breaking news
Tanush Kotian
-
IND vs SA: సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్
సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో ఉత్కంఠ పోరులో భారత్- ‘ఎ’ జట్టు విజయం సాధించింది. టెయిలెండర్లు అన్షుల్ కాంబోజ్ (37 నాటౌట్), మానవ్ సుతార్ (Manav Suthar- 20 నాటౌట్) యాభైకి పరుగుల భాగస్వామ్యంతో రాణించి జట్టును గట్టెక్కించారు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన కారణంగా.. అనధికారిక తొలి టెస్టులో భారత్.. సౌతాఫ్రికాను మూడు వికెట్ల తేడాతో చిత్తు చేసింది.ఇంగ్లండ్ పర్యటనలో గాయపడ్డ టీమిండియా స్టార్ రిషభ్ పంత్.. సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టు సిరీస్కు ముందు భారత్-‘ఎ’ జట్టు కెప్టెన్గా తిరిగి మైదానంలో అడుగుపెట్టాడు. పంత్ సారథ్యంలో భారత్- సౌతాఫ్రికా- ‘ఎ’ జట్టుతో రెండు అనధికారిక టెస్టు సిరీస్లు ఆడుతోంది. ఇందులో భాగంగా బెంగళూరు వేదికగా గురువారం తొలి అనధికారిక టెస్టు మొదలైంది.తనుశ్ కొటియాన్కు నాలుగు వికెట్లుటాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 309 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ జొర్డాన్ హెర్మాన్ (71), జుబేర్ హంజా (66), రుబిన్ హెర్మాన్ (66), టియాన్ వాన్ వారెన్ (46) రాణించారు.234 పరుగులకే ఆలౌట్భారత బౌలర్లలో తనుశ్ కొటియాన్ నాలుగు వికెట్లు దక్కించుకోగా.. గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్ రెండేసి వికెట్లు కూల్చారు. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్.. 234 పరుగులకే ఆలౌట్ అయింది.ఓపెనర్లు ఆయుశ్ మాత్రే (65), సాయి సుదర్శన్ (32)లతో పాటు ఆయుశ్ బదోని (38) రాణించగా.. కెప్టెన్ పంత్ (17) సహా దేవదత్ పడిక్కల్ (6), రజత్ పాటిదార్ (19) విఫలమయ్యారు. తనుశ్ కొటియాన్ 13 పరుగులు చేయగా.. టెయిలెండర్లు అన్షుల్ 5, మావన్ 4, ఖలీల్ 4 పరుగులే చేశారు.ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సౌతాఫ్రికా భారత బౌలర్ల ధాటికి 199 పరుగులకే కుప్పకూలింది. తనుశ్ మరోసారి నాలుగు వికెట్లతో చెలరేగగా.. అన్షుల్ 3, బ్రార్ రెండు, మానవ్ ఒక వికెట్ దక్కించుకున్నారు.ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 75 పరుగులు కలుపుకొని సౌతాఫ్రికా.. భారత్కు 275 పరుగుల లక్ష్యాన్ని విధించింది. అయితే, ఓపెనర్లు సాయి సుదర్శన్ (12), ఆయుశ్ మాత్రే (6), వన్డౌన్ బ్యాటర్ పడిక్కల్ (5) త్వరగా అవుట్ కావడంతో భారత్ చిక్కుల్లో పడింది.పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్ఈ దశలో రజత్ పాటిదార్ (28) సహకారం అందించగా.. పంత్ కెప్టెన్ ఇన్నింగ్స్తో మెరిశాడు. ఐదో స్థానంలో వచ్చి 113 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 90 పరుగులు సాధించాడు. అయితే, పంత్ అవుటైన తర్వాత.. ఆ వెంటనే ఆయుశ్ బదోని (34) కూడా అవుట్ కావడంతో భారత్ కష్టాల్లో కూరుకుపోయింది.గెలిపించిన అన్షుల్, మానవ్ఇలాంటి తరుణంలో తనుశ్ కొటియాన్ 23 పరుగులు చేయగా.. ఆశలు వదిలేసుకున్న సమయంలో మానవ్ 20, అన్షుల్ 37 (4 ఫోర్లు, 2 సిక్స్లు) పరుగులతో అజేయంగా నిలిచి భారత్కు విజయం అందించారు. ఆల్రౌండ్ ప్రతిభతో రాణించిన తనుశ్ కొటియాన్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.