ఆర్టీసీ కండక్టర్‌ నిజాయితీ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ కండక్టర్‌ నిజాయితీ

Published Sun, Aug 11 2024 2:32 AM | Last Updated on Sun, Aug 11 2024 2:32 AM

ఆర్టీసీ కండక్టర్‌ నిజాయితీ

ఆర్టీసీ కండక్టర్‌ నిజాయితీ

అమలాపురం రూరల్‌: అమలాపురం ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ ప్రయాణికుడు పోగొట్టుకున్న రెండు కాసుల బంగారు గొలుసును అతనికి అందించి ఓ కండక్టర్‌ నిజాయితీ చాటుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. కాజులూరు మండలం అండ్రంగికి చెందిన మాచవరపు కృష్ణ కుటుంబ సభ్యులతో కలసి పాలకొల్లు వెళ్లడానికి అమలాపురం బస్టాండ్‌కు శుక్రవారం వచ్చారు. అతని రెండు కాసుల బంగారు గొలుసు బస్టాండ్‌లో పడిపోయింది. ఆ గొలుసు అమలాపురం డిపో కండక్టర్‌ పి.నారాయణరావుకు దొరికింది. దానిని డిపో అధికారులకు అప్పగించారు. గొలుసును పోగొట్టుకున్న ప్రయాణికుడు అమలాపురం బస్టాండ్‌లోని విచారణ కేంద్రం వద్ద సంప్రదించగా శనివారం ఆ గొలుసును సెక్యూరిటీ అధికారి, సీఐ పతిమాకుమారి, ఓపీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి ఎన్‌.వరహాలుబాబు సమక్షంలో కండక్టర్‌ నారాయణరావు ప్రయాణికుడు కృష్ణకు అందజేశారు. నిజాయితీ చాటుకున్న కండక్టర్‌ను డిపో మేనేజర్‌ సత్యనారాయణ మూర్తి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement