sunayana
-
ఆ సినిమా చేస్తున్నప్పడు చాలాసార్లు గాయపడ్డాను : విశాల్
తమిళసినిమా: విశాల్ తాజా చిత్రం లాఠీచార్జ్. సునయన నాయకిగా నటించిన ఇందులో ప్రభు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఆర్. వినోద్ కుమార్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నటులు నందా, రమణ కలిసి రాణా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ భారీ చిత్రానికి సుబ్రమణ్యం చాయాగ్రహణను, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో రూపొందింది. ఇందులో విశాల్ పోలీస్ కానిస్టేబుల్ గా నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 22వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సోమవారం సాయంత్రం చిత్ర ట్రైలర్ను ఆవిష్కరించారు. స్థానిక వడపళనిలోని పలోజా థియేటర్లో నిర్వహించారు. మాజీ డీజీపీ జాంగిత్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ ముఖ్య అతిథులుగా ట్రైలర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతుండగా అభిమానులు పురట్చి దళపతి అని హర్షధ్వానాలతో ఘోషించారు. దీంతో విశాల్ స్పందిస్తూ తాను దళపతి కాదు, పురట్చి దళపతినీ కాదని.. విశాల్ను మాత్రమే అంటూ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఈ కానిస్టేబుల్కు సెల్యూట్ అంటూ జాంగిత్ విశాల్కు సెల్యూట్ చేశారు. అనంతరం విశాల్ మాట్లాడుతూ.. దర్శకుడు వినోద్ కుమార్ ఈ కథను చెప్పి ఎనిమిది రోజుల్లోనే సమ్మతం పొందారన్నారు. తను కథ చెప్పడానికి ముందే ఇందులో తనది 8 ఏళ్ల బాలుడికి తండ్రి పాత్ర అని తెలిపారన్నారు. కథ విన్న తర్వాత తాను ఎలాంటి అనుభూతికి లోనైయ్యానో, చిత్రం చూసిన తర్వాత ప్రేక్షకులు అలాంటి అనుభూతికే గురవుతారన్నారు. తాను ఇప్పటివరకు నటించిన చిత్రాలన్నింటి కంటే భారీ బడ్జెట్ కథా చిత్రం ఇదని చెప్పారు. ఈ చిత్రంలో పనిచేసిన ఇద్దరికి మంచి పేరు వస్తుందన్నారు అందులో ఒకరు సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, రెండో వ్యక్తి ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ అని తెలిపారు. చిత్రంలో క్లైమాక్స్ పోరాట దృశ్యాలను 80 రోజుల పాటు చిత్రీకరించినట్లు చెప్పారు. ఈ సన్నివేశాల సమయంలో చాలాసార్లు గాయపడ్డానని చెప్పారు. చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో ఈ నెల 22వ తేదీ, హిందీ వెర్షన్ 30వ తేదీ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. -
రాజమౌళి అంత సక్సెస్ విశాల్ అందుకోవాలి
‘‘సినిమా కథకి ఎంత బడ్జెట్ అయినా, షూటింగ్కి ఎన్ని రోజులు పట్టినా చేయాలనే జబ్బు విశాల్కి ఉంది. ఆ జబ్బు మా అబ్బాయి రాజమౌళి నుంచి విశాల్కి అంటుకుంది (నవ్వుతూ). రాజమౌళి ఎంత సక్సెస్ అందుకున్నాడో మంచి మనసున్న విశాల్ కూడా అంతే సక్సెస్ అందుకోవాలి’’ అని ప్రముఖ రచయిత–దర్శకుడు, రాజ్యసభ ఎంపీ విజయేంద్ర ప్రసాద్ అన్నారు. విశాల్, సునయన జంటగా ఎ.వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లాఠీ’. రానా ప్రొడక్షన్స్ పై రమణ, నంద నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో డిసెంబర్ 22న విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ని విజయేంద్ర ప్రసాద్ రిలీజ్ చేశారు. విశాల్ మాట్లాడుతూ– ‘‘వినోద్ కుమార్ గురించి ‘లాఠీ’ విడుదలయ్యాక సిల్వర్ స్క్రీనే చెబుతుంది. రమణ, నంద చాలా ప్యాషన్తో ఈ సినిమా చేశారు. నా ప్రతి సినిమాలానే ‘లాఠీ’ని ఎంత మంది చూస్తారో టికెట్కి రూపాయి చొప్పున రైతులకు ఇస్తాను’’ అన్నారు. ‘‘లాఠీ’ యాక్షన్ అడ్వంచర్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ’’ అన్నారు వినోద్ కుమార్. ‘‘ఈ సినిమాతో విశాల్కి జాతీయ అవార్డు వస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు రమణ. మాటల రచయిత రాజేష్ ఎ.మూర్తి, పాటల రచయిత చంద్రబోస్ పాల్గొన్నారు. -
వెంకీ, వరుణ్ తేజ్లను ఆడేసుకున్న నాగరత్తమ్మ.. ట్రెండింగ్లో వీడియో
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్లో వచ్చిన `ఎఫ్ 2` చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. 2019 సంక్రాంతికి విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్గా మూడు రెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్తో `ఎఫ్ 3` సినిమాను తెరకెక్కిస్తున్నాడు అనిల్ రావిపూడి. ఈ మూవీని అనేక వాయిదాల తర్వాత మే 27న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా సెట్లో చిత్రబృందానికి చుక్కలు చూపించింది నాగరత్తమ్మ అలియాస్ 'ఫ్రస్టేటెడ్ ఉమెన్' ఫేమ్ సునయన. అయితే ఎఫ్-3 చిత్రం రిలీజయ్యే వరకూ నీడలా వెంటాడతానని ఇదివరకు శపథం చేసిన నాగరత్తమ్మ.. అన్నట్లే చేసింది. వెంకటేష్, వరుణ్ తేజ్, రాజేంద్రప్రసాద్ ఇతర టీం సభ్యులతో ఆమె కొంతసేపు ముచ్చటించి సరదాగా గడిపింది. అనంతరం వాళ్లతో ఫొటోలు దిగింది. సినిమాకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండింగ్లో దూసుకెళ్తోంది. -
కూచిభొట్ల హంతకుడికి అమెరికా కోర్టు జీవిత ఖైదు
-
కూచిభొట్ల హంతకుడికి జీవిత ఖైదు
కన్సాస్, అమెరికా : హైదరాబాద్ టెకీ శ్రీనివాస్ కూచిభొట్ల(33) హంతకుడికి అమెరికా కోర్టు జీవిత ఖైదు విధించింది. స్నేహితుడితో కలసి బార్లో ఉన్న శ్రీనివాస్పై అమెరికా నేవీ మాజీ సైనికుడు ఆడమ్ ప్యురిన్టన్(52) ‘నా దేశం నుంచి వెళ్లిపోండి’అంటూ కాల్పులకు తెగబడిన విషయం తెల్సిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కూచిభొట్ల చికిత్సపొందుతూ ఆసుపత్రిలో ప్రాణాలు వదిలారు. శ్రీనివాస్తో పాటు బార్లో ఉన్న అలోక్ మాదసాని గాయాలతో బయటపడ్డారు. వీరిపై దాడిని అడ్డుకునేందుకు వచ్చిన ఇయాన్ గ్రిలట్ అనే వ్యక్తికి కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. శ్రీనివాస్ హత్యపై అంతర్జాతీయ స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. ఈ ఏడాది జనవరిలో కూచిభొట్ల భార్య సునయనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి స్టేట్ ఆఫ్ యూనియన్ ప్రసంగానికి ఆహ్వానించారు. ఈ వేదికపై నుంచి ట్రంప్ కూచిభొట్లపై జరిగిన దాడిని ఖండించారు. ప్యూరింగ్టన్ శిక్షపై మాట్లాడిన న్యాయవాదులు 50 ఏళ్ల తర్వాత అతనికి పెరోల్పై బయటకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ఆడమ్కు జీవిత ఖైదు విధించడాన్ని శ్రీనివాస్ భార్య సునయన ఆహ్వానించదగ్గ విషయంగా పేర్కొన్నారు. విదేశీయులపై దాడులకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించాలని అన్నారు. -
సునయన శాంతి ర్యాలీ
హూస్టన్: అమెరికాలో జాత్యాహంకార దాడిలో హత్యకు గురైన తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ కూచిభొట్ల శ్రీనివాస్ భార్య సునయన ఆయన సహోద్యోగులతో కలసి హూస్టన్లో శాంతి ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం కూచిభొట్ల 34వ పుట్టిన రోజు సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. కూచిభొట్ల పనిచేసిన కంపెనీ గార్మిన్ నుంచి హత్యకు గురైన బార్ వరకు సుమారు 3 కి.మీ మేర ఈ యాత్ర సాగింది. -
శ్రీనివాస్ కూచిభొట్లను నేనే చంపాను!
