Test format
-
ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
ఐసీసీ మెన్స్ టీమ్ టెస్టు ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలోకి దూసుకువచ్చింది. టీమిండియాను వెనక్కి నెట్టి నంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకుంది.ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ 2021-23 టైటిల్ గెలిచిన కంగారూ జట్టు 124 పాయింట్లతో మొదటి స్థానంలో నిలవగా.. రన్నరప్ టీమిండియా 120 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.ఇక ఈ రెండు జట్లతో పాటు ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్ టాప్-5లో చోటు దక్కించుకున్నాయి. ఇదిలా ఉంటే.. టెస్టుల్లో టీమిండియా అగ్రస్థానం కోల్పోయినా వన్డే, టీ20లలో మాత్రం టాప్ ర్యాంకు పదిలంగా ఉంది.పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్ సేన ప్రథమ స్థానంలో కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.మెన్స్ టీమ్ టెస్టు ర్యాంకింగ్స్ టాప్-51. ఆస్ట్రేలియా- 124 రేటింగ్ పాయింట్లు2. ఇండియా- 120 రేటింగ్ పాయింట్లు3. ఇంగ్లండ్- 105 రేటింగ్ పాయింట్లు4. సౌతాఫ్రికా- 103 రేటింగ్ పాయింట్లు5. న్యూజిలాండ్- 96 రేటింగ్ పాయింట్లు.మెన్స్ టీమ్ వన్డే ర్యాంకింగ్స్ టాప్-51. ఇండియా -122 రేటింగ్ పాయింట్లు2. ఆస్ట్రేలియా- 116 రేటింగ్ పాయింట్లు3. సౌతాఫ్రికా- 112 రేటింగ్ పాయింట్లు4. పాకిస్తాన్- 106 రేటింగ్ పాయింట్లు5. న్యూజిలాండ్- 101 రేటింగ్ పాయింట్లుమెన్స్ టీమ్ టీ20 ర్యాంకింగ్స్ టాప్-51. ఇండియా- 264 రేటింగ్ పాయింట్లు2. ఆస్ట్రేలియా- 257 రేటింగ్ పాయింట్లు3. ఇంగ్లండ్- 252 రేటింగ్ పాయింట్లు4. సౌతాఫ్రికా- 250 రేటింగ్ పాయింట్లు5. న్యూజిలాండ్- 250 రేటింగ్ పాయింట్లుచదవండి: -
భారత్ కంటే ఆస్ట్రేలియా మెరుగు
దుబాయ్ : ఐసీసీ టెస్టు చాంపియన్షిప్ రేసులో ఇప్పటి వరకు భారత్ అగ్రస్థానంలో సాగింది. ఆడిన 9 మ్యాచ్లలో 7 గెలిచి 2 ఓడిన టీమిండియా... 360 పాయింట్లతో ముందంజలో నిలిచింది. అయితే కరోనా కారణంగా పలు సిరీస్లు రద్దు కావడంతో టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ కోసం పాయింట్ల విధానాన్ని మార్చాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధికారికంగా నిర్ణయించింది. ఆడిన మ్యాచ్ల సంఖ్య, అందుబాటులో ఉన్న మొత్తం పాయింట్ల సంఖ్యను చూస్తూ ఐసీసీ విజయ శాతాన్ని లెక్కించనుంది. దాంతో మొత్తం 480 పాయింట్ల (4 సిరీస్లు) ద్వారా 360 పాయింట్లు సాధించిన భారత్ విజయ శాతం 75 % గా ఉంది. అదే ఆస్ట్రేలియా అందుబాటులో ఉన్న 360 పాయింట్ల (3 సిరీస్లు) 296 పాయింట్లు సాధించడంతో జట్టు విజయ శాతం 82.2%గా నిలిచింది. దాంతో తాజా ర్యాంకింగ్స్లో ఆసీస్ నంబర్వన్ కాగా, టీమిండియా రెండో స్థానానికి పడిపోయింది. 60.8 శాతంతో ఇంగ్లండ్ మూడో స్థానంలో కొనసాగుతోంది. మరో వైపు నవంబర్ 2022లో జరగాల్సిన మహిళల టి20 ప్రపంచ కప్ను ఫిబ్రవరి 2023కి ఐసీసీ వాయిదా వేసింది. 