భారత్- ‘ఎ’ వర్సెస్ సౌతాఫ్రికా- ‘ఎ’తొలి అనధికారిక టెస్టు సంక్షిప్త స్కోర్లు👉వేదిక: బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ 1, బెంగళూరు👉టాస్: భారత్.. తొలుత బౌలింగ్👉సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 309👉భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 234👉సౌతాఫ్రికాకు 75 పరుగుల ఆధిక్యం👉సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 199👉భారత్ లక్ష్యం: 275 పరుగులు👉భారత్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 277/7👉ఫలితం: మూడు వికెట్ల తేడాతో సౌతాఫ్రికాపై భారత్ విజయం.చదవండి: ICC: గెలిచిన జట్టుకు కళ్లు చెదిరే ప్రైజ్మనీ!.. బీసీసీఐ బంపరాఫర్ -
IND vs SA: రసవత్తర పోరు.. భారత్కు భారీ షాక్
భారత్- ‘ఎ’- సౌతాఫ్రికా- ‘ఎ’ జట్ల మధ్య అనధికారిక తొలి టెస్టు రసవత్తరంగా మారింది. తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు చేసిన సౌతాఫ్రికాను.. రెండో ఇన్నింగ్స్లో తక్కువ స్కోరుకే భారత్ పరిమితం చేసింది. ఆఫ్ స్పిన్నర్ తనుశ్ కొటియాన్ (Tanush Kotian) మరోసారి నాలుగు వికెట్లతో చెలరేగి సఫారీ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.నాలుగు వికెట్లు తీసిన తనుశ్రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బెంగళూరు వేదికగా భారత్- ‘ఎ’- సౌతాఫ్రికా- ‘ఎ’ (IND A vs SA A) జట్ల మధ్య గురువారం తొలి అనధికారిక టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 309 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ జోర్డాన్ హెర్మాన్ (71), వన్డౌన్ బ్యాటర్ జుబేర్ హంజా (66), రుబిన్ హెర్మాన్ (54) అర్ధ శతకాలతో రాణించారు. టియాన్ వాన్ వారెన్ 46 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.234 పరుగులకే ఆలౌట్భారత బౌలర్లలో తనుశ్ కొటియాన్ నాలుగు వికెట్లు తీయగా.. గుర్నూర్ బ్రార్, మానవ్ సుతార్ చెరో రెండు, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. టీమిండియా ఆటగాళ్లతో నిండిన భారత ‘ఎ’జట్టు తొలి ఇన్నింగ్స్లో 58 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది.ఆయుశ్ మాత్రే (76 బంతుల్లో 65; 10 ఫోర్లు) అర్ధ శతకంతో టాప్ స్కోరర్గా నిలవగా... ఆయుశ్ బదోనీ (47 బంతుల్లో 38; 5 ఫోర్లు), సాయి సుదర్శన్ (94 బంతుల్లో 32; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. రిషబ్ పంత్ విఫలంఇంగ్లండ్ పర్యటన సందర్భంగా నాలుగో టెస్టులో గాయపడి ఆటకు దూరమైన వికెట్ కీపర్ రిషబ్ పంత్ చాన్నాళ్ల తర్వాత మైదానంలో అడుగు పెట్టగా... 17 పరుగులు మాత్రమే చేయగలిగాడు. రజత్ పాటీదార్ (19), దేవదత్ పడిక్కల్ (6), తనుశ్ కొటియాన్ (13), మానవ్ సుతార్ (4) విఫలమయ్యారు.దక్షిణాఫ్రికా ‘ఎ’బౌలర్లలో ప్రేనెలన్ సుబ్రాయన్ 61 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. సిపామ్లా రెండు వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. ఇక శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా మరో 169 పరుగులు జతచేసి ఆలౌట్ అయింది.