Dr. B. R. Ambedkar Konaseema District Latest News
-
వీసీ కుర్చీ కోసం ఖర్చీఫ్లు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: విశ్వవిద్యాలయాలు రాజకీయ చక్రబంధంలో అల్లాడి పోతున్నాయి. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్కు దిశానిర్దేశం చేసే విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్ల నియామకానికి సంబంధించిన పీటముడి వీడటం లేదు. పనితీరు, నైపుణ్యంతో ప్రమేయం లేకుండా రాజకీయ పలుకుబడి, ధనబలం ఉన్న వారికే ఈ పోస్టులు కట్టబెట్టే ప్రయత్నాలు ఉన్నత స్థాయిలో జరుగుతున్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడు నెలలు కావస్తున్నా జేఎన్టీయూ కాకినాడ, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయాలకు ఉప కులపతి నియామకంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో దూరదృష్టితో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జేఎన్టీయూ, రాజానగరంలో ఆదికవి నన్నయ వర్సిటీలను స్థాపించారు. ఈ రెండు ప్రాంతాల్లో రెండు వర్సిటీలకు అంకురార్పణ చేసి ఉన్నత విధ్యాభివృద్ధికి బాటలు వేశారు.రాజకీయాలు చొప్పించిన కూటమి సర్కారుప్రారంభంలో ఎనిమిది జిల్లాల పరిధిలో కాకినాడ వర్సిటీ ఏర్పాటైంది. 160 ఇంజినీరింగ్ కాలేజీల ద్వారా ఏటా సుమారు 45వేల మంది విద్యార్థుల భవిష్యత్యుకు మార్గం చూపించింది జేఎన్టీయూ కాకినాడ. ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈ వర్సిటీకి వీసీ నియామకాన్ని త్వరతిగతిన చేపట్టాలని మేధావి వర్గం సూచిస్తోంది. ఈ రెండు వర్సిటీల వీసీలను కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన రోజుల వ్యవధిలోనే అర్ధంతరంగా ఇంటికి పంపించేసింది. విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు చొప్పించడం సహేతుకం కాదనే మేధావి వర్గం అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా కేవలం గత ప్రభుత్వ హయాంలో నియమితులయ్యారనే ఏకైక కారణంతో ఇద్దరు వీసీలను తప్పించింది. వాస్తవానికి జేఎన్టీయూ కాకినాడ వర్సిటీ వీసీ పదవీ కాలం ఆరు నెలలు, నన్నయ్య వర్సిటీ వీసీ పదవీకాలం రెండేళ్లు మిగిలి ఉండగానే కూటమి ప్రభుత్వం అర్ధంతరంగా రాజీనామా చేయించింది. అలాగని ఎక్కడా అధికారిక ఉత్తర్వులు లేకుండా మౌఖిక ఆదేశాలతోనే ఈ రాజీనామాలు చేయించింది. ఇదంతా ప్రభుత్వం గద్దె నెక్కి పట్టుమని 10 రోజులు కూడా గడవకుండానే జరిపించేసి తమ భవిష్యత్ను దెబ్బతీసిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు వీసీలు రాజీనామా చేసి ఇంచుమించు ఏడు నెలలు కావస్తున్నా రెండు వర్సిటీలు ఇన్చార్జ్ వీసీలతోనే కాలక్షేపం చేస్తున్నాయి.నియామకం ఇలా..గత డిసెంబర్లో రెండు వర్సిటీల పాలకమండళ్ల అత్యవసర భేటీలో వీసీల నియామకాల కోసం చర్చించారు. సెర్చ్ కమిటీలో ఉండే ముగ్గురు విద్యావేత్తలలో విశ్వవిద్యాలయాల పాలకమండలి ఒక అభ్యర్థిని ఎంపిక చేస్తుంది. యూజీసీ ఒక విద్యావేత్తను, ప్రభుత్వం మరో అభ్యర్థిని నియమిస్తుంది. సెర్చ్ కమిటీలు దర ఖాస్తులు పరిశీలన చేసి మూడు పేర్లతో జాబితా రూ పొందిస్తే ఒకరి పేరును వీసీగా గవర్నర్ ఖరారు చేస్తారు.ఎవరి ప్రయత్నాలు వారివే...ప్రస్తుత ఇన్చార్జిలుగా చేస్తున్న వారితో పాటు గతంలో రిజిస్ట్రార్లు, డైరెక్టర్లుగా పనిచేసిన వారితో పాటు ప్రస్తుత డైరెక్టర్లు కూడా ఈ సీటు ఆశిస్తున్నారు. వీసీల కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు సామాజిక, ఆర్థిక అంశాల ప్రాతిపదికన జరుగుతోన్న ప్రయత్నాలు అటు జేఎన్టీయూకే, ఇటు ఆదికవి నన్నయ వర్సిటీలో హాట్టాపిక్గా మారాయి. జేఎన్టీయూకే ప్రొఫెసర్ మురళీకృష్ణ, ఆదికవి నన్నయ్య వర్సిటీకి జియాలజీ ప్రొఫెసర్ వై.శ్రీనివాసరావు ప్రస్తుతం ఇన్చార్జి వీసీలుగా కొనసాగుతున్నారు. వీరితో పాటు పలువురు వీసీ పోస్టు ఆశిస్తూ ఆ మేరకు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. ఈ నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి అవుతుందంటున్నారు. పూర్తి స్థాయి వీసీలు నియామకంలో జరుగుతోన్న జాప్యం రెండు వర్సిటీల అభివృద్ధిపై ప్రభావం చూపిస్తోందంటున్నారు. ఇదే విషయమై పదేపదే విద్యార్థులు మొత్తుకుంటున్నా సెర్చ్ కమిటీ అంటూ సర్కార్ కాలయాపన చేస్తోందనే విమర్శలున్నాయి. వీసీ పీఠం కోసం ఖర్చుకు వెనుకాడకుండా పై స్థాయిలో కొందరు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. జేఎన్టీయూ కాకినాడ కుర్చీ కోసం రూ. రెండు, మూడు కోట్లకు వెనుకాడటం లేదని వర్సిటీలో ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. సెర్చ్ కమిటీకి 30 మంది వరకు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికే తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక వర్సిటీ ప్రొఫెసర్ ఈ పోస్టు కోసం మాట్లాడుకున్నారని వినిపిస్తోంది. ఇందుకు పొరుగు రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధి, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో చినబాబుతో మంతనాలు సాగిస్తున్నారని సమాచారం. ఆదికవి నన్నయ్య వీసీ కుర్చీ కోసం కృష్ణా, గుంటూరు ప్రాంతానికి చెందిన ఒక మహిళా ప్రొఫెసర్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలియవచ్చింది. కూటమి సర్కార్లో కొందరు పెద్దలతో ఉన్న పరిచయాలతో ఆమె ఈ పోస్టు కోసం ఉన్నత స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారంటున్నారు. వర్సిటీ వర్గాల్లో జరుగుతోన్న చర్చను బట్టి సెర్చ్ కమిటీలు వీసీల నియామకానికి ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకోవడానికే పరిమితమయ్యాయి.వీసీలను త్వరగా నియమించాలిగత వీసీలకు ఇంకా సమయం ఉన్నా అర్ధంతరంగా తొలగించి ఇన్చార్జి వీసీలను నియమించారు. విశ్వవిద్యాలయాలను ఆరు నెలలుగా ఇన్చార్జ్ వీసీల పాలనలోనే నడుపుతున్నారు. వైస్ చాన్సలర్లను త్వరగా నియమిచాలి. ఇన్చార్జ్లు ఉండడంతో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఈ కారణంగా విద్యావ్యస్థకు నష్టం జరిగే పరిస్థితి ఉంది.– ఎం.గంగా సూరిబాబు, ఎస్ఎఫ్ఐ, జిల్లా కార్యదర్శి, కాకినాడఇన్చార్జులు చురుకుగా నిర్ణయాలు తీసుకోలేరుయూనివర్సిటీల నిర్వహణలో ఫుల్చార్జి వైస్ చాన్సలర్లను నియమించాల్సిన ప్రభుత్వం ఇన్చార్జిలతో కాలం గడపడం సహేతుకం కాదు. ఇన్చార్జిలు ఎవరైనా సరే ఆయా యూనివర్సిటీలకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో చురుకై న పాత్ర నిర్వర్తించలేరు. అదే ఫుల్చార్జ్ వైస్ చాన్సలర్ ఉంటే అవసరం అనుకుంటే గవర్నర్ వద్దకు నేరుగా వెళ్లి యూనివర్సిటీ కోసం మాట్లాడే అవకాశం ఉంటుంది. వెంటనే ఫుల్చార్జ్ వీసీలను నియమించాలి.– అశోక్కుమార్, డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, తూర్పుగోదావరిజిల్లా -
ఈ–క్రాప్ నమోదు తప్పనిసరి
అల్లవరం: రైతులు తాము పండించే పంట వివరాలను ఈ–క్రాప్లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి వి.బోసుబాబు సూచించారు. బెండమూర్లంక గ్రామంలో జరుగుతున్న ఈ–క్రాప్ నమోదు కార్యక్రమాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1.52 లక్షల ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయన్నారు. 64 వేల ఎకరాల్లో ఈ–క్రాప్ నమోదు జరిగిందని, ఈ నెల 31 లోపు వంద శాతం పూర్తి చేయాలన్నారు. సెప్టెంబర్ 15లోగా ఈ–క్రాప్ నమోదు చేసిన పంటకు రైతుల ఈ–కేవైసీని నమోదు చేయాలన్నారు. అనంతరం ప్రతి గ్రామ సచివాలయంలో డ్రాఫ్ట్ జాబితాను ప్రదర్శించి, రైతులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలన్నారు. అల్లవరం మండలంలో 2,380 ఎకరాల్లో వరినాట్లు పూర్తి కాగా, 1,650 ఎకరాల్లో పంట వివరాలు నమోదు జరిగినట్టు తెలిపారు. వరిని కుళ్లు తెగులు ఆశించకుండా హెక్సాకోనోజోల్ మందును పిచికారీ చేయాలని సూచించారు. ఆయన వెంట ఏడీ షంషీ, వ్యవసాయాధికారి ఎన్వీవీ సత్యనారాయణ, ప్రకృతి వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, విస్తరణాధికారి శివమోహన్, సర్పంచ్ బర్రే సీతారత్నం, రైతులు ఉన్నారు. -
కలెక్టర్ ఫొటోతో వాట్సాప్ సందేశాలు
అమలాపురం రూరల్: కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని జిల్లాలోని అధికారులకు, ఇతరులకు గుర్తు తెలియని వ్యక్తులు వాట్సాప్ సందేశాలు పంపిస్తున్నారు. వారితో చాటింగ్ చేస్తూ సంభాషణ కొనసాగిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ మహేష్ కుమార్ మంగళవారం ప్రకటన విడుదల చేరారు. వాట్సాప్ లో చూపిస్తున్న 947855 66071 నంబర్ తనది కాదని స్పష్టం చేశారు. ఎవ్వరూ ఆ నంబర్ నుంచి మెసేజ్లకు స్పందించవద్దని, ఫోన్ కాల్స్ను స్వీకరించవద్దని తెలిపారు. పాఠ్య, నోట్ పుస్తకాల పంపిణీ పూర్తి అమలాపురం టౌన్: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన పాఠ్య, నోట్ పుస్తకాల పంపిణీ దాదాపు పూర్తయ్యిందని డీఐఈవో వనుము సోమశేఖరరావు తెలిపారు. వాటిని విద్యార్థులు సక్రమంగా సద్వినియోగం చేసుకుంటున్నారా అనే విషయాన్ని తల్లిదండ్రులు పర్యవేక్షించాలని సూచించారు. అలాగే కళాశాలల్లో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు కూడా ఆరా తీయాలన్నారు. మలికిపురం మండలం కేశనపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వృక్ష శాస్త్ర అధ్యాపకుడు లేని కారణంగా గెస్ట్ లెక్చరర్ ఫ్యాకల్టీ నుంచి దరఖాస్తులు ఆహ్వానించామన్నారు. పోస్టు గ్రాడ్యుయేషన్లో 50 శాతం మార్కులు సాధించిన వారు అర్హులన్నారు. బోధన చేసిన గంటకు రూ.150 చొప్పున నెలకు రూ.10 వేల మించకుండా గౌరవ భృతి ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ఆసక్తి కలవారు ఈ నెల 24వ తేదీ సాయంత్రం లోపు దరఖాస్తులను ఆ కళాశాలలో సమర్పించాలన్నారు. -
కుండపోత.. ఉక్కపోత..
సాక్షి, అమలాపురం: వాతావరణం చాలా విచిత్రంగా మారింది. ఎప్పుడు ఎండ కాస్తుందో, ఎప్పుడు వాన పడుతుందో తెలియడం లేదు. వేసవిని తలదన్నెలా ఎండ కాస్తూ ప్రజలను భయపెడుతోంది. అంతలోనే చల్లని చినుకులు సేదతీర్చుతున్నాయి. అమలాపురంలో మంగళవారం గంట పాటు ఏకదాటిగా వర్షం పడింది. ఏకంగా 18.2 మీమీ కురిసింది. ఉదయం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు కురిసిన వర్షంతో సామన్యులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి భానుడు విజృంభించాడు. విపరీతమైన ఎండతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. -
యూనివర్సిటీ ఖ్యాతి పెంచాలి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): యూనివర్సిటీ స్థాయి మరింత పెంచాలని, రాబోయే తరాలకు విద్యావృక్షంలా తయారు చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.రామ్మోహనరావు పేర్కొన్నారు. జేఎన్టీయూ కాకినాడ వర్సిటీ 16 వ్యవస్థాపక దినోత్సవం మంగళవారం నిర్వహించగా ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. రామ్మోహనరావు మాట్లాడుతూ రీసెర్చ్ సెంటర్లు మరిన్ని ఏర్పాటుచేసి విద్యార్థులను పరిశోధన వైపు ప్రోత్సహించాలన్నారు. జేఎన్టీయూకే వీసీ మురళీకృష్ణ మాట్లాడుతూ ఉన్నత విద్యలో పరీక్షా విధానం, మెఽథడాలజీ, బోధన పద్ధతులు, పాఠ్య ప్రణాళికలో తీసుకురావలసిన మార్పులపై దృష్టి సారిస్తున్నామన్నారు. కాకినాడ సీపోర్టు సీఈఓ మురళీధర్ మాట్లాడుతూ వర్సిటీ ద్వారా సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టులు చేపట్టాలన్నారు. వర్సిటీ అనుబంధ కళాశాలలకు ఉత్తమ ఫెర్మార్మెన్స్ అవార్డులతో పాటు ఐపీఎస్ అధికారి ఎంవీఆర్ కృష్ణతేజకు యంగ్ అచీవర్ అవార్డు అందజేశారు. రెక్టార్ కేవీరమణ, రిజిస్ట్రార్ రవీంద్ర, డైరెక్టర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. బస్షెల్టర్ కూల్చివేసిన కూటమి నాయకులు పెదపూడి: అనపర్తి మండలం పొలమూరు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి తండ్రి గంగిరెడ్డి, తల్లిపేరు మీద ఉన్న బస్షెల్టర్ను కూటమి నాయకులు మంగళవారం జేసీబీతో దౌర్జన్యంగా కూల్చివేశారు. దీంతో బస్షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. కూటమి నాయకులు దౌర్జన్యంగా బస్షెల్టర్ కూల్చివేయడంపై ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పొలమూరు గ్రామంలో తూర్పు పేటలో 20 ఏళ్ల క్రితం టీడీపీ హయాంలో జన్మభూమి గ్రామ సభల్లో నిర్ణయం మేరకు 30శాతం ప్రజావిరాళం (కాంట్రిబ్యూషన్)తో మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి తన తండ్రి గంగిరెడ్డి పేరుమీద ఈ నిర్మాణం చేపట్టారు. అప్పట్లో సూర్యనారాయణనరెడ్డి మూడు బస్షెల్టర్లు నిర్మాణాకి సుమారు రూ.లక్ష విరాళం ఇచ్చి వాటిని నిర్మించారు. అప్పటి నిబంధనల ప్రకారం ప్రజా విరాళం ఇచ్చినవారి పేర్లతో బస్షెల్టర్ నిర్మించుకోవచ్చు. అప్పటి టీడీపీ ఎమ్మెల్యే దివంగత నల్లమిల్లి మూలారెడ్డి హయాంలో నిర్మాణాలు చేపట్టారు. పొలమూరులో రెండు, చిన్న పొలమూరులో ఒకటి నిర్మించారు. ఈ బస్షెల్టర్లను ప్రయాణికులు వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పొలమూరు తూర్పు పేట వద్ద బస్షెల్టర్ను దౌర్జన్యంగా కూటమి నాయకులు కూల్చివేశారు. మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి ఆయన తండ్రి పేరు మీద ఉన్న కట్టడాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా పరిపాలన సాగుతోందా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. -
జిల్లాకు 57 లక్షల ఉపాధి పనిదినాలు
అమలాపురం రూరల్: ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాల్సిన పనులను గుర్తించి నివేదిక ఇవ్వాలని అధికారులను కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఉపాధి హామీ పనులపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు తమ శాఖల్లో ఉపాధి హామీ పనులు కింద చేయడానికి అవకాశం ఉన్న పనుల వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు ఉపాధి హామీ పథకం కింద 57 లక్షల పని దినాలను లక్ష్యంగా ఇచ్చారని, వాటిని చేరుకునేలా పనులను గుర్తించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. మెటీరియల్, లేబర్ కాంపోనెంట్ల కింద జిల్లాలో 266 రకాల పనులను చేపట్టవచ్చన్నారు. ఆగస్టు 23న రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో ప్రత్యేక సభలు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో గ్రామ సభలకు కనీసం 30 శాతం మంది ప్రజలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఏపీవోలు, ఏపీడీలు ముందుగానే సమావేశమై ప్రస్తుతం జరుగుతున్న, జరగబోయే పనుల ప్రణాళిక రూపొందించుకుని గ్రామ సభలలో ఆమోదం తీసుకోవాలనన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, డీఆర్ఓ ఎం.వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ మధుసూదన్, జిల్లా ఉధ్యానశాఖ అధికారి బీవీ రమణ పాల్గొన్నారు. దేవాలయాల అభివృద్ధికి ప్రతిపాదనలు ప్రసాద్ పథకంలో దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం దేవదాయ ధర్మాదాయ శాఖపై సమీక్షించారు. జిల్లాలో దేవదాయశాఖ పరిధిలోని ఆలయాలు, వాటిలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు తదితర వాటిపై ఆరా తీశారు. జిల్లాలో సుమారు 216 ఎకరాల దేవాలయ భూములు ఆక్రమణకు గురయ్యాయని అధికారులు తెలపగా, తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పెద్ద మొత్తంలో ప్రసాదాలు తయారు చేస్తున్న దేవాలయాలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి నాణ్యతను పరీక్షించాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ ఎం.వెంకటేశ్వర్లు, ఆర్టీవో జి.కేశవవర్ధన్ రెడ్డి, జిల్లా దేవదాయ ధర్మాదాయశాఖ అధికారి ఎం.లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ మనోహర్, అంతర్వేది ఈవో సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. సీసీ కెమెరాలతో పర్యవేక్షణ జిల్లాలో ముఖ్యమైన ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోని రికార్డు రూమ్లను సీసీ టీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షించే దిశగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. ఈ విషయంపై మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులు, ఎస్ఎన్ఆర్ ఈ–డేటా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లోని (తహసీల్దార్ ) రికార్డు రూమ్లు, సంక్షేమ హాస్టళ్లు, ఇసుక రీచ్లు, ఇసుక నిల్వ కేంద్రాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాలలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం ద్వారా పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమన్వయంతో లక్ష్యాన్ని చేరుకోవాలి అధికారులతో కలెక్టర్ మహేష్ కుమార్ -
కల్యాణ వైభోగమే..