2022లో ఇప్పటికే మహిళల వన్డే వరల్డ్ కప్, కామన్వెల్త్ క్రీడలు ఉండటంతో పాటు 2023లో ఒక్క ఐసీసీ ఈవెంట్ కూడా లేకపోవడమే దీనికి కారణం. దక్షిణాఫ్రికా క్రికెటర్కు కరోనా కేప్టౌన్: స్వదేశంలో ఇంగ్లండ్తో వన్డే, టి20 సిరీస్లకు సన్నద్ధమవుతున్న సమయంలో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టును కరోనా తాకింది. జట్టులో సభ్యుడొకరు కోవిడ్–19 పాజిటివ్గా తేలాడు. దాంతో అతడిని బయో బబుల్నుంచి బయటకు పంపించివేశారు. అతనితో సన్నిహితంగా మెలిగిన మరో ఇద్దరు క్రికెటర్లకు వైరస్ లక్షణాలు లేనప్పటికీ ముందు జాగ్రత్తగా క్వారంటైన్కు తరలించినట్లు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు. ఆ ముగ్గురి స్థానాలను ఇతర క్రికెటర్లతో భర్తీ చేయబోమని చెప్పింది. మరో వైపు తాజా సిరీస్లో మోకాలిపై కూర్చొని నల్లజాతివారికి సంఘీభావం తెలిపే కార్యక్రమానికి తాము దూరంగా ఉంటున్నామని దక్షిణాఫ్రికా కోచ్ మార్క్ బౌచర్ వెల్లడించాడు. తమ దేశంలో ఈ మొత్తం ఉద్యమంలో కీలకంగా ఉన్న జట్టు సభ్యుడు లుంగీ ఇన్గిడితో తాను మాట్లాడానని... కొన్నాళ్ల క్రితం జరిగిన 3టీసీ మ్యాచ్లో ఇలా చేశాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదని వివరించినట్లు బౌచర్ తెలిపాడు. -
‘ఈ ఏడాది చాలా కష్టంగా గడిచింది’
ఇస్లామాబాద్: రెండు టెస్టు సిరీసుల్లో (ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా) ఓటమి చవిచూడటం, రన్రేట్ కారణంగా ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరకపోవడం వంటి ఘటనలతో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఈ ఏడాది(2019) చాలా కష్టంగా గడిచిందని ఆ జట్టు కోచ్ మిస్బావుల్ హక్ పేర్కొన్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో తమ జట్టు ఆశించిన మేర రాణించలేదని అసహనం వ్యక్తం చేశాడు. అయితే దాదాపు దశాబ్దం తర్వాత స్వదేశంలో టెస్టు సిరీస్ జరగడం సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. అంతేకాకుండా శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను 2-0తో పాక్ కైవసం చేసుకోవడం ఈ ఏడాది తమ జట్టుకు మరో హైలెట్గా నిలిచిందన్నాడు. అయితే అదే జట్టుతో జరిగిన టీ20 సిరీస్లో చిత్తుచిత్తుగా ఓడిపోవడం కూడా బాధించిందన్నాడు. అయితే ఓవరాల్గా పొట్టి క్రికెట్లో పాక్ ప్రదర్శనపై సంతృప్తికరంగా ఉన్నామని.. అయితే రెడ్ బాల్ క్రికెట్లో ప్రదర్శనపైనే తాము ఆందోళనగా ఉన్నామని మిస్బావుల్ అన్నాడు. టెస్టు ఫార్మట్పై తాము ఇంకాస్త దృష్టి పెట్టాలన్నాడు. అయితే స్వదేశంలో టెస్టులు ఆడితే ఏ జట్టుకైనా అదనపు బలం కలుగుతుందని అభిప్రాయపడ్డాడు. గత కొన్నేళ్లుగా పాక్లో టెస్టులు లేకపోవడం వలన జట్టులో స్థైర్యం దెబ్బతిందన్నాడు. కనీసం రానున్న ఏడాదిలోనైనా పాక్లో ఎక్కువ టెస్టులు ఆడగలిగితే తమ జట్టుకు ఎంతో లాభం చేకూరుతుందన్నాడు. ఇక ఈ ఏడాది ఆటగాళ్ల ప్రదర్శనపై మిస్బావుల్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ముఖ్యంగా బాబర్ అజమ్పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఫార్మట్తో సంబంధం లేకుండా పరుగుల వరద పారించాడని, పాక్ జట్టుకు అతడే స్టార్ బ్యాట్స్మన్ అని కితాబిచ్చాడు. ఇక అతడితో పాటు కర్రాళ్లు నసీమ్ షా, షాహీన్ ఆఫ్రిదిల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుందన్నాడు. అంతేకాకుండా పాక్ భవిష్యత్ క్రికెటర్లు వీరేనంటూ వ్యాఖ్యానించాడు. ఇక ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యం టీ20 ప్రపంచకప్ అని ఈ మెగా టోర్నీ కోసం సన్నద్దమవుతున్నట్లు మిస్బావుల్ తెలిపాడు. 2017 చాంపియన్ ట్రోఫీ తర్వాత పాక్ చెప్పుకునేంత పెద్ద టోర్నీలు గెలవలేదని.. అందుకే ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నట్లు పేర్కొన్నాడు. -
కోహ్లికి సముచిత గౌరవం!
