Umesh Kumar petition
-
దినేష్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా
న్యూఢిల్లీ : మాజీ డీజీపీ దినేష్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణను ఆగస్ట్ 12వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి మధ్యంతర నివేదికను సీబీఐ కోర్టుకు సమర్పించింది. కాగా దినేష్ రెడ్డి ఆస్తులపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. దినేష్డ్డితో సహా ఆయన సతీమణి కమలా రెడ్డికి చెందిన అన్ని ఆస్తుల లావాదేవీలపై పూర్తి విచారణకు ఆదేశించాలంటూ ఐపీఎస్ అధికారి ఉమేష్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
దినేష్ రెడ్డి ఆస్తులపై విచారణకు సుప్రీం ఆదేశం
-
దినేష్ రెడ్డి ఆస్తులపై విచారణకు సుప్రీం ఆదేశం
హైదరాబాద్ : పోలీస్ డైరక్టర్ జనరల్ దినేష్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన ఆస్తులపై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఐపీఎస్ ఉమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై ఉన్నత న్యాయస్థానం శుక్రవారం తీర్పు ఇచ్చింది. దినేష్డ్డితో సహా ఆయన సతీమణి కమలా రెడ్డికి చెందిన అన్ని ఆస్తుల లావాదేవీలతో పాటు డీజీపీ కుటుంబసభ్యులు వై.రవిప్రసాద్, ఏ.కృష్ణారెడ్డి జరిపిన అన్ని లావాదేవీలపై పూర్తి విచారణకు ఆదేశించాలంటూ ఆయన తన పిటీషన్లో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు... ఉమేష్ కుమార్ పిటిషన్లోని అభియోగాలను ఎదుర్కోవల్సిందేనని దినేష్ రెడ్డికి స్పష్టం చేసింది. దర్యాప్తులోని అభ్యంతరాలను ట్రయిల్ కోర్టులో తేల్చుకోవాలని డీజీపీకి సుప్రీంకోర్టు సూచించింది. డీజీపీ భార్యకు రంగారెడ్డి జిల్లా చంపాపేట, మహేశ్వరం, మేడ్చల్ లలో 90కి పైగా భూముల లావాదేవీలు అమ్మటం, కొనటం జరిగిందని ఉమేష్ కుమార్ తన పిటిషన్లో పేర్కొన్నారు. కాగా దినేష్రెడ్డి తన భార్య పేరుతో బెనామీగా ఆస్తులను కూడబెట్టారంటూ ఉమేశ్కుమార్, అలాగే షూ కుంభకోణంలో ఉమేశ్కుమార్ నిందితుడిగా ఉన్నారంటూ దినేష్రెడ్డి పరస్పర ఆరోపణలతో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. -
ఉమేష్ కుమార్ పిటిషన్పై ముగిసిన వాదనలు
ఢిల్లీ: డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డిజిపి) దినేష్రెడ్డిపై ఉమేష్కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్ చేసింది. ఫోర్జరీ కేసులో గతంలో ఐపీఎస్ అధికారి ఉమేష్ కుమార్పై సుప్రీంకోర్టులో పిటీష్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ కేసులో డీజీపీ దినేష్ రెడ్డిని ప్రతివాదిగా చేర్చాలంటూ ఉమేష్ మధ్యంతర పిటిషన్ వేశారు. దీంతో గతంలో దినేష్ రెడ్డికి సుప్రీం కోర్టుకు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలో ఈ ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారుల మధ్య తలెత్తిన వివాదంపై గతంలో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఒకరిపై ఒకరు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. న్యాయస్థానాలను ఆశ్రయించారు. నిజాయితీ గల ఐఎఎస్ అధికారితో కానీ ఐపీఎస్ అధికారితో కానీ విచారణ జరిపించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. డీజీపీగా పని చేస్తున్న వ్యక్తికి సంబంధించిన ఆస్తులపై విచారణ జరిపించాలని హైకోర్టు ఆదేశించడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. డీజీపీ దినేష్రెడ్డి తన భార్య పేరుతో అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకున్నట్లు ఉమేష్కుమార్ ఆరోపించగా, షూ కోనుగోళ్లలో ఉమేష్కుమార్ అక్రమాలకు పాల్పడట్లుగా దినేష్రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.