద్వేగ బలంపై దృష్టిపెట్టాడు. కంటెస్టెంట్స్ ఎమోషన్తో గేమ్ ప్లాన్ చేసినట్లు తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే అర్థమవుతుంది. హౌస్లో ఉన్నవాళ్లకు బిగ్ బాస్ బంపరాఫర్ ఇచ్చాడు. ఎవరైతే తొలుత బజర్ ప్రెస్ చేస్తారో..వారికి ఫ్యామిలీ వాళ్లు అందించిన సందేశాలను పంపిస్తామని చెప్పాడు. అయితే అది పొందాలంటే కొంత మూల్యం చెల్లించాల్సిందే అంటూ అక్కడ వందశాతం నిండి ఉన్న బ్యాటరీని చూపించాడు.బటన్ ప్రెస్ చేసి అవకాశం దక్కించుకున్న కమెడియన్ ఇమ్మాన్యుయేల్ ముందు మూడు ఆప్షన్లు పెట్టాడు బిగ్బాస్. నాన్న నుంచి వచ్చిన లేఖను పొందలాంటే హౌస్ బ్యాటరీ నుంచి 45 శాతం తగ్గింపోతుందని, అమ్మ నుంచి వచ్చిన ఆడియో మెసేజ్ని పొందాలంటే 30 శాతం బ్యాటరీ తగ్గిపోతుందని, ఫ్యామిలీ ఫోటోని పొందాలంటే 25శాతం తగ్గుతుందని చెప్పి.. ఇందులో ఏది ఎంచుకుంటారో మీ ఇష్టం అని అన్నాడు. ఇది విని ఇమ్మాన్యుయేల్ వెక్కి వెక్కి ఏడ్చాడు. ‘నేను ఏడిస్తే..మా అమ్మ తట్టుకోలేదు’ బిగ్బాస్ అంటూ కన్నీళ్లు తూడ్చుకున్నాడు. తోటి కంటెస్టెంట్స్ కోసం ఇమ్మాన్యుయేల్ చివరి ఆప్షన్ ఎంచుకున్నట్లు తెలుస్తుంది. -
గాజులేసుకుని కూర్చో.. సుమన్పై సంజనా చీప్ కామెంట్స్
ఒక్కసారి నోరు జారితే ఆ మాటను తిరిగి తీసుకోలేం. ఆ విషయం తెలిసి కూడా చాలామంది అదేపనిగా నోరు జారుతూ ఉంటారు. తీరా తప్పు తెలుసుకుని నాలుక్కరుచుకుంటారు. బిగ్బాస్ (Bigg Boss Telugu 9) హౌస్లో అదే జరిగింది. నిన్న బిగ్బాస్ టెనెంట్లకు ఓనర్లయ్యే అవకాశం కల్పించాడు. ఒక్కో రౌండ్లో ఎలిమినేట్ అయినవారు మిగతావారిలో ఎవరికైనా సపోర్ట్ చేయొచ్చన్నాడు.గాజులేసుకుని కూర్చోండిదాంతో సంజనా, ఫ్లోరా.. ఫస్ట్ సుమన్ను టార్గెట్ చేసి అతడు ఎలిమినేట్ అయ్యేలా చేశారు. అయితే సుమన్ (Suman Shetty) కాసేపు ఆడకుండా సోఫాలో కూర్చున్నందుకు అతడిపై సెటైర్లు వేసింది. మీరు మమ్మల్ని చెడ్డోళ్లను చేసి మీరు గాజులేసుకుని కూర్చోండి అని సుమన్పై ఫైర్ అయింది. అందుకతడు మీరెప్పుడో చెడ్డోళ్లయ్యారు అని కౌంటర్ ఇచ్చింది. సంజనాకు వార్నింగ్ఇక అక్కడే ఉన్న శ్రీజ.. అలాంటి మాటలు మాట్లాడొద్దంటూ సంజనాకు వార్నింగ్ ఇచ్చింది. సంజనా కామెంట్స్పై నెట్టింట ట్రోలింగ్ జరుగుతోంది. మాస్క్ మ్యాన్ హరీశ్.. ఆడవాళ్లను చాలా చులకన చేసి మాట్లాడాడంటూ గతవారం నాగార్జునతోనే వాదించింది సంజనా. మరిప్పుడు తనే స్వయంగా.. సుమన్ను గాజులేసుకుని కూర్చోండి అనడంలో అర్థమేంటి? అంటే, ఆడవారికి ఏదీ చేతకాదు, ఓ మూలన కూర్చోమనా? ఈ కామెంట్స్తో ఆమె స్త్రీలను అవమానించట్లే అవుతుంది కదా! క్షమాపణలు కోరిన సంజనాఆవేశంలో నోటికి ఎంతొస్తే అంత వాగుతారా? అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇకపోతే గేమ్ అయ్యాక తన తప్పు తెలుసుకున్న సంజనా.. సుమన్కు సారీ చెప్పింది. నీ చెల్లి అనుకుని క్షమించమని కోరింది. దీంతో అతడు కూడా ఆమె సారీని యాక్సెప్ట్ చేశాడు. మరి నాగార్జున ఈ విషయాన్ని ప్రస్తావించి సంజనాకు క్లాస్ పీకుతాడో? లేదో? చూడాలి! We stand with #SumanSetty anna.Worst #SanjanaGalrani 💦She degraded women by saying they’re only capable of wearing bangles and sitting.Last week she tried assassinate #Harish #Maskman character using the same point.What sanjana did is actually insulting women. 🤬… pic.twitter.com/tpKSWotVi4— Guru (@Guruprasath_02) September 19, 2025 చదవండి: నాకు గర్ల్ఫ్రెండ్స్ ఉండగా మా అమ్మకు బాయ్ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి? -
ఉగ్రరూపం చూపించిన సుమన్.. అమ్మాయిలను ఈడ్చిపడేశాడు!