భారత్కు 275 పరుగుల లక్ష్యంఈసారి ఓపెనర్లలో జోర్డాన్ (12) విఫలం కాగా.. లెసెగో సెనోక్వానే (37).. వన్డౌన్ బ్యాటర్ జుబేర్ హంజా (37) రాణించారు. లోయర్ ఆర్డర్లో మొరేకి 25 పరుగులు చేశాడు. మిగతా వారంతా విఫలం కావడంతో 48.1 ఓవర్లలో 199 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని (75+199) భారత్కు 275 పరుగుల లక్ష్యం విధించింది.భారత బౌలర్లలో తనుశ్ కొటియాన్ నాలుగు వికెట్లతో మెరవగా.. అన్షుల్ కాంబోజ్ మూడు, గుర్నూర్ బ్రార్ రెండు, మానవ్ సుతార్ ఒక వికెట్ తీశారు. లక్ష్య ఛేదనలో భారత్కు భారీ షాక్ఇక లక్ష్య ఛేదనకు దిగిన భారత్కు ఆదిలోనే షాక్ తగిలింది. గత ఇన్నింగ్స్లో అర్ధ శతకం బాదిన ఓపెనర్ ఆయుశ్ మాత్రే 6 పరుగులకే అవుటయ్యాడు. మొరేకి బౌలింగ్లో బౌల్డ్ అయి తొలి వికెట్గా వెనుదిరిగాడు.ఇక వన్డౌన్లో వచ్చిన దేవ్దత్ పడిక్కల్ (5) మరోసారి విఫలం అయ్యాడు. సిలీ బౌలింగ్లో అతడు బౌల్డ్ అయ్యాడు. కాగా టీ విరామ సమయానికి ఓపెనర్ సాయి సుదర్శన్ 8, నాలుగో నంబర్ బ్యాటర్ రజత్ పాటిదార్ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీ బ్రేక్ సమయానికి భారత్ స్కోరు: 25-2 (9). చదవండి: శివం దూబేను కాదని.. హర్షిత్ను ప్రమోట్ చేయడానికి కారణం అదే: అభిషేక్ శర్మ -
టీమిండియాతో మ్యాచ్.. సౌతాఫ్రికా కెప్టెన్ ఫెయిల్! అయినా భారీ స్కోర్
బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ గ్రౌండ్ వేదికగా సౌతాఫ్రికా-ఎ, భారత్-ఎ మధ్య జరుగుతున్న మొదటి అనధికారిక టెస్ట్ తొలి రోజు ఆట ముగిసింది. మొదటి రోజు ఆటలో భారత్పై సౌతాఫ్రికా బ్యాటర్లు పై చేయి సాధించారు. ప్రోటీస్ ఎ జట్టు డే వన్ ఆట ముగిసే సమయానికి 85.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. క్రీజులో షెపో మోరెకి(4), కుహ్లే సెలె(0) ఉన్నారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో జోర్డాన్ హెర్మాన్(71), హంజా(66), రుబిన్ హెర్మాన్(54) హాఫ్ సెంచరీలతో రాణించారు. కెప్టెన్ మార్క్స్ అకెర్మాన్(18) పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యాడు. భారత బౌలర్లలో ముంబై స్పిన్నర్ తనీష్ కొటియన్ 4 వికెట్లతో సత్తాచాటగా.. మానవ్ సుత్తర్ రెండు, అన్షుల్ కాంబోజ్, ఖాలీల్ అహ్మద్ తలా వికెట్ సాధించారు.పంత్ రీ ఎంట్రీ..ఇండియా-ఎ జట్టుకు సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ నాయకత్వం వహిస్తున్నాడు. గాయం కారణంగా వెస్టిండీస్తో టెస్టు సిరీస్, ఆస్ట్రేలియా పర్యటనకు దూరమైన పంత్.. సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్కు తిరిగి అందుబాటులోకి రానున్నాడు. ఇంగ్లండ్ పర్యటనలో పంత్ కాలి మడమకు గాయమైంది.దీంతో అతడు దాదాపు మూడు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో భారత్-ఎ తరపున ఆడాలని రిషబ్ నిర్ణయించుకున్నాడు. రెండో అనాధికారిక టెస్టులో కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ వంటి సీనియర్ ప్లేయర్లు కూడా ఆడనున్నారు.చదవండి: IND vs SA: లంచ్కు ముందే టీ బ్రేక్.. క్రికెట్ చరిత్రలో తొలిసారి -