అమెరికాలోని కాన్సన్ నగరంలో ప్రవాస తెలుగు వ్యక్తి శ్రీనివాస్ కూచిభొట్లను కాల్చిచంపేసిన కేసులో నిందితుడు కోర్టులో నేరాన్ని అంగీకరించాడు. నిందితుడు ఆడం పురింటన్కు మే 4న శిక్ష ఖరారు కానుంది. పథకం ప్రకారం చేసిన ఈ హత్యకు గాను అతనికి పెరోల్ లేకుండా 50 ఏళ్ల వరకు యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశముంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ఆ దేశమంతటా విదేశీయులపై విద్వేషం వ్యక్తమైన నేపథ్యంలో కాన్సస్ నగరంలో శ్రీనివాస్ కూచిభొట్ల, అతని స్నేహితుడు అలోక్ మాదసానిపై కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. విద్యార్థి వీసా మీద అమెరికాకు వెళ్లిన శ్రీనివాస్, అలోక్ అనంతరం అక్కడి జీపీఎస్ తయారీ కంపెనీ గార్మిన్లో ఇంజినీర్లుగా పనిచేసేవారు. ఈ క్రమంలో గత ఏడాది ఫిబ్రవరి 27న ఉద్యోగాన్ని ముగించుకొని స్నేహితులిద్దరు కాన్సస్లోని ఆస్టిన్స్ బార్ అండ్ గ్రిల్లోకి మద్యం సేవించేందుకు వెళ్లారు. అక్కడ వారిని చూసిన నిందితుడు పూరింటన్ జాతివిద్వేషంతో దూషణలకు దిగాడు. ‘నా దేశం నుంచి వెళ్లిపోండి’ అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో అతన్ని బార్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా సిబ్బంది చెప్పారు. ఇలా బయటకు వెళ్లిన పూరింటన్ అనంతరం తుపాకీ తీసుకొని వచ్చి శ్రీనివాస్ కూచిభొట్ల, అలోక్పై కాల్పులు జరిపాడు. ఈ సమయంలో జోక్యం చేసుకొని.. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన సాటి శ్వేతజాతీయుడు ఇయాన్ గ్రిలాట్పై ఆ కిరాతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో శ్రీనివాస్ కూచిభొట్ల ప్రాణాలు విడువగా అలోక్, ఇయాన్ గాయాలపాలయ్యారు. ఈ ఘటన నేపథ్యంలో అమెరికాలోని ప్రవాస భారతీయుల భద్రతపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసులో తాజాగా నిందితుడు నేరాన్ని అంగీకరించిన నేపథ్యంలో శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయన దుమల స్పందించారు. ఈ కేసులో నిందితుడు నేరాన్ని ఒప్పుకున్న నేపథ్యంలో విద్వేషం ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదనే బలమైన సందేశాన్ని అందించాలని, మనమంతా పరస్పరం ప్రేమించుకోవాలిగానీ ద్వేషించుకోకూడదని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
నిన్ను చాలా మిస్సవుతున్నా: సునయన
హైదరాబాద్: ప్రవాస భారతీయుడు, ఏవియేషన్ ఇంజనీర్ శ్రీనివాస్ కూచిభొట్ల ఈ లోకంలో ఉన్నట్టయితే ఈ రోజు (గురువారం) తన 33వ పుట్టినరోజు వేడుకను చేసుకునేవారు. ఇప్పుడు శ్రీనివాస్ లేరు. అతని జ్ఞాపకాలే మిగిలున్నాయి. అమెరికాలోని కాన్సాస్లో ఓ శ్వేతిజాతి దుండగుడు జాతివివక్షతో జరిపిన కాల్పుల్లో ఆయన మరణించిన సంగతి తెలిసిందే. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, భార్య సునయన ఇంకా ఈ విషాదం నుంచి కోలుకోలేదు. సునయన కన్నీటి జ్ఞాపకాలతో భర్తను గుర్తు చేసుకుంటూ విషెష్ చెప్పారు. శ్రీనివాస్ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఫేస్బుక్లో ఓ లేఖను పోస్ట్ చేశారు. 'హ్యాపీ బర్త్ డే మై లవ్. ఇలా శుభాకాంక్షలు చెబుతున్నందుకు బాధగా ఉంది. నిన్ను చాలా మిస్సవుతున్నా' అంటూ సునయన పోస్ట్ చేశారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఇంకా విషాదం నుంచి కోలుకోలేదని సమీప బంధువు కృష్ణమోహన్ చెప్పారు. శ్రీనివాస్ బతికున్న రోజుల్లో ప్రతీ పుట్టినరోజున స్కైప్ ద్వారా వీడియో కాల్ చేసి కుటుంబ సభ్యులందరితో మాట్లాడేవారని కుటుంబ సభ్యులు గుర్తు చేసుకున్నారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకునేవారని తెలిపారు. శ్రీనివాస్ జయంతి సందర్భంగా ఈ రోజు సాయంత్రం హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. -
హైదరాబాద్కు చేరుకున్న శ్రీనివాస్ మృతదేహం
-
అశ్రు‘నయన’ ప్రశ్న