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) హౌస్లో కెప్టెన్సీ గోల అయిపోయింది. డిమాన్ పవన్ సెకండ్ కెప్టెన్ అయ్యాడు. ఇప్పుడిక టెనెంట్స్కు ఓనరయ్యే ఛాన్స్ ఇచ్చాడు బిగ్బాస్. అందుకోసం సెలబ్రిటీలకు గేమ్స్ పెట్టాడు. అందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఓనర్లు విసిరే వస్తువులను పట్టుకుని వాటిని ఎండ్బజర్ వరకు తమ బాస్కెట్లో భద్రంగా దాచుకోవాలి. చివరకు ఎవరి దగ్గర ఎక్కువ వస్తువులుంటే వారే గెలిచినట్లు!కొట్టేసుకున్న సెలబ్రిటీలుప్రియ, మనీష్.. బొమ్మలు, బంతులు విసరగా టెనెంట్లు వాటిని క్యాచ్ చేసి బాస్కెట్లో వేసుకున్నారు. ఆ తర్వాతే అసలు యుద్ధం మొదలైంది. పక్కవాళ్ల బొమ్మల్ని తస్కరించే పని షురూ చేశారు టెనెంట్లు. ఈ క్రమంలో కిందామీదా పడి కొట్టుకున్నట్లే కనిపించారు. ఫ్లోరా, ఇమ్మాన్యుయేల్ కలిసి రీతూను కిందపడేశారు. సుమన్ శెట్టి.. మోచేతితో ఫ్లోరాను గుద్దిపడేశాడు. ఎవర్నైనా కొడితే గేమ్ నుంచి ఎలిమినేట్ చేస్తానంది ప్రియ. అయినా సుమన్ తగ్గలేదు. విశ్వరూపం చూపించిన సుమన్తన దగ్గరకు వస్తే తడాఖా చూపిస్తా అన్నట్లుగా విశ్వరూపం చూపించాడు. అయితే సంజనా అతడి బాస్కెట్లోనుంచి దొంగతనం చేయబోతే ఆమె చేయిని విసురుగా నెట్టేశాడు. దానికి ప్రియ.. సుమన్ను ఎలిమినేట్ చేసింది. ఆ కోపంతో అతడు తన బాస్కెట్ను కాలితో తన్నేశాడు. మరి టెనెంట్లలో ఎవరు ఓనర్ అయ్యారనేది చూడాలి! చదవండి: బిగ్బాస్ 9 గ్రాండ్ లాంచ్కు దారుణమైన TRP రేటింగ్స్ -
ఎలిమినేషన్: కామనర్ల ఓవరాక్షన్.. ఆ కంటెస్టెంట్కు మూడినట్లే!
బిగ్బాస్ (Bigg Boss Telugu 9) హౌస్లో కెప్టెన్సీ కోసం పోరు మొదలైంది. ఓనర్స్లో ఏ నలుగురికి కెప్టెన్ అయ్యే అర్హత లేదో టెనెంట్స్ చెప్పాలన్నాడు. దీంతో సెలబ్రిటీలందరూ చర్చించుకుని ప్రియ, శ్రీజ, హరీశ్, పవన్ కల్యాణ్లను పక్కన పెట్టేశారు. భరణి, డిమాన్ పవన్, మర్యాద మనీష్లను కెప్టెన్సీ కంటెండర్లుగా సెలక్ట్ చేశారు. రేసులో లేకుండా పోయిన కామనర్లు సెలబ్రిటీలపై విరుచుకుపడ్డారు. మీరు కావాలనే చేశారు, ఫేవరిటిజం చూపించారంటూ నోరేసుకుని పడిపోయారు. వీళ్ల ఓవరాక్షన్ వల్ల వారికే చేటు రానుంది. ఈ వారం కామనర్స్లో ఒకరు ఇంటి నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంది.నామినేషన్స్లో ఏడుగురుఈ వారం మనీష్, హరీశ్, సుమన్ శెట్టి, ప్రియ, డిమాన్ పవన్, ఫ్లోరా, భరణి నామినేషన్స్లో ఉన్నారు. వీరిలో ఎక్కువగా భరణి, సుమన్ శెట్టి (Suman Shetty)కే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి. హరీశ్, ఫ్లోరా సైనీకి పర్వాలేదనిపించేలా ఓట్లు పడుతున్నాయి. ఫ్లోరాకు ఓట్లు పడటానికి బలమైన కారణమే ఉంది. కామనర్స్ ఓవరాక్షన్తో ప్రేక్షకుల తల బొప్పి కడుతోంది. దీంతో వారిలో ఒకరిని పంపిస్తే కానీ వీళ్ల నోటికి తాళం పడేలా లేదని జనం ఫీలవుతున్నారు. అందుకే కామనర్స్లో ఒకరిని ఎలిమినేట్ చేయాలన్న కసితో ఫ్లోరాకు ఓట్లేసి మరీ ఆమెను సేవ్ చేస్తున్నారు. డేంజర్ జోన్లో ముగ్గురుదీంతో మనీష్, ప్రియ, డిమాన్ పవన్ డేంజర్ జోన్లో ఉన్నారు. డిమాన్ పవన్.. తన గేమ్ కన్నా రీతూ చుట్టూ తిరగడంపైనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ప్రియ.. తను చెప్పిందే రైట్ అంటూ వాగుతూనే ఉంటుంది. మనీష్.. వరస్ట్ కామనర్స్ అంటూ తన టీమ్నే తిడతాడు, మళ్లీ వాళ్లనే సపోర్ట్ చేస్తాడు. ఒక మాట మీద నిలబడడు. అందుకే వీళ్లలో ఒకర్ని బయటకు పంపించాలన్నది బుల్లితెర ప్రేక్షకుల ఆలోచన. ముఖ్యంగా మనీష్, పవన్లపైనే ఎలిమినేషన్ కత్తి వేలాడుతోంది. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది చూడాలి! చదవండి: ఓనర్స్ ఆర్ టెనెంట్స్.. కెప్టెన్సీ ఎవరికీ దక్కింది..! -
'ఏదో ఒక రోజు రోడ్డు మీదకి వస్తా.. నా కోసం ఆ ఒక్క పని చేసి పెట్టమని చెప్పా'
అధ్యక్షా.. అనే ఒకే ఒక్క డైలాగ్తో ఫేమస్ అయిన కమెడియన్ సుమన్ శెట్టి (Suman Shetty). నితిన్ హీరోగా వచ్చిన జయం మూవీతో ప్రేక్షకుల గుండెల్లో స్థానం దక్కించుకున్నారు. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో తన కామెడీ టైమింగ్తో మెప్పించాడు. అప్పట్లో సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన సుమన్.. ఈ మధ్యకాలంలో సైలెంట్ అయిపోయాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్దగా కనిపించని సుమన్ శెట్టి.. బిగ్బాస్ రియాలిటీ షోతో మళ్లీ కెరీర్ రీ స్టార్ట్ చేశాడు.