క్రికెట్ ప్రపంచంలో ఎదురు లేకుండా దూసుకుపోతున్న భారత స్టార్ విరాట్ కోహ్లిని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా సముచిత రీతిలో గౌరవించుకుంది. ఆటగాడిగా, కెప్టెన్గా తిరుగులేని రికార్డులు సాధిస్తున్న విరాట్ను మూడు ప్రధాన అవార్డులకు ఎంపిక చేసి అవార్డుల విలువను పెంచింది. టెస్టులు, వన్డేల్లో పరుగుల వరద పారించడంతో రెండు ఫార్మాట్లలోనూ ఉత్తమ క్రికెటర్గా నిలిచిన కోహ్లి సహజంగానే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్గా ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. మరో సందేహం లేకుండా టెస్టు, వన్డే జట్లకు కూడా అతనే కెప్టెన్గా ఎంపికయ్యాడు. దుబాయ్: 13 టెస్టుల్లో 55.08 సగటుతో 5 సెంచరీలు సహా 1322 పరుగులు... 14 వన్డేల్లో ఏకంగా 133.55 సగటుతో 6 సెంచరీలు సహా 1202 పరుగులు... వీటికి అదనంగా 10 అంతర్జాతీయ టి20ల్లో కలిపి 211 పరుగులు... ఈ అద్భుత గణాంకాలు 2018ని కోహ్లినామ సంవత్సరంగా మార్చేశాయి. అతడిని ప్రతిష్టాత్మక అవార్డులకు అర్హుడిగా చేశాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ప్రకటించిన 2018 వార్షిక పురస్కారాల్లో విరాట్ కోహ్లి మూడు ప్రధాన అవార్డులకు ఎంపికయ్యాడు. అన్ని ఫార్మాట్లలో చెలరేగినందుకు ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ) వరుసగా రెండో ఏడాది కోహ్లిని వరించింది. 2017లో కూడా అతను ఇదే అవార్డు సాధించాడు. ఇప్పుడు టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులనూ కోహ్లినే గెలుచుకున్నాడు. ఐసీసీ చరిత్రలో ఒకే ఏడాది మూడు ప్రధాన అవార్డులు సాధించిన తొలి ఆటగాడిగా కోహ్లి నిలవడం విశేషం. గత ఏడాది భారత జట్టు ఉపఖండం బయటే దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో ఎక్కువ మ్యాచ్లు ఆడటాన్ని బట్టి చూస్తే కోహ్లి సాధించిన ఘనత అసమానం. రెండు ఫార్మాట్ ర్యాంకింగ్స్లలో కూడా కోహ్లి నంబర్వన్గా 2018ని ముగించాడు. మాజీ క్రికెటర్లు, సీనియర్ జర్నలిస్ట్లు, విశ్లేషకులతో కూడిన 36 మంది సభ్యుల ఎంపిక ప్యానెల్ ఏకగ్రీవంగా కోహ్లికి ఓటు వేసింది. ఐసీసీ ప్రకటించిన టెస్టు టీమ్ ద ఇయర్, వన్డే టీమ్ ద ఇయర్లకు కూడా కోహ్లినే కెప్టెన్గా ఎంపికయ్యాడు. కోహ్లి నాయకత్వంలో 2018లో భారత్ 6 టెస్టుల్లో గెలిచింది. 7 టెస్టుల్లో ఓడింది. వన్డేల్లో 9 విజయాలు నమోదు చేసింది. 