Advertisement
Theatrical
-
ఈ వారం థియేటర్, ఓటీటీలోకి వచ్చే సినిమాలివే
కరోనా ప్రభావం తగ్గి ఆడియన్స్ ఇప్పుడిప్పుడే థియేటర్ల వైపు కదులుతున్నారు. దీంతో ఇప్పటికే కొన్ని సినిమాలు థియేటర్స్ విడుదలై మంచి విజయాన్ని సాధించగా, మరికొన్ని విడుదలైయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అలాగే మరి కొన్ని డెరెక్ట్ ఓటీటీ రిలీజ్కి, ఇంకొన్ని ఇటీవలే థియేటర్లలో విడుదలై ఇప్పుడు ఓటీటీల్లో ప్రేక్షకులని అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఈ తరుణంలో ఈ వారం ఆడియన్స్ ముందుకు వస్తున్న సినిమాలపై ఓ లుక్ వేయండి. ‘ఉప్పెన’ తర్వాత ‘కొండపొలం’తో వస్తున్న వైష్ణవ్తేజ్ వైష్ణవ్తేజ్ హీరోగా పరిచయమైన ‘ఉప్పెన’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఆయన ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘కొండపొలం’. రకుల్ ప్రీత్ సింగ్ కథనాయికగా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 8న థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి నవల ‘కొండపొలం’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మెడికల్ క్రైమ్ థ్రిల్లర్గా ‘వరుణ్ డాక్టర్’ ‘రెమో’ సినిమాతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న తమిళ నటుడు శివ కార్తికేయన్. ఇప్పటికే ఆయన నటించిన కొన్ని అనువాద సినిమాలు ప్రేక్షాకదరణని పొందాయి. నీల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఆయన హీరోగా చేసిన తాజా చిత్రం ‘వరుణ్ డాక్టర్’. మెడికల్ క్రైమ్ థ్రిల్లర్గా వస్తున్న ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటించింది. షూటింగ్ పూర్తై కోవిడ్ నేపథ్యంలో విడుదల ఆలస్యమైన ఈ సినిమా అక్టోబరు 9న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనుంది. ‘ఆరడుగుల బుల్లెట్’గా రానున్న గోపిచంద్ డైరెక్టర్ బి.గోపాల్ దర్శకత్వంలో గోపీచంద్, నయనతార హీరోహీరోయిన్లుగా చేసిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. జయబాలజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిలెట్ పతాకంపై తాండ్ర రమేశ్ నిర్మించాడు. కొన్నేళ్ల క్రితమే చిత్రీకరణ పూర్తైన ఈ చిత్రం వివిధ కారణాల వల్ల విడుదలకు కాలేదు. ఎట్టకేలకు అక్టోబర్ 8న ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలో ప్రకాశ్రాజ్, బ్రహ్మానందం కీలకపాత్రలు పోషించారు. ప్రేమకథ చెబుతానంటున్న నవీన్ చంద్ర సురేష్ ఉత్తరాది దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘నేను లేని నా ప్రేమకథ’. నవీన్చంద్ర కథానాయకుడిగా గాయత్రి ఆర్.సురేష్, అదితి మ్యాకల్ కథానాయికలు చేస్తున్నారు. కల్యాణ్ కందుకూరి, అన్నదాత భాస్కర్రావు, నిమ్మకాయల దుర్గాప్రసాద్రెడ్డి, నిర్మాతలగా వ్యవహరిస్తున్నారు. అక్టోబరు 8న థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ మూవీలోని ప్రేమకథ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుందని మేకర్స్ ఇటీవల తెలిపారు. ఓటీటీలో విడులయ్యే చిత్రాలు! ఓటీటీలో అలరించనున్న శ్రీ విష్ణు శ్రీ విష్ణు హీరోగా నటించిన చిత్రం ‘రాజ రాజ చోర’. ఇప్పటికే థియేటర్లలో విడుదలై ప్రేక్షకులని అలరించిన ఈ సినిమా ఇప్పుడు అక్టోబరు 8 నుంచి ఓటీటీ ‘జీ 5’లో స్ట్రీమింగ్ కానుంది. హసిత్ గోలి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మేఘా ఆకాశ్, సునయన కథానాయికలుగా నటించారు. ‘అంధాదున్’ మలయాళ రీమేక్గా వస్తున్న ‘భ్రమమ్’ బాలీవుడ్ హిట్ మూవీ ‘అంధాదున్’ని నితిన్ ‘మ్యాస్ట్రో’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తెచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఓటీటీలో విడుదలైన ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ హిందీ సినిమాని ‘భ్రమమ్’గా మలయాళంలో రిమేక్ చేస్తున్నాడు మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. రాశిఖన్నా హీరోయిన్గా చేస్తున్న ఈ చిత్రంలో మమతా మోహన్దాస్ కీలక పాత్రలో నటిస్తోంది. వినూత్న కథాంశంతో వస్తున్న ఈ మూవీ అక్టోబరు 7 నుంచి ఓటీటీ ఫ్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ మరో సినిమా ‘కోల్డ్ కేస్’ మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా చేసిన మరో చిత్రం ‘కోల్డ్ కేస్’. మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి తను బాలక్ దర్శకుడు. జూన్ 30న మలయాళం భాషలో అమెజాన్ ప్రైమ్లో విడుదలైన ఈ సినిమా తెలుగు వెర్షన్ ‘ఆహా’లో అక్టోబరు 8న విడుదల కానుంది. ఓటీటీలో మరికొన్ని.. నెట్ఫ్లిక్స్ హౌస్ ఆఫ్ సీక్రెట్స్- 8 అక్టోబరు ఎస్కేప్ ది అండర్ టేకర్- 5 అక్టోబరు డేర్స్ సమవన్ ఇన్సైడ్ యువర్ హౌస్- 6 అక్టోబర్ అమెజాన్ ప్రైమ్ జస్టిన్ బీబర్ ఔర్ వరల్డ్- 8 అక్టోబరు మాడ్రెస్- 8 అక్టోబరు సోనీ లివ్ అప్పథావా ఆట్టయా పొట్టుటాంగా- 8 అక్టోబరు డిస్నీ+హాట్ స్టార్ ముప్పెట్స్ హంటెడ్ మాన్షన్- 8 అక్టోబరు -
ఓటీటీలో టక్ జగదీష్? రూమర్లకు చెక్
‘‘టక్ జగదీష్’ చిత్రం ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారంలో వాస్తవం లేదు. థియేటర్లలోనే రిలీజ్ చేస్తాం’’ అని చిత్రబృందం స్పష్టం చేసింది. ‘నిన్నుకోరి’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత హీరో నాని, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘టక్ జగదీష్’. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్లో విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందనే వార్తలు వచ్చాయి. దీనిపై చిత్రబృందం స్పందిస్తూ– ‘‘టక్ జగదీష్’ ఓటీటీలో రిలీజ్ కానుందనే వార్తలు అవాస్తవం. ఇది పూర్తిగా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం రూపొందించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చాక సినిమా విడుదల తేదీ చెబుతాం’’ అని పేర్కొంది. ఈ చిత్రా నికి: ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్). -
అన్లాక్ థియేటర్స్
థియేటర్లు రీ ఓపెన్ చేయొచ్చని కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ నెల ప్రారంభంలోనే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో చాలా చోట్ల థియేటర్స్ను ఓపెన్ చేశారు. కానీ తమిళనాడు ప్రభుత్వం మాత్రం థియేటర్స్ తెరవడానికి అనుమతి ఇవ్వలేదు. తాజాగా నవంబర్ 10 నుంచి మల్టీప్లెక్స్లు, థియేటర్స్ అన్నింటినీ అన్లాక్ చేయొచ్చని ప్రకటించింది. ఈ ప్రకటనతో థియేటర్స్ యజమానులు తాళాలు తీయడానికి రెడీ అవుతున్నారు. 50 శాతం సీటింగ్తో అనుమతి ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. -
నాటకరంగం చాలా గొప్పది
సాక్షి, సిటీబ్యూరో: నాటక రంగం చాలా గొప్పదని ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ. రామలింగేశ్వరరావు తెలిపారు. సోమవారం రవీంద్రభారతిలో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ 22వ ఉభయ తెలుగు రాష్ట్రస్థాయి నాటిక పోటీల 2016 బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తి నాటకరంగానికి ఉందన్నారు. నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రజాసామ్యం ధనసామ్యంగా మారిందన్నారు. ధనవంతులే సినీ, రాజకీయ రంగాల్లోకి వస్తున్నారన్నారు. ఏమీలేని వారికి సినిమాల్లో అవకాశం కల్పించిన దాసరి నారాయణరావును సినీ అంబేద్కర్గా అభివర్ణిస్తున్నట్లు చెప్పారు. అక్కినేని నాగేశ్వరరావుకి తాను గొప్ప అభిమానినని, సత్కారాలకు దూరంగా ఉండేతాను డాక్టర్ అక్కినేని జీవన సాఫల్య పురస్కారం అంటే అంగీకరించక తప్పలేదన్నారు. మాజీ పార్లమెంట్ సభ్యులు, సినీనటుడు డాక్టర్ కైకాల సత్యనారాయణ, డాక్టర్ అక్కినేని నాటక కళాపరిషత్ అధ్యక్షులు సారిపల్లి కొండలరావు, చిత్ర దర్శకులు కోడి రామకృష్ణ , గజల్ శ్రీనివాస్. క్రిష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. -
నాటకరంగ అనుభవమే భుక్తి
ప్రముఖ సినీ నటుడు వైజాగ్ప్రసాద్ ఖమ్మం కల్చరల్ : ఆ నాటి నాటక రంగ అనుభవమే నేటి ముక్తికి మార్గమైందని ప్రముఖ సినీ నటుడు వైజాగ్ ప్రసాద్ పేర్కోన్నారు. నెలనెలా వెన్నెల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఖమ్మం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం నటనా రంగంలో అనుభవంతో పనిలేకుండా ఎవరితో పడితే వాళ్లతో నటింపజేసి నాణ్యతలేని, జీవం లేని సినిమాలు, సీరియళ్లను నిర్మించడం దారుణమన్నారు. మరీ కొన్ని సినిమాలు, సీరియళ్లలో సంస్కృతి, సంప్రదాయాలను మంటగలిపేస్తున్నారని వాపోయారు. 50 ఏళ్లుగా నాటకాలు వేస్తున్నానని, సినిమాల్లో అనేక పాత్రలు చేశానని తెలిపారు. నాటకరంగలో రచన, నటన, దర్శకత్వం రంగాల్లో గుర్తింపు లభించిందని, అనేక అవార్డులొచ్చాయని చెప్పారు. మాట్లాడుతున్న వైజాగ్ ప్రసాద్