తాజాగా సుమన్ శెట్టి గురించి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తేజ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అతన్ని పరిచయం చేశాక.. సినిమాల్లో నీకు మంచి అవకాశాలు వస్తాయి.. తొందరగా నువ్వు ఒక సైట్ కొనుక్కో అని సుమన్కు సలహా ఇచ్చానని అన్నారు. అన్నట్లుగానే సుమన్ శెట్టి ఓ సైట్ కొని ఇల్లు కూడా కట్టుకున్నాడని తెలిపారు. ఒకసారి నా వద్దకు వచ్చిన సుమన్.. ఇదంతా మీవల్లే సార్ అంటూ నా కాళ్లను టచ్ చేస్తా అన్నారు. నేను ఏ విధంగా మీ రుణం తీర్చుకోవాలని అడిగాడని గుర్తు చేసుకున్నారు.తేజ మాట్లాడుతూ.. 'కాళ్లను టచ్ చేయడం నా కిష్టం లేదని చెప్పా. నేను ఏ విధంగా మీ రుణం తీర్చుకోవాలని అడిగాడు. నేను కొత్త వాళ్లతో సినిమాలు తీస్తా ఉంటా. ఇలా చేస్తూ నేను ఏదో ఒక రోజు రోడ్డుమీదకి వచ్చేస్తా. అప్పుడు నేను ఉండేందుకు నువ్వు కట్టుకునే ఇంటిలో ఒక రూమ్ ఉంచు అని చెప్పా. నేను అన్నట్లుగానే అతని ఇంటిలో నాకోసం రూమ్ కట్టి.. ఆ గదిలో నా ఫోటో పెట్టి రోజు క్లీన్ చేస్తూ ఉంటాడు' అని తెలిపారు.కాగా.. తేజ డైరెక్షన్లో వచ్చిన జయం, జై, సంబరం, ఔనన్నా కాదన్నా, ధైర్యం, నిజం లాంటి సినిమాల్లో సుమన్ శెట్టికి అవకాశాలిచ్చాడు. అందువల్లే తేజ సార్ నాకు గాడ్ ఫాదర్ అని సుమన్ శెట్టి చాలాసార్లు చెప్పారు. కాగా.. కమెడియన్ సుమన్ శెట్టి.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, భోజ్పురి భాషల్లో దాదాపు 300 సినిమాల్లో నటించారు. -
4 రోజులుగా మాస్క్ మ్యాన్ నిరాహార దీక్ష! నామినేషన్స్లో ఏడుగురు
హీరో, విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్ను చంపేసినట్లుంది కథ! హౌస్లో గుడ్డు దొంగతనం చేసింది సంజనా.. ఆ గుడ్డును కాపాడుకోవాల్సింది ఓనర్లు. సంజనా ఐదు నెలల బాలింత కావడంతో ఆ దొంగతనాన్ని చూసీచూడనట్లు వదిలేశాడు భరణి. అంతే, దొరికిందే ఛాన్స్ అన్నట్లు ఇప్పటికీ అదే పాయింట్ లాగుతూ ఓనర్లందరూ కలిసి భరణిని నామినేట్ చేశారు. మరి ఈ రెండోవారం నామినేషన్స్లో ఎవరున్నారో చూసేద్దాం..తలతిక్క సమాధానాలునాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న మాస్క్ మ్యాన్ హరీశ్ను రీతూ చౌదరి (Rithu Chowdary) నామినేట్ చేసింది. నేను తినను, వెళ్లిపోతాను అని గివప్ ఇవ్వడం నచ్చలేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, మరి అదే అన్నం మీ ఎదురుగా మీకోసం గంటన్నర వెయిట్ చేసింది. ఫ్యామిలీ గురించి ఆలోచించైనా తినొచ్చుగా.. అంది. దీనికి హరీశ్ తలతిక్క సమాధానం చెప్పాడు. నా జీవితం.. నాకు నచ్చినట్లు బతుకుతా, మీకు నచ్చినట్లు కాదు. బలమైన కారణం వల్లే ఫుడ్ తినడం లేదు. నేను బయట కొంతమందిని కాపాడుకోవాలి. నాపై ముద్ర వేశారునేను చరిత్రహీనుడని ముద్రవేశారు కదా.. దాన్నుంచి బయట మనుషుల్ని కాపాడుకోవడానికి క్విట్ అవుతా అన్నాడు. మీ మీద ముద్ర వేస్తే అది నిజం కాదని ప్రూవ్ చేయాలని రీతూ అంది. అప్పటికీ తగ్గని హరీశ్ (Mask Man Harish) టాపిక్ను డైవర్ట్ చేస్తూ ఏదేదో మాట్లాడాడు. నీకు ఫుడ్ పెట్టడం వల్లే గొడవలనడంతో రీతూ ఏడ్చేసింది. ఆమె కన్నీళ్లు పెట్టుకోవడాన్ని సింపతీ కార్డ్ అన్నాడు హరీశ్. అలాగైతే అన్నం తినకపోవడం కూడా సింపతీ కార్డే అని రీతూ ఇచ్చిపడేసింది.దమ్ముంటే బిగ్బాస్ను అడగండితర్వాత శ్రీజ కూడా హరీశ్ను నామినేట్ చేసింది. మీరు ఇమ్మాన్యుయేల్ను రెడ్ ఫ్లవర్ అనడం వీడియోలో క్లియర్గా కనిపించిందని శ్రీజ చెప్తుంటే ఇమ్మాన్యుయేలే బాడీ షేమింగ్ చేశాడంటూ హరీశ్ మళ్లీ ఫైరయ్యాడు. మా మధ్య ఉండటం ఇష్టం లేకపోతే వెళ్లిపో అనేసింది శ్రీజ. దమ్ముంటే బిగ్బాస్ను అడగండి, పంపిస్తే వెళ్లిపోతా అన్నాడు. ఇలా గొడవలతోనే నామినేషన్ ప్రక్రియ జరిగింది. చివర్లో బిగ్బాస్ కెప్టెన్ సంజనాకు ఓ పవర్ ఇచ్చాడు. ఒకర్ని నేరుగా నామినేట్ చేయొచ్చన్నాడు.సుమన్ను బలి చేసిన కెప్టెన్ సంజనాదీంతో ఆమె.. ఆరోజు నేను ఏడుస్తున్నప్పుడు మేము 9 మంది కాదు 8మందిమే అని నన్ను పక్కనపెట్టేశారు. తర్వాత ఒక్కసారి కూడా సారీ చెప్పలేదు అంటూ సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. అందుకతడు.. ఆ తొమ్మిదో వ్యక్తి మీరే అని ఎందుకు ఫిక్స్ అవుతున్నారు? నేను అయ్యుండొచ్చుగా అని కౌంటరిచ్చాడు. ఇక ఫైనల్గా భరణి, హరీశ్, మనీష్, ప్రియ, డిమాన్ పవన్, ఫ్లోరా, సుమన్ శెట్టి ఈ వారం నామినేషన్స్లో ఉన్నారు. మరోవైపు లైవ్లో తనూజ ఎంతో బతిమాలడంతో అప్పుడు అన్నం ముద్ద తిన్నాడంట హరీశ్!చదవండి: 'రాను బొంబాయికి రాను'.. ఈ పాట వెనక అసలు నిజం చెప్పిన పేరేంట్స్! -
అధ్యక్షా.. ఈ కమెడియన్ ఇప్పుడెలా ఉన్నాడో చూశారా?