4 పరాజయాలు చవిచూసింది. మరో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. పంత్ సూపర్... టెస్టులు, వన్డేల్లో 2018లో అరంగేట్రం చేసిన భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్కు ‘ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు వరించింది. అతను 8 టెస్టుల్లో కలిపి 537 పరుగులు సాధించాడు. ఇందులో ఇంగ్లండ్పై ఓవల్లో చేసిన సెంచరీ సైతం ఉంది. అతను 40 క్యాచ్లు అందుకోవడం అవార్డు ఎంపికకు కారణమైంది. ఇదే ప్రదర్శనతో ఐసీసీ టెస్టు జట్టు కీపర్గానూ పంత్ ఎంపికయ్యాడు. ఈ టీమ్లో జస్ప్రీత్ బుమ్రాకు స్థానం లభించింది. వన్డే జట్టులో రోహిత్ శర్మ, బుమ్రా, కుల్దీప్లకు అవకాశం దక్కింది. ఫించ్ ఫటాఫట్... హరారేలో జింబాబ్వేపై ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) చేసిన భారీ సెంచరీ టి20 అత్యుత్తమ ఇన్నింగ్స్గా నిలిచింది. ఈ మ్యాచ్లో 72 బంతుల్లోనే 16 ఫోర్లు, 10 సిక్సర్లతో 172 పరుగులు చేసిన ఫించ్ అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. స్కాట్లాండ్ ఆటగాడు కాలమ్ మెక్లాయిడ్ ‘అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ఇయర్’ అవార్డును గెలుచుకున్నాడు. వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో అఫ్గానిస్తాన్పై 157 పరుగులు చేసిన అతను... ఇంగ్లండ్పై 140 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఇతర అవార్డుల్లో ‘స్పిరిట్ ఆఫ్ ద ఇయర్’ను విలియమ్సన్ (న్యూజి లాండ్) గెలుచుకోగా, కుమార ధర్మసేన (శ్రీలంక) ఉత్తమ అంపైర్గా నిలిచాడు. భారత యువ జట్టు అండర్–19 వరల్డ్ కప్ గెలుచుకోవడం ‘అభిమానుల అత్యుత్తమ క్షణం’గా ఎంపికైంది. ►1 ఐసీసీ ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారాన్ని రెండోసారి నెగ్గిన తొలి భారత క్రికెటర్గా కోహ్లి గుర్తింపు పొందాడు. గతేడాది కూడా కోహ్లికి ఈ అవార్డు లభించింది. గతంలో రాహుల్ ద్రవిడ్ (2004), సచిన్ (2010), అశ్విన్ (2016) ఒక్కోసారి ఈ అవార్డు అందుకున్నారు. ►1 ఐసీసీ ‘వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు మూడుసార్లు (2012, 2017, 2018) ఎంపికైన తొలి భారత క్రికెటర్ కోహ్లినే. ధోనికి (2008, 2009) రెండుసార్లు ఈ అవార్డు వచ్చింది. ►5 ఐసీసీ ‘టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు పొందిన ఐదో భారత క్రికెటర్ కోహ్లి. గతంలో రాహుల్ ద్రవిడ్ (2004), గంభీర్ (2009), సెహ్వాగ్ (2010), అశ్విన్ (2016) ఈ ఘనత సాధించారు. చాలా అద్భుతంగా అనిపిస్తోంది. సంవత్సరం మొత్తం చేసిన కఠోర శ్రమకు దక్కిన గుర్తింపు ఇది. వ్యక్తిగతంగా చాలా గొప్పగా అనిపిస్తుండటమే కాదు... నేను బాగా ఆడుతున్న సమయంలోనే జట్టు కూడా మంచి ఫలితాలు సాధించడం పట్ల చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందరో ఆటగాళ్లు అంతర్జాతీయ వేదికపై ఆడుతున్నప్పుడు ఐసీసీ నుంచి గుర్తింపు లభించడం అంటే ఒక క్రికెటర్గా ఇది నేను గర్వపడే క్షణం. ఈ రకమైన ప్రోత్సాహం ఇదే ఘనతను పునరావృతం చేసేందుకు కావాల్సిన స్ఫూర్తినందిస్తుంది. క్రికెట్ ప్రమాణాలను నిలబెట్టేందుకు, మరింత నిలకడగా రాణించేందుకు ఇలాంటివి అవసరం. – కోహ్లి, భారత కెప్టెన్ -