బరువెక్కిన హృదయంతో నేనీ నాలుగు ముక్కలు రాస్తున్నాను. ఫిబ్రవరి 22, 2017 నాకో కాళరాత్రి. ఆ రోజు నేను నా భర్తను, ఆత్మబంధువును, మిత్రుడిని, అత్యంత నమ్మకస్తుడిని కోల్పోయాను. అతనో స్ఫూర్తి ప్రదాత. సహాయకారి. ఒక్క నాకే కాదు... తనని ఎరిగిన వారందరికీ. ఎవరు ఎదురైనా... ముఖంపై ఎప్పుడూ చిరునవ్వు ఉండేది. ప్రతి ఒక్కరిని గౌరవించేవాడు. తనకంటే పెద్దవారి పట్ల ఇంకా గౌరవభావంతో మెలిగేవాడు. 2006 ఆగస్టులో కామన్ ఫ్రెండ్స్ ద్వారా మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. తర్వాత ‘ఆర్కుట్’ ద్వారా పలకరించుకునే వాళ్లం. తొలి పరిచయంతోనే ఇద్దరమూ ఒకరినొకరం ఇష్టపడ్డాం. మా ఇంట్లో ముగ్గురు ఆడపిల్లల్లో నేనే చిన్నదాన్ని. చాలా గారాబంగా, స్వేచ్ఛగా పెరిగాను. అమెరికాకు వెళ్లి చదువుకోవాలనే నా కలను నిజం చేసుకునేందుకు కావాల్సిన ధైర్యాన్ని నాకు శ్రీనివాసే ఇచ్చాడు. నేనీ రోజు ఇలా స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తిగా, సొంత కాళ్లపై నిలబడగల, ధైర్యమున్న మహిళగా ఎదగడానికి అమెరికాలో చదువు దోహదపడింది. గత ఏడాది మే నెల నుంచే నేను ఉద్యోగం చేయడం మొదలుపెట్టాను. నాకు ఉద్యోగం రావడంలో శ్రీనివాస్ది ముఖ్యపాత్ర. ఎల్లప్పుడూ ప్రోత్సహించేవాడు. నిరాశపడ్డప్పుడల్లా వెన్నుతట్టి ధైర్యం చెప్పేవాడు. అందుకే నాలుగేళ్ల విరామం తర్వాత నేను మళ్లీ ఉద్యోగ జీవితం మొదలుపెట్టాను. ఎన్నో కలలతో కాన్సస్కు వచ్చాం.. విమానయాన రంగంలో నిరంతరం కొత్త ఆవిష్కరణల కోసం ఆయన తపించేవాడు. రాక్వెల్ కోలిన్స్ కంపెనీలో చేరడం ద్వారా శ్రీనివాస్ తన కెరీర్ను ప్రారంభించాడు. ఫ్లయిట్ కంట్రోల్ సిస్టమ్పై పనిచేసేవాడు. ప్రాథమిక ఫ్లయిట్ కంట్రోల్ కంప్యూటర్ అభివృద్ధి కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు. రాత్రి భోజనం కోసం ఇంటికి వచ్చి, అది కాగానే ఆఫీసుకు వెళ్లిపోయిన రోజులు చాలానే ఉన్నాయి. అలా వెళ్లి మళ్లీ ఏ రెండింటికో, మూడింటికో తిరిగివచ్చేవాడు. రాక్వెల్లో ఉద్యోగంతో చాలా సంతోషంగా ఉండేవాడు. అయోవాలోని చిన్న పట్టణం సెడార్ రాపిడ్స్లో ఉండటానికి కూడా ఇష్టపడ్డాడు. అయితే నేను ఉద్యోగం సంపాదించడానికి, నా కలలను సాకారం చేసుకోవడానికి పెద్ద పట్టణానికి మారాలని మేమిద్దరం నిర్ణయించుకున్నాం. మరో ఆలోచన లేకుండా వెంటనే కాన్సస్ రాష్ట్రాన్ని ఎంచుకున్నాం. ఎన్నో కలలతో కాన్సస్లో అడుగుపెట్టాం. సొంతింటి కలను నేరవేర్చుకున్నాం. ఈ ఇంటికి శ్రీనివాస్ స్వయంగా రంగులేశాడు.. గ్యారేజీకి తలుపు బిగించాడు. ఇంటికి సంబంధించిన ఏ పనినైనా అతనెంతో ఇష్టపడి చేసేవాడు. అందులో ఎంతో సంతోషం పొందేవాడు. మా కోసం, మాకు పుట్టబోయే బిడ్డల కోసం అతను కట్టిన ఇల్లు ఇది. మాకంటూ చిన్ని కుటుంబాన్ని ఏర్పరచుకోవడానికి వేసిన తొలి అడుగు. ఇప్పుడీ కల చెదిరిపోయింది. మా ఆశలు, ఆకాంక్షలు, కలలు అన్నీ చెదిరిపోయాయి.. తన చర్యవల్ల బాధిత కుటుంబంపై పడే ప్రభావం ఏమిటనేది ఆలోచించని ఒకే ఒక వ్యక్తి మూలంగా.. పోలీసులు చెబుతుంటే నమ్మలేదు.. ఆ రోజు రాత్రి పోలీసులు మా ఇంటి తలుపులు తట్టి... ఎవరో ఆగంతకుడు తుపాకీతో నా భర్త ప్రాణాలు తీశాడని చెబుతుంటే నేను నమ్మలేకపో యా. ‘మీరు చెబుతున్నది వాస్తవమేనా? మీరు శ్రీని వాస్ను చూశారా? తనను గుర్తుపట్టడానికి నాకేదైనా ఫోటోను చూపించగలరా? మీరు మాట్లాడుతున్నది ఆరు అడుగులు రెండు అంగుళాలు ఉండే వ్యక్తి గురిం చేనా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉన్నా. అన్నిం టికీ పోలీసులు తలూపుతూ... ‘అవును’ అనే సమా ధానం ఇచ్చారు. వెంటనే డల్లాస్లో ఉంటు న్న శ్రీనివాస్ తమ్ముడికి ఫోన్ చేశా. నమ్మలేదు... నేనేదో జోక్ చేస్తున్నానని అనుకున్నాడతను. తమ ఆప్త మి త్రుడిని, అత్యంత సన్నిహితుడికి కడసారి వీడ్కోలు పలకడానికి అయోవా, మిన్నెసోటా, సెయింట్ లూ యిస్, డెన్వర్, కాలిఫోర్నియా, న్యూజెర్సీల నుంచి మి త్రులు వచ్చారు. న్యూయార్క్, నూజెర్సీలో ఉండే అతని బంధువులు వచ్చారు. ఈ మార్చి తొమ్మిదికి త ను 33వ ఏట అడుగుపెట్టేవాడు. తన కజిన్ ఎంగేజ్ మెంట్ కోసం న్యూజెర్సీకి విమానంలో వెళ్లొద్దామని మేము ప్లాన్ చేసుకున్నాం. ఈ ట్రిప్ కొరకు వీకెండ్లో షాపింగ్ చేయాలని కూడా అనుకున్నాం. కానీ జరిగింది మరొకటి. నేను భారత్కు ప్రయాణమయ్యాను. శవపేటికలో తనని తీసుకొని.. ఇమిగ్రేషన్పై ఆందోళన చెందేవాడు.. ఆయనకు చుట్టుపక్కల జరుగుతున్న విషయాలపై ఆసక్తి ఉండేది. రోజూ టీవీలో వార్తలు చూడటం, పత్రికలు చదవడం చేసేవాడు. భారత్ గురించి, నరేంద్ర