అదరగొట్టిన తనీష్.. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్
ఇంగ్లండ్ లయన్స్తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ జట్టు అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. టీమిండియా తమ సెకెండ్ ఇన్నింగ్స్ను 417/7 వద్ద డిక్లేర్ చేసింది. 163/4 ఓవర్నైట్ స్కోర్తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత్-ఎ.. అదనంగా 254 పరుగులు జోడించింది.దీంతో తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని కలుపునుకుని ఇంగ్లండ్ లయన్స్ ముందు 439 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత జట్టు ఉంచింది. భారత బ్యాటర్లలో తనీష్ కోటియన్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. తనీష్(108 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్తో 90) టాప్ స్కోరర్గా నిలవగా.. అభిమన్యు ఈశ్వరన్(80), రాహుల్(51), కాంబోజ్(51) రాణించారు.ఇంగ్లండ్ లయన్స్ బౌలర్లలో జార్జ్ హిల్ మూడు వికెట్లు పడగొట్టగా.. క్రిస్ వోక్స్, జాక్ తలా రెండు వికెట్లు సాధించారు. కాగా ఇదే ఆఖరి రోజు కావడంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశముంది. -
కేకేఆర్తో మ్యాచ్.. పంజాబ్ కింగ్స్ వ్యూహాత్మక నిర్ణయం
ఐపీఎల్-2025 (IPL 2025)లో మరో రసవత్తర పోరు.. డిఫెండింగ్ చాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్- పంజాబ్ కింగ్స్ (KKR vs PBKS) మధ్య మ్యాచ్.. శనివారం నాటి ఈ పోరుకు ఈడెన్ గార్డెన్స్ వేదిక.ఈ సీజన్లో ఇప్పటికే ముఖాముఖి ఇరుజట్లు తలపడగా.. అతి స్వల్ప లక్ష్యాన్ని (112) కాపాడుకుని పంజాబ్ కేకేఆర్పై జయభేరి మోగించింది. తద్వారా కేకేఆర్ మాజీ కెప్టెన్, పంజాబ్ ప్రస్తుత సారథి శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తన పాత జట్టుపై ప్రతీకారం తీర్చుకున్నాడు.వ్యూహాత్మక నిర్ణయంఇక సొంతగడ్డపై కేకేఆర్ను ఓడించాలనే పట్టుదలతో మరోసారి అయ్యర్ బరిలోకి దిగనున్నాడు. ఈ నేపథ్యంలో కేకేఆర్తో మ్యాచ్కు ముందు వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. దేశీ స్పిన్నర్ తనూశ్ కొటియాన్ను నెట్ బౌలర్గా రప్పించింది. అతడి బౌలింగ్లో పంజాబ్ బ్యాటర్లు శుక్రవారం ప్రాక్టీస్ చేశారు.అతడే ఎందుకు?ఈ సందర్భంగా పంజాబ్ స్పిన్ బౌలింగ్ కోచ్ సునిల్ జోషి.. తనూశ్కు సలహాలు, సూచనలు ఇవ్వడం కనిపించింది. కాగా ఇప్పటికే పంజాబ్ జట్టులో యజువేంద్ర చహల్ రూపంలో మేటి స్పిన్నర్ అందుబాటులో ఉండగా.. హర్ప్రీత్బ్రార్, ప్రవీణ్ దూబే అతడికి సహకారం అందిస్తున్నారు. అయితే, వీరంతా మణికట్టు స్పిన్నర్లే.అందుకే వైవిధ్యం కోసం ఆఫ్ స్పిన్నర్ అయిన తనూశ్ కొటియాన్ను పంజాబ్ నాయకత్వ బృందం బరిలోకి దించింది. కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్లు సునిల్ నరైన్, వరుణ్ చక్రవర్తిలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అతడి బౌలింగ్లో ప్రాక్టీస్ చేయించింది.