అధ్యక్షా.. డైలాగ్తో పాపులర్ కాదు సెన్సేషన్ అయ్యాడు కమెడియన్ సుమన్ శెట్టి (Suman Shetty). ఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఇతడు ఈ మధ్యకాలంలో సైలెంట్ అయిపోయాడు. చాలాకాలం తర్వాత మరోసారి ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. కాకపోతే ఈసారి సినిమా ద్వారా కాదు, బిగ్బాస్ షో ద్వారా! తెలుగు బిగ్బాస్ 9వ సీజన్ (Bigg Boss 9 Telugu)లో అడుగుపెట్టిన సుమన్ శెట్టి తన జర్నీ గురించి ఇలా చెప్పుకొచ్చాడు. తొలి సినిమాకే నంది అవార్డుఅధ్యక్షా.. నన్ను గుర్తుపట్టారా? సుమన్శెట్టిని.. చిన్నప్పటినుంచే సినిమాలంటే పిచ్చి. ఇంటర్ పూర్తయ్యాక ఓ మ్యాగజైన్లో కొత్త ఆర్టిస్టులు కావాలన్న ప్రకటన చూసి వెంటనే హైదరాబాద్ వెళ్లాను. దర్శకుడు తేజ నన్ను ఆడిషన్ చేసి సెలక్ట్ చేశారు. జై మూవీతో కెరీర్ మొదలైంది. ఫస్ట్ సినిమాకే నంది అవార్డు గెలిచాను. జయం, జై, సంబరం, ఔనన్నా కాదన్నా, ధైర్యం, నిజం సినిమాల్లో అవకాశాలిచ్చి తేజ గారు నాకు గాడ్ ఫాదరయ్యారు.300 సినిమాలుతెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, భోజ్పురి భాషల్లో దాదాపు 300 సినిమాలు చేశాను. అలా సినిమాలు చేస్తుండగా ఇంట్లోవాళ్లు నాకు పెళ్లి చేశారు. నాకు ఓ కూతురు, కొడుకు సంతానం. 2019లో మా నాన్న చనిపోయారు. నాన్న లేకపోయేసరికి ఒంటరితనం ఆవరించింది. నీ కెరీర్ మళ్లీ మొదలుపెట్టు అని అమ్మ తోడుగా నిలిచింది. బిగ్బాస్తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడతాను. బిగ్బాస్ హౌస్లో ఈ సుమన్ శెట్టి ఆటేంటో చూపిస్తా అన్నాడు సుమన్ శెట్టి. మరి ఈ కమెడియన్ బిగ్బాస్లో ఎంతమేరకు మెప్పిస్తాడో చూడాలి! -
Jetty Movie: ఒక ఊరిలో జరిగిన కథ
నందితా శ్వేత, కృష్ణ , కన్నడ కిషోర్, మైమ్ గోపి, ఎమ్యస్ చౌదరి, శివాజీరాజా, జీవా, సుమన్ శెట్టి నటించిన చిత్రం ‘జెట్టి’. సుబ్రహ్మణ్యం పిచ్చుక దర్శకత్వంలో వేణుమాధవ్ నిర్మించిన ఈ చిత్రం టైటిల్ లోగోని లాంచ్ చేశారు. సుబ్రహ్మణ్యం పిచ్చుక మాట్లాడుతూ –‘‘కొన్ని వందల గ్రామాల్లోని వేల మత్స్యకార కుటుంబాల తరాల పోరాటం ఒక గోడ.. ఆ గోడ పేరే జెట్టి. అనాదిగా వస్తున్న ఆచారాలను నమ్ముకొని జీవనం సాగిస్తున్న మత్య్సకారులున్న ఒక ఊరిలో జరిగిన కథ ఇది. మత్స్యకారుల జీవన శైలి, వారి కట్టుబాట్లతో తెరకెక్కించాం. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో సినిమాని విడుదల చేస్తాం. మా చిత్రంలో సిద్ శ్రీరాం పాడిన పాట హైలెట్గా ఉంటుంది.. త్వరలోనే ఆ పాటను రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తిక్ కొండకండ్ల. -
గ్యాంగ్ వార్
అలీ ప్రధాన పాత్రలో ధన్రాజ్, సుమన్ శెట్టి, హీన, షేకింగ్ శేషు, జబర్దస్త్ అప్పారావు ముఖ్య తారాగణంగా ఎస్. శ్యామ్ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగుపడుద్ది’. కిషోర్ రాఠి సమర్పణలో మనీషా అర్డ్స్ అండ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహేష్ రాఠి నిర్మించిన ఈ చిత్రం టీజర్ను విడుదల చేశారు. ధన్రాజ్ మాట్లాడుతూ– ‘‘మనీషా బ్యానర్లో బ్లాక్బస్టర్ హిట్ అయిన ‘ఘటోత్కచుడు’ చిత్రంలో ఫేమస్ అయిన రంగు పడుద్ది డైలాగ్నే ఇప్పుడు టైటిల్గా పెట్టి ఇదే బ్యానర్లో సినిమా చేశారు. ‘యమలీల’ చిత్రంలోని ‘చినుకు చినుకు..’ పాటను అప్పారావు, హీరోయిన్ హీనల మధ్య రీ క్రియేట్ చేశారు. శ్యామ్ప్రసాద్గారి దర్శకత్వంలో నేను నటించడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు. ‘‘చాలాకాలం తర్వాత ఈ బ్యానర్లో సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఒక బంగ్లాలో రెండు గ్యాంగ్ల మధ్య చోటు చేసుకునే ఘర్షణే మా చిత్రకథాంశం. హారర్, కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్ముతున్నాను. మేలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు శ్యామ్ప్రసాద్. ‘‘ఈ సమ్మర్ వెకేషన్కు అవుట్ అండ్ అవుట్ కూల్ కామెడీ చిత్రం అవుతుంది’’ అన్నారు మహేశ్. -
ఖమ్మంలో ‘ప్రేమిస్తే ప్రాణం తీస్తారా?’