మోదీ గురించి గర్వంగా ఫీలయ్యేవాడు. దేశానికి సమర్థ నాయకత్వం లభించిందనే భావనతో ఉండేవాడు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విదేశాల్లో ఉన్న భారతీయులు కష్టాల్లో ఉంటే తక్షణం స్పందించే తీరు తనకు నచ్చేది. అలా సహాయం పొందే వాళ్లలో తాను ఒకడినవుతానని ఊహించి ఉండడు. కష్టకాలంలో మాకు సహాయపడ్డందుకు మరోసారి ధన్యవాదాలు మేడమ్. మిమ్మల్ని, మోదీ గారిని కలిసి మా ఇరువురి తరఫున కృతజ్ఞతలు తెలపాలని కోరుకుంటున్నాను. ఇమిగ్రేషన్ విధానం, చట్టాల గురించి ఆందోళన చెందేవాడు. ఇంటర్నెట్లో ఈ అంశాలను చాలా ఆసక్తితో చదివేవాడు. అమెరికా శాశ్వత నివాస కార్డు కోసం దరఖాస్తు చేసి ఏళ్లు గడిచిపోతోంది.. ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలో అని అప్పుడప్పుడు అనేవాడు. హెచ్–1బీ వీసాలపై వచ్చిన వారి జీవిత భాగస్వాములు ఉద్యోగాలు చేసుకోవడానికి వీలుకల్పించే హెచ్4 ఈఏడీ రూల్ చట్టసభల ఆమోదం పొందినపుడు ఎంత సంతోషించాడో. ‘నానీ... నువ్వు ఇక ఉద్యోగం చేయవచ్చురా. మనకు డబ్బు అవసరం ఉందని కాదు. నువ్వు నీ కలలను సాకారం చేసుకునేందుకు... నీ తల్లిదండ్రులు గర్వపడేలా చేయడానికి’ అని అన్నాడు. తక్కువ ఆదాయంతో ముగ్గురు మగపిల్లలను పెంచడానికి వాళ్ల తండ్రి బాగా కష్టపడ్డాడని రోజుకు ఒకసారైనా గుర్తు చేసుకునేవాడు. తల్లిదండ్రులకు ఎంతో చేయాల్సి ఉందనేవాడు. ‘నేనొకటి కచ్చితంగా చెప్పగలను శ్రీను... నువ్వు మీ తల్లిదండ్రులు గర్వపడేలా ఎదిగావు. కానీ నువ్విలా మమ్నల్ని విడిచి వెళ్లకుండా ఉండాల్సింది’. ముగ్గురు పిల్లలో శ్రీను రెండోవాడు. తనకు తమ్ముడంటే ఎంతో ఇష్టం. చిన్నప్పుడు ముగ్గురూ బాగా అల్లరి చేసేవారంట. వెళ్లిపోదామా అని అడిగేదాన్ని.. ఎవరైనా హత్యకు గురయ్యారనే వార్త విన్నపుడల్లా ఇక్కడి నుంచి వెళ్లిపోదామా అని అడిగేదాన్ని. ‘మన ఆలోచనలు మంచిగా ఉంటే, మనం సత్ప్రవర్తనతో నడుచుకుంటే... మనకు మంచే జరుగుతుందని, మనకేం కాదు అని ప్రతిసారీ దగ్గరికి తీసుకొని ధైర్యం చెప్పేవాడు. ఇప్పుడు ఆ ఆత్మీయ ఆలింగనం లేదు. నాకిక మునుపటిలా నిద్ర రాదేమో! ఎలాంటి ఆందోళన, భయం లేకుండా నేను హాయిగా నిద్రపోయేది ఒక్క నీ ఎదపైనే..! ఈ కష్టం ఎవరికీ రావొద్దు... గార్మిన్ సీఈఓవోకు, శ్రీను సహచరులకు, ఓలేత్ నగర మేయర్కు, కష్టకాలంలో అండగా నిలబడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నేను పనిచేస్తున్న ఇన్టచ్ సొల్యూషన్స్ సీఈవో ఫ్రాంక్కు ధన్యవాదాలు. ఎంతకాలమైనా సెలవు తీసుకోమని, ఎప్పుడొచ్చినా... నా ఉద్యోగం నాకు ఉంటుందని చెప్పారాయన. నేను అమెరికాలో కెరీర్ను నిర్మించుకోవాలనేది నా శ్రీను కల. దానిని నేరవేర్చడానికి నేను అమెరికా తిరిగి రావాలి. నా భర్తను కాపాడటానికి తనవంతు ప్రయత్నం చేసి కాల్పుల్లో గాయపడ్డ ఇయాన్ గ్రిలాట్ త్వరగా కోలుకోవాలని ఆక్షాంక్షిస్తున్నాను. ఓలేత్కు తిరిగివచ్చాక మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలని కోరుకుంటున్నాను. గ్రిలాట్ సాటి మనిషిని కాపాడటానికి మీరు చేసిన ప్రయత్నం, మీరు ప్రదర్శించిన మానవత్వం... ప్రేమపై, ప్రేమను పంచడంపై నాలో ఉన్న విశ్వాసాన్ని సజీవంగా ఉంచాయి. ట్వీట్ల ద్వారా మద్దతు పలికిన సత్య నాదెళ్ల, కమలా హారిస్లకు కృతజ్ఞతలు. మార్క్ జుకెర్బర్గ్, సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ లాంటి వారందరికీ నా విన్నపం ఒకటే... మానవ హక్కులకు మీ మద్దతును వీలైనంతగా జనంలోకి తీసుకెళ్లండి. ద్వేషాన్ని ఆపాలి... ప్రేమను వ్యాపింపజేయాలి. ఈ రోజు గార్మిన్ ఉద్యోగికి జరిగింది... రేపు మీ ఉద్యోగుల్లో ఒకరు కావొచ్చు. మా కుటుంబానికి వచ్చిన ఈ కష్టం మరెవరికీ రాకూడదని నేను కోరుకుంటున్నాను. శ్రీనివాస్ పార్థివదేహం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటికి చేరేలా చూసిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. అమితాబ్బచ్చన్ సర్, షారూక్ ఖాన్ సర్... మేము మీకు వీరాభిమానులం. ప్రేమను పంచాలనే గట్టి సందేశాన్ని అందరికీ చేరవేయడానికి నాకు మీ మద్దతు కావాలి. నేను అదే ప్రశ్న మళ్లీ అడుగుతాను. చర్మం రంగును బట్టి ఒక మనిషి మంచివాడో, చెడ్డవాడో ఎవరైనా ఎలా నిర్ణయిస్తారు? ఇలాంటి ఘటనలు