-
ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి మరో 471 మంది..
న్యూఢిల్లీ: ఆపరేషన్ అజయ్లో భాగంగా ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ నుంచి ఆదివారం రెండు విమానాల్లో 471 మంది భారతీయులు ఢిల్లీకి చేరుకున్నారు. వీటిలో ఒక విమానం ఎయిరిండియాకు చెందినది కాగా, మరోటి స్పైస్జెట్ సంస్థదని అధికారులు చెప్పారు. ఆదివారం ఉదయం 197 మందితో కూడిన మూడో విమానం ఢిల్లీ ఎయిర్పోర్టులో ల్యాండ్ కాగా, 274 మంది ప్రయాణికులతో నాలుగో విమానం సాయంత్రం వచ్చినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన ‘ఎక్స్’లో విడుదల చేశారు. శుక్ర, శనివారాల్లో ఎయిరిండియా ఏర్పాటు చేసిన ఛార్టర్డ్ విమా నాల్లో 435 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. తాజా తరలింపుతో యుద్ధ వాతావరణం నెలకొన్న ఇజ్రాయెల్ నుంచి ఇప్పటి వరకు నాలుగు విమానాల్లో స్వదేశానికి వచ్చిన భారతీయుల సంఖ్య 900 దాటింది. -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఏంటో తెలుసా?
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఏమిటి అనగానే చాలా మంది ప్యారిస్ లేదా సింగపూర్ అని చెబుతారు. కానీ, అవి ఏవి కావు. ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్ నగరం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా నిలిచింది. పెరుగుతున్న జీవన వ్యయాల ఆధారంగా ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయు) ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో ఇజ్రాయిల్ నగరం టెల్ అవీవ్ తొలిసారిగా అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ప్రపంచ వ్యాప్తంగా 173 నగరాల్లో నిత్యావసర సరుకుల ధరలు, అద్దె, రవాణా వంటి ఇతర వ్యయాలను పరిగణలోకి తీసుకొని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ "వరల్డ్ వైడ్ సిటీ కాస్ట్ ఆఫ్ లివింగ్" పేరుతో ఒక జాబితాను రూపొందించింది. రవాణా, కిరాణా సరుకుల ధరలు పెరగడం వల్ల ఈ జాబితాలో టెల్ అవీవ్ అగ్రస్థానంలో నిలిచింది. అలాగే, ఈ జాబితాలో పారిస్, సింగపూర్ నగరాలు ఉమ్మడిగా రెండవ స్థానంలో ఉన్నాయి. (చదవండి: దూసుకెళ్తున్న జీఎస్టీ వసూళ్లు!) తర్వాత స్థానాల్లో జ్యూరిచ్, హాంగ్ కాంగ్ ఉన్నాయి. న్యూయార్క్ 6వ స్థానంలో, జెనీవా 7వ స్థానంలో, కోపెన్ హాగన్ 8వ స్థానంలో, లాస్ ఏంజిల్స్ 9వ స్థానంలో, ఒసాకా 10వ స్థానంలో నిలిచాయి. గత ఏడాది సర్వే జరిపిన ఈ జాబితాలో పారిస్, జ్యూరిచ్, హాంగ్ కాంగ్లు ఉమ్మడిగా ప్రథమ స్థానంలో ఉన్నాయి. గత ఐదు సంవత్సరాలలో నమోదైన ద్రవ్యోల్బణ రేటు, కరోనావైరస్ మహమ్మారి వల్ల కొన్ని దేశాలలో వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఆయా దేశాలలో జీవన వ్యయం కూడా అదే స్థాయిలో పెరిగింది. -
‘మరో 10 దేశాలు టచ్లో ఉన్నాయి’
జెరూసలేం : పవిత్ర నగరం జెరూసలేంను ఇజ్రాయిల్ రాజధానిగా అమెరికా గుర్తించడంతో.. మరో పది దేశాలు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు ఇజ్రాయిల్ విదేశాంగ శాఖమంత్రి టిజిపి హోటెవెలి తెలిపారు. అందులో భాగంగా ఆయా దేశాల రాయబార కార్యాలయాలను టెల్ అవైవ్ నుంచి జెరూసలేంకు మార్చేవిధంగా చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఐరోపా సహా మరికొన్ని దేశాలతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తయినట్లు ఆయన చెప్పారు. పిలిప్పీన్స్, రొమేనియా, దక్షిణ సూడాన్, హోండూరస్ సహా మరికొన్ని దేశాలు తమ రాయబార కార్యాలయాలను టెల్ అవైవ్ నుంచి జెరూసలేంకు మార్చేసందుకు అనుకూలంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇది ప్రారంభమేనని.. త్వరలో మరికొన్ని దేశాలు ఇజ్రాయిల్కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటాయని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా.. జెరూసలేం విషయంలో అమెరికా అధ్యక్షుడి ప్రతిపాదనను ఐక్యరాజ్య సమితి తిరస్కరించిన విషయం తెలిసిందే. -
విమానానికి బాంబు బెదిరింపు.. రక్షణగా ‘ఫైటర్లు’
టెల్ అవీవ్ : న్యూయార్క్ నుంచి ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్కు వెళుతున్న ఈఎల్ ఏఎల్ ప్యాసింజర్ విమానానికి మంగళవారం బాంబు బెదిరింపు వచ్చింది. వెంటనే ఆ విమానానికి రక్షణగా స్విట్జర్లాండ్ ఎయిర్ఫోర్స్ యుద్ధ విమానాలను మోహరించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, బాంబు బెదిరింపు తప్పుడు సమాచారమని అధికారులు తెలిపారు. -
టెల్ అవీవ్లో కాల్పులు, నలుగురు మృతి
ఇజ్రాయెల్: టెల్ అవీవ్ లోని నైట్ స్పాట్ వద్ద గురువారం తెల్లవారుజామున ఇద్దరు టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో అక్కడి ప్రజలందరూ భయభ్రాంతుయ్యారు. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న భద్రతా దళాలు టెర్రరిస్టులపై కాల్పులు జరిపాయి. దీంతో ఒకరికి గాయం కావడంతో అతనికి సర్జరీ చేసేందుకు ఆసుపత్రికి తరలించారు. మరోకరిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాడికి పాల్పడిన ఇరువురు హెబ్రాన్ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు. రాత్రి సమయంలో దాడి కారణంగా ఆ ప్రాంతాన్నంతటిని ఖాళీ చేయించినట్లు వివరించారు. అయితే, దాడిలో గాయపడిన వారు ఇజ్రాయెల్ జాతీయులా? లేదా? అన్న సమాచారాన్ని వెల్లడించలేదు. ఇజ్రాయెల్ జరిగిన ఈ దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. అమాయక ప్రజలపై దాడులకు తెగబడటం వల్ల భారీగా మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని హెచ్చరించింది. ఇజ్రాయెల్ కు తాము అండగా ఉంటామని తెలిపింది. పాఠశాలలు, మునిసిపల్ భవనాల వద్ద భద్రత భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. కాగా, గత అక్టోబర్ లో దేశంలో జరిగిన అల్లర్ల కారణంగా207 మంది పాలస్తీయన్లు, 28 ఇజ్రాయిలీలు, ఇద్దరు అమెరికన్లు మరణించిన విషయం తెలిసిందే.