సాక్షి, ఖమ్మం మయూరి సెంటర్: సిరి క్రియేషన్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ‘ప్రేమిస్తే ప్రాణం తీస్తారా? చిత్ర బృందం సోమవారం నగరంలో సందడి చేశారు. చిత్ర యూనిట్ సభ్యులు ఖమ్మం నగరంలో సినిమా చిత్రీకరణ ప్రారంభించారు. సిరి, షాలిని, ఇమ్రాన్, హరి హీరో, హీరోయిన్లుగా నటిస్తుండగా, ప్రముఖ సినీ నటులు కోటా శంకర్రావు, నామాల మూర్తి, సుమన్శెట్టి, పటాస్ ప్రకాశ్, జబర్దస్త్ నటులు చిత్రంలో నటిస్తున్నట్లు దర్శకుడు సమిర్నాని తెలిపారు. ఖమ్మం, పాలేరు, కిన్నెరసాని, భద్రాచలం పరిసర ప్రాంతాల్లో సినిమాకు అవసరమైన ప్రదేశాలు ఉన్నాయని, షూటింగ్కు అనూకూలమైన వాతావరణం ఉందని తెలిపారు. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న పరువు హత్యల నేపథ్యంలో ప్రేమిస్తే ప్రాణం తీస్తారా? సినిమాను తెరకెక్కిస్తున్నామని పేర్కొన్నారు. సోమవారం ఖమ్మంలో పలు సన్నివేశాలను చిత్రికరించినట్లు తెలిపారు. ఈ సినిమాకు కెమెరామెన్గా శివరాథోడ్, సంగీత దర్శకుడిగా ఏఆర్ సన్నీ, ఎడిటర్గా సుబ్రహ్మణ్యరాజు, అసిస్టెంట్ డైరెక్టర్గా సరిత కనపత్తి, కోడైరెక్టర్గా దిలీప్ రామగిరి వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. చిత్రానికి సంబంధించిన ఆడియో ఫిబ్రవరి మొదటి వారంలో జీవీకే–4 ద్వారా విడుదలవుతుందని వివరించారు. -
నవ్వించడం ఓ వరం
సింహాచలం (పెందుర్తి) : హాస్య నటిగా గుర్తింపు పొందడం ఆ భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తానని గీతాసింగ్ తెలిపారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శనివారం హాస్యనటులు సుమన్శెట్టి, చిట్టిబాబు, జబర్దస్త్ టీం లీడర్ ఆనంద్లతో కలిసి ఆమె దర్శించుకున్నారు. ఈసందర్భంగా స్థానిక విలేకర్లతో మాట్లాడారు. తేజ తీసిన జై సినిమాతో సినీ రంగప్రవేశం చేశానన్నారు. ప్రస్తుతం ఆచారి అమెరికా యాత్ర సినిమాలో నటించానన్నారు. హీరో నరేష్ సిమాలో ప్రస్తుతం నటిస్తున్నాన్నారు. మరికొన్ని సినిమాల్లో చాన్స్లు వస్తున్నాయని, స్టోరీలు వింటున్నానన్నారు. కితకితలు సినిమా నాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిందన్నారు. సుమన్శెట్టితో తాను ఒక రియాల్టీ షో చేస్తున్నాని వచ్చే నెలలో ఆ షూటింగ్ ప్రారంభమవుతుందన్నారు. నెగిటివ్ రోల్స్ ఇష్టం : సుమన్శెట్టి నెగిటివ్ రోల్స్ చేయడం చాలా ఇష్టమని సినీ నటుడు సుమన్శెట్టి తెలిపారు. తెలుగులో జయం సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యానన్నారు. 7జి బృందావనం కాలనీ, రణం, యజ్ఞం తదితర సినిమాలు ఎంతో పేరు తెచ్చిపెట్టాయన్నారు. ప్రస్తుతం అనుకోకుండా ఒక రాజకుమారుడు సినిమాలో నటిస్తున్నాన్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, బోజ్పురి భాషల్లో ఇప్పటి వరకు భాషల్లో కలిపి 290 సనిమాల్లో నటించానన్నారు. పుట్టింది, పెరిగింది అంతా వైజాగ్ పూర్ణామార్కెట్ అని పేర్కొన్నారు. -
గోవాలో రాజకుమారుడు
నవీన్బాబు హీరోగా సంజన, అమృత హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘అనగనగా ఓ రాజకుమారుడు’. హాస్యనటుడు సుమన్ శెట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. షెరాజ్ దర్శకత్వంలో రమాదేవి సమర్పణలో పీవీ రాఘవులు నిర్మిస్తోన్న ఈ చిత్రం గోవాలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. షెరాజ్ మాట్లాడుతూ – ‘‘లవ్, కామెడీ, థ్రిల్లర్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. గోవా నేపథ్యంలో కథ ఉంటుంది. త్వరలో హైదరాబాద్లో రెండో షెడ్యూల్ మొదలు పెట్టి, పాటలు, మిగతా సన్నివేశాలు పూర్తి చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా–ఎడిటింగ్: ఏకరీ లక్కీ, సంగీతం–స్క్రీన్ప్లే–దర్శకత్వం: షెరాజ్. -
యాక్షన్ థ్రిల్లర్
నవీన్, జీవా, మధు, సుమన్ శెట్టి ముఖ్య తారలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘డేర్’. ప్రవీణ్ క్రియేషన్స్ పతాకంపై కె. కృష్ణ ప్రసాద్ దర్శకత్వంలో ఎన్. రామారావు నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ను రిలీజ్ చేశారు. నిర్మాత మాట్లాడుతూ – ‘‘పాటలు, వినోదం సినిమాకు హైలైట్. సీనియర్ నటులతో పాటు కొత్తవారూ నటించారు. త్వరలో ఆడియో, సినిమా రిలీజ్కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ‘‘పూర్తి యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన సినిమా ఇది. నవీన్ కొత్తవాడైనా బాగా నటించాడు. జీవా, సుమన్ శెట్టి పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అన్నారు కృష్ణప్రసాద్. ‘‘హీరోగా నాకిది తొలి సినిమా. కథ–కథనం ఆసక్తిగా ఉంటాయి’’ అన్నారు నవీన్. నటి సాక్షి, పాటల రచయిత సదా చంద్ర, మాటలు రచయిత రాఘవ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దంతు వెంకటే, సంగీతం: ఇ.ఆర్ నరేన్, సమర్పణ: ఎన్. కరుణాకర్ రెడ్డి. -
ఎవరికి ఎవరో!
వీఏకే భాస్కర్ దర్శకత్వంలో దేవీకృష్ణ సినిమా పతాకంపై సిస్టర్ కుమారి, శాబోలి రమాదేవి గౌడ్ నిర్మిస్తున్న హారర్ కామెడీ సినిమా ‘నువ్వు ఎవరో నేను ఎవరో’. సుమన్ శెట్టి, ‘చిత్రం’ శీను, ‘జబర్దస్త్’ చిట్టి, రూపశ్రీ, శిల్ప, మేఘనా రాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘సుమన్ శెట్టి, కౌబాయ్గా చిట్టిబాబు, కామెడీ విలన్గా స్వామి నాయక్ ప్రేక్షకులను నవ్విస్తారు. ‘చిత్రం’ శీను విలన్గా నటించారు. నవ్విస్తూ భయపెడుతుందీ సినిమా. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో సెన్సార్ పూర్తిచేసి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు: దేవీకృష్ణ, కెమేరా: తిరుమల్, సంగీతం: రమణ సాకు. -
సోమవారం ఏం జరిగింది?
