vikarabad mla
-
బీఆర్ఎస్కు బిగ్ షాక్
వికారాబాద్ అర్బన్: కొంత కాలంగా వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్పై తీవ్ర అసంతృప్తితో ఉన్న మున్సిపల్ చైర్పర్సన్ దంపతులు మంజుల రమేష్ ఆదివారం బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. వారి రాజీనామాతో పట్టణంలో పార్టీకి గట్టి దెబ్బే అని చెప్పవచ్చు. మున్సిపల్ పరిధిలోని అన్ని వర్గాల్లో రమేష్ కుమార్కు మంచి పట్టు ఉంది. మాస్ నాయకుడిగా గుర్తింపు పొందారు. అనేక సార్లు స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. నాలుగు సార్లు ఇండిపెండింట్గా పోటీ చేసి కౌన్సిలర్గా విజయం సాధించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత 2015లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తరఫున మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన రమేష్కుమార్ అందరి ఊహలను తలకిందులు చేస్తూ ఏడుగురు కౌన్సిలర్లను గెలిపించుకున్నారు. దీంతో ఆయనకు పట్టణంలో మరింత పట్టు పెరిగింది. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ ఏ చంద్రశేఖర్కు మద్దతు ఇచ్చారు. చంద్రశేఖర్ సాధించిన 20వేల ఓట్లలో సుమారు మూడు వేల ఓట్లు పట్టణంలో పోలయ్యాయి. ఇందులో రమేష్ కుమార్ ప్రధాన భూమిక పోషించారనే ప్రచారం ఉంది. 2020లో బీఆర్ఎస్లోకి.. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో రమేష్ కుమార్ చైర్మన్ పదవి ఆశించి బీఆర్ఎస్కు దగ్గరయ్యారు. అయితే చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వు రావడంతో అనూహ్యంగా తన సతీమణి మంజులను బీఆర్ఎస్ తరఫున 24వ వార్డు కౌన్సిరల్గా పోటీ చేయించారు. ఆమె ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో చైర్పర్సన్ పదవి దక్కింది. ఆ తరువాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు చైర్పర్సన్ దంపతులకు, ఎమ్మెల్యే ఆనంద్కు తీవ్రంగా గ్యాప్ పెంచింది. అప్పటి నుంచి ఎమ్మెల్యే ఆనంద్ అధికార పార్టీ కౌన్సిలర్లతో అనేక సార్లు కౌన్సిల్ సమావేశాల్లో చైర్పర్సన్కు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేయించారని చైర్పర్సన్ దంపతులే నేరుగా ఆరోపించారు. అధికార పార్టీ కౌన్సిలర్లు ఎవరూ కౌన్సిల్ సమావేశానికి హాజరు కాకుండా చేశారని మీడియా ముందు వాపోయారు. అంతటితో ఆగకుండా సొంత పార్టీ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం పెట్టించిన ఘనత ఎమ్మెల్యేకు దక్కుతుందని కూడా ఆరోపించారు. కౌన్సిల్ సమావేశంలో తోటి మహిళా కౌన్సిలర్ చేతిలో నుంచి మైక్ తీసుకున్నందుకు తనపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారని, పార్టీ పెద్దలు జోక్యం చేసుకోవడంతో కేసు వాపసు తీసుకున్నారని చైర్పర్సన్ అప్పట్లో ఆరోపించారు. అనేక అభివృద్ధి పనులకు ఆమోదం తెలపకుండా ఎమ్మెల్యే అడ్డుకున్నారని బహిరంగంగానే విమర్శించారు. ఎంత అవమానించినా భరిస్తూ పార్టీలో కొనసాగినట్లు తెలిపారు. తమకు సముచిత స్థానం