అన్నవరం: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంతో అత్యంత అపూర్వ ఘట్టం. ఆ కార్యక్రమం తమ ఇష్టదైవం సన్నిధిలో జరగాలని చాలామంది కోరుకుంటారు. అన్నవరంలోని వీర వెంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానం వివాహాలకు పెట్టింది పేరు. ఇక్కడ ఏటా వేల సంఖ్యలోవివాహాలు జరుగుతాయి. మంచి ముహూర్తాల సమయంలో ఈ సంఖ్య భారీగా పెరుగుతుంది. ప్రస్తుతం శ్రావణ మాసం కావడంతో రత్నగిరిపై వివాహాల సందడి మొదలైంది. నూతన దంపతులతో కళకళ నూతన దంపతులతో సత్యదేవుని ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. వివిధ ప్రాంతాల నుంచి కూడా నూతన వధూవరులు స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. వీరందరూ వ్రతాలను ఆచరించి, స్వామివారిని దర్శించుకుని తమ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. సత్యదేవుని సన్నిధిలో ఏటా ఐదు వేల జంటలు వేదమంత్రాల సాక్షిగా ఒక్కటవుతున్నాయి. వీరితో బాటు ఎక్కడెక్కడో వివాహాలు చేసుకున్న మరో పది వేల జంటలు సత్యదేవుని సన్నిధికి విచ్చేస్తున్నాయి. పెళ్ల్లిళ్ల సీజన్ శ్రావణ మాసం ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకూ సత్యదేవుని సన్నిధిలో ఐదు వందలకు పైగా వివాహాలు జరిగాయి. ఆగస్టు ఐదు నుంచి శ్రావణ మాసం ప్రారంభం కాగా ఏడో తేదీ నుంచి వివాహాలు మొదలయ్యాయి. ఈ నెల 15వ తేదీ ఒక్కరోజే వందకు పైగా జరిగాయి. మిగిలిన రోజుల్లో పది నుంచి ఇరవై వరకూ జరుగుతున్నాయి. 18, 19వ తేదీలలో దాదాపు 50 జంటలు ఒక్కటయ్యాయి. నేటి నుంచి భారీ సంఖ్యలో.. రత్నగిరిపై బుధవారం నుంచి ఈ నెల 23వ తేదీ వరకూ భారీ సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. ఈ మూడు రోజులూ రత్నగిరిపై సత్రం గదులలో దాదాపు 70 శాతం, అన్ని వివాహ మండపాలను పెళ్లి బృందాలు రిజర్వ్ చేసుకున్నాయి. ఇదే ముహూర్తానికి పెళ్లిళ్లు పెట్టుకున్న మిగిలిన వారందరూ మంటపాలు లభ్యం కాక తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. సర్దుబాటు చేయ‘లేఖ’ రత్నగిరిపై వివాహాల నేపథ్యంలో సత్రం గదులు, అతిథి గృహాల కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. కొండపై ఉన్న 600 వసతి గదులలో దాదాపు 70 శాతం రిజర్వ్ అయిపోయాయి. వాటికి సంబంధించి చార్టులు కూడా సిద్ధమయ్యాయి. మిగిలిన గదుల కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. కొండకు వచ్చే భక్తులు, పెళ్లి బృందాలు గదుల కోసం ప్రముఖ రాజకీయ నాయకులు, వీఐపీల సిఫారసు లేఖలను తీసుకువస్తున్నారు. ఈ వ్యవహారం దేవస్థానం అధికారులకు తలనొప్పిగా మారింది. గదులను సర్దుబాటు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రత్నగిరిపై జోరుగా వివాహాలు నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ ముహూర్తాలు సత్రం గదులు 70 శాతం రిజర్వ్ శ్రావణంలో ఇప్పటికే 500 పెళ్లిళ్లు -
రొయ్య రయ్..
సాక్షి అమలాపురం: వెనామీ సాగుకు పూర్వ వైభవం వచ్చింది. రొయ్యల ధరలకు రెక్కలు వచ్చాయి. గడిచిన నెల రోజుల్లో కౌంట్కు కేజీకి రూ.50 నుంచి రూ.60 వరకు పెరిగాయి. సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు సాగు చేసిన చోట వాతావరణ మార్పుల వల్ల తెగుళ్లు సోకి పంట దెబ్బతినడంతో అంచనాలకు మించి ధరలు పెరిగాయని రైతులు చెబుతున్నారు. వెనామీ సాగు అధికం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో వెనామీ సాగు అధికంగా ఉంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాతో పాటు కాకినాడ జిల్లాలో సుమారు 25 వేల ఎకరాల వరకూ ఉంటుందని అంచనా. గడిచిన నెల రోజులుగా రొయ్యల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్లో కీలకమైన వంద కౌంట్ (కేజీకి 100 రొయ్యలు) ధర కొనుగోలుదారులు రూ.260గా నిర్ణయించారు. మార్కెట్లో పోటీ కారణంగా కేజీకి మరో రూ.10 పెంచి కొనుగోలు చేస్తున్నారు. అలాగే 90 కౌంట్ రూ.270 నుంచి రూ.280 వరకు, 80 కౌంట్ రూ.280 నుంచి రూ.290 వరకు, 70 కౌంట్ రూ.300 నుంచి రూ.310ల వరకు, 60 కౌంట్ రూ.320 నుంచి రూ.330 వరకు, 50 కౌంట్ రూ.340 నుంచి రూ.350 వరకు, 40 కౌంట్ రూ.375 నుంచి 385 వరకు, 30 కౌంట్ రూ.470 నుంచి రూ.480 వరకు ఉంది. రొయ్యల కొనుగోలుదారులు నిర్ణయించిన ధర కన్నా రూ.పది అదనంగా చేసి కొంటున్నారు. ఎగుమతుల జోరు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు రొయ్యల ఎగుమతి జోరుగా సాగుతుండడంతో వెనామీ ధరలు పెరిగాయి. కానీ డిమాండ్కు తగిన విధంగా రొయ్యలు అందుబాటులో లేవు. 100 కౌంట్ నుంచి 70 కౌంట్ మధ్యలో ఉన్న వెనామీ రొయ్యలు చైనాకు అధికంగా రవాణా జరుగుతుండగా, అంతకన్నా తక్కువ కౌంట్ అంటే 60 నుంచి 30 కౌంట్ మధ్య రొయ్యలు అమెరికాతో పాటు యూరప్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయని చెబుతున్నారు. తెగుళ్ల బెడద కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో గోదావరి నదీపాయలను ఆనకుని అనధికార ఆక్వా సాగు జరుగుతోంది. వరదలకు భయపడి ఇక్కడ జూలై నెలాఖరు నాటికి పట్టుబడులు వచ్చేలా చూసుకుంటారు. ఈ ఏడాది జూలై 20కి వరదలు రావడం వల్ల రైతులు నష్టాలను చవిచూశారు. దీని వల్ల కూడా సాగు తగ్గింది. ఇదే సమయంలో సాగు చేసిన చోట ఈ ఏడాది తెగుళ్ల తీవ్రత అధికంగా ఉంది. వెనామీ రొయ్యలకు వైట్ స్పాట్, వైట్ గట్ వంటి తెగుళ్లు, హెచ్పీ వల్ల రొయ్యల్లో ఎదుగుదల లోపం వంటి కారణాలతో దిగుబడి గణనీయంగా పడిపోయింది. ఎంతగా అంటే రెండు జిల్లాలకు కలిపి రోజుకు సగటున 400 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడిగా వచ్చి కొనుగోలు కేంద్రాలకు వచ్చేది. కానీ ఇప్పుడు రోజుకు 150 టన్నులు కూడా మార్కెట్కు రావడం లేదు. ఈ కారణాల వల్లే వెనామీకి ధరలు పెంచడం మినహా మరో మార్గం కొనుగోలుదారులకు లేకుండా పోయింది. మార్కెట్ను గుప్పెట పెట్టుకుంటే అసలుకే మోసం వస్తోందనే కారణానికి తోడు, అనుకూల ప్రభుత్వానికి రైతులలో కొంత సానుకూలత రావాలనే ఉద్దేశంతో ధరలు పెంచారని రైతులు చెబుతుండడం విశేషం. ధరకు రెక్కలు ఐదేళ్ల తర్వాత పెరిగిన వైనం కౌంట్కు రూ.50 నుంచి 60 వరకూ అధికం వరదలు, తెగ్గుళ్లతో తగ్గిన సాగు ఉన్న వాటికి డిమాండ్ కౌంట్ రకం ధర (రూ.లలో) 30 470 40 375 50 340 60 320 70 300 80 280 90 270 100 260దెబ్బతీసిన తెగుళ్లు ఇటీవల రొయ్యల కొనుగోలుదారులు సిండుకేటుగా మారి ధరలు తగ్గించడం పరిపాటిగా మారింది. టీడీపీకి అనుకూలంగా ఉండే కొనుగోలుదారులు ధరలను తగ్గించడం ద్వారా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి చెడ్డ పేరును తీసుకురావడానికి యత్నించారు. ధరలు తగ్గిన ప్రతి సందర్భంలోనూ గత ప్రభుత్వం కలుగజేసుకుని కనీస మద్దతు ధరలు (ఎంఎస్సీ) ప్రకటించి రొయ్యలు కొనుగోలు చేయించింది. కరోనా తర్వాత నుంచి అంతర్జాతీయంగా ఎగుమతుల తగ్గుదల చోటు చేసుకుని ఆ ప్రభావం ధరలపై పడింది. 100 కౌంట్ ధర కేజీ రూ.210 నుంచి రూ.230 మధ్యలో ఉండేది. సిండికేటు కొనుగోలుదారులకు భయపడి కొందరు రైతులు సాగుకు దూరమయ్యారు. మరికొందరు పూర్తిస్థాయిలో రొయ్యలను పెంచలేదు. హైటెక్ పద్ధతిలో సాగు చేసే రైతులు ఎకరాకు గరిష్టంగా లక్ష వరకు రొయ్య పిల్లలను సాగు చేస్తుంటారు. అటువంటి వారు కూడా ఎకరాకు 70 వేల రొయ్యలకు మించి సాగు చేయలేదు. సాగు విస్తీర్ణం తగ్గడమే కారణం సాగు విస్తీర్ణం తగ్గడం వల్లే రొయ్యలకు ధర పెరిగింది. ఇప్పుడిప్పుడే సాగు మొదలు పెట్టినా డిసెంబర్, జనవరి వరకు దిగుబడి వచ్చే అవకాశం లేదు. అప్పటి వరకు మార్కెట్లో వెనామీ రొయ్యలకు ధర అధికంగానే ఉంటుంది. – బి.రాంబాబు, ఆక్వా రైతు, అమలాపురం -
ఎస్పీ కార్యాలయానికి 18 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 18 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అర్జీదారులు వచ్చి తమ సమస్యలపై ఫిర్యాదు చేశారు. వచ్చిన అర్జీల్లో కొన్నింటిని ఎస్పీ అక్కడికక్కడే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. మిగిలిన ఫిర్యాదులపై ఆయా పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్సైలతో మాట్లాడి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు. ఫిర్యాదుదారులు కొందరు తమ కుటుంబ సమేతంగా వచ్చి కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలపై ఎస్పీకి ఏకరవు పెట్టారు. ఎస్పీ కార్యాలయ ప్రజా సమస్యల పరిష్కార వేదిక పర్యవేక్షణ ఎస్సై డి.శశాంక పాల్గొన్నారు. జగన్ కోసం నిలబడే వారు లక్షల్లో.. అమలాపురం టౌన్: మేము గేట్లు తెరిస్తే జగన్ మాత్రమే నిలుస్తారన్న రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ జిల్లా ఐటీ విభాగం అధ్యక్షుడు తోరం గౌతమ్ రాజా ఖండించారు. ఈ మేరకు అమలాపురంలో గౌతమ్ రాజా సోమవారం ప్రకటన విడుదల చేశారు. సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారిపోయే ప్రతి ఒక్కరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మామూలేనని ఆయన మంత్రి విమర్శలను కొట్టి పారేశారు. మాజీ ముఖ్యమంత్రి జగనన్న వెంట నిలబడే నాయకులు, కార్యకర్తలు లక్షల్లో ఉన్నారని గుర్తు చేశారు. ఈవీఎంల గోల్మాల్తో నెగ్గిన మీకు మా అధినేత జగన్ను విమర్శించే అర్హత లేదని పేర్కొన్నారు. తోబుట్టువుల బంధాన్ని తెలిపేలా రాఖీ అమలాపురం టౌన్: తోబుట్టువుల బంధాన్ని తెలుపేలా జిల్లాలో రక్షాబంధన్ వేడుకలను జరుపుకొన్నారు. చెల్లి అన్నకు, అక్క తమ్ముడికి రాఖీ కట్టి పండగ విశిష్టతను చాటారు. రాఖీ పౌర్ణమిని అమలాపురంలోని ఓం శాంతి కేంద్రం ఇన్చార్జి బ్రహ్మకుమారి శ్రీదేవి ఆధ్వర్యంలో బ్రహ్మకుమారీలు ఘనంగా జరుపుకొన్నారు. అమలాపురంలోని రెండో అదనపు జిల్లా కోర్టు జడ్జి వి.నరేష్ వద్దకు బ్రహ్మకుమారీలు వెళ్లి రాఖీ కట్టారు. అలాగే జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, ఎంపీ గంటి హరీష్మాధుర్ల వద్దకు కూడా వెళ్లి రాఖీలు కట్టారు. బ్రహ్మకుమారీలు వారి నుదుట తిలకం దిద్ది స్వీట్లు తినిపించి ఆత్మీయతను చాటారు. ఓం శాంతి కేంద్రం ఇన్చార్జి బ్రహ్మకుమారి శ్రీదేవితోపాటు బ్రహ్మకుమారి స్వరూప తదితరులు పాల్గొన్నారు. పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం అమలాపురం రూరల్: జిల్లా పరిధిలోని వన్ స్టాప్ సెంటర్లో కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేసేందుకు వివిధ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారిత అధికారి ఝన్సీరాణి తెలిపారు. ఈ పోస్టులను కలెక్టర్ మహేష్కు మార్ అధ్యక్షతన భర్తీ చేస్తారన్నారు. 25–42 ఏళ్ల మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కేస్ వర్కర్, పారా లీగల్ పర్సన్, లాయర్, పారా మెడికల్ పర్సన్, సోషల్ కౌన్సెలర్, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఆఫీస్ అసిస్టెంట్, బహుళ ప్రయోజన సిబ్బంది, కుక్, సెక్యూరిటీ గార్డ్ తదితర పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. కోనసీమ ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ నుంచి దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని ఈ నెల 30వ తేదీలోగా ముమ్మిడివరంలో ఎయిమ్స్ కళాశాలలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారిత అధికారి కార్యాలయంలో అందించాలన్నారు. కనక దుర్గమ్మకు లక్ష గాజుల పూజ తాళ్లపూడి: స్థానిక నవదుర్గాది పరివార సహిత కననదుర్గమ్మ ఆలయంలో శ్రావణ పూర్ణిమ సందర్భంగా సోమవారం లక్ష గాజులతో పూజా మహోత్సవం నిర్వహించారు. అమ్మవారికి గాజులు అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు అల్లూరి శివప్రసాద్ ఆధ్వర్యంలో మహిళలు కుంకుమార్చన, లక్ష గాజుల పూజలో పాల్గొన్నారు. అమ్మవారికి గాజులు అలంకరించారు. -
మంగళవారం శ్రీ 20 శ్రీ ఆగస్టు శ్రీ 2024
ఇది మే 17న తీసిన చిత్రం. కూనవరం మేజర్ డ్రెయిన్ మొగ ద్వారా సముద్రంలో కలిసే (స్ట్రైట్కట్) ప్రాంతం. ఇలా ఇసుక మేటలు వేసింది. ఏటా డ్రెయిన్లో నీరు లేని సమయంలో మేటలు వేయడం సహజమే అయినా ఈసారి ఏకంగా ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తున ఇసుక మేట వేసింది. దీనివల్ల ఖరీఫ్ సాగుకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోందని, వరి చేలు మంపుబారిన పడతాయని అప్పుడే శ్రీసాక్షిశ్రీ హెచ్చరించింది. కొత్త ప్రభుత్వం ఏర్పడినా దీని వంక కన్నెత్తి చూడకపోవడంతో అనుకున్నంత పని అయ్యింది. గత నెలలో కురిసిన భారీ వర్షాలతో జరగాల్సిన నష్టం జరిగింది. ఇది ఆగస్టు 14న మొగ తెరిచిన నాటి సమయంలో ముంపునీరు డ్రెయిన్ ద్వారా సముద్రంలో కలుస్తున్న దృశ్యం. కూనవరం మొగ మూసుకుపోవడంతో వరి చేలు నీట మునగడంపై శ్రీసాక్షిశ్రీలో వచ్చిన కథనాలకు తోడు ఆయకట్టు రైతులు పలు దఫాలుగా జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. కొంతమంది ఆక్వా రైతుల మాటలు నమ్మి మొగ తెరవకపోతే సాగు వదిలేస్తామని హెచ్చరించడంతో ఎట్టకేలకు స్పందించి మొగ తవ్వకాలు చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇది ఆగస్టు 19న కూనవరం మొగ వద్ద పరిస్థితి. సముద్ర కెరటాలకు మొగ మూసుకుపోయింది. వారం పది రోజులుగా సరైన వర్షాలు లేకపోవడంతో డ్రెయిన్లో నీరు పెద్దగా లేదు. డ్రెయిన్ నుంచి బలమైన ఒత్తిడితో నీరు సముద్రంలోకి దిగకపోవడం, కెరటాలతో మేటలు వేసేశాయి. ఇప్పుడు మూడు, నాలుగు అడుగుల ఎత్తున మేటలు వేయడంతో అధికారులు కంగుతిన్నారు. డ్రెయిన్ ఆనుకుని ఉన్న సాంప్ (పర్ర భూములు)ల్లోకి నీరు వెళ్లకుండా అడ్డుకట్టు వేసి డ్రెయిన్ ద్వారా సముద్రంలోకి నీరు బలమైన ఒత్తిడితో దిగేలా చేసినా ఫలితం ఇవ్వలేదు. దీనితో మొగ మరోసారి పూడుకుపోయింది. -
నిర్దిష్ట వ్యవధిలో సమస్యలు పరిష్కరించండి
జాయింట్ కలెక్టర్ నిషాంతి అమలాపురం రూరల్: మారుమూల గ్రామాల నుంచి ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి వచ్చే అర్జీదారుల సమస్యలపై సానుకూలంగా స్పందించి, నిర్దిష్ట కాల వ్యవధిలో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి అధికారులకు సూచించారు. సోమవారం అమలాపురంలోని కలెక్టరేట్ గోదావరి భవన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జేసీతో పాటు డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ పీడీ ఎం.ఝాన్సీరాణి, డీఆర్డీఏ పీడీ డాక్టర్ వి.శివశంకర్ ప్రసాద్లు ప్రజల నుంచి 126 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిషాంతి మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. ఒకవేళ పరిష్కారానికి ఆస్కారం లేని ఫిర్యాదులు వస్తే అందుకు గల కారణాలను సంబంధిత ఫిర్యాదుదారులకు తెలపాలన్నారు. ఫిర్యాదులు నమోదు విభాగాన్ని ఆమె స్వయంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. దివ్యాంగుల వద్దకు జాయింట్ కలెక్టర్ వెళ్లి అర్జీలు స్వీకరించారు. జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి కార్తీక్రెడ్డి, సీపీఓ వెంకటేశ్వర్లు, ట్రాన్స్కో ఈఈ మోకా రవికుమార్, జిల్లా మత్స్యశాఖ అధికారి ఎన్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సేంద్రీయ ఉత్పత్తులతో ఆరోగ్యం సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా ఆరోగ్యకర జీవనాన్ని గడపవచ్చని జాయింట్ కలెక్టర్ నిషాంతి తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణంలో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనను ఆమె ప్రారంభించి, పలు ఉత్పత్తులను కొనుగోలు చేశారు. సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులకు నేటి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. ఈ స్టాల్లో కూరగాయలు, ఆకుకూరలు, పప్పు దినుసులు, దేశవాళీ రకాలైన నల్ల బియ్యం తదితర రకాలు ఉన్నాయని ఆమె తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి వి.బోసుబాబు, డీపీఎం కె.శ్రీనివాస్, అడిషనల్ డీపీఎం సత్యనారాయణ, ఆదర్శ రైతు అప్పారి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
రాఖీ కట్టి.. రక్షణ కోరి..