జరిగినపుడు కొంతకాలం వర్ణ, జాతి వివక్షలపై చర్చ జరుగుతుంది. కొన్ని వారాల తర్వాత జనం అంతా మర్చిపోతారు. ప్రజల మనసుల్లోని ద్వేషాన్ని రూపుమాపడానికి నిరంతర పోరాటం జరగాలి. ద్వేషపూరిత దాడులను ఆపడానికి ప్రభుత్వం ఏం చేయబోతోంది? ప్రతి వలసదారుడి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. మేమీ ప్రాంతానికి చెందిన వాళ్లమేనా? చివరగా దీనికి సమాధానం కావాలి. ఇది మేం కలలుగన్న దేశమేనా? పిల్లలు, కుటుంబంతో కలసి నివసించడానికి ఇది సురక్షితమేనా? – సునయన దుమాలా నువ్వు ఎప్పటికీ నా వాడివే.. కాన్సస్ ఎయిర్పోర్ట్లో ఎంతోమంది నన్ను గుర్తు పట్టారు. ఆలింగనం చేసుకొని ఓదార్చారు. నా జీవిత పర మార్థాన్నే మార్చేశావని ఓ డెర్మటాలజిస్టు అంది. ప్రేమను పంచే పోరాటంలో అది తొలి విజయమేమో. నీ గురించి.. చుట్టుపక్కల ఉన్న వారికి నువ్వు పంచిన ప్రేమ గురించి ఓ పుస్తకం రాసినా సరిపోదేమో. ఒకే సాయంత్రంతో అంతా మారిపోయింది. భార్య నుంచి వితంతువును అయిపోయాను. ఈ నిజాన్ని జీర్ణం చేసుకోవడానికి నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. శ్రీను... నా ప్రేమ, నీవు లేని వెలితిని నేనెలా పూడ్చుకోగలనో తెలియదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను... ఎప్పటికీ నీ ఆశలను, ఆశయాలను ఓడిపోనివ్వను. ఐ లవ్ యూ, నువ్వు ఎప్పటికీ నా వాడివే. టీ తాగడానికి ఇంటికి రమ్మని పిలిచినపుడు నీవు వచ్చుంటే బాగుండని అనుకుంటున్నాను. నాలో ఎన్నో సమాధానం లేని ప్రశ్నలున్నాయి. వాటికి నువ్వు జవాబివ్వాలని కోరుకుంటు న్నాను. అవతలి ప్రపంచంలో నీవున్న చోటికి నేను వచ్చినప్పుడే నా ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. ఆ రోజు ఎప్పుడొస్తుందో తెలియదు. నాకో బిడ్డ ఉంటే తనలో శ్రీనును చూసుకునేదాన్ని.. ఆరేళ్ల స్నేహం తర్వాత మేము పెళ్లి చేసుకున్నాం. అందత తేలికగా ఏమీ జరగలేదు. వాళ్ల తల్లిదండ్రులతో పాటు మా అమ్మానాన్నలను కూడా అతనే ఒప్పించాల్సి వచ్చింది. మీ ప్రియమైన కూతురిని బాగా చూసుకోగలనని, తగినవాడినని చెప్పి పెళ్లికి ఒప్పించడానికి పలుమార్లు మా కుటుంబీకులను కలిశాడు. అడిగిన ప్రశ్నలన్నింటికీ ముఖంపై చిరునవ్వుతో సమాధానాలిచ్చాడు. ఆయన సమ్మోహన శక్తి ఎలాంటిదంటే... అనతికాలంలోనే మా కుటుంబంలో అందరికీ అత్యంత ఆప్తుడైపో యాడు. అలాంటి వ్యక్తి ఇక లేడంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. చిన్నచిన్న వాటిల్లోనే సంతోషం పొందేవాడు. టీవీ చూడటం ఆయనకు అత్యంత ఇష్టమైన కాలక్షేపం. కుటుంబానికి ప్రాధాన్యమిచ్చే వ్యక్తి. ఇంట్లో వండినవి తినడమే ఆయనకిష్టం. ప్రతిరోజు రాత్రి... మరుసటి రోజు లంచ్కు మాకిద్దరికీ బాక్స్లను సిద్ధం చేసేదాన్ని. బాక్స్ సర్దుకోవడం అస్సలు ఇష్టముండేది కాదతనికి. ఎందుకలా... అని అడిగితే సరదాగా ఉండే వివరణలు ఇచ్చేవాడు. నా లంచ్ బాక్స్ నేనే సర్దుకుంటే... ఏం తినబోతున్నానో ముందే తెలుస్తుంది. అదే నువ్వు ప్యాక్ చేశావనుకో... ఈరోజు లంచ్లో ఏముందో అనే ఆసక్తి నాకుంటుంది అనేవాడు. ఆప్యాయంగా భోజనం పెట్టిన వారినీ ‘అన్నదాతా సుఖీభవ’ అని మనసారా దీవించేవాడు. చాలామంది మిత్రులకు శ్రీనివాస్ నుంచే ఈ అలవాటు వచ్చింది. లంచ్లో ఆర్నబ్ గోస్వామి షో ఎంజాయ్ చేసేవాడు. మళ్లీ ఎప్పుడు టీవీ తెరపై కనిపిస్తాడా? అని ఎదురుచూస్తుండే వాడు. పిల్లలంటే తనకెంతో ఇష్టం. పిల్లలను కనాలనే ఆలోచనతో ఉన్నాం. కొన్ని వారాల కిందటే డాక్టర్ను కలిశాం కూడా. ‘నానీ (తను నన్నలా పిలిచేవాడు)... కృత్రిమ గర్భధారణకు వెళ్లాల్సి వస్తే... దానికోసం డబ్బు దాచాలిరా..’ అని అన్నాడు. తను నాతో పంచుకొన్న కొన్ని చివరి ఆలోచనల్లో ఇదొకటి. మా ఈ కల చెదిరిపోయిందనేది ఇప్పుడిప్పుడే జీర్ణమవుతోంది... అందుకే రాస్తున్నాను. మాకో బిడ్డ ఉంటే... తనలోనైనా శ్రీనివాస్ను చూసుకునే దాన్ని. శ్రీనులా పెంచేదాన్ని. - ఫేస్బుక్లో తన ఆవేదనకు అక్షరరూపమిచ్చిన సునయన (అమెరికాలోని కాన్సస్లో ఫిబ్రవరి 22న జరిగిన ద్వేషపూరిత కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన కూచిభొట్ల శ్రీనివాస్ అర్ధాంగి సునయన 28–02–2017న తన ఫేస్బుక్ అకౌంట్లో చేసిన పోస్ట్) -
శ్రీనివాస్కు కన్నీటి వీడ్కోలు..
అశ్రునయనాల మధ్య శ్రీనివాస్ కూచిభొట్ల అంత్యక్రియలు ⇒ రాయదుర్గం శ్మశానవాటికలో చితికి నిప్పంటించిన తండ్రి ⇒ ట్రంప్ వ్యతిరేక నినాదాలతో మారుమోగిన మహాప్రస్థానం ⇒ శ్రీనివాస్ నివాసానికి భారీగా తరలివచ్చిన బంధువులు, స్నేహితులు ⇒ అంత్యక్రియల్లో పాల్గొన్న దత్తాత్రేయ, చుక్కా రామయ్య తదితరులు హైదరాబాద్: అమెరికాలో జాతి విద్వేష తూటాకు బలైన శ్రీనివాస్ కూచిభొట్ల అంత్యక్రియలు రాయదుర్గంలోని మహాప్రస్థానం శ్మశానవాటిక లో అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. మల్లం పేట గ్రామ పరిధిలోని ప్రణీత్ నేచర్స్ బౌంటీ లోని నివాసం నుంచి ప్రత్యేక వాహనంలో శ్రీని వాస్ భౌతికకాయాన్ని ఊరేగింపుగా శ్మశానవాటి కకు తీసుకొచ్చారు. శ్రీనివాస్ తండ్రి మధు సూదన్రావు శాస్త్రోక్తంగా కర్మకాండలను నిర్వ హించారు. శ్రీనివాస్ చితికి నిప్పంటిస్తూ.. ఆయన కన్నీటిపర్యంతమైన తీరు అందరినీ కల చివేసింది. శ్రీనివాస్ అంత్యక్రియల్లో బంధువు లు, స్నేహితులు, వివిధ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతకుముందు శ్మశాన వాటికకు చేరుకున్న శ్రీనివాస్ భార్య సునయన, తల్లి వర్ధినిని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, విద్యా వేత్త చుక్కా రామయ్య, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సినీనటులు రాజశేఖర్, జీవిత దంపతులు ఓదార్చారు. ఈ క్రమంలో తమ కుమారుడిని అన్యా యంగా చంపేశారని తల్లి రోదించడం అందరినీ కంట తడిపెట్టించింది. ఇప్పటికైనా రక్షణ కల్పించాలి సోమవారం రాత్రి 11:30 గంటల సమయంలో శ్రీనివాస్ భౌతికకాయం ఆయన స్వగృహానికి చేరుకోగానే అక్కడి వాతావరణం ఒక్కసారిగా బరువెక్కింది. కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బోరున విలపిస్తున్న శ్రీనివాస్ తల్లి వర్ధిని, భార్య సునయనలను ఆపడం ఎవరితరం కాలేదు. ‘పిల్లలిద్దరూ విదేశాల్లో స్థిరపడ్డారని ఆనందంగా ఉన్న సమయంలో ఈ ఘోరం జరిగింది. ఏదైనా ఇబ్బంది ఉంటే తిరిగి వచ్చేయాలని శ్రీనివాస్కి చెప్పేదానిని. అలాంటివేమీ లేవని శ్రీనివాస్ చెప్తూ ఉండేవాడు. ఇప్పటికైనా అమెరికాలో ఉండే భారతీయులకు రక్షణ కల్పించాలని కోరు తున్నా’ అంటూ వర్ధిని బోరుమన్నారు. మంగళ వారం తెల్లవారుజాము నుంచి ఉదయం 10.30 వరకు శ్రీనివాస్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శ నార్థం ఉంచారు. అనంతరం శాస్త్రోక్తంగా కార్యక్రమాలు నిర్వహించారు. కుటుంబ సభ్యు లు, బంధువులు, స్నేహితులు అశ్రునయనాల మధ్య మధ్యాహ్నం 12 గంటలకు శ్రీనివాస్ పార్థివదేహాన్ని అంతిమయాత్ర రథంలో మహాప్రస్థానానికి తరలించారు. భద్రతకు చర్యలు తీసుకుంటాం: దత్తాత్రేయ అమెరికాలో భారతీయుల భద్రతకు కేంద్రం అన్ని చర్యలూ తీసుకుంటుందని దత్తాత్రేయ చెప్పారు. రాయదుర్గంలోని మహాప్రస్థానం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఈ విషయంలో జోక్యం చేసుకుని అమెరికాలోని భారత ఎంబసీ, ఇక్కడి అమెరికా ఎంబసీ అధికారులతో టచ్లో ఉన్నారని చెప్పారు. అమెరికా ప్రభుత్వంతోనూ మాట్లాడి భారతీయుల భద్రతకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల్లో కొంత భయాందోళన ఉన్నా ప్రభుత్వ చర్యలతో వారిలో భరోసా పెరుగుతోందన్నారు. అమెరికా అభివృద్ధిలో భారతీయుల భాగస్వామ్యం ఎంతో ఉందని చుక్కా రామయ్య పేర్కొన్నారు. గ్లోబలైజేషన్లో విజ్ఞానవంతులకు ఎక్కడైనా ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. శ్రీనివాస్ లాంటి అమాయకులు ఇలా బలి కాకుండా కేంద్రం, అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకోవా లన్నారు. శ్రీనివాస్ హత్యను అందరూ ఖండిం చాలని, ఈ హత్య తర్వాత ప్రధాని మోదీ తగిన చర్యలు చేపట్టాలని అందరూ ఎదురు చూస్తున్నా రని జీవిత, రాజశేఖర్ చెప్పారు. భారతీయులు ఎక్కడున్నా వారి భద్రతకు ప్రభుత్వ భరోసా ఉండేలా చర్యలు ఉండాలన్నారు. పలువురు ప్రముఖుల పరామర్శ.. మంగళవారం ఉదయం శ్రీనివాస్ నివాసానికి పలువురు ప్రముఖులు వచ్చి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించి.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు, ఎమ్మెల్యే కిషన్రెడ్డి, సీపీఐ జాతీయ నేత నారాయణ, వైఎస్సార్సీపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తడక జగదీశ్వర్గుప్తా, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు, బీజేపీ సీనియర్ నేత మల్లారెడ్డి నివాళులర్పించారు. ట్రంప్ డౌన్డౌన్ నినాదాలు శ్రీనివాస్ అంత్యక్రియల్లో పాల్గొనేం దుకు వచ్చిన బంధువులు, స్నేహితులు, వివిధ పార్టీలకు చెంది న వారంతా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు వ్యతి రేకంగా నినాదాలు చేయడంతో మహాప్రస్థానం శ్మశానవాటిక మారుమోగింది. ‘ట్రంప్.. డౌన్ డౌన్’.. ‘భారత్ మాతాకీ జై’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కొందరు ట్రంప్కు వ్యతిరేకంగా, హత్యను ఖండిస్తూ ప్లకార్డులను పట్టుకుని అంత్యక్రియలకు హాజరయ్యారు. నచ్చిన సూట్లోనే.. శ్రీనివాస్కు ఓ సూట్ అంటే చాలా ఇష్టం. శ్రీనివాస్ భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు అమెరికా నుంచి అతనికి అత్యంత ఇష్టమైన సూట్లోనే తీసుకుచ్చారు. శ్రీనివాస్ సాయిబాబా భక్తుడు కావడంతో బాబా కండువాను పార్థివదేహంపై కప్పారు. -
అమెరికా కంపెనీ పెద్దమనసు