లేని చోట ఉండటం ఇష్టం లేకనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆమె తెలిపారు. మంజుల రమేష్కుమార్ దంపతుల బాటలోనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన 6వ వార్డు కౌన్సిలర్ చందర్ నాయక్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జే అరుణ్ కుమార్, విశ్రాంత ఇంజనీర్, జే ప్రదీప్ కుమార్, బీఆర్ఎస్ పట్టణ యువ నాయకుడు సాయికృష్ణ పార్టీకి రాజీనామా చేశారు. ఏది ఏమైనా ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంజుల రమేష్కుమార్ దంపతులు బీఆర్ఎస్ను వీడడం గట్టి దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
పరిహారం అడిగితే.. పోలీసులకు పట్టించిన ఎమ్మెల్యే
సాక్షి, వికారాబాద్ : గతంలో ఇచ్చిన మాట ప్రకారం న్యాయం చేయమని అడిగిన పాపానికి ఎమ్మెల్యే ఆనంద్ తనను పోలీసులకు పట్టించాడని ఓ రైతు వాపోయాడు. బాధితుడి వివరాలు ఇలా ఉన్నాయి.. ‘మాది బంట్వారం మండలం బీరోల్. గ్రామ రెవెన్యూ పరిధిలోని వ్యవసాయ పొలాల నుంచి గత ఏడాది ఫార్మేషన్ రోడ్డు నిర్మించారు. ఇందులో నాతో పాటు పలువురు రైతులకు చెందిన వ్యవసాయ భూములు పోయాయి. మిగితావారితో పోలిస్తే నా పొలం.. అర ఎకరం మేర అదనంగా కోల్పోయా. ఈ విషయాన్ని అప్పట్లో ఎమ్మెల్యే ఆనంద్ దృష్టికి తీసుకెళ్లా. నాకు న్యాయం చేయాలని అభ్యరి్థంచా. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన పరిహారం అందేలా చూస్తానని అప్పట్లో మాటిచ్చారు. కానీ రోడ్డు నిర్మాణం పూర్తయిన తర్వాత వెళ్లి అడిగితే పట్టించుకోలేదు. చదవండి: ప్రయాణికుడి ట్వీట్కు స్పందించిన కేటీఆర్ రోడ్డులో తన భూమి పోయిందని పత్రాలు చూపిస్తున్న శ్రీనివాస్రెడ్డి దీంతో శుక్రవారం నేను వికారాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లా. ఇచ్చిన మాట ప్రకారం తనకు పరిహారం అందేలా చూడమని అడిగా. అయితే తనను నేను సతాయిస్తున్నానని ఎమ్మెల్యే పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు నన్ను జీప్లో ఎక్కించుకుని పీఎస్కు తీసుకెళ్లారు. నియోజకవర్గ పౌరుడిగా ఎమ్మెల్యే వద్దకు వచ్చి న్యాయం చేయమని అడగటం నేరమా..? ఇలా పోలీసులకు పట్టించడం, బెదిరించడం దారుణం. నన్ను పీఎస్కు తీసుకెళ్లిన పోలీసులు ఆతర్వాత వ్యక్తిగత పూచీకత్తుపై వదిలేశారు. ముందుగా ఇచి్చన మాట ప్రకారం నాకు న్యాయం చేయాలి’. అని బాధితుడు మీడియా ఎదుట వాపోయాడు. ఈ విషయమై వివరణ కోరేందుకు ఎమ్మెల్యేకు ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు. -
రాజకీయాలంటే ఆయనకు ఇష్టం: సబితా ఆనంద్
‘నా భార్య కొండంత అండ.. అన్ని విషయాల్లో సూచనలు, సలహాలు ఇస్తుంది. మా మధ్యన ఎలాంటి దాపరికాలూ ఉండవు. ప్రతి విషయాన్ని ఇద్దరం కలిసి పంచుకుంటాం’ అని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ చెప్పారు. తన భర్తకు చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే ఇష్టమని.. ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. కుటుంబ బాధ్యతలు, ఆస్పత్రి నిర్వహణ తాను చూసుకుంటున్నానని ఆనంద్ భార్య సబిత చెప్పారు. వారి జీవన విశేషాలను శనివారం ‘సాక్షి’తో పంచుకున్నారు. సాక్షి, వికారాబాద్: మా సొంత గ్రామం ధారూరు మండలం కేరెళ్లి. మాది చిన్న కుటుంబం. ఇద్దరు అక్కలు, నేను. నా విద్యభ్యాసం మొత్తం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో కొసాగింది. ఒకటి నుంచి 7వ తరగతి వరకు కేరెళ్లిలోని సీయుపీఎస్లో, ఆ తరువాత 8 నుంచి పదవ తరగతి వరకు ధారూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో కొనసాగింది. ఇంటర్ వికారాబాద్ ఎస్ఏపీ కళాశాలలో బైపీసీలో చేరి చదివాను. ఆ తరువాత మా గురువు డాక్టర్ టి.వీరయ్య ప్రోద్బలంతో ఎంసెట్లో మొదటి సారి ర్యాంకు సాధించి గాంధీ మెడికల్ కళాశాలలో చేరి 1999లో డాక్టర్ పట్టా అందుకున్నా. మా ఇంట్లో నా కంటే ముందు చదువుకున్నావారు లేరు. నేను మాత్రమే డాక్టర్ అయ్యాను. ఎండీ, ఎంఎస్ కాకతీయ మెడికల్ కళాశాలలో 2003లో పూర్తి చేశాను. ఎండీ, ఎంఎస్ చేసిన డాక్టర్లు అప్పట్లో తెలంగాణ వ్యాప్తంగా నాకు తెలిసి పది మంది లోపే ఉంటారు. నేను మొదటి నుంచి అన్నింట్లోనూ మొదటి స్థానాన్నే సంపాదించుకున్నా. ప్రభుత్వ స్కాలర్షిప్తో నా విద్యభ్యాసం కొనసాగింది. అందరు మాది ప్రేమ వివాహం అని అనుకుంటారు. కానీ, మాది పెద్దలు కుదిర్చిన సంబంధం. ఐపీఎస్ ప్రవీణ్కుమార్ సోదరే నా భార్య. ఆయనే ప్రోద్బలంతోనే 2002లో మా వివాహమైంది. నాకు చిన్నప్పటి నుంచి రాజకీయాలంటే ఎంతో ఇష్టం. నా జీవితంలో మరిచిపోలేనివి రెండు. అవి ఒకటి.. నేను డాక్టర్గా పట్టా పుచ్చుకున్నది, రెండవది నేను వికారాబాద్ ఎమ్మెల్యేగా ఎంపికైనది. ఈ రెండు అంశాలు నా ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. నాకు ఇష్టమైన ఇవీ.. నేను డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నప్పుడు ఉదయం లేవగానే యోగ చేస్తాను. బుక్స్ చదవడం, సినిమాలు చూడటం, వారంలో ఒక రోజు కుటుంబంతో కలిసి ఎక్కడికైనా సరదాగా వెళ్లిరావడం ఇష్టం. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇష్టమైన సినిమా భరత్ అనే నేను.. నాతో పాటు మా కుటుంబానికి అందరికి నచ్చింది. నాకు దేశంలో నచ్చిన ప్రాంతం కేరళలోని మునార్. ఆ ప్రాంతం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. నాకు చేపలు, పెరుగు, జొన్నరొట్టె చాలా ఇష్టం. మా ఆవిడ తానే స్వయంగా చికెన్ బిర్యాని చేస్తుంది. చాలా బాగా వండుతుంది. డాక్టర్ వృత్తికి దూరమయ్యాను రాజకీయాల్లోకి వచ్చిన తరువాత డాక్టర్ వృత్తికి దూరమయ్యాను. ప్రజల మధ్య ఉండి సేవలు అందించాల్సి వస్తోంది. కుటుంబానికి ప్రస్తుతం సమయం కేటాయించడానికి వీలులేకుండా పోతోంది. వారానికి ఒక రోజు కుటుంబంతో గడపడానికి సమయం కేటాయించాలి. నా భార్యే ఆస్పత్రి బాధ్యతలతో పాటు ఇంటిని చక్కబెట్టడం స్వయంగా చూసుకుంటుంది. నాకు మద్యం, సిగరెట్ అలవాటు లేదు. కనీసం కాఫీ, టీ కూడా తాగను. చిన్నప్పటి నుంచీ అలవాటు లేదు. నాకు