పిఠాపురం: రాఖీ పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయుని జన్మస్థలమైన పిఠాపురంలోని ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తుల తరలిరావడంతో దత్తాత్రేయుని ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఏటా రాఖీ పౌర్ణమికి దేశ విదేశాల నుంచి భక్తులు ఇక్కడకు వచ్చి దత్తాత్రేయునికి రాఖీలు కడతారు. ఈ ఏడాది సుమారు 20 వేల మంది మహారాష్ట్ర భక్తులు తరలివచ్చి స్వామివారికి రాఖీలు కట్టి పూజలు చేశారు. పిఠాపురంలో ప్రముఖ పుణ్య క్షేత్రమైన పాదగయ కుక్కుటేశ్వరస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
మళ్లీ మొగటికే..
ఫ మూసుకుపోయిన కూనవరం మొగ ఫ తెరిచిన వారం రోజుల్లోనే ఇలా ఫ వర్షాలు పడితే మరోసారి ముంపు ఫ శాశ్వత పరిష్కారం కోరుతున్న రైతులు సాక్షి, అమలాపురం/ ఉప్పలగుప్తం: కూనవరం మొగ తెరిపించేందుకు అసలైన సమయంలో అనుమతులు ఇవ్వకుండా ఉన్నతాధికారులు చేసిన జాప్యంతో అవసరం లేని సమయంలో మొగ తెరవాల్సి వచ్చింది. ఇప్పుడు అది పూడుకుపోవడం చూసి ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోసారి భారీ వర్షాలు పడితే చేలు ముంపు బారిన పడి ఈ సారి నష్టం మరింత పెరిగే అవకాశముంది. దీంతో డ్రైన్స్ అధికారులు స్పందించి డ్రెజ్జర్ను రప్పించారు. దీనిద్వారా తవ్వకాలు చేయాలని నిర్ణయించారు. ఈ పనులతో కూడా పెద్దగా ప్రయోజనం ఉండదని, సాగు పూర్తయ్యే వరకూ తరచూ డ్రెజ్జింగ్ చేయాల్సిందేని రైతులు చెబుతున్నారు. అందరూ చెబుతున్నా.. ఈ డ్రెయిన్కు శాశ్వత పరిష్కారం చూపాలని గతంలో నిపుణుల కమిటీ పలు సూచనలు చేసింది. ముంబయికి చెందిన ఓష్ణోగ్రఫీ సంస్థ సర్వే చేపట్టింది. సముద్రంలోకి గ్రోయిన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేసింది. అంతమాత్రాన ఇది విజయవంతం అవుతోందని చెప్పలేమని ఆ సంస్థ తేల్చి చెప్పింది. కానీ కొంతమంది విశ్రాంత సాగునీటి పారుదల శాఖ అధికారులు మాత్రం కూనవరం, రామేశ్వరం మొగలను ఆనుకుని ఉన్న పర్రభూముల (సాంప్)లో ఆక్రమణలు తొలగించాలని సూచిస్తున్నారు. దీనివల్ల కొంత వరకూ ముంపు నీటికి పరిష్కారం దొరుకుతుందంటున్నారు. సుమారు ఆరు వేల ఎకరాల విస్తీర్ణంలో సహజ సిద్ధంగా ఏర్పడిన పర్ర భూములను ఆక్రమించి కొందరు ఆక్వా సాగు చేస్తున్నారు. దీనివల్ల అవి కుచించుకుపోయాయి. లేకుంటే ఈ పర్ర భూముల్లోకి ముంపునీరు చేరి నదుల ద్వారా సముద్రంలో కలిసేది. అలాగే పర్ర భూముల నుంచి సముద్రంలోకి నీరు దిగేలా పలుచోట్ల గండ్లు కొట్టాలని, అప్పుడు వేగంగా ముంపునీరు సముద్రంలో దిగుతుందని వారు తేల్చారు. ఈ కార్యాచరణ రూపొందించడంలో అధికారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కూనవరం డ్రెయిన్ నుంచి మొగ వరకూ సుమారు కిలో మీటరు పొడవునా డ్రెజ్జింగ్ చేస్తున్నారే తప్ప అటు చిర్రయానం పర్రభూమి నుంచి ముంపునీరు సముద్రంలోకి దిగే విధంగా, ఇటు ఎస్.యానాం పర్ర భూముల నుంచి సముద్రంలోకి నీరు దిగేలా గండ్లు పెడితే చాలా వరకూ సమస్య తీరుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ దిశగా పదేళ్లుగా కార్యాచరణ చేపట్టకపోవడం ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. సాగు వదిలేస్తున్నారు.. మధ్య డెల్టా (కోనసీమ)లో కీలకమైన కూనవరం మైజర్ డ్రెయిన్ దశాబ్దాల కాలంగా ఆయకట్టు రైతులకు కడగండ్లను మిగులుస్తోంది. ఉప్పలగుప్తం, అమలాపురం, కాట్రేనికోన, ముమ్మిడివరం మండలాల్లో ఒకప్పుడు 35 వేల ఎకరాల ఆయకట్టుకు చెందిన ముంపునీరు ఈ డ్రెయిన్ ద్వారా సముద్రంలో కలిసేది. సహజ సిద్ధంగా తెరుచుకోవడం, మూసుకుపోవడం ఈ మొగ లక్షణం. దీనికి శాశ్వత పరిష్కారం చూపాల్సి ఉండగా ఏటా తాత్కాలికంగా మొగ తవ్వకాలు చేసి వదిలేస్తున్నారు. గతంలో ఈ సమస్య ఉన్నా పదేళ్లుగా మాత్రం ఆయకట్టు రైతులకు పెనుముప్పుగా మారింది. దీని ద్వారా ముంపునీరు దిగక ఈ ప్రాంతంలో సుమారు 4 వేల ఎకరాల్లో వరి చేలు ఆక్వా చెరువులుగా మారిపోయాయి. మరో రెండు వేల ఎకరాల్లో రైతులు సాగు వదిలేశారు. ఇక మిగిలింది 29 వేల ఎకరాలు. ఇంతటి ఆయకట్టుకు చెందిన ముంపునీరు దిగేందుకు వీలుగా మొగకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు కోరుతున్నారు. ప్రక్షాళన చెయ్యాల్సిందే.. కోనసీమలో డ్రైనేజీ వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేయాలి. ఆక్రమణలు తొలగించి డ్రెయిన్లలో పూడిక తొలగించాలి. రెవెన్యూ, మైనర్, మీడియం, మేజర్ డ్రెయిన్లను ఒకేసారి ఆధునీకరించాలి. అలాగే డ్రెయిన్ల నీరు కలిసే నదులపై ఉన్న అవుట్ఫాల్ స్లూయిజ్లను నిర్మించడంతో పాటు మొగలకు శాశ్వత పరిష్కారం చూపాలి. ఇందుకు రూ.500 కోట్లు అవుతోందని చేయలేమని అధికారులు చెబుతున్నారు. కానీ ఇక్కడ ఏడాదిలో పండే పంట విలువ రూ.2,800 కోట్లు అనే విషయాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. కూలీలకు 1.65 కోట్ల పనిదినాలు దొరుకుతుందనే విషయాన్ని ప్రభుత్వం గుర్తు పెట్టుకుని డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. –అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, కోనసీమ రైతు పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి, గోపవరం, ఉప్పలగుప్తం మండలం -
సత్యదేవుని ఆలయానికి భక్తుల తాకిడి
● స్వామిని దర్శించిన 40 వేల మంది ● దేవస్థానం ఆదాయం రూ.40 లక్షలు అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆదివారం వేలాదిగా వచ్చిన భక్తులతో కిటకిటలాడింది. సత్యదేవుని సన్నిధిన శనివారం రాత్రి పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. వివాహాలు చేసుకున్న నవ దంపతులు, ఇతర ప్రాంతాలలో వివాహాలు చేసుకున్నవారు పెద్ద సంఖ్యలో సత్యదేవుని ఆలయానికి తరలి వచ్చారు. వారంతా సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయంతో బాటు ఆలయ ప్రాంగణం, వ్రతాలాచరించే భక్తులతో వ్రత మంటపాలు, స్వామివారి దర్శనం అనంతరం సేద తీరే భక్తులతో విశ్రాంతి మంటపాలు కిక్కిరిసిపోయాయి. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించగా స్వామివారి వ్రతాలు మూడు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. స్వామివారి నిత్యాన్నదాన పథకంలో ఐదు వేల మంది భక్తులకు భోజన సౌకర్యం కల్పించారు. కన్నుల పండువగా రథోత్సవం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతేదేవి అమ్మవారి రథోత్సవం ఆది వారం కన్నుల పండువగా జరిగింది. ఉదయం పది గంటలకు రధాన్ని తూర్పు రాజగోపురం ముందుకు తీసుకువచ్చారు. అనంతరం ఆ రధంపై సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లను ప్రతిష్టించారు. ఆలయ ప్రధాన అర్చకుడు కోట సుబ్రహ్మణ్యం స్వామి, అమ్మవార్లకు పూజలు చేశారు. అనంతరం దేవస్థానం ఏఈఓ కృష్ణారావు కొబ్బరికాయ కొట్టి రధోత్సవం ప్రారంభించారు. తరువాత ఆలయ ప్రాకారంలో రధానికి నాలుగు దిక్కుల కొబ్బరి కాయలు కొట్టి రధోత్సవాన్ని నిర్వహించారు. రూ.2,500 టిక్కెట్ తో ఇద్దరు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదపండితులు, అర్చకులు, వ్రతపురోహితులు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యదేవుని రథోత్సవం -
నిన్నటి క్లిక్.. రేపటి కిక్కు
అభిరుచే వృత్తిగా మారింది మొదట్లో ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఫొటోగ్రఫీపై ఉన్న అభిరుచి క్రమంగాా పెరగడంతో దాన్నే వృత్తిగా మలుచుకున్నా. వృత్తిపరంగా, అభిరుచి పరంగా ఫొటోగ్రఫీనే ఆశగా, శ్వాసగా జీవిస్తున్నా. నా ప్రయాణంలో ప్రతి దృశ్యాన్ని కెమెరాలో బంధించేందుకు ప్రయత్నిస్తాను. ప్రకృతి చిత్రాలు, ఆరుదుగా కనిపించే లొకేషన్లు, ప్రత్యేకతను సంత రించుకున్న చిత్రాలను కెమెరాలో బంధిస్తుంటాను. – చిట్టూరి దుర్గాప్రసాద్, ఫొటోగ్రాఫర్, వెదురుపాక, రాయవరం మండలం పోటీ విపరీతంగా పెరిగింది ఫొటోగ్రఫీలో సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగింది. టెక్నాలజీకి అనుగుణంగా ఫొటోగ్రాఫర్లు కూడా అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది. అప్డేట్ కాని ఫొటోగ్రాఫర్లు పోటీలో వెనుకబడి పోతున్నారు. ఫొటోగ్రఫీని కూడా ఒక వృత్తిగా భావించి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందించాలి. అప్పుడే ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అభివృద్ధి చెందడానికి అవకాశముంటుంది. – పోసిన వీరేంద్రకుమార్, రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ ఫొటోఅండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, రాజమహేంద్రవరం నైపుణ్యానికి కొదవులేదు సాంకేతికత ఎంత పెరిగినా నైపుణ్యానికి ఉన్న ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. ఆసక్తి ఉండాలే కానీ ప్రకృతిపై కన్నేస్తే కమనీయమైన దృశ్యాలను చిత్రీకరించే వీలుంది. సృజనాత్మకత, ఓపిక, సమయం కేటాయిస్తే మంచి ఫోటోగ్రాఫర్గా రాణించొచ్చు. ఈ వృత్తిలో సంపద ఎలా ఉన్నా సంతృప్తి పుష్కలంగా ఉంటుంది. – చిక్కం శ్రీనివాస్, పద్మాలయ స్డూడియో, అంగర ● ప్రతి ఫొటో.. ఓ జ్ఞాపకం ● చరిత్రను సజీవంగా నిలిపే ఫొటోగ్రఫీ ● ఫొటోలు, సెల్ఫీలకు పెరుగుతున్న ప్రాధాన్యం ● నేడు ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం రాయవరం/కపిలేశ్వరపురం: భావావేశాలకు గురిచేసే ఎన్నో సంఘటనలు.. ఆ ఘటనల దృశ్యాలు..వాటి జ్ఞాపకాలను మనసు తన కాన్వాస్పై ముద్రించుకుంటుంది. ఆ అనుభూతులను ఆస్వాదించడమో.. లేదా అనుభవించడమో పూర్తి కాకముందే మరో సంఘటన.. దృశ్యంగా.. జ్ఞాపకంగా.. ఇలా జీవిత పర్యంతం ఎన్నో ఘటనల దృశ్యాలు మదిలో నిక్షిప్తమై కాలగతిలో కలసిపోతుంటాయి. వాటిలో కొన్ని ఘటనల దృశ్యాలు మాత్రం ఎప్పటికీ మదిని ముద్దాడేవో.. మెలిపెట్టేవో.. గిలిగింతలు పెట్టేవో కచ్చితంగా ఉంటాయి. వాటిని కళ్లముందు నిలిపే అద్భుతం ‘చిత్రం’ మాత్రమే. అనుకునో.. కావాలనో.. ఆదమరచినపుడో ఎవరో కెమేరాతో క్లిక్ మనిపించిన ఆ చిత్రం నిజంగా మాయావే. ఎన్నేళ్లు గతించిపోయినా ఏ మూలనుంచో.. ఏ ఆల్బం నుంచో బయటపడినపుడు గత కాలపు మధురోహల్లోకి తీసుకుపోయి మురిపించేస్తుంది. కన్నీరు పెట్టిస్తుంది. అవి ఆనంద బాష్పాలు కావచ్చు.. నిబ్బరం కోల్పోయి ఒలికిన కన్నీరు కావచ్చు. కాలాన్ని సైతం జయించిన ఆ ‘చిత్రం’.. ఎంతో అపురూపం. మనసుతో తీస్తేనే ఫొటోగ్రాఫ్.. సాంకేతికంగా వృద్ధి చెందిన తరువాత వచ్చిన ఆవిష్కరణల్లో కెమేరా ఒక అద్భుతం. ఆ కెమేరా లెన్స్ ముందున్న దృశ్యాన్ని క్లిక్ మనిపిస్తే అది కేవలం ఫొటో అవుతుంది కానీ ఫొటోగ్రఫీ కాదు. ముందున్న దృశ్యాన్ని క్లిక్మనిపించే వ్యక్తి కన్ను భావగర్భితమైనదైనపుడే.. అటువంటి వ్యక్తి క్లిక్చేసి ఆవిష్కరించే చిత్రాన్నే ఆహా.. ఏం ఫొటోగ్రాఫ్ అనగలం. అలాంటి కెమెరా పితామహుడు డాగురేకు పేటెంట్ లభించిన రోజు ఆగస్టు 19న ఏటా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఫొటో విశ్వ వ్యాపితం.. అందుకే మిత్రులు, కుటుంబ సభ్యుల సమాగమం.. శుభాశుభ కార్యాలు.. సభలు, సమావేశాలు.. అది ఏదైనా నేడు ఫొటోలు తీయించడం సాధారణమైన విషయం. రేపటికి అదో జ్ఞాపకమే కాదు.. రిఫరెన్స్ కూడా. ఇక సాధారణ ప్రజా జీవనంలోకి వస్తే ప్రతి ఇంటా ఎన్నో బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు.. రెండు లేదా మూడు దశాబ్దాల నాటి ఫొటోలు ఎన్నో ఉంటాయి. అవి చూచినపుడల్లా ఆ రోజుల్లోకి వెళ్లిపోయి నాటి డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ చూసుకుని ఎన్ని కామెంట్లు పాసైపోతాయో.. అన్నీ మనసును ఆ రోజుల్లోకి తీసుకెళ్లి గిలిగింతలు పెడతాయి. గమ్మత్తైన చప్పుడు ‘క్లిక్’ క్లిక్.. గమ్మత్తైన మెత్తని చప్పుడు. క్షణాల్లో సుందర దృశ్యం. చూపుడువేలి కొనతో బటన్ నొక్కితే ఎదుటి దృశ్యం చిన్ని చిప్లో బంధీ అవుతుంది. కొంతమందికి ఎన్ని సార్లు, ఎన్ని వేల ఫొటోలు తీయించుకున్నా కొత్తదనమే. గుండె కింద మెత్తని మధుర జ్ఞాపకాలను నిక్షిప్తం చేసి అవసరమైనప్పుడు వీక్షించగలిగే అపురూపమైన అవకాశాన్ని మనకు ఫొటోగ్రఫీ అందిస్తుంది. ఇటీవల కాలంలో సెల్ఫోన్ల రాకతో కెమెరాల ప్రాభవం కాస్త తగ్గినా విలక్షణమైన ఫొటోలకు మాత్రం స్టూడియోలు, కెమెరాలను ఆశ్రయించక తప్పదు. రోలికార్డ్, రైస్ ల్యాండర్, రోలీ ఫ్లెక్స్, నికాన్, కేనన్ వంటి ఎన్నో కంపెనీల కెమెరాలు వివిధ మోడళ్లలో అందుబాటులోకి వచ్చాయి. వేల నుంచి లక్షల విలువ చేసే కెమెరాలు ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ఫొటోగ్రఫీ అనేది గ్రాఫోన్ అనే పదం నుంచి పుట్టింది. గ్రాఫోన్ అంటే రాయడం, చిత్రించడం అని అర్ధం. మొదటిసారిగా 1826లో ఫ్రెంచి శాస్త్రవేత్త జోసఫ్ నైసిఫర్ నిస్సీ కనిపెట్టిన మొదటి కెమెరాతో ప్రారంభమైన ఫొటోగ్రఫీ నేడు డిజిటల్ ఫొటోస్ స్థాయికి అభివృద్ధి చెందింది. తీసే ఫొటోను బట్టి దాని ప్రాముఖ్యాన్ని బట్టి నేడు వివిధ లెన్సులు అందుబాటులోకి వచ్చాయి. సెల్ఫోన్లో బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు అందుబాటులోకి జనబాహుళ్యానికి ఫొటోగ్రఫీ మరింత దగ్గరైంది. తాజాగా డ్రోణ్ ఫొటోగ్రఫీతో విహంగ వీక్షణం చేస్తూ తీసే ఫొటోలకు ఎంతో డిమాండ్ ఉంది. వినూత్న రీతిలో.. నేచురల్, వైల్డ్ లైఫ్, ఫైన్ ఆర్ట్స్, నైట్ స్కేప్, వెడ్డింగ్ ఫొటోగ్రఫీ, యాష్రో ఫొటోగ్రఫీ, స్ట్రీట్ ఫొటోగ్రఫీ, సీటీస్కేప్స్, ల్యాండ్ స్కేప్స్, నైట్స్కేప్స్ ఇలా ఎన్నో రకాలుగా ఫొటోగ్రాఫర్లు తమ ప్రతిభ చాటుకుంటున్నారు. ఎమోషన్లు, ఫీలింగ్స్, సేడ్నెస్, థింకింగ్, కేరింగ్ ఇలా అన్ని రకాల ఎమోషన్లను ఒక్క క్లిక్తో చూపిస్తుంటారు. అంతే కాకుండా సమాజంలో జరుగుతున్న ఆకృత్యాలను కళ్లకు కట్టినట్టు చూపించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చే ఫోటోలు తీయడంలోను కొందరకు తమ ప్రతిభ చూపుతున్నారు. తరాలుగా ఇదే పని.. కాకినాడలో చెక్కా బసవరాజు 1885లో ఓ హాబీగా ఫొటోగ్రఫీని ప్రారంభించి చెక్కా బసవరాజు అండ్ సన్స్ ఏర్పాటు చేశారు. నాలుగు తరాలుగా తన కుటుంబం ఆ ప్రతిష్టను నిలబెట్టుకుంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఫొటోగ్రఫీ అసోసియేషన్లలో నాలుగు వేల మంది వరకు ఫొటోగ్రాఫర్లు ఉన్నారు. ఫొటోగ్రాఫర్లలో మిక్సింగ్ ఎడిటర్లు, ఫొటగ్రఫీ ఎడిటర్లు, ఫొటో ల్యాబ్ ఆపరేటర్లు ఇలా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు ఏడు వేల మంది ఈ వృత్తిపై ఆధారపడి ఉన్నారు. కాకినాడ జిల్లాలో 15 మండలాలకు చెందిన సుమారు 2వేల మంది ఫోటోగ్రాఫర్లు 4 జోన్లు, 8 సంఘాలుగా ఉన్నారు. కుటుంబం అంతా కలసికట్టుగా.. కపిలేశ్వరపురం మండలంలోని అంగర గ్రామానికి చెందిన పద్మాలయా ఫోటో స్టూడియోను 1986 ఆగస్టు 16న ప్రారంభించారు. వారి కుటుంబం ఫో టో గ్రాఫర్ల జీవన విధానాన్ని స్పష్టం చేస్తుంది. గ్రా మానికి చెందిన సోదరులు చిక్కం నరసింహారావు, శ్రీనివాస్, కాశీ విశ్వనాథం 38 ఏళ్లుగా స్టూడియో నిర్వహిస్తున్నారు. ఆహ్లాదకరమైన ప్రకృతి అందాల ను కెమేరాతో ఒడిసి పట్టడం శ్రీనివాస్కు అలవాటు. -
అయినవిల్లికి పోటెత్తిన భక్తులు
అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. స్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో స్వామికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకం, ఏకాదశ, లఘున్యాస, రుద్రాభిషేకాలు, వివిధ ప్రత్యేక పూజలు జరిపారు. స్వామి మహానివేదన అనంతరం వివిధ పుష్పాలతో అర్చకస్వాములు సర్వాంగ సందరంగా అలంకరించారు. స్వామివారి లఘున్యాస, ఏకదశ రుద్రాభిషేకాల్లో 34 మంది, లక్ష్మీగణపతి హోమంలో 12 మంది దంపతులు పాల్గొన్నారు. 20 మంది తమ నూతన వాహన పూజలు నిర్వహించారు. 24 చిన్నారులకు తులాభారం నిర్వహించారు. స్వామివారి అన్నదాన పథకంలో 1384 మంది అన్నప్రసాదం స్వీకరించారు. స్వామివారికి వివిధ పూజలు, అన్నదాన విరాళాలుగా రూ.2,07,312 ఆదాయం లభించిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం ఆలయంలో అమలు చేస్తున్న నిత్యాన్నదాన పథకానికి ముమ్మిడివరం వాస్తవ్యులు ముళ్లపూడి శ్రీగణేష్ కుటుంబ సభ్యులు ఆదివారం రూ.లక్ష విరాళం అందజేశారు. ఈ సొమ్మును ఆలయ అర్చకుడు సత్తిబాబుకు అందజేశారు. దాతను వేదపండితులు వేదమంత్రాలతో సత్కరించి స్వామి చిత్రపటం ప్రసాదం అందజేశారు. -
తెలుగు భాషను పరిరక్షించుకుందాం
● శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షుడు ప్రతాప్ ● వైభవంగా 138వ జాతీయ శతాధిక కవి సమ్మేళనం అమలాపురం రూరల్: తెలుగు భాష పరిరక్షణకు తెలుగువారు కృషి చేయాలని అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కత్తిమండ ప్రతాప్ అన్నారు. కవులు సామాజిక చైతన్యంతో కవిత్వం రాయాలని ఆయన అన్నారు. ఆయన ఆధ్వర్యంలో అమలాపురం అంబేద్కర్ కమ్యూనిటీ భవనంలో ఆదివారం వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషా సంబరాలు నిర్వహించారు. ప్రాచీన, ఆధునిక కవుల వేషధారణలతో సాగిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. సెప్టెంబర్ 29వ తేదీన అనకాపల్లిలో తెలుగు భాషోత్సవాలు, శతాధిక కవుల కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు ప్రతాప్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు హాజరై కళావేదిక సాహితీ సేవను ప్రశంసించారు. తెలుగు తేజం, గోదావరి సోషల్ అండ్ కల్చర్ అసోసియేషన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ సంయుక్తంగా సాహితీ రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన ప్రముఖ కవయిత్రి కొల్లి రమావతి రాజమహేంద్రవరం నన్నయ విద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ తరపట్ల సత్యనారాయణ, తెలుగు అధ్యాపకులు ప్రముఖ సాహితీవేత్త మాకే బాలార్జున సత్యనారాయణ, ప్రముఖ రచయిత్రి చిట్టె లలిత, ప్రముఖ రచయిత్రి ఈశ్వరి భూషణం విశ్రాంత విద్యాధికారి గిరిజన సంక్షేమం కేఆర్.పురం ఏలూరుకు చెందిన డాక్టర్ టి.పార్థసారధి, కాకినాడ పీఆర్ కళాశాల సంస్కృత శాఖా అధ్యక్షురాలు డాక్టర్ వై. బుజ్జిలకు జ్ఞాపిక, ప్రశంసాపత్రం, రూ.10వేలు నగదు పురస్కారాన్ని అందజేశారు. కళావేదిక జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం, జాతీయ మహిళా అధ్యక్షురాలు చిట్టె లలిత జిల్లా కమిటీల ఏర్పాటులోనూ సాహితీ యజ్ఞంలో నిరంతరం కృషి చేస్తున్నారని ప్రతాప్ ప్రశంసించారు. ఈ సందర్భంగా పలువురు సాహితీవేత్తలను సత్కరించారు. కార్యక్రమంలో కళావేదిక జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణం, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ టి.పార్థసారధి, పోలిశెట్టి అనంతలక్ష్మి దేవి, అరిగెల బలరాం మూర్తి , గుర్రం రామకృష్ణారావు పాల్గొని కవి సమ్మేళనం నిర్వహించారు. రాష్ట్రం నుంచి 150 మంది కవులు తమ కవితల ద్వారా తెలుగు భాషా వైభవాన్ని చాటి చెప్పారు. -
నిబంధనలు తొలగించాలి
ఎమ్మెల్సీ ఐవీ డిమాండ్ అమలాపురం టౌన్: రాష్ట్రంలో సర్వ శిక్ష విభాగంలో పనిచేస్తున్న ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ల (ఐఈఆర్పీ) జీతాల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన అక్రమ నిబంధనలను తక్షణమే రద్దు చేయాలని ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు (ఐవీ) డిమాండ్ చేశారు. అమలాపురంలోని యూ టీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్సీ ఐవీని ఐఈఆర్పీలు ఆదివారం కలిసి తమ సమస్యలను వివిరిస్తూ ఓ వినతి పత్రం అందించారు. దీనిపై స్పందించిన ఐవీ మాట్లాడుతూ ఐఈఆర్పీలు జీతాల చెల్లింపులపై ఆంక్షలు విధించడం అన్యాయ మని అన్నారు. వారు రెగ్యులైజేషన్ అడగకూడదని, కోర్టులకు వెళ్లడానికి వీలులేదని, ఎలాంటి కార ణం లేకుండా విధుల నుంచి తొలగించే అధికారం యాజమాన్యనికి ఉంటుందన్న నిబంధనలు వర్తింపచేయడం సరికాదని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. బాండు పేపరుపై సంతకం పెడితేనే జీతం చెల్లిస్తామన్న నిబంధన మరీ దారుణమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి అసంబద్ధ, అక్రమ నిబంధనలను తొలగించాలని డిమాండ్ చేశారు. రాత పూర్వకమైన ఉత్తర్వులు లేకుండా ఈ నిబంధనలు అమలు చేయడమేమిటని ఎమ్మెల్సీ ప్రశ్నించారు. ఈ నిబంధనల వల్ల 1350 మంది ఐఈఆర్పీలు ఇబ్బంది పడుతున్నారని, ఉన్నతాధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్తానని ఆయన తెలిపారు. -
క్రీడాకారులను తయారు చేసుకోవాలి
ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అమలాపురం టౌన్: క్రీడాకారులు అప్పటికప్పడు పుట్టరని, ప్రతిభ గల క్రీడాకారులను మనం తయారు చేసుకుంటేనే వారు అంచలంచెలుగా ఎదిగి జాతీయ స్థాయికి ఎదుగుతారని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. పాఠశాలల స్థాయిలోనే విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని నింపి క్రీడాంశాలవారీగా వారి ఆసక్తిని బట్టి నిష్ణాతులైన క్రీడాకారులుగా తీర్చిదిద్దినప్పుడే క్షేత్రస్థాయి నుంచి క్రీడా వ్యవస్థ బలపడుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు. ఈ మేరకు ఆయన ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో క్రీడా స్ఫూర్తి అంశంపై వివరించారు. ఇప్పడు రాష్ట్ర ప్రభుత్వం జాతీయ స్థాయి క్రీడలను నిర్వహించాలన్న ఆలోచనను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేసి పాఠశాలల విద్యార్థుల్లో వారి వారి అభిరుచులను బట్టి క్రీడా స్ఫూర్తి నింపి సత్ఫలితాలు సాధించారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వంలో కూడా ఆ తరహా ప్రయత్నం సాగాలని ఆకాంక్షించారు. స్పోర్ట్ పాలసీలు తయారు చేసినప్పుడు క్రీడలపై అవగాహన లేని ఐఏఎస్ అధికారులు సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకోకూడదని సూచించారు. స్పోర్ట్స్ పాలసీ రూప కల్పనలో విశ్రాంత స్పోర్ట్స్ ఉన్నతాధికారులు, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారుల ఆలోచనలు, సూచనలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. వేణుగోపాలస్వామికి వెండి ఆభరణాల సమర్పణ మామిడికుదురు: మండలంలోని మొగలికుదురు గ్రామంలో కొలువుదీరిన శ్రీరుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామికి గ్రామానికి చెందిన దండు భీమరాజు, విజయలక్ష్మి దంపతులు రూ.1.5 లక్షల విలువైన వెండి ఆభరణాలను ఆదివారం సమర్పించారు. శ్రావణమాసం సందర్భంగా భీమరాజు దంపతులు స్వామి వారికి వెండి కవచం, శంఖు చక్రాలు తదితర ఆభరణాలను అందజేశారు. అర్చక్షులు సంప్రోక్షణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వెండి ఆభరణాలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. నేడు యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక అమలాపురం రూరల్: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సోమవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టరేట్లోని గోదావరి భవన్లో ఉదయం 10 గంటల నుంచి యథావిధిగా నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు తమ సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి తగు పరిష్కార మార్గాలు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లోవలో భక్తుల సందడి తుని రూరల్: తలుపులమ్మ అమ్మవారిని దర్శించేందుకు వచ్చిన భక్తులతో లోవ దేవస్థానంలో సందడి నెలకొంది. ఆదివారం వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన భక్తులు ఎనిమిది వేల మంది అమ్మవారిని దర్శించుకున్నట్టు కార్యనిర్వహణ అధికారి పెన్మెత్స విశ్వనాథరాజు తెలిపారు. లడ్డూ, పులిహోర ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,19,975, పూజా టికెట్లకు రూ.65,930, కేశఖండనశాలకు రూ.15,040, వాహన పూజలకు రూ.6,200, కాటేజీలు, పొంగలి షెడ్లు, వసతి గదుల అద్దెలు రూ.74,392, విరాళాల ద్వారా రూ.85,353, మొత్తం రూ.3,76,890 ఆదాయం సమకూరినట్టు ఈఓ వివరించారు. సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి రూ.1,00,001 అన్నవరం: సత్యదేవుని నిత్యాన్నదాన పఽథకానికి రాయుడు శ్రీనివాసరావు (కాకినాడ) రూ.1,00,001 విరాళాన్ని ఆది వారం సమర్పించారు. దాతకు అన్నదానం రశీదు, బాండ్ను అధికారులు అందజేశారు. -
సంస్కృతంతో విడదీయరాని బంధం
సంస్కృతంతో తెలుగుకు విడదీయరాని సంబంధం ఉంది. తెలుగులో 40 శాతం పదాలు సంస్కృతం నుంచే వచ్చాయని భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం. తెలుగు, సంస్కృతం రెండు ఒకే భాషా కుటుంబానికి చెందకపోయినా ఒకటితో ఒకటి కలిసి మనగలగడం ఆశ్చర్యం. – డాక్టర్ పీవీబీ సంజీవరావు, తెలుగు శాఖధిపతి, ఎస్కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్టాంప్ విడుదల సంస్కృతం భారతీయ భాషలలో అంతర్లీనంగా ఉంటుంది. కొన్ని పదాలు అటూఇటూ రూపాంతరం చెందాయి. రూపాంతర భాషాకుటుంబాలకి ప్రాకృతభాషలని పేరు. సంస్కృతంపై ఉజుపిస్ దేశం స్టాంప్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. నేడు నన్నయ యూనివర్శిటీ, కలెక్టరేట్లో ఈ స్టాంప్ని విడుదల చేయనున్నారు. – శ్రీనివాస చీమలమర్రి, అంబాసిడర్ ఫర్ జైన్ లిటరేచర్, రిపబ్లిక్ ఆఫ్ ఉజుపిస్ -
అమెరికాలో ఇంటర్న్షిప్నకు అమలాపురం కుర్రాడు
అమలాపురం టౌన్: పట్టణానికి చెందిన పిల్లాడి మధుకృష్ణ చంద్రబాబు సినీ నటుడు సోనూసూద్ అందించిన సాయంతో చదువుకుని ప్రయోజకుడై అమెరికాలో ఇన్టర్న్షిప్కు ఎంపికయ్యాడు. స్థానిక చిరు వ్యాపారి కుమారుడైన అతడు సోనూ అందించిన రూ.10 లక్షల సాయంతో పంజాబ్లోని లూధియానాలోని సిటీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీలో డిగ్రీ చేస్తూ ఈ ఘనత సాధించాడు. జే–వన్ వీసాపై ఆ యువకుడిని హాస్పటాలిటీ స్టూడెంట్ – ఎక్ఛేంజ్ విజిటర్గా 12 నెలల పాటు అమెరికా వెళ్లనున్నాడు. కరోనా కాలంలో రవాణా స్తంభించినపడు స్థానిక ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు, సామాజిక కార్యకర్త బాబీ గాబ్రియేల్ సాయంతో తన చదువు కోసం లూధియానా వర్సిటీకి వెళ్లినట్టు గుర్తుచేసుకున్నాడు. ఈ సందర్భంగా వారు చంద్రబాబును అభినందించారు. -
వందే సంస్కృత భారతీమ్
భాషాసు ముఖ్య మధుర దివ్య గీర్వాణ భారతి ! తస్మాది కావ్యం మధురం తస్మాదపి సుభాషితం! పద్మాసన ప్రియాం దేవీం వీణా పుస్తక ధారిణీం! జననీం సర్వవిద్యానాం ప్రపంచంలో ఉన్న వేల భాషలలో సంస్కృతం ప్రాచీనమైనది. సాహిత్య పరంగా, సౌందర్యపరంగా, వాంగ్మయ వైశాల్యపరంగా, శబ్ద సంపదగా ఏ దృష్టితో చూసినా దీనిని మించిన భాష మరొకటి లేదు. భారతీయులు దీనిని చూసి గర్వించాలి. సరళంగా స్పష్టంగా నేర్చుకోదగిన భాష సంస్కృతం. అభ్యసించేలా కృషి చేద్దాం! రాబోయే తరాలకు అలవాటు చేద్దాం. – రాజనాల రాజేశ్వరి, సంస్కృతశాఖ, శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ మహిళా కళాశాల -
విశ్వజన మోహితం సంస్కృతం
కంప్యూటర్కు వాడుకోగలిగే భాషల్లో మొదటి స్థానం సంస్కృతానిదే. ఆ భాష అతి గొప్ప లక్షణం ఎన్ని వేల లక్షల కొత్త పదాలనైనా తయారు చేయవచ్చు. వాటికి వ్యత్పత్తి కలిగి ఉండడం మరో ప్రత్యేకత. అందుకనే లిథునియా, రష్యా, స్లొవేకియా మొదలైన యూరోపియన్ దేశాల వారు వారి మూలాలను సంస్కృతంలో వెతుక్కుంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రెండు రకాల స్టాంపులను ఉజుపిస్ విడుదల చేస్తోంది. వాటి ధర ఇండియన్ కరెన్సీలో రూ.ఒక్కొటి రూ.120 ఉంటుంది. ● ప్రపంచంలో 877 భాషలపై ఎంతో ప్రభావం ● భారత సంస్కృతి, సంస్కృతం ప్రతిష్టమైనవి ● నేడు విశ్వ సంస్కృత భాషా దినోత్సవం ● సంస్కత భాషపై అభిమానంతో నేడు ఉజుపిస్ దేశం స్టాంప్ విడుదల సీటీఆర్ఐ(రాజమహేంద్రవరం): భాషలకు సంస్కృతం తల్లివంటిది అని తొలి తెలుగు వ్యాకరణకర్త, ఆంధ్రభాషాభూషణము రచయత మూలఘటిక కేతన అన్నట్లుగా ప్రపంచం అంతా ఇప్పుడు సంస్కృతం గురించి గొప్పగా చెప్పుకుంటోంది. కాని భారతదేశంలో పుట్టిన సంస్కృతం ఒక్క వర్గం వారికి తప్ప మరే ఇతర వర్గాల వారు అభ్యసించకపోవడంతో ఆ భాష నేడు కనుమరుగవుతోంది. పాశ్చాత్య దేశాల వారు ఈ భాష ఔన్నత్యాన్ని గుర్తించి నేర్చుకోవడం హర్షణీయం. నిజానికి సంస్కృతం అంటే భాష కాదు. కృతము అంటే చెయటము లేదా చేసినదని, సంస్కరిపబడిన పని, భాష అని అర్థము. జనని ఎల్ల భాషలకు సంస్కృతంబు అనడానికి కారణమిదే. ప్రపంచంలో అతి పురాతన భాషల్లో సంస్కృతం ఒకటి. మన దేశ అధికారిక భాషగా గుర్తించబడి గౌరవించబడుతోంది. సంస్కృతాన్ని దేవ భాష, అమరవాణి, గీర్వాణిగా పిలుస్తారు. సంస్కృతం దేశ భాషలపైనే కాదు, ప్రపంచంలోని 877 భాషలపై తన ప్రభావాన్ని కలిగి ఉందని పరిశోధనలు తేల్చారంటే ఆ భాష ప్రభావం అర్థం చేసుకోవచ్చు. సంస్కృతం ఔన్నత్యాన్ని నిలబెట్టేలా ఏటా శ్రావణ పౌర్ణమి రోజున విశ్వ సంస్కృత భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సంస్కృత భాష గొప్పదనం సంస్కృతాన్ని ఉన్నతమైనదిగా గుర్తించారు కాబట్టే ఈ భాషలోని గ్రంథాలను వివిధ భాషల్లోకి పాశ్చాత్య పండితులు అనువదించుకున్నారు. అలాగే ఆధునిక విజ్ఞాన విషయాలకు సంస్కృత సాహిత్యం భాండాగారం. ఇవే మన ప్రస్తుత సంస్కృతికి నిలువుటద్దాలై మనల్ని ముందుకు నడిపిస్తున్నాయనడంలో అతిశయోక్తి లేదు. పంచతంత్రం, హితోపదేశం, ఇతిహాసాలు రామాయణ, భారతం, భర్తృహరి సుభాషితాలు ప్రపంచ సాహిత్యానికి అద్భుతమైన ఎన్సైక్లోపీడియాలు. సంస్కృతంపై ఉజుపిస్ దేశం స్టాంప్ విడుదల.. మన సంస్కృతానికి మనం గౌరవం ఇవ్వకపోయినా పాశ్చాత్య దేశాల వారు ఎంతో గౌరవం ఇస్తున్నారు. ఏకంగా రిపబ్లిక్ ఆఫ్ ఉజుపిస్ దేశం వారు ప్రపంచ సంస్కృత దినోత్సవం సందర్భంగా లిధునియా రాజధాని ఇండియన్ ఎంబసీలో సోమవారం గౌరవ సూచకంగా కమోరెటివ్ స్టాంపును విడుదల చేస్తోంది. అసలు యూరోపియన్ దేశమైన ఉజుపిస్ సంస్కృత పై ఇంత గౌరవాన్ని ఉంచి స్టాంపును ఎందుకు విడుదల చేస్తోందన్న అనుమానం రావటం సహజం. ఉజుపిస్ అధికారిక భాష లిధునియా. ఈ భాష సంస్కృతానికి చాల దగ్గరగా ఉంటుంది. పేరుకే యూరోపియన్ భాష లిథునియా కాని అనుసరించేది పూర్తిగా సంస్కృతమే. అతిపురాతమైన విల్నియస్ యూనివర్సిటీలో ఏషియన్ ట్రాన్సిడెంటల్ స్టడీస్ కేంద్రంలో సంస్కృత శాఖ ఉంది. ఈ కేంద్రంలో పనిచేసే ఆచార్య వితస్ బిధునస్ 2016లో సంస్కృత లిథునియామాల అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఇందులో సంస్కతానికి లిథునియాకి వున్న సంబంధం గురించి వివరించారు. -
వంద కిలోల గంజాయి పట్టివేత
● ఇద్దరు నిందితుల అరెస్టు ● డీఎస్పీ శ్రీనివాసులు రాజానగరం: జాతీయ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న వంద కిలోల గంజాయిని స్థానిక పోలీసులు ఆదివారం పట్టుకుని, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ గంజాయి విలువ సుమారు రూ.5 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఉత్తర మండల డీఎస్పీ కె.శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు రాజానగరంలోని మాధవీ ఫంక్షన్ హాలు వద్ద జాతీయ రహదారిపై వాహానాలను తనిఖీ చేస్తుండగా విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న టిఎన్ 88 బి 5961 నంబరు గల లారీలో తరలిస్తున్న వంద కిలోల గంజాయి పట్టుబడింది. తమిళనాడులోని సేలం జిల్లా వజపడి మండలం, వెప్పిలైపట్టిపుదుర్కు చెందిన లారీ డ్రైవర్ కమ్ ఓనర్ అయిన మరిముత్తు ఆర్ముగమ్ (45), పెరంబలూరు జిల్లా, సిరుమతూర్ మండలం, కుదిక్కడుకు చెందిన వేల్ మురుగన్ (27) పశ్చిమ బెంగాల్ కిరాయికి వెళ్లి తిరిగి వస్తూ విశాఖపట్నం సమీపంలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి ఈ గంజాయిని తక్కువ రేటుకు కొనుగోలు చేశారు. అక్కడ నుంచి ఆ గంజాయిని ఐదు సంచులలో నింపి తీసుకువెళ్లి, చిల్లర వ్యాపారం చేస్తున్నారన్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, గంజాయిని, లారీని, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ కేసులో చురుగ్గా పనిచేసిన సీఐ, ఎస్సైలను ఎస్పీ నరసింహ కిశోర్ అభినందించినట్టు డీఎస్పీ తెలిపారు. ఏడాదిలో ఏడు కేసులు.. స్థానిక పోలీసు స్టేషను పరిధిలో ఈ ఏడాదిలో గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి ఇంతవరకు ఏడు కేసులు నమోదయ్యాయని ఉత్తర మండల డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. వీటిలో సుమారు రూ.25 లక్షలు విలువ చేసే 506.35 కిలోల గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన రెండు లారీలు, ఒక వ్యాన్, ఒక మోటారు సైకిలును స్వాధీనం చేసుకుని, 22 మందిని అరెస్టు చేశామన్నారు. సమావేశంలో సీఐ ఎస్పీ వీరయ్యగౌడ్, ఎస్సై మనోహార్ పాల్గొన్నారు. -
గాయత్రి మాతగా వనదుర్గమ్మ
అన్నవరం: రత్నగిరి దుర్గామాత శ్రీ వనదుర్గ అమ్మవారి శ్రావణమాస జాతర మహోత్సవాలలో భాగంగా నాలుగో రోజు ఆదివారం వనదుర్గ అమ్మవారిని గాయత్రి మాతగా అలంకరించి పండితులు పూజించారు. ఉదయం ఎనిమిది నుంచి 11 గంటల వరకు రుత్విక్కులు నవగ్రహ జపాలు, శ్రీచక్రార్చన, పురుష, శ్రీ సూక్త పారాయణ, మూలమంత్ర జపాలు, సూర్యనమస్కారాలు, సప్తశతీ పారాయణలు, మూలమంత్ర జపాలు, బాల, కన్య, సువాసినీ పూజలు ఘనంగా నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు లక్ష కుంకుమార్చన, చండీహోమం నిర్వహించారు. కుంకుమార్చన అనంతరం సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, ప్రసాదాలు నివేదించి భక్తులకు పంపిణీ చేశారు. వేద పండితులు గొల్లపల్లి ఘనాపాఠి. యనమండ్ర శర్మ, ఉపాధ్యాయుల రమేష్, ముష్టి పురుషోత్తం, కల్యాణబ్రహ్మ ఛామర్తి కన్నబాబు, ప్రథమశ్రేణి వ్రత పురోహితులు నాగాభట్ల రవిశర్మ, పాలంకి పట్టాభి, అంగర సతీష్, ఆలయ అర్చకులు కోట వంశీ, పరిచారకులు పవన్ ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు. నేడు అమ్మవారికి చండీహోమం శ్రావణ పౌర్ణిమ సందర్భంగా సోమవారం జరిగే చండీహోమం పూర్ణాహుతి కార్యక్రమంతో వనదుర్గ అమ్మ వారి జాతర మహోత్సవాలు ముగియనున్నాయి. ఉద యం తొమ్మిది గంటలకు చండీహోమం ప్రారంభమ వుతుంది. 11 గంటలకు జరిగే పూర్ణాహుతి కార్యక్ర మంలో రుత్విక్కులు హోమద్రవ్యాలను సమర్పిస్తారు. అనంతరం అమ్మవారికి వేదపండితుల ఆశీస్సులు, ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. -
రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తి మృతి
సామర్లకోట: స్థానిక రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో సుమారు 60 ఏళ్ల వయసున్న వ్యక్తి మృత దేహాన్ని గుర్తించారు. రైల్వే పోలీసు కథనం ప్రకారం పిఠాపుం–సామర్లకోట కేఎం నెంబరు 630/–34–40 పోస్టుల మధ్య ఆ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. రైల్వే ఏఎస్ఎం జీకేఎస్ శ్రీదేవి ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించినట్టు తెలిపారు. మృతదేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. తలకు ఎడమ వైపు గాయం ఉన్నదని, మృతుడు చామనచాయ రంగులో ఉండి కుడి చాతిపై పుట్టుమచ్చ, బొడ్డు దిగువ భాగంలో మరో పుట్టు మచ్చ ఉండి, తెలుపు షర్టు నీలం గళ్ల లింగి ధరించి ఉన్నాడని చెప్పారు. రైల్వే ఎస్సై బి.లోవరాజు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పెద్దాపురం ఏరియా ఆస్పత్రికి తరలించామన్నారు. రత్నగిరిపై మరొకరు..అన్నవరం: రత్నగిరిపై తూర్పు రాజగోపురం దిగువన గల ఘాట్రోడ్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అతని వయసు 55 ఏళ్లు ఉంటాయని, తెల్ల చొక్కా, కాషాయం రంగు లుంగీ ధరించి ఉన్నాడని తెలిపారు. అతని మృతదేహాన్ని ప్రత్తిపాడు ఆసుపత్రి మార్చురీకి తరలించామని తెలిపారు. -
మద్యం దుకాణం వాచ్మన్పై హత్యాయత్నం
● పోలీసుల అదుపులో నిందుతుడు ● ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కొవ్వూరు: పట్టణంలో బస్టాండ్ సెంటర్లోని ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద నైట్ వాచ్మన్గా పని చేస్తున్న ఖండవల్లి జయరాజుపై ఆదివారం తెల్లవారు జామున హత్యాయత్నం జరిగింది. మెరకవీధికి చెందిన పిండి సుబ్రహ్మణ్యం తెల్లవారు జామున నాలుగు గంటలకు దుకాణం వద్దకు వచ్చి మద్యం కావాలని అడిగారు. దుకాణం మూసేశారని, మద్యం లేదని చెప్పడంతో ఆగ్రహించిన సుబ్రహ్మణ్యం తనతో తెచ్చుకున్న చాకుతో దాడి చేసి జయరాజు ముఖం, తల, చేతులపైన, చెవి వెనుక, ఛాతీ పైన గాయపరిచారు. జయరాజు కింద పడిపోవడంతో చనిపోయాడనుకుని సుబ్రహ్మణ్యం పారిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. చాకుకు ఉన్న పిడి విరిగిపోవడంతో బాధితుడికి ప్రాణాపాయం తప్పింది. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న జయరాజును స్థానికులు స్థానిక సామాజిక ఆస్పత్రికి తరలించారు. నిజానికి మానసిక వికలాంగురాలైన సుబ్రహ్మణ్యం సోదరి పట్ల జయరాజు గతంలో అసభ్యకరంగా ప్రవర్తించారని, ఆ కోపంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలిందని ఎస్సై కె.జగన్మోహన్రావు తెలిపారు. ఈ విషయంపై సుబ్రహ్మణ్యం సోదరుడు గతంలో జయరాజును మందలించాడని వివరించారు.సెంట్రింగ్ పనులు చేసుకునే సుబ్రహ్మణ్యం తరచూ బయటి ప్రాంతాలకు వెళ్లి వస్తుంటాడని, వీరి ఇంటి పక్కనే సుబ్రహ్మణ్యం సోదరుడు నివసిస్తుంటే, వదిన వీరికి వండి పెడుతుండేందన్నారు. సోదరి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు తెలుసుకుని జయరాజుపై కక్షతో ఈ హత్యాయత్నానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఆసుపత్రి నుంచి అందిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడు సుబ్రహ్మణ్యాన్ని అదుపులోకి తీసుకున్నామని, డీఎస్పీ జి.దేవకుమార్ ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
రూ.4 లక్షల ఖరీదైన బైక్ చోరీ
పెద్దాపురం: స్థానిక బ్యాంక్ కాలనీలో సుమారు రూ.నాలుగు లక్షల విలువైన బైక్ చోరీకి గురైనట్లు ఆదివారం ఫిర్యాదు అందింది. స్థానిక ఎస్సై మౌనిక తెలిపిన వివరాల మేరకు స్థానిక నియర్స్ కింగ్ ఓపెరా అపార్ట్మెంట్లో ఉంటున్న ఆర్అండ్బి డీఈ ఎం.నాగేశ్వరరావుకు చెందిన ఏపీ39క్యూజే 3838 నెంబరు గల బైక్ యథావిధిగానే పార్క్ చేసి ఉంచారు. ఆదివారం ఉదయం లేచి చూసేసరికి బైక్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బహ్రెయిన్లో పెదపట్నంలంక యువకుడి ఆత్మహత్య మామిడికుదురు: ఉపాధి కోసం బహ్రెయిన్ వెళ్లిన పెదపట్నంలంక యువ కుడు ఉరి వేసుకుని చనిపోయాడని కుటుంబ సభ్యులకు శనివారం రాత్రి సమాచారం రావడంతో వారు కన్నీరు మున్నీరవుతున్నారు. వివరాల్లోకి వెళితే మామిడికుదురు మండలం పెదపట్నంలంక శివారు దుర్గాపట్నానికి చెందిన నాగులాపల్లి వీర వెంకటదుర్గా నాగసాయి (22) బహ్రెయన్లో శనివారం ఉరి వేసుకుని చనిపోయాడు. గత నెల 22న ఇంటి నుంచి వెళ్లిన నాగసాయి 29న బెహ్రెయిన్ చేరుకున్నాడని అతని మేనమామ ఉండపల్లి రమేష్ అలియాస్ శ్రీను ఆదివారం తెలిపారు. అక్కడ పెట్రోల్ బంకులో పని చేస్తున్నాడని, అక్కడి సమస్యలపై ఎప్పుడూ చెప్పలేదని, చనిపోవడానికి రెండు రోజులు ముందు కూడా ఫోన్లో మాట్లాడాడని ఆయన తెలిపారు. నాగసాయి మృతిపై విచారణ జరిపించాలని, అతని మృతదేహాన్ని స్వదేశం రప్చించేందుకు సహకరించాలని ఎంపీ గంటి హరీష్ మాధుర్, పి.గన్నవరం ఎమ్మె ల్యే గిడ్డి సత్యనారాయణను కోరారు. ఇండియన్ ఎంబసీ అధికారులతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని మేనమామ తెలిపారు. చెరువులో మునిగి వ్యక్తి మృతి కొత్తపల్లి: ప్రమాదశాత్తు చెరువులోపడి ఒక వ్యక్తి మృతి చెందినట్టు పోలీసులు ఆదివారం తెలిపారు. మండలంలోని కొమరగిరి శివారు చిన్న కలవలదొడ్డికి చెందిన దొంగల శ్రీను(48) అదే గ్రామంలో ఉన్న కఠారి చంటిబాబు పొలంలో ఉన్న చెరువులోకి గేదెను కడిగేందుకు దిగాడు. ప్రమాదశాత్తు అదుపుతప్పి చెరువులో పడి మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎస్సై వెంకటేష్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ప్రారంభం
రాయవరం: ఉపాధ్యాయుల వృత్తి నైపుణ్యాలను పెంచేందుకు ఉద్దేశించిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు శనివారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఇకపై ప్రతి నెలా ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులతో పాటు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు సబ్జెక్టు కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు 50 శాతం మంది పాల్గొనగా, సబ్జెక్టు కాంప్లెక్స్ సమావేశాల్లో భాగంగా తెలుగు, గణితం, బయలాజికల్ సైన్స్ సబ్జెక్టు ఉపాధ్యాయులకు సమావేశాలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు 47, తెలుగు, గణితం, బయలాజికల్ సైన్స్ సబ్జెక్టు కాంప్లెక్స్ ఉపాధ్యాయులకు 21, వ్యాయామ ఉపాధ్యాయులకు 7 స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించారు. వీటిని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.కమలకుమారి పర్యవేక్షించారు. -
కిడ్నీ బాధితుడికి రూ.లక్ష సాయం
కాట్రేనికోన: ిప.గన్నవరం నియోజకవర్గం లంకల గన్నవరం డొక్కా సీతమ్మ కాలనీకి చెందిన కొల్లు రవీంద్ర (21) రెండు కిడ్నీలు పాడై మంచాన పడ్డాడు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ముమ్మిడివరం నియోజకవర్గం పల్లం గ్రామానికి చెందిన అగ్నికుల క్షత్రియ యువత సాయం అందించారు. నిరుపేద కుటుంబానికి అండగా ఉండాలనే తపనతో స్నేహితులంతా కలసి రూ.లక్ష సేకరించి అందజేశారు. ఆర్థిక సహాయం అందించిన యువకుల్లో అవనిగడ్డ నారాయణమూర్తి, మల్లాడి దయ, అవనిగడ్డ శ్రీరాములు, బొమ్మిడి శ్రీరాములు, రాజు, శంకర్, నాయకర్, రామరాజు, వీరబాబు తదితరులు ఉన్నారు. జిల్లా ఏఎస్పీగా ప్రసాద్ అమలాపురం టౌన్: జిల్లా ఏఎస్పీ (అడ్మిన్)గా ఏవీఆర్పీబీ ప్రసాద్ బదిలీపై వస్తున్నారు. ఇప్పటి వరకూ ఇక్కడ ఏఎస్పీగా పనిచేసిన ఎస్.ఖాదర్ బాషాకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. బాషాను మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్యార్టర్స్లో రిపోర్టు చేయాలని ఆదేశాలు వచ్చాయి. నెల్లూరు జిల్లా క్రైం విభాగం ఏఎస్పీగా పనిచేస్తున్న ప్రసాద్ జిల్లాకు వస్తున్నారు. ఆయన రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని స్థానిక ఎస్పీ కార్యాలయం పేర్కొంది. ఇక్కడ పనిచేసిన ఏఎస్పీ బాషా ఏడాదిన్నర కిందట బాధ్యతలు చేపట్టారు. కోనసీమ జిల్లా ఏర్పాటయ్యాక ప్రసాద్ మూడో ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. చవితి ఏర్పాట్లకు శ్రీకారం అయినవిల్లి: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో వచ్చే నెల 7 నుంచి 15 వరకూ నిర్వహించే వినాయక చవితి మహోత్సవాలకు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ శనివారం శ్రీకారం చుట్టారు. ఆలయ ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు, ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణ మూర్తి మంత్రోచ్ఛారణల మధ్య ఎమ్మెల్యే ఉత్సవాలకు నాంది పలికారు. గ్రామ సర్పంచ్ కాకర శ్రీనివాస్, జెడ్పీటీసీ సభ్యుడు గన్నవరపు శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ బయ్యా చినబాబు తదితరులు పాల్గొన్నారు. బాలాజీ ఆలయంలో భక్తుల సందడి మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి ఆలయం శ్రావణ మాసం సందర్భంగా శనివారం భక్తులతో సందడిగా మారింది. తొలుత పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారికి ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. ఆలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేశారు. స్వామి వారికి వివిధ సేవల ద్వారా రూ.3,17,707 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ గ్రంధి మాధవి తెలిపారు. ఇందులో లడ్డూ ప్రసాదం, దర్శనం టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.2,30,798, నిత్యాన్నదాన ట్రస్టుకు భక్తులు రూ.86,909 విరాళంగా అందించారు. 3,671 మంది స్వామి వారిని దర్శించుకోగా, 2,948 మంది అన్నప్రసాదం స్వీకరించారు. స్వామివారి నిత్యాన్నదాన ట్రస్టుకు పాశర్లపూడిబాడవకు చెందిన కాండ్రేగుల వెంకటేశ్వరరావు, సూర్యావతి దంపతులు రూ.11,111 విరాళంగా సమర్పించారు. -
వ్యక్తి ఆత్మహత్య
కపిలేశ్వరపురం: మండలంలోని కేదారిలంక గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ కోణాల ఏడుకొండలు (43) తన ఇంట్లో ఈ నెల 16న రాత్రి ఉరివేసుకుని మృతి చెందాడు. మనస్పర్థల కారణంగా ఇటీవల అతని భార్య ధనలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన ఏడుకొండలు తన ఇంట్లో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అతని కుమార్తె పావని ఫిర్యాదు మేరకు అంగర ఇన్చార్జి ఎస్సై సురేష్బాబు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కాలువలో మహిళ మృతదేహం
ఏలేశ్వరం: మండలంలోని మర్రివీడు గ్రామంలో ఏలేరు ప్రాజెక్టుకు వెళ్లే ప్రధాన కాలువలో శనివారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహానికి కాళ్లు, చేతులు, తల లేవు. దుండుగులు హత్య చేసి కాలువలో పడేసి ఉంటారని భావిస్తున్నారు. ఉదయం కాలువ పక్కనుంచి వెళుతున్న మత్స్యకారులు నీటిలో తేలుతున్న మృతదేహాన్ని గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతురాలి వయసు 30 నుంచి 35 ఏళ్లు ఉంటుందని, హత్య జరిగి వారం రోజులు అయ్యి ఉంటుందని భావిస్తున్నారు. మొండెం మాత్రమే లభ్యం కావడంతో కాలువ ఎగువ ప్రాంతాలైన అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల నుంచి కొట్టుకువచ్చిందా లేదా మైదాన ప్రాంతం నుంచి తీసుకువచ్చి ఇక్కడ పడేశారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఫ హత్యచేశారని పోలీసుల అనుమానం -
విజన్ కార్యాచరణ తయారు చేయాలి
అమలాపురం రూరల్: వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా వికసిత్ ఆంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు వచ్చే ఐదేళ్లకు జిల్లా కార్యాచరణ తయారు చేయాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం అమలాపురం కలెక్టరేట్లో శాఖల వారీగా జిల్లా యాక్షన్ ప్లాన్ రూపొందించే అంశంపై కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారులందరికీ ఈ నెల 21 నుంచి 31 వరకూ రాష్ట్ర స్థాయిలో సంబంధిత హెచ్ఓడీల సమావేశాలు నిర్వహించి, తమ శాఖల ప్రణాళికను రూపొందించడానికి దిశానిర్దేశం చేస్తారన్నారు. జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, సీపీఓ వెంకటేశ్వర్లు, డీఆర్డీఏ పీడీ శివశంకర ప్రసాద్, డ్వామా పీడీ మధుసూదన్, అగ్రికల్చర్ జేడీ బోసుబాబు పాల్గొన్నారు. సోలార్ రూఫ్టాప్లు నిర్మించుకోవాలి పేద, మధ్యతరగతి కుటుంబాలు ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద తమ ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్లను నిర్మించుకోవడం ద్వారా 300 యూనిట్ల వరకూ విద్యుత్తును ఆదా చేసుకోవచ్చని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి సూర్యఘర్ యోజన క్యూఆర్ కోడ్ సెల్ఫీ స్టాండ్ను ఆయన పరిశీలించారు. క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఒక కిలో వాట్ సామర్థ్యం గల సోలార్ ప్యానల్లను ఏర్పాటు చేసుకుంటే రూ. 30 వేల వరకూ రాయితీ అందిస్తుందని, రెండు కిలోవాట్ల సామర్థ్యానికి రూ. 60 వేలు, మూడు కిలోవాట్లకు గరిష్టంగా రూ.78 వేల వరకూ రాయితీ అందిస్తుందన్నారు. ఈ పథకం కింద సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకోవడానికి అతి తక్కువ వడ్డీకే బ్యాంకుల నుంచి రుణాలు లభిస్తాయన్నారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు టోల్ ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. -
అమలాపురంలో ఐఎంఏ వైద్యుల నిరసన
కోల్కతాలో వైద్యురాలి హత్యపై ఖండన అమలాపురం టౌన్: కోల్కతాలో వైద్యురాలిపై లైంగిక దాడి, ఆపై హత్య చేసిన ఘటనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లా శాఖ ఆధ్వర్యంలో వైద్యులు నిరసన తెలిపారు. శనివారం జిల్లాలోని వైద్యులు తమ విధులను బహిష్కరించి అమలాపురంలో నిరసన ప్రదర్శన చేశారు. స్థానిక గడియార స్తంభం సెంటర్కు జిల్లా నలుమూలల నుంచి వైద్యులు చేరుకుని కోల్కతా ఘటనను తీవ్రంగా ఖండించారు. వైద్యురాలిపై ఆటవికంగా లైంగిక చేసి, అతి కిరాతంగా హత్య చేసిన తీరుపై ఐఎంఏ వైద్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో దోషులను తక్షణమే శిక్షించాలని నినాదాలు చేశారు. తొలుత గడియార స్తంభం సెంటర్లో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత ధర్నా నిర్వహించారు. అక్కడి నుంచి ప్రదర్శనగా కలెక్టరేట్ వరకూ చేరుకున్నారు. కలెక్టరేట్కు ఎదురుగా ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వైద్యులు పూలమాలలు వేశారు. అనంతరం కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ను కలసి ఇటీవల కాలంలో వైద్యులపై పెరుగుతున్న దాడులను వివరించారు. దాడులు అరికట్టకపోతే తాము వైద్య సేవలు అందించలేమని వివరించారు. ఐఎంఏ జిల్లా శాఖ అధ్యక్షుడు వీఎస్ఎస్ఎన్ మూర్తి, కార్యదర్శి డాక్టర్ కడలి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో వైద్యులు పీఎస్ శర్మ, గొలకోటి రంగారావు, బి.రాఘవేంద్రరావు, జి.ప్రభాకర్, పయ్యావుల సురేష్, గిరిజా, రమాదేవి, దీపిక తదితరులు పాల్గొన్నారు. వైద్యుల నిరసన శిబిరాన్ని పట్టణ సీఐ కె.క్రిష్టోఫర్ సందర్శించారు. వైద్యులపై జరుగుతున్న దాడులపై చట్ట ప్రకారం తీసుకునే చర్యలను ఆయన వివరించారు. నిరసన ప్రదర్శన అనంతరం స్థానిక గడియారం స్తంభం సెంటర్లో దాడుల నుంచి వైద్యులు ఎలా రక్షణ పొందాలి, దాడులకు పాల్పడే వ్యక్తులను చట్టప్రకారం శిక్షించే అంశాలపై ఐఎంఏ వైద్యులు మాట్లాడారు. -
త్వరలోనే ప్రభాస్తో స్పిరిట్