ధన్రాజ్, శ్రీచరణ్, సుమన్శెట్టి, ‘జబర్దస్త్’ శ్రీను, చిత్రం శ్రీను ముఖ్య పాత్రల్లో భవానీ అగర్వాల్ నిర్మించిన చిత్రం ‘ఫామ్హౌస్’. ఎమ్.యన్. రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ను శోభారాణి, ప్రచార చిత్రాలను మల్టీ డైమన్షన్ వాసు, సాయి వెంకట్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘సోమవారం రోజు ఏం జరిగింది? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. సస్పెన్స్, హారర్ నేపథ్యంలో సినిమా సాగుతుంది’’ అని చెప్పారు. ఎమ్.ఎన్. రెడ్డి అద్భుతంగా తెరకెక్కించారని భవానీ అగర్వాల్ అన్నారు. -
ఏం జరిగింది?
ముగ్గురు యువకులు తమ ప్రియురాళ్లతో ఓ ఫామ్హౌస్కి వెళతారు. అక్కడ వారికి ఎలాంటి అనుభవం ఎదురైంది? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘ఫామ్ హౌస్’. ‘జబర్దస్త్’ శ్రీను, ‘చిత్రం’ శ్రీను, ధన్రాజ్, సుమన్శెట్టి, శ్రీచరణ్ ముఖ్య పాత్రల్లో భవానీ అగర్వాల్ ఈ చిత్రం నిర్మించారు. యమ్.యన్. రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా భవానీ అగర్వాల్ మాట్లాడుతూ -‘‘ఇది సస్పెన్స్, హారర్ మూవీ. ఈ మధ్యకాలంలో వచ్చిన హారర్ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అర్జున్ స్వరపరచిన పాటలు బాగుంటాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని చెప్పారు. -
కమెడియన్కి మైనస్లే ప్లస్సులు!
సంభాషణం నవ్వడం తేలికే. కానీ నవ్వు పుట్టించడం అంత తేలిక కాదు. దానికి ప్రతిభ ఉండాలి. హాస్యం అనేది అణువణువునా నిండివుండాలి. అలాంటివారే అందరినీ నవ్వించగలరు అంటారు సుమన్శెట్టి. విభిన్నమైన లుక్తో, వైవిధ్యభరితమైన హావభావాలతో కడుపుబ్బ నవ్వించే ఈ కమెడియన్తో మాటా మంతీ.... ఈ మధ్య కాస్త తక్కువ కనిపిస్తున్నట్టున్నారు...? కెరీర్ కొంచెం డల్ అయిందిలెండి. ఎందుకలా? కొత్తవాళ్లు వస్తున్నారు. పోటీ పెరిగింది. అలా అని మరీ డల్లేమీ కాదు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా నటిస్తున్నాను కాబట్టి ఫర్వాలేదు. ఇక్కడ చాన్సుల్లేవని అక్కడికెళ్లారా? అలా ఏమీ లేదు. ‘జయం'లో చేసిన పాత్ర తమిళ వెర్షన్లో కూడా నేనే చేశాను. దాంతో అక్కడ కూడా మొదట్నుంచీ అవకాశాలు బాగానే వచ్చాయి. ఇప్పుడు కన్నడంలో కూడా వస్తున్నాయి. ఇప్పటికి ఎన్ని సినిమాలు చేశారు? తెలుగులో మూడొందల పైనే చేశాను. తమిళంలో అరవై వరకూ చేశాను. అన్నిట్లోకీ బెస్ట్ అనుకునే పాత్ర...? ఎప్పుడూ ఫస్ట్ చేసిందే బెస్ట్ అవుతుందని నా అభిప్రాయం. ఎన్ని రకాల పాత్రలు చేసినా... నన్ను నటుడిని చేసిన ‘జయం' సినిమాలో పాత్ర అంటే నాకు ప్రత్యేమైన ఇష్టం! అలాగే ‘7/జి బృందావన్ కాలనీ’లో చేసింది కూడా! ఇన్ని సినిమాలు చేశారు. రావలసినంత గుర్తింపు వచ్చిందంటారా? దర్శకులు పిలిచి అవకాశాలు ఇస్తున్నారంటే గుర్తింపు వచ్చినట్టే. కానీ తృప్తి కలిగించేటి రోల్స్ చేయలేదంటే ఇంకా గుర్తింపు రావలసి ఉన్నట్టే! ఇంత కాంపిటీషన్ మధ్య నిలబడటానికి మీకున్న ప్రత్యేకతలేంటి? నా మాడ్యులేషన్! కొండవలస గారిని తీసుకోండి... ఆయన మాట్లాడినట్టు వేరేవాళ్లు మాట్లాడలేరు. ప్రయత్నించినా రాదు. నాదీ అంతే. ఓ డిఫరెంట్ మాడ్యులేషన్. అదే నాకంటూ ఓ గుర్తింపునిచ్చింది. నన్నిక్కడ నిలబెట్టింది. మరి మైనస్ పాయింట్స్...? అవి నేను కాదు... నన్ను చూసేవాళ్లు చెప్పాలి. అయినా నెగిటివ్ పాయింట్స్ హీరోలకు మైనస్ అవుతాయి. అదే కమెడియన్కి అయితే మైనస్లే ప్లస్ అవుతాయి. (నవ్వుతూ) నన్ను చూడండి... నా రూపం చూస్తేనే నవ్వొస్తుందంటారు అందరూ. అంటే మైనస్ ప్లస్ అయినట్టేగా! మీ రోల్మోడల్ ఎవరు? పద్మనాభంగారంటే నాకు చాలా ఇష్టం. కమెడియన్గా ఎంత నవ్వించారో... హీరో దగ్గర్నుంచి నెగిటివ్ రోల్స్ వరకూ అన్ని రకాల పాత్రలూ చేసి అంతగానూ అలరించారాయన. అలాగే రేలంగిగారు, రాళ్లపళ్లిగారు అన్నా ఎంతో ఇష్టం. ఫలానా దర్శకుడితో చేయాలి అన్న కోరికేమైనా ఉందా? అలా ఏం లేదు. తేజ నన్ను పరిచయం చేశారు. ఇప్పటి వరకూ తన ప్రతి సినిమాలో చాన్స్ ఇస్తూనే ఉన్నారు. అలాగే మిగతా దర్శకులు కూడా నాకు సరిపోయే పాత్ర ఉంటే పిలిచి ఇస్తున్నారు. అలాంటప్పుడు ఒక్క దర్శకుడి పేరు ఎలా చెబుతాను! నాకు అందరూ ముఖ్యమే. ఎవరన్నా గౌరవమే. అందరూ నన్ను ప్రోత్సహించి నడిపిస్తున్నవారే కదా! మీ డ్రీమ్ రోల్...? ఎప్పుడూ నవ్విస్తూ ఉండే నాకు ఓ మంచి నెగిటివ్ రోల్ చేసి... నాలోనూ ఓ సీరియస్ నటుడున్నాడని చూపించాలని ఉంది. చాలామంది కమెడియన్లు హీరోలవుతున్నారు. మీకూ అలాంటి కోరికేదైనా...? అస్సలు లేదు. ఉన్నదాంతో తృప్తిపడే తత్వం నాది. మధ్యలో అవకాశాలు తగ్గి ఓ సంవత్సరం గ్యాప్ వచ్చినప్పుడు కూడా నిరాశపడలేదు. ఈసారి వచ్చే అవకాశాల్ని సద్వినియోగం చేసుకుని, మళ్లీ ఒక్కో మెట్టూ ఎదగాలనుకున్నాను. నేనేది చేయగలనో, నాకేది తగునో అవే చేస్తాను తప్ప ఎక్కువ ఆశలు పెట్టుకోను. - సమీర నేలపూడి -
భయపెట్టే గవ్వలాట
సుమన్శెట్టి, సైరాభాను ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘గవ్వలాట’. రామ్కుమార్ దర్శకుడు. సీహెచ్ సుధాకరబాబు నిర్మాత. ఈ నెల 21న విడుదల కానున్న ఈ సినిమా గురించి నిర్మాత చెబుతూ -‘‘హారర్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. దర్శకుడు చాలా చక్కగా తెరకెక్కించారు. నిర్మాణం విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని తెలిపారు. ఇంకా మోహన్ వడ్లపట్ల, సాయివెంకట్, చంద్రశేఖర్రెడ్డి, అశోక్కుమార్, మోహన్గౌడ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
మెరిపిస్తాం..మురిపిస్తాం..
‘న్యూస్లైన్’తో విశాఖ సినీ తేజాల మాటామంతీ విశాఖ నగరానికి సినిమా పరిశ్రమకు అవినాభావ సంబంధం ఉంది. ఈ అందాల తీరం షూటింగ్లకు నుకూలమన్న విషయం తెలిసిందే. అలాగే ఎంతోమంది నటీనటులు, దర్శకులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్లు, నిర్మాతలు మన నగరం నుండి వెళ్లి తెలుగు చిత్ర పరిశ్రమను సుసంపన్నం చేశారు. వీరిలో కొంతమంది తమ న్యూ ఇయర్ కమిట్మెంట్స్ను ‘న్యూస్లైన్’కు వివరించారు. లవ్ స్టోరీతో వస్తున్నా... నర్సీపట్నం ప్రాంతానికి చెందిన దర్శకుడు పూరి జగన్నాథ్ నితిన్ హీరోగా నటిస్తున్న హార్ట్ ఎటాక్ చిత్రం షూటింగ్లో బిజీబిజీగా ఉన్నారు. ఈ చిత్రం చాలా వరకు పూర్తి కావచ్చింది. మంచి యూత్ ఫుల్ లవ్స్టోరీగా నిలుస్తుందని ఆయన చెప్పారు. జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి నెలలో హార్ట్ ఎటాక్ను విడుదల చేయనున్నామన్నారు. ఇప్పుడాయన బ్యాంకాక్లో షూటింగ్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తన దృష్టి ఈ చిత్రంపైనే ఉందని, మిగతా ప్రాజెక్టుల వివరాలు తర్వాత వెల్లడిస్తానన్నారు. ప్రేక్షకులకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఈ ఏడాది ఎన్నో చిత్రాలు విజయవంతమై పరిశ్రమలో అందరూ ఆనందంగా ఉండాలని కోరుతున్నానన్నారు. ఈ ఏడాది కూడా విశాఖలో షూటింగ్... ఈ ఏడాది కూడా విశాఖలోనే తన తదుపరి చిత్ర షూటింగ్ జరుగుతుందని ప్రముఖ దర్శకుడు సునీల్కుమార్ రెడ్డి చెప్పారు. ఆయనకు ఈ నగరమంటే సెంటిమెంట్. హీరో, గంగపుత్రులు, రొమాంటిక్ క్రైమ్ కథ.. ఇలా తాను డెరైక్ట్ చేసిన సినిమాలు విశాఖలోనే తీశారు. తన సొంత బ్యానర్ శ్రావ్య ఫిలిమ్స్పై యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చిత్రం రూపొందిస్తున్నానని, జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి తొలి వారంలో షూటింగ్ ప్రారంభిస్తానని చెప్పారు. ఇద్దరు పెద్ద హీరోలతో సినిమాలు చేయడానికి చర్చలు సాగుతున్నాయన్నారు. ప్రజలందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతూ సామాజిక దృక్పథంతో సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని కోరారు. మరింత కామెడీ పండిస్తా... విశాఖ నుండి వెళ్లిన కొద్ది కామెడియన్లలో ప్రస్తుత జనరేషన్లో బాగా పాపులర్ అయిన నటుడు సుమన్ శెట్టి. పూర్ణామార్కెట్ ప్రాంతానికి చెందిన ఈ నటుడు కామెడీ పండించడంలో తనదంటూ ఓ ముద్ర వేశాడు. కొత్త సంవత్సరంలో మరి న్ని మంచి చిత్రాల్లో నటిస్తున్నానని, బెస్ట్ కామెడీ పండి స్తానని చెప్పాడు. ఈ ఏడాది ఓ స్త్రీ ప్రేమకధ, రింగ్టోన్, తనీష్ హీరోగా చేస్తున్న తమిళ, తెలుగు చిత్రాలు, వరుణ్ సందేశ్ నటిస్తున్న నాతో వస్తావా చిత్రంలో నటిస్తున్నాడు. ఈ ఏడాది నాకు చాలా ప్రత్యేకం స్టార్ మేకర్ సత్యానంద్ అంటే తెలియని వారుండరు. సుమారు 70మంది హీరోలను, 12మంది క్యారెక్టర్ నటులను, ఎనిమిదిమంది దర్శకులను, ఎందరో టీవీ ఆర్టిస్టులను అందించిన ఘనత ఆయనది. ఈ సంవత్సరం తనకు చాలా ప్రత్యేకమని సత్యానంద్ చెప్పారు. కారణం ఇరవై ఏళ్ల సినీ ప్రస్థానంలో తాను తొలిసారిగా నటిస్తున్న బిల్లారంగ చిత్రం ఈ ఏడాది విడుదలవుతోంది. దర్శకుడు సునీల్కుమార్రెడ్డి తీస్తున్న కొత్త చిత్రంలో కూడా సత్యానంద్ నటించబోతున్నారు. ఈ ఏడాది తన దృష్టి అంతా యాక్టింగ్పైనేనని చెప్పారు. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, చిరు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ల చిత్రాలు ఈ ఏడాది రిలీజవుతున్నాయి. వీరిద్దరూ సత్యానంద్ స్కూలు నుండి వచ్చిన వారే. ఈ ఏడాది విశాఖ నుండి మరింతమంది చిత్ర పరిశ్రమకు చేరాలని కోరుతున్నానన్నారు. -