టెస్టులకు డ్వేన్ బ్రేవో గుడ్బై
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ప్రపంచకప్లో చోటు దక్కించుకోలేకపోయిన వెస్టిండీస్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రేవో టెస్టు ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. చివరి టెస్టు మ్యాచ్ను 2010 డిసెంబర్లో ఆడిన 31 ఏళ్ల ఈ ఆల్రౌండర్ వన్డే, టి20 ఫార్మాట్లో మాత్రం కొనసాగుతానని చెప్పాడు. ‘టెస్టు క్రికెట్కు నేను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. ఈ నిర్ణయాన్ని ఇప్పటికే విండీస్ క్రికెట్ బోర్డుకు తెలిపాను. అలాగే పరిమిత ఓవర్ల ఫార్మాట్లో ఆడాలనే నా కోరికను కూడా చెప్పాను. ఇన్నేళ్లుగా అంకితభావంతో, అంతులేని ఆసక్తితో ఆడాను. మా ప్రాంత ప్రజలు అత్యద్భుతమైన ఆటగాళ్లను గతంలో చూశారు. కానీ మేం అప్పటి వైభవాన్ని తేలేకపోయాం. అయితే క్రికెట్పై మా ప్రేమ మాత్రం ఎప్పటిలాగే కొనసాగుతుంది. నాకు అన్నివేళలా అండగా నిలిచిన వారికి కృతజ్ఞతలు’ అని బ్రేవో అన్నాడు. కెరీర్లో 40 టెస్టులు ఆడిన బ్రేవో 2,200 పరుగులు చేయగా ఇందులో మూడు సెంచరీలున్నాయి. అలాగే 86 వికెట్లు తీశాడు. -
టీమిండియా ఆరంభ శూరత్వం
-
‘కెప్టెన్ కూల్’ తప్పటడుగులు!
మహేంద్ర సింగ్ ధోని అంటే మైదానంలో కదిలే కంప్యూటర్లాంటివాడు... ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఒత్తిడికి లోను కాకుండా ప్రత్యర్థిని బోల్తా కొట్టించడంలో అతని ప్రత్యేకతే వేరు. తనదైన శైలిలో కొత్త తరహా వ్యూహాలతో ఎదుటి బ్యాట్స్మెన్ను కట్టడి చేయగల సామర్థ్యం అతని సొంతం. మ్యాచ్ చేజారిపోతున్న క్షణాల్లోనూ కేవలం కెప్టెన్ సూచనలతోనే ఫలితాలు సాధించామని బౌలర్లంతా చెబుతారు. మరి ఇంగ్లండ్ సిరీస్లో ఆ వ్యూహాలు ఏమయ్యాయి? గత రెండు టెస్టుల్లో ధోనికి అంతా రివర్స్లో జరుగుతోంది. సంప్రదాయ వ్యూహాలను దాటి భిన్నంగా చేస్తున్న ఏ ప్రయత్నమూ విజయవంతం కావడం లేదు. అసలు అతనికి తన బౌలర్ల మీద నమ్మకం సడలిందా... లేక ఇక ఏమీ చేయలేమంటూ ముందే చేతులెత్తేస్తున్నాడా... అన్నింటికి మించి అతని వన్డే వ్యూహాలు టెస్టులకు పనికి రావడం లేదా! ధోని వ్యూహాలు విఫలం బౌలర్లపై అనవసరపు ఒత్తిడి సహచరులపై నమ్మకం సడలిందా! సాక్షి క్రీడా విభాగం : లార్డ్స్ టెస్టు...