రాజానగరం: ప్రముఖ సినీ హీరో ప్రభాస్తో త్వరలోనే స్పిరిట్ సినిమా ప్రారంభమవుతుందని సినీ దర్శకుడు సందీప్రెడ్డి స్పష్టం చేశారు. అర్జున్రెడ్డి, కబీర్సింగ్, యానిమల్ చిత్రాలు తీసి హిట్ కొట్టి ఫామ్లో ఉన్న ఆయన స్థానిక జీఎస్ఎల్ వైద్య కళాశాల ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన స్వతంత్య్ర ఆసుపత్రి 38వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో ‘సాక్షి’ ముచ్చడించింది. ఆ వివరాలు ఇలా.. ప్రశ్న: మీరు తీసే సినిమాల్లో వైద్యానికి సంబంధించి అంశాలే ఎక్కువగా ఉంటున్నాయి. దానికి కారణాలేంటి? సందీప్రెడ్డి: ఫిజియోథెరపీ కోర్సు చేసిన నేను కొంతకాలం ప్రాక్టీస్ కూడా చేశాను. అందువల్ల ఆ ఛాయలు సినిమాల్లో కాస్త డీప్గా కనిపిస్తుంటాయి. ప్రశ్న: వైద్య రంగంలో ఉన్న మీరు సినిమా రంగం వైపు ఎందుకు వెళ్లారు? సందీప్రెడ్డి: విద్యార్థి దశ నుంచి ఎందుకో సినిమాలపై ఎక్కువగా ఆసక్తి ఉండేది. సినిమా తీసే విధానాన్ని నిశితంగా పరిశీలించే వాడిని. అందుకే ఫిజియోథెరపిస్టుగా ప్రాక్టీసు చేసే సమయంలోనే సినీ రంగం వైపు అడుగులు పడ్డాయి. ప్రశ్న: తదుపరి సినిమాల గురించి చెబుతారా..! సందీప్రెడ్డి: ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుంది. ప్రశ్న: మహేష్బాబుతో సినిమా అన్నారు, ఎప్పుడు చేస్తారు? సందీప్రెడ్డి: ప్రస్తుతం అందుకు సమయం లేదు. స్పిరిట్ సినిమా తరువాత యానిమల్– 2కి వెళ్తాం. ఈ రెండింటికీ కనీసం నాలుగేళ్లు పడుతుంది. ఆ తరువాతే ఏదైనా ఉంటుంది. ప్రశ్న: వైద్య విద్యార్థులకు మీరిచ్చే సందేశం ఏంటి? సందీప్రెడ్డి: సినిమాల ద్వారానే నా సందేశం ఏంటో చెబుతూనే ఉన్నాను. ఏదేమైనా చేసే పనిపై ఫోకస్ పెట్టాలి. అప్పుడే సరైన ఫలితాలను అందుకోగలుగుతాం. -
సాధారణ బదిలీలకు పచ్చజెండా
రాయవరం: ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. బదిలీల షెడ్యూల్, మార్గదర్శకాలతో జీఓ 75ను విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఈ బదిలీలు జరగనున్నాయి. అయితే బదిలీలను కేవలం 15 శాఖలకే పరిమితం చేశారు. రెవెన్యూ (ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్), పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (ఇన్క్లూడింగ్ సెర్ఫ్), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, జీవీడబ్ల్యూవీ అండ్ వీఎస్డబ్ల్యూఎస్, సివిల్ సప్లయిస్, మైనింగ్ అండ్ జియాలజీ, ఇంజినీరింగ్ స్టాఫ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్, దేవదాయ, రవాణా, పరిశ్రమలు, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్, కమర్షియల్ టాక్స్, ఎకై ్సజ్, ఈఎఫ్ఎస్ అండ్ టీ శాఖల్లో బదిలీలు జరగనున్నారు. ఈ ఏడాది జూలై 31 నాటికి ప్రస్తుతం పనిచేస్తున్న చోట ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి తప్పనిసరిగా బదిలీ ఉంటుంది. మిగిలిన వారు జీరో సర్వీస్పై రిక్వెస్ట్ బదిలీకి అర్హులవుతారు. ఉద్యోగ సంఘాల నేతలకు మాత్రం బదిలీ ఒకే స్థానంలో తొమ్మిదేళ్ల వరకూ మినహాయింపు ఉంటుంది. ఈ నెల 19 నుంచి ఈ నెల 31వ తేదీ వరకూ బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేశారు. తిరిగి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం కొనసాగుతుంది. కాగా ఉపాధ్యాయులు మాత్రం ఈ బదిలీ ఉత్తర్వుల పరిధిలోకి రారు. ఇదిలా ఉంటే ఎన్నికలకు ముందు ఎన్నికల నిబంధనల్లో భాగంగా రెవెన్యూ అధికారులు, ఎంపీడీఓలు బదిలీలకు నోచుకోగా, ఇటీవలే వారిని తిరిగి పూర్వపు స్థానాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చిన విషయం పాఠకులకు తెలిసిందే. ఫ ప్రభుత్వ జీవో విడుదల ఫ 15 శాఖలలో బదిలీలకు చర్యలు -
రైలు కిందపడి ఆత్మహత్య
తుని: రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు జీఆర్పీ ఎస్సై షేక్ అబ్దుల్ మారూఫ్ శనివారం తెలపారు. ఆ వివరాల్లోకెళ్తే.. తుని మండలం సూరవరం గ్రామానికి చెందిన వజ్రపు భాను పద్మేశ్వరరావు (19) ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో చనిపోవాలనే నిర్ణయానికి వచ్చాడు. స్థానిక రైల్వే పెద్ద గేటు సమీపంలో తుని నుంచి అన్నవరం వైపు వెళ్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శృంగార వల్లభునికి రూ.2.69 లక్షల ఆదాయం పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి స్వయంభూ శృంగార వల్లభుని ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఆలయంలో వివిధ సేవల టిక్కెట్లు, అన్నదానం, కేశ ఖండన ద్వారా స్వామికి 2,68,814 రూపాయలు ఆదాయం సమకూరినట్లు ఈఓ తెలిపారు. సుమారు 12 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారని, సుమారు నాలుగు వేల మంది భక్తులు అన్నదానం స్వీకరించారని పేర్కొన్నారు. -
యువకుడి మృతదేహం లభ్యం
కె.గంగవరం: కోటిపల్లిలోని గౌతమి గోదావరి నదిలో శుక్రవారం సాయంత్రం స్నానానికి దిగి కుందూల నరేంద్ర (25) గల్లంతయ్యాడు. రాత్రి నుంచి గజ ఈతగాళ్లతో స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేట్టారు. స్నానానికి దిగిన ప్రాంతానికి కూతవేటు దూరంలో శనివారం ఉదయం శవమై తేలాడు. వెంటనే గుర్తించిన ఈతగాళ్లు మృతదేహాన్ని గట్టుకు చేర్చారు. కె.గంగవరం పోలీసులు మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే నరేంద్ర మృతితో ద్రాక్షారామ తోటపేటలో విషాదచాయలు అలముకున్నాయి. నరేంద్ర తల్లి ద్రాక్షారామలోని ప్రైవేట్గా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. -
ఇలా ఇసుకిస్తారా!
● కపిలేశ్వరపురం స్టాక్ పాయింట్ వద్ద 60,188 మెట్రిక్ టన్నుల ఇసుక అమ్మకాలు జరిపారు. ఇప్పుడు కొద్దిపాటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. మరో రెండు రోజుల్లో ఈ నిల్వలూ పూర్తి కానున్నాయి. ● ఆలమూరు మండలం జొన్నాడ స్టాక్ పాయింట్ వద్ద 10,590 మెట్రిక్ టన్నుల ఇసుక ఉండగా, జిల్లాలో తొలి స్టాక్ పాయింట్ ఇదే. అయితే ఇసుక అమ్మకాలు పూర్తయ్యాయి. ఇప్పుడున్న కొద్దిపాటి ఇసుక మట్టిలో కలిసిపోయింది. ● ఉచిత ఇసుక నిల్ ● జిల్లాలో ఆరు స్టాక్ పాయింట్లు ● మిగిలింది అరకొర నిల్వలే ● అదీ పీఆర్ అప్పగించామంటున్న అధికారులు ● వరదతో అక్టోబర్ 15 వరకూ ర్యాంపుల్లో సేకరణ కష్టమే ● నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం సాక్షి, అమలాపురం/ రావులపాలెం/ కొత్తపేట/ కపిలేశ్వరపురం/ ఆలమూరు: ఇసుక కంటికి కనిపించడం లేదు.. ఎక్కడా దొరికే పరిస్థితి లేదు.. నిల్వలు లేక స్టాక్ పాయింట్లు తెరిచే పరిస్థితి లేదు. కొద్దిపాటి నిల్వలను సైతం ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తామని అధికారులు చెబుతుండడంతో ఇసుక దొరకడం లేదు. ఇదే సమయంలో గోదావరి వరద నీటి ప్రవాహం కారణంగా అక్టోబర్ 15 వరకూ ఇసుక తవ్వకాలు చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఈ ప్రభావం నిర్మాణ రంగంపై పడుతోంది. కార్మికుల ఉపాధికి గండి కొడుతోంది. మొదలు పెట్టే సమయానికి.. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ మొదలు పెట్టే సమయానికి జిల్లాలో ఆరు స్టాక్ పాయింట్లలో 2,44,131 మెట్రిక్ టన్నుల ఇసుక ఉందని తేల్చారు. రావులపాలెం–1 స్టాక్ పాయింట్లో 33,888 మెట్రిక్ టన్నులు, రావులపాలెం–2లో 82,089, కొత్తపేట (మందపల్లి) 25,898, జొన్నాడ 10,590, తాతపూడి 31,478, కపిలేశ్వరపురంలో 60,188 మెట్రిక్ టన్నుల చొప్పున నిల్వలు ఉండగా, ప్రభుత్వం ఇక్కడి నుంచి ఇసుక అమ్మకాలు చేపట్టింది. కానీ అంతకు ముందే అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే రావులపాలెం–1, 2, మందపల్లి ఇసుక స్టాక్ పాయింట్ల నుంచి దొడ్దిదారిన టన్నుల కొద్దీ ఇసుకను తరలించుకుపోయారు. కపిలేశ్వరపురం మండల పరిధి తాతపూడి వద్ద కూడా ఇలా కొల్లగొట్టేందుకు ప్రయత్నించగా స్థానికులు తిరగబడడంతో నిలిచిపోయింది. తరువాత గుర్తించిన నిల్వలను ప్రభుత్వం ఉచితం పేరుతో టన్నుకు రూ.265 చొప్పున వసూలు చేసి అమ్మకాలు చేసిన విషయం తెలిసిందే. పేరుకు ఉచిత ఇసుకే కానీ టీడీపీ ప్రజాప్రతినిధుల పేరున ట్యాక్స్లు, లారీల యజమానులు రెట్టింపు చేసి రవాణా చార్జీలు వసూలు చేయడంతో ఉచిత ఇసుక కాస్తా వినియోగదారులకు మోయలేని భారంగా మారింది. అప్పటి వరకూ ఇంతే.. ఇప్పటికీ గోదావరిలో వరద నీరు ప్రవహిస్తోంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి శనివారం సాయంత్రం ఆరు గంటల సమయంలో 2,02,483 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువన క్యాచ్మెంట్ ఏరియాలో ఇంకా వర్షాలు పడే అవకాశముంది. సహజంగా గోదావరికి ఆగస్ట్లోనే పెద్ద వరదలు వస్తుంటాయి. అక్టోబర్ 15 వరకూ ఇదే పరిస్థితి ఉంటోంది. దీనివల్ల ర్యాంపులు నిర్వహించే అవకాశం తక్కువ. అప్పటి వరకూ ర్యాంపుల నుంచి ఇసుక తీయడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ముందుచూపు లేకుండా.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న వచ్చాయి. అప్పటి వరకూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా ఎంపిక చేసిన స్టాక్ పాయింట్లలో భారీగా ఇసుక నిల్వ చేసింది. కూటమి ప్రభుత్వం, అధికార టీడీపీ ఎమ్మెల్యేలు ఆ నిల్వలను కొల్లగొట్టుకుని జేబులు నింపుకోవాలని చూశారే తప్ప గోదావరి వరదలు వస్తే మూడున్నర నెలల పాటు ఇసుక సేకరణ ఇబ్బంది అవుతోందనే ధ్యాస లేకుండా పోయింది. గోదావరికి జూలై 20 తరువాత కాని వరద రాలేదు. అప్పటి వరకూ ఇసుక సేకరించే అవకాశమున్నా కొత్త ప్రభుత్వం గుర్తించ లేదు. దీనివల్ల ఇప్పుడు కొరత వేధిస్తోంది. నిర్మాణ రంగంపై ప్రభావం జిల్లాలోని స్టాక్ పాయింట్లలో ఇసుక లేదు. ర్యాంపులు అప్పుడే తెరుచుకోక ఇసుకకు కొరత ఉండనుంది. పట్టణాలు, అభివృద్ధి చెందిన గ్రామాల్లో అపార్ట్మెంట్లు, కమర్షియల్ భవనాలు నిర్మించేవారు ముందుగానే ఈ పరిస్థితి ఊహించి ఇసుక నిల్వ చేసుకున్నారు. కానీ సామాన్యులు, మధ్య తరగతి కుటుంబాలు ఇసుక నిల్వ చేయలేదు. ఇసుక కొరత ప్రభావం వీరిపై అధికంగా పడనుంది. నిల్వలు అడుగంటినందున ఇసుకకు మరింత డిమాండ్ వచ్చిన తరువాత ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖకు అప్పగిస్తామని చెబుతున్నారు. ఈ ఇసుకను సైతం తెలుగు తమ్ముళ్లు దొడ్డిదారిన విక్రయించే అవకాశముందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు నిఘా ఉంచాలనే డిమాండ్ ఉంది. కపిలేశ్వరపురంలో ఇసుక స్టాక్ పాయింట్ ఇక నో స్టాక్.. రావులపాలెం–1 స్టాక్ పాయింట్లో 33,888 మెట్రిక్ టన్నుల ఇసుక ఉన్నట్టు మొదట్లో అధికారులు చెప్పారు. దాదాపు ఇక్కడ అమ్మకాలు పూర్తయ్యాయి. అధికారికంగా ఇసుక మొత్తం ఖాళీ అయ్యింది. అదనంగా ఏమీ లేదు. ఎటువంటి విక్రయాలూ జరగడం లేదు. ఉన్నది పోగు చేస్తూ.. రావులపాలెం–2లో ప్రభుత్వం 82,089 మెట్రిక్ టన్నుల ఇసుక ఉన్నట్టు చెప్పింది. వాస్తవంగా ఇంతకన్నా అధికంగానే ఇక్కడ ఇసుక ఉందని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఇక్కడ కేవలం 600 టన్నుల మాత్రమే ఉంది. ఉన్న కొద్దిపాటి ఇసుకను పోగు పెడుతున్నారు. అయితే కొబ్బరి ఆకులు, డస్టు పౌడర్ వస్తుండడంతో ఇది ఇళ్ల కట్టుబడికి పనికి రాదని చెబుతున్నారు. వచ్చే కొద్దిపాటి ఇసుకను పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉంచుతామని అధికారులు వివరించారు. అభివృద్ధికని చెబుతూ.. కొత్తపేట మండలం మందపల్లి వద్ద ఉన్న ఈ స్టాక్ పాయింట్లో 25,898 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వలు ఉన్నాయి. ఇక్కడ అమ్మకాలు దాదాపుగా పూర్తయ్యాయి. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక కొత్తపేట ఇసుక స్టాక్ పాయింట్ నుంచి ఇసుకను టీడీపీ నాయకులు అక్రమంగా తరలించారు. ఇంకా 1,200 టన్నుల మిగిలిన ఇసుకను అభివృద్ధి కార్యక్రమాల కోసం నిల్వ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఇది కాకుండా మరో వెయ్యి టన్నుల ఇసుక స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఖాళీ స్థలంలో నిల్వ చేశారు. -
మందపల్లిలో శని త్రయోదశి పూజలు
కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మందపల్లి ఉమామందేశ్వర (శనైశ్చర) స్వామివారిని శనివారం అత్యధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామికి ప్రీతికరమైన శనివారంతో పాటు త్రయోదశి పర్వదినం కలసి రావడంతో ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంతో పాటు ఆలయం వెనుక షెడ్లలో భక్తులు పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. దేవదాయ, ధర్మదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, దేవస్థానం ఈఓ కె.విజయలక్ష్మి ఆధ్వర్యంలో భక్తుల పూజలు, దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా పూజలు, తైలాభిషేకాల టిక్కెట్ల ద్వారా దేవస్థానానికి రూ.13,89,710, అన్నప్రసాదం విరాళాల రూపంలో రూ.57,700 ఆదాయం వచ్చిందని ఈఓ విజయలక్ష్మి తెలిపారు. కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ దంపతులు మందపల్లి శనైశ్చరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు, తైలాభిషేకం చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం కలెక్టర్ దంపతులకు దేవస్థానం తరఫున స్వాగతం పలికారు. పూజాధికాల అనంతరం వేదపండితులు వేదాశీస్సులు అందించి, శాలువాతో సత్కరించారు. స్వామివారి ప్రసాదం, చిత్రపటం అందజేశారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ జీవీవీ సత్యనారాయణ, తహసీల్దార్ వై.రాంబాబు, ఆర్ఐ కె.ఏడుకొండలు తదితరులు ఉన్నారు. డివైడర్ను దాటి.. ముగ్గురిని ఢీకొట్టి ఆలమూరు: ఓ వ్యాన్ డివైడర్ను దాటొచ్చి రెండు బైక్లను ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. జాతీయ రహదారిలోని చొప్పెల్ల వద్ద శనివారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. చొప్పెల్లకు చెందిన ఆకులు వెంకన్న (45), అడబాల సత్యనారాయణ (57)లు ఓ బైక్ వస్తుండగా, చిక్కిరెడ్డి రాజు (32) మరో బైక్పై ఆగి ఉన్నారు. వీరు వ్యవసాయ పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నారు. జొన్నాడ నుంచి రాజమహేంద్రవరం వైపు ఇటుక లోడుతో వెళ్తున్న వ్యాన్ ఇక్కడి కొండలమ్మ గుడి జంక్షన్కు వచ్చేసరికి అదుపుతప్పి డివైడర్ దాటుకుంటూ వచ్చి వీరి బైక్లను ఢీకొంది. అనంతరం మరో వాహనం దగ్గరకు వచ్చి ఆగింది. ఈ ప్రమాదంలో పై ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఎస్సై ఎం.అశోక్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వెంటనే హైవే, 108 అంబులెన్స్ సిబ్బంది వచ్చి క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో రెండు బైక్లూ నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిలో సత్యనారాయణ, వెంకన్న పరిస్థితి విషమంగా ఉందనే అభిప్రాయాన్ని వైద్యులు వ్యక్తం చేయడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. మరో క్షతగాత్రుడు చిక్కిరెడ్డి రాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు చెప్పారు. వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు ఆలమూరు ఎస్సై ఎం.అశోక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధుడి మృతి కాజులూరు: గొల్లపాలెంలోని కాజులూరు రోడ్ జంక్షన్లో శనివారం హెరిటేజ్ పాల వ్యాన్ సైకిల్ను ఢీకొన్న ఘటనలో ఓ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఆర్యావటం శివారు ముత్తావారిగరువుకు చెందిన కోట వెంకట్రావు (70) ఐస్క్రీమ్ వ్యాపారం చేస్తూ జీవనోపాధి సాగిస్తున్నాడు. శనివారం ఉదయం తన సైకిల్పై గొల్లపాలెం నుంచి ఇంటికి వెళ్తుండగా కాజులూరు రోడ్ జంక్షన్లో ఎదురుగా వస్తున్న హెరిటేజ్ పాల వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో వెంకట్రావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వెంకట్రావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ కేసును గొల్లపాలెం ఎస్సై ఎం.తులసీరామ్ దర్యాప్తు చేస్తున్నారు. ఫ బైక్లను ఢీకొన్న వ్యాన్ ఫ ఒకరికి తీవ్ర గాయాలు ఫ ఇద్దరి పరిస్థితి విషమం -
గోవిందా.. హరి గోవింద
ఫ వాడపల్లికి ఆధ్యాత్మిక శోభ ఫ పెరిగిన భక్తుల రద్దీ ఆత్రేయపురం: గోవిందా.. హరి గోవింద నామస్మరణ మార్మోగింది. కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయం శనివారం కిక్కిరిసింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. వేద పండితులు, అర్చకులు పువ్వుల రాయుడు వేంకటేశ్వర స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం తదితర పూజలు నిర్వహించారు. భక్తులు తలనీలాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఏడు శనివారాల నోము ఆచరిస్తున్న భక్తులు ఏడు ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు స్వామివారి దర్శనానికి కాలినడకన వచ్చారు. ఆలయ ఆవరణలో వేలాది మందికి అన్నసమారాధన జరిగింది. ఈ ఏర్పాట్లను దేవదాయ ధర్మదాయశాఖ డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈఓ భూపతిరాజు కిశోర్కుమార్ పర్యవేక్షించారు. అలాగే పురాణ ప్రసిద్ధి చెందిన ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి ఆలయం, ఆత్రేయపురం శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. -
తోడుగా.. రక్షగా..