అమెరికాలో దారుణ హత్యకు గురైన తెలుగు ఇంజినీర్ కూచిభొట్ల శ్రీనివాస్ భార్య సునయనకు అండగా నిలబడేందుకు ఆయన పనిచేసే కంపెనీ ముందుకొచ్చింది. శ్రీనివాస్ హెచ్1బి వీసాతో అమెరికాలో పనిచేసేందుకు వెళ్లారు. అక్కడ గార్మిన్ అనే కంపెనీలో ఆయన పనిచేసేవారు. అయితే ఇప్పుడు ఆయన లేకపోవడంతో.. ఆయన వద్దకు వెళ్లేందుకు వీసా తీసుకుని ఉంటున్న సునయన శ్రీనివాస్ అంత్యక్రియల తర్వాత మళ్లీ అమెరికా వెళ్లేందుకు వీలుండదు. ఈ విషయాన్ని ఆమె అమెరికాలో ఉన్నప్పుడే నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పి.. గార్మిన్ కంపెనీ తాను మళ్లీ అమెరికా వచ్చేందుకు, ఇక్కడ తాను శ్రీనివాస్ కలలను నెరవేర్చేందుకు తాను ఎంచుకున్న రంగంలో విజయవంతం అయ్యేందుకు సాయపడాలని కోరారు. శ్రీనివాస్కు హెచ్1బి వీసా ఉండగా, సునయనకు హెచ్4 వీసా ఉంది. దాని ఆధారంగా ఆమె అమెరికాలో ఉండేందుకు, పనిచేసేందుకు వీలుంటుంది. ఇప్పుడు సునయన అమెరికా వచ్చేందుకు వీలుగా తగిన వీసా సిద్ధం చేసేందుకు గార్మిన్ న్యాయ ప్రతినిధులు, వాళ్ల ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆమెకు ఉచితంగా న్యాయసహాయం అందించేందుకు బ్రయాన్ కేవ్ అనే న్యాయసంస్థ సహా పలు సంస్థలు ముందుకు వచ్చినట్లు గార్మిన్ హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ లారీ మినార్డ్ చెప్పారు. శ్రీనివాస్ సహా భారతదేశం, మరికొన్ని ఇతర దేశాలకు చెందిన ఉద్యోగులు తమ కంపెనీలో పనిచేసేందుకు వీలుగా గార్మిన్ కంపెనీ స్పాన్సర్షిప్ అందించింది. ఇప్పుడు సునయనకు కూడా తాము అన్ని రకాలుగా సాయం చేస్తామని, ఆమె అమెరికాలోనే ఉండి పని చేసుకోడానికి అవకాశం కల్పిస్తామని గార్మిన్ ప్రతినిధులు చెప్పారు. అమెరికాలో జాతివిద్వేషంపై మరిన్ని కథనాలు చూడండి... హైదరాబాద్కు చేరుకున్న శ్రీనివాస్ మృతదేహం ‘కాలుస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపించింది’ అమెరికాలో ప్రమాదం ఇలా తప్పించుకోండి అమెరికాలో భారతీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అమెరికాలో జాతి విద్వేష కాల్పులు విద్వేషపు తూటా! మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా? భారతీయుల రక్షణకు కట్టుబడి ఉండాలి కాల్పులపై శ్వేతసౌదం ఏం చెబుతుందో? నా భర్త మరణానికి సమాధానం చెప్పాలి ‘తరిమేయండి.. లేదా తలలో బుల్లెట్లు దించండి’ -
హైదరాబాద్కు చేరుకున్న శ్రీనివాస్ మృతదేహం
-
నా భర్త మరణానికి సమాధానం చెప్పాలి
► ట్రంప్ సర్కారును ప్రశ్నించిన మృతుడు శ్రీనివాస్ భార్య ► మైనారిటీల భద్రతకు ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ ► విచారణ వేగవంతానికి భారత దౌత్య కార్యాలయం డిమాండ్ ► ఆసుపత్రినుంచి అలోక్ రెడ్డి డిశ్చార్జ్ ► కోలుకుంటున్న మరో బాధితుడు హూస్టన్ : అమెరికాలోని కాన్సస్లో బుధవారం రాత్రి జరిగిన కాల్పుల ఘటనకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలని ఈ ఘటనలో మృతిచెందిన కూచిభొట్ల శ్రీనివాస్ భార్య సునయన డిమాండ్ చేశారు. అమెరికాలో మైనారిటీలపై వివక్షాపూరితమైన దాడులు ఆపేందుకు సర్కార్ ఏం చేస్తుందో చెప్పాలన్నారు. ‘కొంతకాలంగా అమెరికాలో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే మేం ఇక్కడి వారమా? కాదా? అని ఆశ్చర్యం కలుగుతోంది’ అని సునయన తెలిపారు. శ్రీనివాస్ ఉద్యోగం చేస్తున్న గార్మిన్ కంపెనీ శనివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సునయన మాట్లాడుతూ.. ‘ఇక్కడుండే ప్రతి ఒక్కరూ దేశానికి చెడు తలపెట్టరు. ఇక్కడ మా కుటుంబం బతకాలా? వద్దా? అనే అనుమానం వస్తోంది. విదేశీయులపై అమెరికాలో దాడుల వార్తలను చూసి బాధకలిగేది. మనం అమెరికాలో భద్రంగానే ఉంటామా? అనే అనుమానం వచ్చేది. కానీ మంచోళ్లకు మంచే జరుగుతుందని నా భర్త చెప్పేవారు. మంచిగా ఆలోచించాలి. మంచి పనులే చేయాలి. అప్పుడు మంచే జరుగుతుందని చెప్పేవారు. పని ఒత్తిడి నుంచి కాస్త రిలాక్స్ అవుదామని ఆయన బార్కు వెళ్లారు. అక్కడికొచ్చిన వ్యక్తి జాత్యహంకారంగా మాట్లాడుతున్నా.. శ్రీనివాస్ పట్టించుకోలేదు. బయటకు వెళ్లొచ్చిన ఆ వ్యక్తి ఓ మంచి మనిషిని, అందరినీ ప్రేమించే వ్యక్తిని పొట్టన పెట్టుకున్నాడు. మా ఇద్దరి కుటుంబాల్లో విషాదం నింపాడు. శ్రీనివాస్ వాళ్ల అమ్మకు ఇప్పుడేమని సమాధానం చెప్పాలి’ అని సునయన ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఆయనకు ఇలాంటి చావొస్తుందనుకోలేదు. మరో రెండు వారాల్లో ఆయన 33వ పుట్టినరోజు జరుపుకోవాలి. ఆయన అమెరికాను బాగా ప్రేమించారు. చాలా సార్లు వేరే దేశానికి వెళ్లిపోదామా అని అడిగాను. కానీ వేచి చూద్దామనే ఆయన సమాధానమిచ్చారు. ఇప్పుడాయన మృతికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలని’ అని సునయన డిమాండ్ చేశారు. ‘మా ఆయన్ను పొట్టన పెట్టుకున్న వ్యక్తి వేరే బార్కు వెళ్లి ఇద్దరు ముస్లిం యువకులను చంపానని గర్వంగా చెప్పుకున్నాడని తెలిసింది. శరీరం రంగు చూసి ఓ వ్యక్తి ముస్లిమా? హిందువా? క్రిస్టియనా అని ఎలా గుర్తిస్తారు?’ అని ఆమె ప్రశ్నించారు. (చదవండి: విద్వేషపు తూటా!) హైదరాబాద్లో అంత్యక్రియల కోసం భారత్కు బయలుదేరనున్న సునయన.. తన భర్త కలలను సాకారం చేసేందుకు కన్సాస్కు తిరిగి వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. ‘ఏ రంగంలోనైనా విజయం సాధించగలననే నమ్మకం నాకుంది. అయితే నా నిర్ణయాన్ని చెప్పేముందు అమెరికా ప్రభుత్వాన్ని అడుగుతున్నా.. ఇలాంటి విద్వేషపూరిత ఘటనలను ఆపేందుకు మీరేం చేస్తారో చెప్పండి’ అని ఆమె డిమాండ్ చేశారు. 