రెండో ఇన్నింగ్స్లో షార్ట్ పిచ్ బంతులు వేయమని ఇషాంత్కు ధోని సూచించాడు. అయితే ఇషాంత్ ఆరంభంలో ఇష్టపడలేదు. కానీ కెప్టెన్ నచ్చజెప్పాక షార్ట్ బంతులతో చెలరేగాడు. ఫలితంగా భారత్కు చిరస్మరణీయ విజయం దక్కింది. ఈ విషయాన్ని ఇద్దరూ స్వయంగా వెల్లడించారు. సాధారణంగా తన గురించి తక్కువగా మాట్లాడే ధోని కూడా తనకూ, ఇషాంత్కు మధ్య ఎలాంటి చర్చ సాగిందో, అది ఎలాంటి ఫలితాన్నిచ్చిందో పదే పదే చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఇప్పుడు అదే ధోనిలో అతి విశ్వాసానికి కారణమైనట్లుంది. అవసరం లేకపోయినా కెప్టెన్ దిశానిర్దేశం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇలాగే బంతులు వేయండి! ఓల్డ్ ట్రాఫర్డ్ టెస్టులో వరుణ్ ఆరోన్ తన కొత్త స్పెల్ వేసేందుకు సిద్ధమయ్యాడు. అంతలో గల్లీలో ఉన్న విరాట్ కోహ్లి లెగ్స్లిప్కు మారాడు. ఇలా ఎందుకంటూ ఆరోన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయితే కెప్టెన్ దానిని అంగీకరించకుండా బౌలింగ్ వేయమని ఆరోన్కు సూచించాడు. ఆ తర్వాత జడేజా విషయంలోనూ అదే జరిగింది. ఓవర్ ది వికెట్ వేసేందుకు జడేజా ముందుకొచ్చాడు. అంతే...అతడిని ఆపి రౌండ్ ది వికెట్ వేయమని ధోని చెప్పాడు. ఈ సారి అయితే జడేజా మారు మాట్లాడకుండా కెప్టెన్ చెప్పినట్లే చేశాడు. సాధారణంగా బౌలర్ తన ఆలోచనలను, వ్యూహాలను కెప్టెన్తో పంచుకుంటాడు. దానికి అనుగుణంగా ఫీల్డర్లను పెట్టమని కోరతాడు. ఫీల్డింగ్ ప్రకారమే తాను బంతులు విసిరేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఇంగ్లండ్ సిరీస్లో ధోని బౌలర్ల మనసులో దూరి తాను అనుకున్న విధంగా చేస్తున్నట్లు అనిపిస్తోంది. విజయవంతమైనా, విఫలమైనా ఎక్కువ ఆలోచనలు వికెట్ల వెనకనుంచే వస్తున్నాయి. పరిస్థితి చూస్తుంటే భారత్ వైఫల్యంలో బౌలర్లను నిందించడంకన్నా ధోని వ్యూహాలనే తప్పు పట్టాల్సి వస్తోంది. తాను కోరుకున్న ఫీల్డింగ్నే పెట్టడం, దానికి అనుగుణంగానే బౌలింగ్ చేయమని ఒత్తిడి తేవడం అనూహ్యం. లెగ్ స్లిప్, ఫైన్ లెగ్, షార్ట్ స్క్వర్ లెగ్ వంటి ఫీల్డింగ్తో ఏ పేస్ బౌలరైనా బౌలింగ్ చేస్తాడా అనేది ఆశ్చర్య పడాల్సిన విషయం. ఊరించే షార్ట్ పిచ్ బంతులు వేస్తే తప్ప లెగ్సైడ్లో వికెట్ వెనక ముగ్గురు ఫీల్డర్లు అనవసరం. కానీ ఇషాంత్ తరహాలో పేస్, దూకుడు లేని భువనేశ్వర్, పంకజ్లాంటి పేసర్ల బౌలింగ్తో ఏం ఫలితం దక్కుతుంది? పైగా లార్డ్స్ టెస్టులో చేసిన తప్పునే ఇంగ్లండ్ మళ్లీ ఎందుకు చేస్తుంది. ఇది చూస్తే ఒకే తరహా మూస వ్యూహంతో ధోని వెళుతున్నట్లు కనిపించింది. అసలు టెస్టుల్లో లెగ్ స్లిప్లో క్యాచ్ లభించడం చాలా అరుదు. ఈ సిరీస్లో ఇంగ్లండ్ అసలు ఆ వైపు చూడకుండా స్లిప్స్పైనే దృష్టి పెట్టి ఆఫ్ స్టంప్పై బంతులతో విజయవంతమైంది. పైగా కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేసే భువనేశ్వర్ పదే పదే లెంగ్త్ మార్పుతో మరో కొత్త బంతి వచ్చే సమయానికి తీవ్రంగా అలసిపోయి ప్రభావం చూపలేకపోతున్నాడు. వికెట్లు అవసరం లేదా! ఒక టెస్టు మ్యాచ్ నెగ్గాలంటే ప్రత్యర్థి జట్టును రెండు సార్లు ఆలౌట్ చేయాల్సిందేననేది ప్రాథమిక సూత్రం. వన్డేల్లోనైతే పరుగులు రాకుండా నిరోధించినా మ్యాచ్లు గెలుచుకోవచ్చు. ఈ సూత్రాన్ని పరిమిత ఓవర్లలో ధోని అత్యద్భుతంగా అమలు చేశాడు. కానీ టెస్టుల్లో అలా కాదు. సౌతాంప్టన్ టెస్టులో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు కుక్, బాలెన్స్ క్రీజ్లో ఉన్నప్పుడు ఏడుగురు ఫీల్డర్లను లెగ్సైడ్లో ఉంచి జడేజాతో ధోని బౌలింగ్ చేయించాడు. 21 ఓవర్ల ఆ స్పెల్లో జడేజా 30 పరుగులే ఇచ్చాడు. కానీ బ్యాట్స్మెన్ ఎలాంటి రిస్క్ తీసుకోకపోవడంతో పరుగులు రాలేదు కానీ వారిపై ఒత్తిడి తగ్గిపోయింది. ఆ తర్వాత కుక్ స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించాడు. సెంచరీకి ముందు కుక్ అవుటైనా అప్పటికే సమయం మించిపోయింది. అసలు జడేజా వికెట్లు తీయగలడని ధోనికి నమ్మకం లేదా! వాస్తవానికి మొయిన్ అలీ అటాకింగ్ బౌలింగ్తో పోలిస్తే జడేజా, అశ్విన్లు ఆత్మ రక్షణ ధోరణిలో బంతులు విసరడంతోనే వారికి వికెట్లు దక్కలేదు. మూడో టెస్టులో భారత్ 163.4 ఓవర్ల పాటు బౌలింగ్ చేస్తే ధోని 52 సార్లు బౌలింగ్ మార్పులు చేయడం విశేషం! నిజాయితీగా ఆలోచిస్తే భారత్లో మూడు లేదా నాలుగో రోజు పిచ్లపై స్పిన్నర్లు పండగ చేసుకుంటారు. బౌలర్ కొంత కష్టపడితే పిచ్ అండగా నిలుస్తుంది. కానీ సౌతాంప్టన్, మాంచెస్టర్లాంటి మైదానాలు అలా కాదు. కాబట్టి ఇక్కడి దాని కోసం ప్రత్యేక వ్యూహాలు అవసరం. ఇప్పుడు సిరీస్ గెలిచే అవకాశమైతే లేదు కానీ చివరి టెస్టు నెగ్గాలంటే కెప్టెన్ కూల్ తన మేధస్సుకు మరింత పదును పెట్టాల్సి ఉంది. కాస్త ఓపిక పడదాం: గవాస్కర్ న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత జట్టు సంధికాలంలో ఉన్నందున ఫలితాల గురించి ఆందోళన చెందకుండా, కాస్త ఓపిక పట్టాలని మాజీ కెప్టెన్ గవాస్కర్ అభిమానులకు సూచించారు. ‘కొద్ది కాలం క్రితం ప్రపంచ ప్రసిద్ధ ఆటగాళ్లు భారత జట్టుకు దూరమయ్యారు. ప్రస్తుతం టీమిండియా సంధికాలంలో ఉంది. దిగ్గజ ఆటగాళ్ల స్థానాలను యువ ఆటగాళ్లు అంత సులువుగా భర్తీ చేయలేరు. అందుకే కాస్త ఓపిక పట్టాలి. అయితే ఇటీవల టెస్టు ఫార్మాట్లో జట్టు ఇబ్బంది పడుతుందనే విషయం వాస్తవం’ అని గవాస్కర్ అన్నారు. ఇంగ్లండ్ స్పిన్నర్ మొయిన్ అలీ అద్భుత బంతులేమీ వేయలేదని, పరుగులు తీయాలనే తొందరలో భారత ఆటగాళ్లు అవుటైనట్టు చెప్పారు. ప్రపంచ క్రికెట్ను శాసిస్తున్న భారత్పై సహజంగానే చాలామందికి అసూయగా ఉంటుందని, అందుకే జట్టును తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నిస్తుంటారని అన్నారు. అయితే భారత ఆటగాళ్లు టెస్టులు ఆడదలుచుకుంటే కచ్చితంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పాల్గొనేలా చూడాలని టీమ్ మేనేజ్మెంట్కు, బీసీసీఐకి సన్నీ సూచించారు.