ఫ అప్యాయతకు ప్రతీక రక్షాబంధన్ ఫ తోబుట్టువుల అనురాగాలకు సూచిక ఫ రేపు రాఖీ పండగ రాయవరం: కష్టాల్లో తోడూనీడగా... అనుబంధానికి ప్రతిరూపంగా.. యోగక్షేమాలు తెలుసుకుంటూ.. ఆప్యాయత పంచుతూ.. తోబుట్టువుల బంధాన్ని శాశ్వతంగా నిలిపేదే రక్షాబంధన్. అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ఆత్మీయతకు నిర్వచనమే రాఖీ పండగ. ఇది సోదరి, సోదరుని మధ్యన ప్రేమానుబంధానికి ప్రతీక. ఈ నెల 19వ తేదీ సోమవారం శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమి తిథి కావడంతో రాఖీ పౌర్ణమిని తోబుట్టువులు ఆనందోత్సాహాలతో జరుపుకొనేందుకు సిద్ధమవుతున్నారు. పండగ రోజు పుట్టిళ్లు సందడిగా మారనున్నాయి. అక్కాచెల్లెళ్లు కట్టిన రాఖీలతో సోదరుల చేతులు వివిధ రంగులు, డిజైన్ల రాఖీలతో కళకళలాడనున్నాయి. అండగా ఉంటామని హామీ ఇస్తూ అన్నదమ్ములు తమకు తోచిన కానుకలు సోదరీమణులకు ఇస్తారు. రక్షా బంధన్ను రాఖీ పౌర్ణమి.. జంధ్యాల పౌర్ణమిగా పిలుస్తారు. విద్యార్థినీ విద్యార్థులు, యువతీ యువకుల మధ్య సోదరభావం, నైతిక విలువలు పెరిగేందుకు ఇది దోహపడుతోంది. ర్యాగింగ్, ఈవ్టీజింగ్ పెరుగుతున్న పరిస్థితుల్లో కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థి సంఘాలు ఈ పండగను ఘనంగా నిర్వహించేందుకు చొరవ చూపాలి. మహాలక్ష్మి స్వరూపంగా.. ఆడ పడుచును మహాలకి్ష్మ్ స్వరూపంగా, పరాశక్తికి ప్రతీకగా భావించే సంస్కృతి మనది. కష్ట సుఖాల్లో భరోసాను అక్కాచెల్లెళ్లకు కల్పించడమే రాఖీ బంధం. సోమవారం జిల్లా వ్యాప్తంగా రాఖీ పౌర్ణమిని ఘనంగా నిర్వహించుకొనేందుకు సోదర సోదరీమణులు సన్నద్ధమవుతున్నారు. శ్రావణమాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పర్వదినాన్ని జంధ్యాల పౌర్ణమిగా పిలుస్తుంటారు. తమిళనాడులో పూనూల్పర్వగా, కేరళలో ఆవని ఆవిట్టంగా పిలుస్తుంటారు. ఉత్తరాదిలో రక్షాబంధన్గా పిలవడం పరిపాటి. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం (ఓంశాంతి) ప్రతినిధులు రాఖీ పండగను ఆధ్యాత్మిక విశిష్టతగలదిగా భావిస్తారు. తమ కార్యాలయాల్లో ఆధ్యాత్మిక కార్యకలాపాలు నిర్వహిస్తారు. ప్రభుత్వ అధికారులు, రాజకీయ ప్రముఖులతో పాటు ఇతర రంగాల ప్రముఖులకు కూడా పండగ రోజు బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టడం ఆనవాయితీగా వస్తోంది. మార్కెట్లో కళకళ రాఖీ పండగను పురస్కరించుకుని మార్కెట్లోని పలు ఫ్యాన్సీ షాపుల్లో సంప్రదాయ, ఆధునిక రాఖీలు కనువిందు చేస్తున్నాయి. వ్యాపారులు రంగురంగుల రాఖీలను అమ్మకాలకు పెట్టారు. ముఖ్యంగా పిల్లలను ఆకర్షించే వివిధ కామిక్ రాఖీలను ఎక్కువగా విక్రయిస్తున్నారు. మరికొన్ని బంగారు బ్రాస్లెట్లను తలపిస్తూ ధగధగలాడుతున్నాయి. రుద్రాక్ష, ప్లాస్టిక్, పూల రాఖీలు, రంగు పూసల రాఖీలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ఇవి కాలానుగుణంగా కొత్త డిజైన్లలో వస్తున్నాయి. గతంతో పోల్చితే విక్రయాలు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. రూ.10 నుంచి రూ.వేల ధరల్లో లభ్యమవుతున్నాయి. అన్నంటే ప్రాణం నాకు సొంత అన్నయ్యలు లేరు. నా కజిన్స్ అంతకంటే ఎక్కువగా భావిస్తాను. ఏటా మా అన్నకు రాఖీ కడతాను. ఎంత దూరాన ఉన్నా మా అన్న నా దగ్గరకు వచ్చి రాఖీ కట్టించుకొని వెళ్తాడు. అన్ని పండగల్లో అన్నాచెల్లెల గురించి తెలియజేసే పండగ ఇదే. ఎంత వయసు వచ్చినా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ఏదీ సాటిరాదు. –ఆర్.కృష్ణమాధురి, మండల లెవిల్ అకౌంటెంట్, విద్యాశాఖ కార్యాలయం, మండపేట కష్ట సుఖాల్లో తోడుండేవాడే.. కష్ట సుఖాల్లో తోడుగా నిలిచి, మన శ్రేయస్సు కోరుకునే వారే సోదరులు. నా అన్నయ్యలు ఎప్పుడూ నాకు వెన్నంటే నిలిచారు. రాఖీ పండగ వస్తుందంటే నా కంటే ఎక్కువగా అన్నయ్యలు సంతోషపడతారు. ఎంతదూరాన ఉన్నా రాఖీ పండగకు తప్పనిసరిగా ఇంటికి వచ్చి ఆశీర్వదించి వెళ్తారు. వారి ప్రేమాభిమానాలు ఎప్పటికీ నిలిచి ఉండాలని కోరుకుంటాను. –షేక్ కరీమున్నీసా బేగం, పసలపూడి, రాయవరం మండలం ఆన్లైన్లో కానుకలు కాలం మారడంతో పాటు రక్షా బంధన్ తీరు మారింది. విద్య, ఉపాధి, ఇతరత్రా కారణాలతో దూర ప్రాంతాల్లో ఉంటున్న సోదరులకు పోస్టు ద్వారా రాఖీలను పంపితే వాటిని కట్టుకొని తోబుట్టువులకు కానుకలు పంపే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా పరస్పరం అభినందనలు తెలుపుకొంటూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. పద్ధతులు మారినా రాఖీ అనుబంధం, ఆప్యాయత మాత్రం చెక్కు చెదరలేదు. -
కూలీలకు బకాయి వేతనాలు జమ
ఆలమూరు: జిల్లాలోని 22 మండలాలకు చెందిన ఉపాధి కూలీలకు బకాయి వేతనాలు జమ అవుతున్నాయి. మొత్తం 5.11 లక్షల ఉపాధి కూలీలకు గత నాలుగు నెలల నుంచి రూ.75.21 కోట్ల వేతనాలను ప్రభుత్వం అందించాలి. దీనిపై ఈ నెల 4న ‘సాక్షి’ దినపత్రికలో ఆ‘కూలీ’ కేకలు అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ నెల పది వరకూ బకాయి పడిన వేతనాలను ఉపాధి కూలీల బ్యాంకు ఖాతాలో జమ చేసింది. ఈ విషయాన్ని ఎన్ఆర్ఈజీఎస్ పీడీ పి.మధుసూదన్, ఆలమూరు ఏపీఓ జి.అరుణకుమారి తెలిపారు. ఉపాధి కూలీలకు ఏదైనా సమస్య ఉత్పన్నమైతే సంబంధిత ఏపీఓ కార్యాలయాలను సంప్రదించాలన్నారు. నేటి నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు రాయవరం: రెండు రోజుల పాటు జరిగే పాఠశాల స్థాయి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు శనివారం ప్రారంభం కానున్నాయి. 2024–25 విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయులకు పాఠశాల సముదాయ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి అనుగుణంగా సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ సమావేశాల నిర్వహణకు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఉత్తర్వుల ప్రకారం జిల్లాలోని 22 మండలాల్లో 47 ప్రాథమిక స్థాయి కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ కాంప్లెక్స్ల పరిధిలోని 50 శాతం ఉపాధ్యాయులు శనివారం జరిగే కాంప్లెక్స్ సమావేశాలకు హాజరు కానుండగా, మిగిలిన 50 శాతం మందికి నిర్దేశించిన కాంప్లెక్స్లో సోమవారం హాజరు కానున్నారు. అలాగే తెలుగు, గణితం, బయలాజికల్ సైన్స్ ఉపాధ్యాయులకు శనివారం సబ్జెక్ట్ కాంప్లెక్స్ సమావేశాలు జరగనుండగా, సోమవారం ఇంగ్లిషు, ఫిజికల్ సైన్స్, హిందీ, సోషల్ సబ్జెక్టు ఉపాధ్యాయులకు సబ్జెక్టు సమావేశాలు నిర్వహించనున్నారు. ఉన్నత పాఠశాలల్లో పనిచేసే వ్యాయామ ఉపాధ్యాయులకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ సమావేశాలను శనివారం నియోజకవర్గ స్థాయిలో జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ నిర్వహించాల్సి ఉంటుంది. జిల్లాలో 123 స్కూల్ కాంప్లెక్స్లు ఉండగా, వాటి పరిధిలో 5,442 ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు హాజరు కానున్నారు. అలాగే 5,200 మంది వివిధ సబ్జెక్టులకు సంబంధించిన ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లాలకు సంబంధించిన ఉర్దూ టీచర్లకు ఈ నెల 20న రాజమహేంద్రవరంలోని మకా ఉర్దూ మీడియం ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈఏపీ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ బాలాజీచెరువు (కాకినాడ సిటీ ): ఏపీ ఈఏపీ సెట్–24 మూడవ దశ కౌన్సెలింగ్కు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. గత జూన్ 30వ తేదిన మొదటి దశ ,జూలై నెలలలో రెండవ దశకు నోటిఫికేషన్ విడుదలచేసి సీట్లు భర్తీ చేయగా తాజాగా మూడవ దశకు షెడ్యూల్ విడుదల చేశారు. ● ఆగస్టు 19వ తేది నుంచి 21వ తేది వరకూ అన్లైన్ అన్లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ● ఆగస్టు 22 వ తేది వరకూ అన్లైన్ సర్టిఫికెట్ల పరిశీలన ● ఆగస్టు 20 నుంచి 22 వరకూ వెబ్ అప్షన్లు. 23వ తేదీన వెబ్ అప్షన్లు మార్పునకు అవకాశం. ● ఆగస్టు 26న సీట్ల కేటాయింపు. 26వ తేదీ నుంచి 30వరకూ కళాశాలలో చేరికకు చివరితేది. ● ఉమ్మడి జిల్లాలో హెల్ప్లైన్ కేంద్రం ఆంధ్రాపాలిటెక్నిక్ కళాశాల (జగన్నాథపురం) కోల్కతా ఘటనపై నేడు ఐఎంఏ నిరసన అమలాపురం టౌన్: కోల్కతాలో ఓ జూనియర్ మహిళా డాక్టర్పై ఆటవికంగా అత్యాచారం చేసి, ఆ తర్వాత అతి కిరాతకంగా హతమార్చిన ఘటనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) జిల్లా శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. డాక్టర్లపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలపై జిల్లా ఐఎంఏ ఆధ్యర్యంలో అమలాపురంలో శనివారం ఉదయం నిరసన చేపట్టేందుకు నిర్ణయించినట్టు సంఘ జిల్లా కార్యదర్శి డాక్టర్ కడలి ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం కోనసీమలోని వైద్యులంతా అమలాపురం గడియారం స్తంభం సెంటరుకు చేరుకుని, అక్కడ నిరసన వ్యక్తం చేస్తారని చెప్పారు. అక్కడ నుంచి వైద్యులు ప్రదర్శనగా స్థానిక కలెక్టరేట్కు చేరుకుని, కలెక్టర్కు వినతిపత్రం అందించనున్నట్టు వివరించారు. శనివారం ఉదయం 9 గంటల కల్లా ఐఎంఏ వైద్యులంతా గడియారం స్తంభం సెంటరుకు చేరుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
రత్నగిరి కిటకిట
తొండంగి: శ్రావణమాసంలో వివాహా ముహూర్తాల నేపథ్యంలో శుక్రవారం రత్నగిరి నూతన దంపతులతో కిటకిటలాడింది. గురువారం రాత్రి వివాహాలు జరగడంతో రాష్ట్రం నలుమూలల నుంచి నూతన దంపతులు సత్యదేవుని వ్రతాలు ఆచరించేందుకు అధిక సంఖ్యలో వచ్చారు. అదేవిధంగా రత్నగిరి, సత్యగిరి కొండలపై కూడా వివాహాలు జరిగాయి. ఈ నేపథ్యంలో వ్రతమంటపాలన్నీ నూతన వధూవరులతోపాటు భక్తులతో రద్దీగా మారాయి. సత్యదేవుని దర్శనానికి భక్తులు బారులు తీరారు. దేవస్థానం అధికారులు భక్తులకు ఇబ్బంది కలగకుండా మంచినీరు, మజ్జిగ వంటివి ఏర్పాటు చేశారు. కాగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం పండగ సందర్భంగా రత్నగిరి కొండపై వనదుర్గ అమ్మవారి ఆలయంలోనూ, కొండ దిగువ దుర్గామాత ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు వేల వ్రత మంటపాల్లో ఏసీలు పనిచేయక భక్తులకు ఇబ్బందులు రత్నగిరి కొండపైకి సత్యదేవుని వ్రతమాచరించే భక్తులకు రెండు వేలు రూపాయల వ్రత మంటపాల్లో ఏసీలు రెండు రోజులుగా సక్రమంగా పనిచేయక భక్తులు ఇబ్బందులు పడ్డారు. కొండపైన రూ.1,500, రూ.వెయ్యి తదితర కేటగిరిల్లో మంటపాలు కేటాయించి భక్తులకు వ్రతాలు నిర్వహిస్తారు. భక్తుల సౌకర్యార్థం కొండపై స్వామి వారి ప్రధానాలయం ఎదురుగా ఏసీ మంటపాలను ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఏసీ పనిచేయకపోవడంతో అధికారులు ప్రత్యామ్నాయంగా విడిగా ఏసీలు ఏర్పాటు చేశారు. అవి రెండు రోజులుగా సక్రమంగా పనిచేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డామని భక్తులు వాపోయారు. దేవస్థానం అధికారులు వ్రత మంటపాల్లో పూర్తిస్ధాయిలో ఏసీ పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. వ్రతం నిర్వహించే సమయంలో కేవలం దంపతులకు మాత్రమే కూర్చునే అవకాశం ఇస్తున్నారని, కుటుంబ సమేతంగా దంపతులతోపాటు తమ సంతానాన్ని కూడా వ్రతంలో పాల్గొనేందుకు వ్రత మంటపాల్లో కూర్చునే వెసులుబాటు కల్పించాలని హైదరాబాద్కు చెందిన భక్తుడు విఠల్ కోరారు. పిల్లలకు కూడా పూజా విధానం, సత్యదేవుని వ్రత విధానం, ఆచార వ్యవహారాలపై అవగాహన, మరింత ఆసక్తి కలుగుతుందన్నారు. -
చమురు సంస్థలకు చెంపపెట్టు
● ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు ● ఖనిజ సంపద నుంచి ఇక ఆదాయం అమలాపురం టౌన్: మైనింగ్ చేసే సంస్థలు విధిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు రాయల్టీ చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం హర్షణీయమని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు అన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నాయకత్వంలో న్యాయమూర్తులు ఈ తీర్పు చెప్పడం రాష్ట్రంలో ఖనిజ సంపద కార్యకలాపాలు, అన్వేషణల పేరుతో దోచుకుంటున్న చమురు సంస్థలకు చెంప పెట్టులాంటిదన్నారు. శుక్రవారం అమలాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. 30 ఏళ్ల నుంచి కేజీ బేసిన్ పరిధిలో చమురు సంస్థలు భూమిని తవ్వి, గుల్లచేసి అన్వేషణలు, కార్యకలాపాల పేరుతో రూ.కోట్లు దోచుకుంటున్నాయని గుర్తు చేశారు. మొత్తంగా కేజీ బేసిన్ ప్రాంతానికి దాదాపు రూ.50 లక్షల కోట్ల రాయల్టీ రావాల్సి ఉందన్నారు. చమురు సంస్థలు సోషల్ రెస్పాన్స్బులిటీ పేరుతో చిన్న సామాజిక భవనాలు నిర్మించడం, అక్కడక్కడ రోడ్లు వేయడం తప్ప భారీ మొత్తంలో రాయల్టీ రూపంలో ఆయా ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించిన సందర్భాలు లేవన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చమురు సంస్థల నుంచి రాయల్టీని పూర్తి స్థాయిలో రాబడితే రాష్ట్రానికి ఉన్న కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన అన్నారు. కొన్నేళ్లుగా చమురు సంస్థలు ఇక్కడ భూములను ఇష్టానుసారం తవ్వేసి చమురు, సహజ వాయువులను వెలికితీస్తూ వ్యవసాయాన్ని విచ్ఛిన్నం చేస్తున్న పరిణామాలపై తాము ఉద్యమాలు చేస్తున్నామని గుర్తు చేశారు. మైనింగ్ చేసే సంస్థల నుంచి రాయల్టీ నిధులను రాబట్టినప్పుడే రాష్ట్రాభివృద్ధి సాకారమవుతుందని పేర్కొన్నారు. ఉదాహరణకు పోలవరం ప్రాజెక్ట్, విశాఖ స్టీల్ ప్లాంట్ తదితర మేజర్ పనులకు రాయల్టీ సొమ్ము ద్వారా నిధులు సమకూర్చుకునే పరిస్థితి ఉంటుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో మిత్రత్వంతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఆ దిశగా రాయల్టీ నిధులను కేంద్రం మెడలను వంచి సాధించాలన్నారు. -
