Telangana cab drivers
-
గుండెపోటుతో కుప్పకూలిన క్యాబ్ డ్రైవర్!
క్యాబ్ డ్రైవర్ల ఆందోళన నేపథ్యంలో నగరంలో విషాద ఘటన హైదరాబాద్: నగర శివారు ప్రాంతమైన ఉప్పల్ ఫిర్జాదిగూడలో తులసీదాస్ అనే క్యాబ్ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. తులసీదాస్ రెండు నెలల క్రితం బజాజ్ ఫైనాన్స్లో టీవీ కొనుగోలు చేశాడు. అయితే రెండు వాయిదాలు చెల్లించడంలో ఆలస్యం కావడంతో సదరు ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు ఆయనను నిలదీశారు. దీంతో తులసీదాస్కు ఫైనాన్స్ ప్రతినిధులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఫైనాన్స్ ప్రతినిధులు తులసీదాస్ ఇంట్లో నుంచి టీవీని బలవంతంగా తీసుకెళ్లారు. దీంతో మనస్తాపానికి గురైన తులసీదాస్ కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు. తులసీదాస్కు నలుగురు ఆడపిల్లలు ఉన్నట్టు తెలుస్తోంది. సమస్యల పరిష్కారం కోసం బుధవారం నుంచి క్యాబ్ డ్రైవర్లు ఆమరణ నిరాహార దీక్షకు దిగిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో క్యాబ్ డ్రైవర్లలో విషాదం నెలకొంది. తమ సమస్యల పరిష్కారం కోసం నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి కానీ, ఉబెర్, ఓలా సంస్థల నుంచి కానీ ఎలాంటి స్పందనా కనిపించడం లేదని, ఈ నేపథ్యంలో గత్యంతరంలేని పరిస్థితుల్లో తాము దీక్షకు దిగామని తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ చెప్తోంది. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తాము ఆమరణ నిరాహార దీక్షకు దిగవలసి వస్తోందని చెప్పారు. ఉబెర్, ఓలా సంస్థలు తమపై సాగిస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా, వేధింపులు, భౌతిక దాడులను నిరసిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు శివ ఉల్కొందూల్కర్ అంటున్నారు. -
క్యాబ్ డ్రైవర్ల ఆందోళన: గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్: నగరంలోని గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్యాబ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం బుధవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. దీంతో ఉదయం 9 గంటలకు గన్పార్కు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించేందుకు క్యాబ్ డ్రైవర్లు రాగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తాము ఆమరణ నిరాహార దీక్షకు దిగవలసి వస్తోందని.. ఉబెర్, ఓలా సంస్థలు తమపై సాగిస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా, వేధింపులు, భౌతిక దాడులను నిరసిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నామని, దానిని అడ్డుకోవడం సరికాదని అసోసియేషన్ అధ్యక్షుడు శివ ఉల్కొందూల్కర్ తెలిపారు. -
నేటి నుంచి క్యాబ్ డ్రైవర్ల ఆమరణ దీక్ష
-
నేటి నుంచి క్యాబ్ డ్రైవర్ల ఆమరణ దీక్ష
తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: క్యాబ్ డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం బుధవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. బుధవారం ఉదయం 9 గంటలకు గన్పార్కు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి.. భారీ క్యాబ్ ర్యాలీతో ఇందిరా పార్కుకు చేరుకుంటామని, ధర్నా చౌక్ వద్ద ఆమరణ దీక్ష చేపడతామని అసోసియేషన్ అధ్యక్షుడు శివ ఉల్కొందూల్కర్ తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులతో కలసి ఆయన మాట్లాడారు. గత్యంతరం లేని పరిస్థితుల్లోనే తాము ఆమరణ నిరాహార దీక్షకు దిగవలసి వస్తోందని చెప్పారు. ఉబెర్, ఓలా సంస్థలు తమపై సాగిస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా, వేధింపులు, భౌతిక దాడులను నిరసిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నామన్నారు. నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి కానీ, ఉబెర్, ఓలా సంస్థల నుంచి కానీ ఎలాంటి స్పందనా కనిపించడం లేదన్నారు. రవాణా రంగంలోని ఆటో డ్రైవర్లు, ఆర్టీసీ డ్రైవర్లు సమ్మెకు దిగినప్పుడు సత్వరమే స్పందించి సమస్యలను పరిష్కరించే ప్రభుత్వం.. క్యాబ్ డ్రైవర్ల సమస్యలను పట్టించుకోకపోవడం అన్యాయమని చెప్పారు. ఈ రెండు సంస్థల్లోనే 80 వేల క్యాబ్లు నమోదై ఉన్నాయని, ఆ క్యాబ్లు నడిపే తామంతా బడుగు, బలహీన వర్గాలకు చెందిన వాళ్లమేనని అన్నారు. బతుకుదెరువు కోసం అప్పు చేసి కార్లు కొనుగోలు చేశామని, ఓలా, ఉబెర్ సంస్థల మాటలు నమ్మి మోసపోయామని, ఇప్పుడు ఆ సంస్థలు తమను నిలువుదోపిడీ చేస్తున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపా లని కోరారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చిన నిరుద్యోగులు డ్రైవింగ్ నేర్చుకుని ఈ రంగంపై ఆధారపడి బతుకుతున్నారని, ఉబెర్, ఓలా సంస్థలకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వమే తమకు ఉపాధి అవకాశాలు కల్పించాలని క్యాబ్ డ్రైవర్లు కోరారు. ముంబై, బెంగళూరు తర హాలో క్యాబ్లకు డిజిటల్ మీటర్లను ఏర్పాటు చేసి హేతుబద్ధమైన చార్జీల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రయాణికులకు, డ్రైవర్లకు భద్రత కల్పించేలా ఎస్ఓఎస్ ఫోన్లను ఏర్పాటు చేయాలని, తద్వారా వెహికల్ ట్రాకింగ్కు అవకాశం కలుగుతుందని చెప్పారు. దీంతో పోలీసులు, ఇతర ప్రభుత్వ విభాగాల పర్యవేక్షణలో ప్రయాణికులకు పూర్తి భద్రతతో కూడిన రవాణా సదుపాయాన్ని అందజేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు. సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు సర్వేశ్వర్, సురేష్, రెడ్డి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. 4వ రోజూ ఆగిన క్యాబ్లు.. మంగళవారం నాలుగో రోజు కూడా ఉబెర్, ఓలా క్యాబ్లు ఎక్కడి కక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు, శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే వారు ఆటోలు, ఇతర సంస్థలకు చెందిన క్యాబ్లకు అధిక మొత్తంలో సమర్పించు కోవలసి వచ్చింది. -
శుక్రవారం అర్థరాత్రి నుంచి క్యాబ్లు బంద్...
-
క్యాబ్లు బంద్...
- తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్– ఓనర్స్ అసోసియేషన్ పిలుపు - శుక్రవారం అర్థరాత్రి నుంచి నిలిచిపోయిన సేవలు హైదరాబాద్: తమ సమస్యలు వివరించేందుకు ఓలా క్యాబ్ సంస్థకు వెళితే బౌన్సర్లతో క్యాబ్ డ్రైవర్లపై దాడి చేయించినందుకు నిరసనగా శుక్రవారం అర్ధరాత్రి నుండి జనవరి 4 వరకు రాష్ట్ర వ్యాప్తంగా క్యాబ్ల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ క్యాబ్స్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ ఉల్కుందకోర్ తెలిపారు. అసోసియేషన్లో ఉన్న ఏడు వేల మందితో పాటు అన్ని సం ఘాల క్యాబ్ డ్రైవర్స్, ఓనర్స్ కూడా బంద్ లో పాల్గొంటారన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో విలేకరులతో శివ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని ఓలా, ఉబర్ కార్పొరేట్ సంస్థలు ప్రకటనలు చేసి నెలకు రూ.70 వేల నుండి రూ.లక్ష సంపాదించవచ్చని నమ్మబలికి ఈఎంఐ పద్ధతిలో కార్లు కొనేలా చేశారన్నారు. లక్ష మంది వరకు ఈ సంస్థల్లో డ్రైవర్లుగా కొనసాగుతున్నారని, తమకు సరి పడా వ్యాపారం ఇవ్వకుండా రోజుకో కొత్త స్కీం పెట్టి మానసిక వేదనకు గురిచేస్తు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కుటుంబాన్ని పోషించుకోలేక, ఈఎంఐలు కట్టలేక అవస్థలు పడుతున్నామన్నారు. ఎన్నోసార్లు ఆయా సంస్థల యాజమాన్యాల కు విన్నవించినా స్పందించలేదన్నారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్గౌడ్, ఉపాధ్యక్షులు సర్వేష్, రెడ్డి శ్యామ్, సురేష్, ప్రధాన కార్యదర్శి సత్య నారాయణ, పాల్గొన్నారు.