ఒక కూతురు వినుత్నా ఆనంద్, ఒక కుమారుడు వైభవ్ ఆనంద్. వారు 9, 8వ తరగతి హైదరాబాద్లో చదువుతున్నారు. మా భార్య సబితా ఆనంద్కు ఆగ్రాలోని తాజ్మహల్ అంటే ఇష్టం. రాజకీయల పట్ల మంచి అవగాహన ఉన్న వ్యక్తి. రాజకీయాలంటే ఆయనకు ఇష్టం – సబితా ఆనంద్ మా ఆయనకు రాజకీయాలంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజల్లో మమేకం కావడం నాకు ఎంతో తృప్తినిస్తుంది. కుటుంబం, ఆస్పత్రి వ్యవహారాలన్నీ నేను చూసుకుంటున్నా. ఆయనకు సంతృప్తి ఇచ్చే పనుల్లో చేదోడువాదోడుగా ఉండడమే నాకు తృప్తి. -
ముగిసిన ఎమ్మెల్యే సతీమణి అంత్యక్రియలు
వికారాబాద్ అర్బన్ : వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు సతీమణి తార (రెండోభార్య) అంత్యక్రియలు గంగారం సమీపంలోని శ్మశాన వాటికలో మంగళవారం పూర్తిచేశారు. అంతకుముందు ఎమ్మెల్యే నివాసం నుంచి నేరుగా మెథడిస్టు చర్చికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. అక్కడ క్రిష్టియన్ మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్లఎమ్మెల్యే కాలె యాదయ్య, విద్య మౌలిక వసతుల కల్పన చైర్మన్ నాగేందర్గౌడ్, టీఎస్పీఎస్సీ సభ్యుడు విఠల్, మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు మహేశ్రెడ్డి, ఆయా పార్టీల నాయకులు, అధికారులు, నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే కారు ఢీకొని వృద్ధురాలికి గాయాలు
బంట్వారం(వికారాబాద్ జిల్లా): వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు కారు ఢీకొని మనెమ్మ అనే వృద్ధురాలికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన బ్వంటారం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఆగ్రహించిన స్థానికులు వికారాబాద్ ఎమ్మెల్యే కారు ధ్వంసం చేశారు. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత వృద్ధురాలిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. -
జిల్లా కాకపోతే రాజీనామా చేస్తా
వికారాబాద్ ఎమ్మెల్యే సంజీవరావు వికారాబాద్: రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ 19 మండలాలతో కూడిన జిల్లా కాకపోతే మొదట రాజీనామా చేసేది నేనేనని వికారాబాద్ ఎమ్మెల్యే బి.సంజీవరావు స్పష్టం చేశారు. బుధవారం ఆయ న అమెరికా నుంచి ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వికారాబాద్ను జిల్లా చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వికారాబాద్ను 19 మండలాలతో కూడిన జిల్లాగా ఏర్పాటు చేస్తారనే నమ్మకం తనకు ఉందన్నారు. ఒకసారి మాట ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ వెనక్కు తీసుకోరన్నారు. ముసాయిదాలో పెట్టిన 19 మండలాలతో కూడిన జిల్లా గెజిట్ 28వ తేదీ లోపు వస్తుందని అందులో ఎవరూ ఎలాంటి అపోహలు చెందవద్దన్నారు. ఎవరెన్ని కృత్రిమ ఉద్యమాలు చేయించినా వికారాబాద్ జిల్లా కేంద్రం అయ్యి తీరుతుందన్నారు. -
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే సంజీవరావు