ముంబైకి ప్రాతినిథ్యంకాగా 26 ఏళ్ల తనూశ్ కొటియాన్ దేశవాళీ క్రికెట్లో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తన అద్భుత స్పిన్ నైపుణ్యాలతో దిగ్గజ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ వారసుడిగానూ నీరాజనాలు అందుకుంటున్నాడు. అయితే, భారత్-ఎ జట్టుకు ఆడుతున్నా.. ఇంత వరకు ఒక్కసారి కూడా జాతీయ జట్టుకు ఎంపిక కాలేదు.ఇక ఇటీవల దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై గెలవడంలో తనూశ్ది కీలక పాత్ర. ఈ ఆర్థోడాక్స్ ఆఫ్ స్పిన్నర్ ఇప్పటి వరకు 33 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడి 101 వికెట్లు తీశాడు. ఇందులో మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. వేలంలో అమ్ముడుపోలేదు.. నెట్బౌలర్గా వచ్చాడు అంతేకాదు రెండు శతకాలు, 13 ఫిఫ్టీల సాయంతో 1525 పరుగులు సాధించాడు. ఇక లిస్ట్-ఎ క్రికెట్లో 19 మ్యాచ్లు ఆడి 20 వికెట్లు తీయడంతో పాటు.. 90 రన్స్ చేశాడు. అదే విధంగా 25 టీ20 మ్యాచ్లలో కలిపి 25 వికెట్లు కూల్చాడు.కాగా తనూశ్ కొటియాన్ గతేడాది రాజస్తాన్ రాయల్స్ జట్టులో ఉన్నాడు. వేలానికి ముందు ఫ్రాంఛైజీ అతడిని వదిలేయగా.. ఐపీఎల్-2025 మెగా ఆక్షన్లోకి రూ. 30 లక్షల కనీస ధరతో అందుబాటులోకి వచ్చాడు. కానీ పది ఫ్రాంఛైజీల్లో ఒక్కటీ తనూశ్పై ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు. ఇప్పుడు పంజాబ్ జట్టులోకి నెట్ బౌలర్గా ఎంట్రీ ఇచ్చాడు. చదవండి: CSK vs SRH: ‘బుర్ర పనిచేయడం లేదా’?!.. మెండిస్పై కావ్యా మారన్ ఫైర్ -
Semi Final: కష్టాల్లో ముంబై.. పట్టు బిగించిన విదర్భ
దేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ సెమీఫైన(Ranji Trophy Semi Final)ల్లో డిఫెండిగ్ చాంపియన్ ముంబై(Mumbai) జట్టు కష్టాల్లో పడింది. నాగ్పూర్ వేదికగా విదర్భ(Vidarbha)తో జరుగుతున్న పోరులో బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోగా... బౌలర్లు కూడా ప్రభావం చూపలేకపోయారు. ఆరంభంలో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచినప్పటికీ... దాన్ని చివరి వరకు కొనసాగించలేకపోయారు. దీంతో కోలుకున్న విదర్భ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 53 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది.యశ్ రాథోడ్ (101 బంతుల్లో 59 బ్యాటింగ్; 4 ఫోర్లు) అర్ధశతకంతో రాణించగా... కెప్టెన్ అక్షయ్ వాడ్కర్ (102 బంతుల్లో 31 బ్యాటింగ్; 2 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. అథర్వ తైడె (0), కరుణ్ నాయర్ (6), ధ్రువ్ షోరే (13), దానిశ్ (29) విఫలమవడంతో... ఒకదశలో 56 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన మాజీ చాంపియన్ విదర్భ జట్టును యశ్ రాథోడ్, అక్షయ్ ఆదుకున్నారు. వీరిద్దరూ అజేయమైన ఐదో వికెట్కు 91 పరుగులు జోడించారు.ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో 113 పరుగుల ఆధిక్యం దక్కించుకున్న విదర్భ జట్టు... ప్రస్తుతం ఓవరాల్గా 260 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ముంబై బౌలర్లలో షమ్స్ ములానీ 2... శార్దుల్ ఠాకూర్, తనుశ్ కొటియాన్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 188/7తో బుధవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై జట్టు చివరకు 92 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఆకాశ్ ఆనంద్ (256 బంతుల్లో 106; 11 ఫోర్లు) విలువైన సెంచరీ చేశాడు. తనుశ్ కొటియాన్ (33; 4 ఫోర్లు, 1 సిక్స్) అతడికి సహకరించాడు. విదర్భ బౌలర్లలో పార్థ్ 4 వికెట్లు పడగొట్టాడు. స్కోరు వివరాలు విదర్భ తొలి ఇన్నింగ్స్: 383ముంబై తొలి ఇన్నింగ్స్: ఆయుశ్ (సి) దానిశ్ (బి) దర్శన్ 9; ఆకాశ్ ఆనంద్ (సి) అక్షయ్ (బి) నచికేత్ 106; సిద్ధేశ్ (బి) యశ్ ఠాకూర్ 35; రహానే (బి) పార్థ్ 18; సూర్యకుమార్ (సి) దానిశ్ (బి) పార్థ్ 0; శివమ్ దూబే (సి) అథర్వ (బి) పార్థ్ 0; షమ్స్ ములానీ (ఎల్బీడబ్ల్యూ) (బి) హర్‡్ష దూబే 4; శార్దుల్ (సి) దర్శన్ (బి) యశ్ ఠాకూర్ 37; తనుశ్ (బి) పార్థ్ 33; మోహిత్ (బి) హర్‡్ష దూబే 10; రాయ్స్టన్ డయస్ (నాటౌట్) 2, ఎక్స్ట్రాలు 16; మొత్తం (92 ఓవర్లలో ఆలౌట్) 270. వికెట్ల పతనం: 1–18, 2–85, 3–113, 4–113, 5–113, 6–118, 7–178, 8–247, 9–261, 10–270, బౌలింగ్: దర్శన్ 12–1–46–1; యశ్ ఠాకూర్ 16–0–73–2; హర్ష్ దూబే 25–3–68–2; నచికేత్ 9–2–25–1; పార్థ్ 30–9–55–4. విదర్భ రెండో ఇన్నింగ్స్: అథర్వ (ఎల్బీడబ్ల్యూ) (బి) శార్దుల్ 0; ధ్రువ్ షోరే (ఎల్బీడబ్ల్యూ) (బి) తనుశ్ 13; దానిశ్ (సి అండ్ బి) ములానీ 29; కరుణ్ నాయర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) ములానీ 6; యశ్ రాథోడ్ (బ్యాటింగ్) 59; అక్షయ్ వాడ్కర్ (బ్యాటింగ్) 31; ఎక్స్ట్రాలు 9; మొత్తం (53 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 147. వికెట్ల పతనం: 1–0, 2–40, 3–52, 4–56, బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 6–2–14–1; మోహిత్ 2–0–13–0; షమ్స్ ములానీ 20–3–50–2; రాయ్స్టన్ డయస్ 7–4–11–0; తనుశ్ కొటియాన్ 14–1–33–1; శివమ్ దూబే 3–0–17–0; ఆయుశ్ 1–0–3–0.ముంబై మాజీ కెప్టెన్ మిలింద్ కన్నుమూత ముంబై జట్టు మాజీ సారథి, మాజీ సెలెక్టర్ మిలింద్ రేగె (76) బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. దేశవాళీల్లో ఆల్రౌండర్గా రాణించిన మిలింద్ కెరీర్లో 52 ఫస్ట్క్లాస్ మ్యాచ్లాడి 1532 పరుగులు చేయడంతో పాటు 126 వికెట్లు పడగొట్టారు. 26 ఏళ్ల వయసులోనే గుండెపోటుకు గురైన మిలింద్ ఆ తర్వాత తిరిగి కోలుకొని ముంబై రంజీ జట్టుకు కెపె్టన్గా వ్యవహరించాడు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. మిలింద్ మృతికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సంతాపం వ్యక్తం చేశాడు. మిలింద్ చిన్ననాటి మిత్రుడు సునీల్ గావస్కర్తో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) సంతాపం వ్యక్తం చేశాయి. మిలింద్ మృతికి సంతాపంగా విదర్భతో రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబై ప్లేయర్లు నల్లరిబ్బన్లతో బరిలోకి దిగారు. -
శతక్కొట్టిన రహానే, చెలరేగిన శార్దూల్.. సెమీస్లో ముంబై
రంజీ ట్రోఫీ(Ranji Trophy) 2024-25 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై(Mumbai) సెమీస్కు దూసుకువెళ్లింది. క్వార్టర్ ఫైనల్-3 మ్యాచ్లో హర్యానా జట్టును మట్టికరిపించి టాప్-4కు అర్హత సాధించింది. కాగా రంజీ తాజా ఎడిషన్లో భాగంగా శనివారం క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లు మొదలయ్యాయి.తొలి ఇన్నింగ్స్లో రహానే విఫలంఈ క్రమంలో కోల్కతా వేదికగా ముంబై హర్యానాతో తలపడింది. ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ఆయుశ్ మాత్రే(0), ఆకాశ్ ఆనంద్(10)తో పాటు వన్డౌన్లో వచ్చిన సిద్ధేశ్ లాడ్(4) కూడా విఫలమయ్యాడు. కెప్టెన్ అజింక్య రహానే(Ajinkya Rahane) సైతం 31 పరుగులకే వెనుదిరగగా.. టీమిండియా టీ20 జట్టు సారథి సూర్యకుమార్ యాదవ్(9), ఆల్రౌండర్ శివం దూబే(28) కూడా నిరాశపరిచారు.ఇలాంటి తరుణంలో ఆల్రౌండర్ షామ్స్ ములానీ 91 పరుగులతో రాణించగా.. మరో ఆల్రౌండర్ తనుశ్ కొటియాన్ 97 పరుగులతో చెలరేగాడు. ఫలితంగా ముంబై తమ తొలి ఇన్నింగ్స్లో 315 పరుగులు చేసింది.అంకిత్ కుమార్ శతకం కారణంగాఅనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన హర్యానా తమ మొదటి ఇన్నింగ్స్లో 301 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ అంకిత్ కుమార్ శతకం(136)తో మెరవగా.. మిగతా వాళ్ల నుంచి అతడికి ఎక్కువగా సహకారం లభించలేదు. పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ దెబ్బకు హర్యానా బ్యాటర్లు పెవిలియన్కు వరుస కట్టారు. అతడు 18.5 ఓవర్ల బౌలింగ్లో 58 పరుగులు ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు. మిగతా వాళ్లలో షామ్స్ ములానీ, తనుశ్ కొటియాన్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఈ నేపథ్యంలో పద్నాలుగు పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ముంబై.. 339 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అజింక్య రహానే శతక్కొట్టగా(108).. సూర్యకుమార్ యాదవ్(70) చాన్నాళ్ల తర్వాత అర్ధ శతకం బాదాడు. మిగిలిన వాళ్లలో సిద్దేశ్ లాడ్ 43, శివం దూబే 48 పరుగులతో రాణించారు.అప్పుడు శార్దూల్.. ఇప్పుడు రాయ్స్టన్ఇక ముంబై విధించిన 353 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హర్యానా తడబడింది. ఓపెనర్ లక్ష్య దలాల్(64), సుమిత్ కుమార్(62) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు. దీంతో 201 పరుగులకే హర్యానా కుప్పకూలింది. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు సాధించగా.. రాయ్స్టన్ డయాస్ ఐదు వికెట్లతో చెలరేగాడు. తనుశ్ కొటియాన్కు రెండు వికెట్లు దక్కాయి. ఇక హర్యానాపై ముంబై 152 పరుగుల తేడాతో గెలుపొందిన ముంబై వరుసగా రెండోసారి సెమీస్లో అడుగుపెట్టింది. శార్దూల్ ఠాకూర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ముంబై వర్సెస్ హర్యానా(క్వార్టర్ ఫైనల్-3) సంక్షిప్త స్కోర్లు👉ముంబై స్కోర్లు: 315 & 339👉హర్యానా స్కోర్లు: 301 & 201👉ఫలితం: 152 పరుగుల తేడాతో హర్యానాను ఓడించిన ముంబై👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శార్దూల్ ఠాకూర్(ముంబై)- మొత్తం తొమ్మిది వికెట్లు.చదవండి: IPL 2025: కొత్త యాజమాన్యం చేతిలోకి గుజరాత్ టైటాన్స్! -
BGT: అశ్విన్ స్థానంలో ఆస్ట్రేలియాకు.. ఎవరీ తనుశ్?