2005లో కూచిభొట్ల అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్–ఎల్ పాసో (యూటీఈపీ)లో పీజీలో చేరేందుకు వచ్చారు. ఇదే యూనివర్సిటీలో చేరేందుకు ప్రయత్నించిన సునయనకు శ్రీనివాస్తో ఆన్ లైన్ లో స్నేహం కుదిరింది. 2007లో అమెరికా వచ్చిన సునయన మినసోటాలోని సెయింట్ క్లౌడ్ స్టేట్ యునివర్సిటీలో చేరారు. ఐదేళ్ల తర్వాత 2012లో వీరిద్దరూ వివాహం చేసుకుని న్యూ ఒలేత్లో ఇంటిని కొనుక్కున్నారు. కాగా, గార్మిన్ కంపెనీ ఆవరణలో శ్రీనివాస్కు ఉద్యోగులు ఉద్వేగపూరిత వాతావరణంలో ఘనంగా నివాళులర్పించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అలోక్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రంగంలోకి భారత కాన్సులేట్ కాన్సస్ ఘటనను భారత దౌత్యకార్యాలయం తీవ్రంగా ఖండించింది. ఈ కేసు విచారణ వేగంగా జరపాలంటూ అమెరికా సర్కారుకు లేఖ రాసింది. హూస్టన్ భారత కాన్సులేట్ జనరల్ అనుపమ్ రాయ్ పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కుటుంబానికి అవసరమైన సాయాన్ని ఆయన అందిస్తున్నారు. డిప్యూటీ కాన్సుల్ ఆర్డీ జోషి, వైస్ కాన్సుల్ హర్పాల్ సింగ్లు ఈ ఘటనలో గాయపడ్డ అలోక్ రెడ్డి కుటుంబాన్ని, భయంతో ఉన్న స్థానిక భారత సంతతి ప్రజలను కలిసి ధైర్యాన్నిచ్చారు. కాగా, శనివారం అలోక్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అమెరికన్ ఇయాన్ గ్రిలాట్ (24) ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని కాన్సస్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్య నాదెళ్ల కన్సాస్లో భారతీయులపై దాడిని ఖండించారు. మతపరమైన దాడులు, హింస సరికాదని బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ట్వీటర్లో పేర్కొన్నారు. విద్వేష రాజకీయాలకు తమ మద్దతుండదని పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ తెలిపారు. ఖండించిన అమెరికన్ చట్టసభ్యులు కాన్సస్ కాల్పుల ఘటనను అమెరికన్ చట్టసభ్యులు బహిరంగంగా ఖండించారు. దేశంలో ఇలాంటి హింసకు తావులేదని ముక్తకంఠంతో వెల్లడించారు. ‘విద్వేషాన్ని ఎట్టిపరిస్థితుల్లో సహించం. ఈ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది’ అని కాలిఫోర్నియా సెనేటర్ కమలా హ్యారీస్ తెలిపారు. ‘అమెరికాలో ఇలాంటి హింసను ఒప్పుకోం’ అని కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ అన్నారు. ‘ఇది ఇద్దరు వ్యక్తులపై జరిగిన దాడి మాత్రమే కాదు. భారతీయులు, భారత్–అమెరికన్ల భద్రతను కట్టుదిట్టం చేయాలి’ అని డెమొక్రటిక్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి తెలిపారు. పలువురు అమెరికన్ చట్టసభ్యులు దాడులపై నిరసన తెలిపారు. బార్లో ఏం జరిగింది? అమెరికాలోని కాన్సస్లోని ఆస్టిన్ బార్లో ఇద్దరు భారతీయులపై కాల్పుల ఘటనను.. బాధితుడు అలోక్ రెడ్డి న్యూయార్క్ టైమ్స్కు ఇచ్చిన టెలిఫోన్ ఇంటర్యూలో వెల్లడించారు. ‘బార్లో నేను (అలోక్) కూచిభొట్ల శ్రీనివాస్ కూర్చున్నాం. మాకు సమీపంలోనే పురింటన్ (కాల్పులకు పాల్పడిన వ్యక్తి) కూర్చున్నాడు. ఏ వీసాలపై వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు? అక్రమంగా ఇక్కడ ఉంటున్నారా? అని పురింటన్ అడిగాడు. దీనికి మేం స్పందించలేదు. చాలా మంది ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తుంటారు అని లైట్ తీసుకున్నాం. కానీ మమ్మల్ని దూషిస్తూ.. వీరు అమెరికన్లు కారు అని గట్టి గట్టిగా అరుస్తూనే ఉన్నాడు. అంతటితో ఆగకుండా బార్ మేనేజర్ను తీసుకొచ్చేందుకు లోపలకు వెళ్లాడు. ఆ తర్వాత ఏమైందేమో బయటకు వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత గన్ పట్టుకుని కోపంగా వచ్చిన పురింటన్ మాపై కాల్పులు జరిపాడు. కూచిభోట్ల అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. నాకు గాయాలయ్యాయి. అక్కడే ఉన్న ఓ 24 ఏళ్ల అమెరికన్ యువకుడు పురింటన్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు.అతన్నీ పురింటన్ కాల్చాడు’ అని అలోక్ రెడ్డి వెల్లడించారు. ట్రంప్ వ్యాఖ్యలతో సంబంధం లేదు అమెరికా అధ్యక్షుడు వలసలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే భారతీయ ఇంజనీర్ హత్యకు కారణమని వస్తున్న వార్తలను వైట్హౌస్ ఖండించింది. ‘ఇలాంటి ఘటనలు దురదృష్టకరం. మేం దీన్ని ఖండిస్తున్నాం. ట్రంప్ వ్యాఖ్యలకు ఈ ఘటనకు సంబంధమే లేదు’ అని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ వెల్లడించారు. అధ్యక్షుడి వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా లేవని దీన్ని తప్పుగా చూపిస్తున్నారన్నారు. కాగా, ఈ ఘట నపై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ గ్యుటెరస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, కాన్సస్ కాల్పులకు కారకుడు పురింటోన్ పై ఫస్ట్ డిగ్రీ హత్యకేసు నమోదు చేసినట్లు జాన్సన్ కౌంటీ జిల్లా అటార్నీ స్టీఫెన్ హోవే వెల్లడించారు. ఈ ఘటన విద్వేషపూరిత నేరమా? కాదా? అనే విషయంలో ఎఫ్బీఐ విచారణ ప్రారంభమైందన్నారు. కోల్కతాలో శ్రీనివాస్కు నివాళులు అర్పిస్తున్న మేయర్ సావర్ ఛటర్జీ