తమిళనాడులో నన్నంతా సెంథిల్ కొడుకు అనుకుంటారు - సుమన్శెట్టి
చిత్రమైన శారీరక భాష, విభిన్నమైన సంభాషణా చాతుర్యం. నవ్వు తెప్పించే హావభావాలు... వెరసి సుమన్ శెట్టి. నటుడవుతానని కలలో కూడా ఊహించని సుమన్ శెట్టి ఏకంగా ఇప్పుడు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో బిజీ హాస్యనటుడు. ఈ జనరేషన్లో అలాంటి అరుదైన అవకాశం తనకే దక్కింది. భవిష్యత్తులో ఇంకా మరిన్ని నవ్వులు కురిపిస్తానని ఆత్మవిశ్వాసం కనబరుస్తున్న సుమన్ శెట్టితో ‘సాక్షి’ జరిపిన సంభాషణ... కెరీర్ ఎలా ఉంది? చాలా బిజీగా ఉందండీ.. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, భోజ్పురి భాషల్లో కూడా నటిస్తున్నాను. ఇంత బిజీ ఆర్టిస్టుని అవుతానని నేను అస్సలు ఊహించలేదు. అసలు నటనపై ఆసక్తి ఎలా మొదలైంది? ‘నువ్వు సినిమాల్లో పనికొస్తావురా’ అని చదువుకునే రోజుల్లో ఫ్రెండ్స్ అంటూ ఉండేవారు. నేను లైట్గా తీసుకునేవాణ్ణి. వైజాగ్లో మాది రైస్, ఆయిల్ హోల్సేల్ వ్యాపారం. ఆ రోజు నాన్నకు పనుండి బయటకు వెళ్లడంతో నేనే షాపులో కూర్చున్నా. అప్పుడే... ‘చిత్రం’ సినీ వారపత్రిక చూశాను. ‘జయం’ సినిమా కోసం నూతన నటీనటులు కావలెను అనే ప్రకటన అందులో కనిపించింది. వెంటనే నా ఫొటోలను, బయోడేటాను పంపించాను. నాకైతే పిలుపు వస్తుందని నమ్మకం లేదు. కానీ... అనుకోకుండా తేజగారి నుంచి కబురొచ్చింది. ఆ క్షణాలు నా జీవితంలో మరిచిపోలేను. నటనపై అవగాహన లేని మీరు ఒక్కసారిగా కెమెరా ముందుకెళ్లినప్పుడు భయం అనిపించలేదా? చచ్చేంత భయం వేసింది. పైగా తేజగారు కోపిష్టి. కొట్టేస్తారని చాలా మంది భయపెట్టారు. ఆ భయంలోనే తొలి షాట్కే 14 టేకులు తిన్నాను. ఇంకేముంది... తేజ కొట్టేస్తారేమో అనుకున్నా. కానీ ఆయన ఒక్క మాట కూడా అనలేదు. పైగా 15వ టేక్ ఓకే అవ్వగానే... తాను క్లాప్స్ కొట్టి, యూనిట్ అందరితో క్లాప్స్ కొట్టించారు. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం ఆయనే. రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోయారు కదా, మీ ఊళ్లో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? మా తాతగారి పేరు పూసల్ల సూరిబాబు. చాలా ఫేమస్. మా నాన్నగారి పేరు గుప్తా. మా నాన్నగారిక్కూడా వైజాగ్లో చాలా మంచి పేరుంది. నన్నందరూ ‘గుప్తాగారబ్బాయి’ అని పిలిచేవారు. కానీ ఇప్పుడు అందరూ మా నాన్నను ‘సుమన్శెట్టి నాన్న’ అంటున్నారు. ఇంతకంటే ఏం సాధించాలి. మాది పెద్ద వ్యాపారం. మా షాపు ఎప్పుడూ కిటకిటలాడుతూనే ఉంటుంది. కానీ ‘జయం’ తర్వాత మా షాపుకు సరుకు కోసం వచ్చేవారికంటే నన్ను చూడ్డానికి వచ్చిన వాళ్లు ఎక్కువ అయిపోయారు. ఇప్పుడు ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాం. తమిళంలో కూడా మీకు మంచి స్టార్డమ్ ఉన్నట్టుంది? ఇక్కడ లాగే అక్కడ కూడా నన్ను చాలా అభిమానిస్తారండీ. తమిళ ‘జయం’, ‘7/జి బృందావన్ కాలనీ’ చిత్రాలు అక్కడ కూడా నాకు మంచి పేరు తెచ్చాయి. దాదాపు తమిళ స్టార్స్ అందరితో నటించా. నన్ను తమిళియన్ అనుకునేవారు అక్కడ కోకొల్లలు. కొందరైతే ‘నువ్వు ప్రముఖ హాస్యనటుడు సెంథిల్ కొడుకువా..’ అని అడుగుతుంటారు. చాలామంది నన్ను అలాగే అనుకుంటారు కూడా. మీరేం చెబుతారు? ‘నేను తెలుగువాణ్ణి. మాది వైజాగ్..’ అని గర్వంగా చెబుతా. ఏ భాషలో నటిస్తున్నా... నా భాషను, నా ప్రాంతాన్ని గౌరవించుకోవడం నా ధర్మం. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు? ఆడు మగాడ్రా బుజ్జీ, మసాలా సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి. రింగ్టోన్, మనుషులతో జాగ్రత్త సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇంకా ఇతర భాషల్లో కూడా బిజీగా ఉన్నాను. డ్రీమ్ కేరక్టర్ ఏమైనా ఉందా? నవ్విస్తూ ఏడిపించే పాత్ర చేయాలని ఉంది. అలాగే నవ్విస్తూ... కోపం తెప్పించే పాత్ర చేయాలని ఉంది.