ముంబై క్రికెటర్ తనుశ్ కొటియాన్కు అరుదైన అవకాశం దక్కింది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ( Border-Gavaskar Trophy- బీజీటీ)లో భాగంగా.. ఆస్ట్రేలియాతో మిగిలిన రెండు టెస్టులకు.. టీమిండియా సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. తనుశ్కు జాతీయ జట్టులో చోటు దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం.కాగా బీజీటీ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన భారత జట్టు ఐదు టెస్టులు ఆడుతోంది. పెర్త్లో జరిగిన తొలి టెస్టులో గెలుపొందిన టీమిండియా.. అడిలైడ్ పింక్ బాల్ టెస్టులో మాత్రం కంగారూల చేతిలో ఓడిపోయింది. ఫలితంగా సిరీస్ 1-1తో సమం కాగా.. బ్రిస్బేన్లో మూడో టెస్టు డ్రా అయింది.అశ్విన్ రిటైర్మెంట్ఇక ఈ మ్యాచ్ ముగియగానే టీమిండియా దిగ్గజ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఈ నేపథ్యంలో అశూ స్థానంలో ముంబై ఆటగాడు తనుశ్ కొటియాన్(Tanush Kotian)కు సెలక్టర్లు పిలుపునిచ్చారు. నిజానికి మరో ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లు జట్టుతోనే ఉన్నా.. ముందు జాగ్రత్త చర్యగా సోమవారం అతడిని ఎంపిక చేశారు.ఎవరీ తనుశ్ కొటియాన్?మహారాష్ట్ర చెందిన తనుశ్ కొటియాన్ ఆఫ్స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. దేశవాళీ క్రికెట్లో అతడు ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. 26 ఏళ్ల తనుశ్ ఇప్పటి వరకు 33 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లలో 25.70 సగటుతో 101 వికెట్లు తీశాడు.అదే విధంగా.. బ్యాటింగ్లోనూ రాణించిన అతను 47 ఇన్నింగ్స్లలో 41.21 సగటుతో 1525 పరుగులు సాధించాడు. ఇందులో 2 శతకాలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 2023–24 రంజీ ట్రోఫీ టైటిల్ను ముంబై గెలుచుకోవడంలో తనుశ్దే కీలకపాత్ర. ఆ ఎడిషన్లో 502 పరుగులు చేసి 29 వికెట్లు పడగొట్టిన అతను ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలవడం విశేషం. ఇక ఇటీవల భారత్ ‘ఎ’ జట్టులో సభ్యుడిగా ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగిన ఒక మ్యాచ్లోనూ తనుశ్ బరిలోకి దిగాడు. వన్డే టోర్నీలో సత్తా చాటుతూతనుశ్ కొటియాన్ ప్రస్తుతం ముంబై తరఫు విజయ్ హజారే టోర్నీ(Vijay Hazare Trophy) మ్యాచ్లు ఆడుతున్నాడు. టీమిండియాలోకి ఎంపికైన రోజే అతడు అహ్మదాబాద్లో హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టును గెలిపించడం విశేషం. రెండు వికెట్లు తీయడంతో పాటు.. 37 బంతుల్లో 39 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇదిలా ఉంటే.. ఆసీస్- భారత్ మధ్య మెల్బోర్న్(డిసెంబరు 26-30)లో నాలుగో టెస్టు జరుగనుంది. తదుపరి సిడ్నీ వేదికగా ఇరుజట్లు ఆఖరి టెస్టులో తలపడతాయి.చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాకు భారీ షాక్.. విధ్వంసకర వీరుడు దూరం!?