మహాలక్ష్మీ నమో నమః
● వెదురుపాక పీఠంలో వార్షికోత్సవాలు ప్రారంభం ● నేత్రపర్వంగా సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం రాయవరం: శ్రీమహాలక్ష్మీ నమో నమః అంటూ ఆ అమ్మవారిని కొలిచారు.. ప్రత్యేక పూజలు చేశారు. దీనికి రాయవరం మండలం వెదురుపాక విజయదుర్గా పీఠం వేదిక అయ్యింది. పీఠం 52వ వార్షికోత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. 1972లో పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం (గాడ్) పీఠం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఏటా పీఠం వార్షికోత్సవాలను ఆగస్టు 16న ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం విజయదుర్గా అమ్మవారికి ప్రత్యేక పూజలు, నవగ్రహ మండపారాధన చేశారు. కొల్హాపూర్ వేద పండితులచే శ్రీమహాలక్ష్మి అమ్మవారికి తిరుమంజనం అర్చన, హోమం నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు తమిళనాడు తిరుత్తణి ఆలయ అర్చకులచే సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం శాస్త్రోక్తంగా జరిపారు. ఈ సందర్భంగా పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం (గాడ్) మాట్లాడుతూ లోక కల్యాణార్థం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కళ్యాణోత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. పీఠంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పీఠం ప్రతినిధుల ఆధ్వర్యంలో అన్న సమారాధన నిర్వహించారు. అన్నవరం దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ ఐవీ రోహిత్, ఇన్చార్జి ఈఓ డి.రమేష్బాబులు విజయదుర్గా పీఠాన్ని సందర్శించి, గాడ్ ఆశీస్సులు అందుకున్నారు. పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు, విజయదుర్గా సేవా సమితి ప్రతినిధులు భాస్కరనారాయణ, జి.సత్యవెంకటకామేశ్వరి, పి.సత్యకనకదుర్గ, బి.రమ, పీఠం పీఆర్వో వి.వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక అలంకరణలో విజయదుర్గమ్మ -
53 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు
దేవరపల్లి: వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మార్కెట్లో లభిస్తోన్న ధర రైతులకు లాభసాటిగా ఉండడంతో రైతులు పొగాకు విక్రయాలు వేగంగా జరుపుతున్నారు. 2023–24 పంట కాలంలో పండించిన పొగాకును ఈ ఏడాది మార్చి 6న కొనుగోలు చేయడం ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లాలోని రెండు వేలం కేంద్రాలతో పాటు ఏలూరు జిల్లాలోని మూడు వేలం కేంద్రాలు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలో ఉన్నాయి. ఇప్పటి వరకూ 127 రోజులు కొనుగోళ్లు నిర్వహించారు. శుక్రవారం నాటికి ఐదు వేలం కేంద్రాల్లో సుమారు రూ.1,749 కోట్ల విలువ గల 53 మిలియన్ల కిలోల పొగాకు కొనుగోలు చేశారు. 2023–24 ఏడాదికి బోర్డు 48.25 మిలియన్ల కిలోల ఉత్పత్తికి అనుమతి ఇవ్వగా, ప్రకృతి వైపరీత్యాల కారణంగా సాగు విస్తీర్ణం పెరగడంతో ఉత్పత్తి బాగా పెరిగింది. దీంతో 67 మిలియన్ల కిలోలు పొగాకు ఉత్పత్తి అవుతుందని పోగాకు బోర్డు అధికారులు, కొనుగోలు సంస్థలు అంచనా వేశాయి. దాదాపు ఈ అంచనాలకు చేరువలో పొగాకు ఉత్పత్తి అవుతోంది. ఇప్పటి వరకూ 53 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరగడంతో బ్రైట్ గ్రేడు పొగాకు అమ్మకాలు దాదాపు చివరి దశకు చేరుకున్నట్టేనని అధికారులు వివరిస్తున్నారు. -
వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
కలెక్టర్ మహేష్ కుమార్ అమలాపురం రూరల్: సీబీఎస్ఈ సిలబస్ అనుబంధ పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో జిల్లాలోని సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, హాస్టళ్ల నిర్వహణ, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, సీబీఎస్సీ సిలబస్ అనుబంధ పాఠశాలల్లోని వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లాలోని 55 బీసీ, ఎస్సీ వెల్ఫేర్ హాస్టళ్లలో ఎంతమంది పిల్లలు ఉన్నారని, వారికి అందిస్తున్న భోజనం, కాస్మోటిక్ చార్జీలు, మెడికల్ క్యాంపుల నిర్వహణ తదితర అంశాలపై అధికారులను ఆరా తీశారు. సోషల్ వెల్ఫేర్ జేడీ జ్యోతిలక్ష్మీదేవి, డీఈఓ ఎం.కమలకుమారి తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా మంచానికి, వీల్ చైర్కు పరిమితమైనట్లు వికలాంగ సర్టిఫికెట్లు పొంది అధిక మొత్తంలో పెన్షన్లు పొందుతున్న పింఛనుదారులను పునః పరిశీలించాలని కలెక్టర్ మహేష్కుమార్ ఆదేశించారు. జిల్లాలో దివ్యాంగులకు అందిస్తున్న పింఛన్లపై ఆయన సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పూర్తి అంగవైకల్యం కలిగి మంచానికి, కుర్చీలకే పరిమితమైనట్లు సదరం సర్టిఫికెట్లు పొంది, లేక ఎటువంటి సర్టిఫికెట్ లేకుండా రూ.15 వేల పింఛన్ అందుకుంటున్న వ్యక్తులు 668 మంది ఉన్నారన్నారు. ఇందులో కొంతమంది అతి తక్కువ అంగవైకల్యం కలిగి ఉన్నప్పటికీ పూర్తి అంగవైకల్యం కేటగిరీలో రూ.15 వేల పింఛన్లు పొందుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. దీనిపై జిల్లాలో 5 రీఅసెస్మెంట్ మెడికల్ టీమ్లను ఏర్పాటు చేసి పునః పరిశీలించాలన్నారు. ఈ టీమ్లో ఆర్థోపెడీషియన్, ఫిజీషియన్, మెడికల్ ఆఫీసర్ ఉంటారన్నారు. ఈ ప్రక్రియ నెలాఖరు లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డీఎంహెచ్ఓ దుర్గారావు దొర, డీఆర్డీఏ పీడీ శివశంకర ప్రసాద్, డీసీహెచ్ ఎస్.కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరగించేందుకు అన్నలా..
● అన్న కేంటీన్ల ముసుగులో దోపిడీ ● మరమ్మతుల పేరిట మింగేసి.. సాక్షి, అమలాపురం: ఆరగించేందుకు కొత్త పథకం తెచ్చారు.. పేదలకు బువ్వ అంటూ రూ.లక్షలు బొక్కేసేందుకు తెరలేపారు.. కూటమి ప్రభుత్వంలో మొదలైన అన్న క్యాంటీన్లు పేదల కడుపు నింపకున్నా ముందే టీడీపీ ఆస్తాన కాంట్రాక్టర్ల జేబులు మాత్రం నింపుతున్నాయి. గతంలో ఉన్న అన్న క్యాంటీన్ భవనాలకు చేపట్టిన చిన్న చిన్న మరమ్మతులకు రూ.లక్షలకు లక్షలు కేటాయించుకున్నారు. ఇక కొత్తగా నిర్మిస్తున్న భవనానికి సైతం కేటాయించిన నిధులు చూసి సామాన్యులను ముక్కున వేలేసుకుంటున్నారు. జిల్లాలో అమలాపురం గ్రేడ్–1 మున్సిపాలిటీతో పాటు మండపేట, రామచంద్రపురం మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధుల్లో సుమారు లక్ష మందికి పైగా జనాభా ఉంటారని అంచనా. 2014–19 టీడీపీ పాలనలో రామచంద్రపురం, మండపేట మున్సిపాలిటీల్లో అన్న క్యాంటీన్లను నిర్వహించేవారు. అమలాపురంలో ఏర్పాటు చేయలేదు. అప్పట్లో ఎంపిక చేసిన స్థలం కోర్టు వివాదంలో ఉండడం వల్ల ఇక్కడ నిర్వహించలేదు. ఇప్పుడు రామచంద్రపురం, మండపేటల్లో మరమ్మతులు చేపట్టి శుక్రవారం ప్రారంభించారు. అమలాపురం మున్సిపాలిటీలో కొత్త భవన నిర్మాణం చేపట్టారు. మండపేట మున్సిపాలిటీ పరిధిలో మరమ్మతులకు ఏకంగా రూ.13.85 లక్షలు ఖర్చు చేశారు. భవనంలో లోపల, వెలుపుల చిన్న చిన్న పనులు చేయడంతోపాటు కొత్త హంగులు చేశారు. కాంపౌండ్ వాల్ చుట్టూ దెబ్బతిన్న ఫ్లోరింగ్ చేయడంతో పాటు ఫ్రంట్ ఎలివేషన్ చేశారు. అయితే వీటికి ఇంత ఖర్చు చేయాల్సిన అవసరం లేదని స్థానికులు చెబుతున్నారు. అలాగే రామచంద్రపురం మున్సిపాలిటీలో గతంలో ఉన్న అన్న క్యాంటీన్కు రూ.9.71 లక్షలతో మరమ్మతులు నిర్వహించారు. ఇంత ఖర్చు పెట్టి చేసే మరమ్మతులు ఏమున్నాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. భవనానికి ఎల్లో బోర్డులు, గ్లాస్లు వేయడంతో పాటు ఫ్లోరింగ్ చేశారు. ఎందుకంత ఖర్చో! అమలాపురం మున్సిపాలిటీలో అన్న క్యాంటీన్కు కొత్త భవన నిర్మాణం చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలోనే దీని నిర్మాణం జరుగుతోంది. ఇందుకు రూ.45 లక్షలు వెచ్చిస్తున్నారు. వాస్తవంగా దీని నిర్మాణానికి ఇంత ఖర్చు కాదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ భవనం పునాదుల దశలో ఉంది. -
నిబంధనలు రీచ్ కాక..
● సీఆర్జెడ్తో అవాంతరాలు ● జిల్లాలో 24 రీచ్ల గుర్తింపు ● 12 చోట్ల మాత్రమే తవ్వకాలు ● నిబంధనలు సడలించాలంటున్న అధికారులు సాక్షి, అమలాపురం/ రావులపాలెం: ఇసుక ర్యాంపులకు కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్జెడ్) అడ్డుగా మారింది. ఫలితంగా ర్యాంపుల ఏర్పాటుకు ప్రతిబంధకమైంది. జిల్లాలో సముద్ర తీర ప్రాంతాలు, మత్స్యకారులు వేట సాగించే గోదావరి నదీ పరివాహక ప్రాంతాలను సీఆర్జెడ్ పరిధిలోకి తీసుకు వచ్చారు. 2011లో సీఆర్జెడ్ను అమలులోకి తెచ్చారు. దీనివల్ల జిల్లాలోని కీలక ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలకు ప్రతిబంధకాలు ఎదురయ్యాయి. సీఆర్జెడ్ నిబంధనలు సడలించకుంటే పూర్తిస్థాయిలో ర్యాంపులు అందుబాటులోకి రావని మైనింగ్, పర్యావరణ శాఖ అధికారులు తేల్చి చెబుతున్నారు. సీఆర్జెడ్ పరిధిలో సముద్రతీర ప్రాంతం ఉంది. ఆయా చోట్ల ఎటువంటి తవ్వకాలు చేయకూడదు. కానీ ఇక్కడే ఇసుక తవ్వకాలు చేయడంతోపాటు ఆక్వా చెరువుల తవ్వకాలు చేస్తున్న విషయం తెలిసిందే. సీఆర్జెడ్ పరిధిని గోదావరి పరివాహక ప్రాంతాలకు సైతం విస్తరించారు. నేషనల్ సెంటర్ ఫర్ సస్టనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ (ఎన్సీఎస్సీఎం) ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లాలో 16 మండలాల పరిధిలోని 128 గ్రామాలు సీఆర్జెడ్ పరిధిలో ఉన్నాయి. సఖినేటిపల్లి మండలం (ఎనిమిది గ్రామాలు), మలికిపురం (తొమ్మిది), మామిడికుదురు (పన్నెండు), రాజోలు (పన్నెండు), అల్లవరం (పదకొండు), ఉప్పలగుప్తం (పది), అమలాపురం (రెండు), అంబాజీపేట (రెండు), కాట్రేనికోన (పదకొండు), కపిలేశ్వరపురం (రెండు), కొత్తపేట (రెండు), పి.గన్నవరం (పదిహేడు), రావులపాలెం (నాలుగు), అయినవిల్లి (ఆరు), కె.గంగవరం (ఎనిమిది), ముమ్మిడివరం (పన్నెండు) గ్రామాలు సీఆర్జెడ్ పరిధిలో ఉన్నాయి. దీనిపై గత నెల 31న అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్లో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. సీఆర్జెడ్లో 300 చదరపు మీటర్ల వరకూ మత్స్యకారులు నిర్మాణాలు చేసుకోవచ్చు. స్థానికంగా అనుమతులు తీసుకోవచ్చని నిర్ణయించారు. అలాగే క్రిక్స్లో వాటర్ లెవిల్ విడ్త్ నుంచి 100 మీటర్ల వరకూ బఫర్ను 50 మీటర్లు చేశారు. భవన నిర్మాణాలకు సంబంధించిన విషయం పక్కన పెడితే సీఆర్జెడ్ పరిధి వల్ల జిల్లాలోని గోదావరిలో పలు ర్యాంపుల వద్ద ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. అవకాశం ఉన్నా.. జిల్లాలో 12 వరకూ ఇసుక తవ్వకాలకు అనుమతి ఉన్న ర్యాంపులు ఉన్నాయి. వీటి నుంచి తవ్వకాలు సాగిస్తున్నారు. అయితే వాస్తవంగా 24 ప్రాంతాల నుంచి ఇసుక తవ్వకాలు చేసే అవకాశముంది. ఇలా చేస్తే ఉచిత ఇసుక పాలసీ అమలులో ఉన్నా స్థానిక సంస్థలకు సీనరేజ్ రూపంలో, ప్రభుత్వానికి జీఎీస్టీ రూపంలో ఆదాయం రావడంతోపాటు ఇసుక లభ్యత అధికంగా ఉంటోంది. భవన నిర్మాణ రంగం సైతం వేగంగా వృద్ధి చెందుతోంది. కానీ సీఆర్జెడ్ నిబంధనలతో పలు ర్యాంపుల నుంచి ఇసుక తీసే అవకాశం లేకుండా పోయింది. ఉదాహరణకు కపిలేశ్వరపురం మండల పరిధిలో కపిలేశ్వరపురం, తాతపూడి గ్రామాల్లో సీఆర్జెడ్ పరిధిలో ఉన్నాయి. ఇక్కడే ప్రస్తుతం స్టాక్ పాయింట్ల ద్వారా ఇసుక అమ్మకాలు జరుగుతుండడం విశేషం. రావులపాలెం మండలం గోపాలపురం, రావులపాలెం, అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం, కె.గంగవరం మండలం కోటిపల్లి, కూళ్ల, సఖినేటిపల్లి, రాజోలు మండలం సోంపల్లి, పి.గన్నవరం మండలం ముంజువరం, లంకల గన్నవరం, మనేపల్లి, పాత గన్నవరం ప్రాంతంలో గతంలో ఇసుక తవ్వకాలు జరిగేవి. వీటిలో ఇసుక ర్యాంపులు అధికం. పరిధి నుంచి తొలగించాలి ఇసుక తవ్వకాలకు వీలుగా గతంలో ర్యాంపులు నిర్వహించిన గ్రామాలను సీఆర్జెడ్ పరిధి నుంచి తొలగించాలనే డిమాండ్ పెరుగుతోంది. గనులు, భుగర్భ శాఖ అధికారులు ప్రభుత్వానికి పలు దఫాలు ప్రతిపాదనలు పంపించారు. దీనికి ఎన్విరాల్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు దృష్టికి ఈ విషయాన్ని జిల్లా అధికారులు తీసుకు వెళ్లారు. దీనిపై తాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో మాట్లాడతానని ఆయన చెప్పుకొచ్చారు. సీఆర్జెడ్ను సవరిస్తే కాని ఇక్కడ ఇసుక తవ్వకాలు చేసే అవకాశం లేదు. -
ఉలిమేశ్వరంలో ఇరువర్గాల దాడి
పెద్దాపురం: మండలంలోని ఉలిమేశ్వరంలో ఇరువర్గాల మధ్య గురువారం సాయంత్రం జరిగిన దాడుల్లో పలువురుకి తీవ్ర గాయాలయ్యాయి. పెద్దాపురం పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఇరువురు యువకుల మధ్య జరిగిన సంభాషణ చిలికి చిలికి ఇరువర్గాల దాడులకు దారి తీసిందన్నారు. గ్రామ వైఎస్సార్ సీపీ సర్పంచ్ ఆకుల వరలక్ష్మి స్వాతంత్య్ర వేడుకల్లో జాతీయ పతాకావిష్కరణ చేస్తుండగా గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ పేకేటి దొరబాబు స్థానిక యువతతో వ్యక్తిగత తగదాల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన పల్నాటి శివ, పల్నాటి వెంకటరమణ తదితరులతో వివాదానికి దిగారు. అక్కడే ఉన్న సర్పంచ్ భర్త వీరబాబు ఇది పద్ధతి కాదని వారిని వారించి అక్కడి నుంచి పంపేయడంతో ఉదయం ఎవరికి వారు వెనుదిగారు. సాయంత్రం సమయంలో గ్రామ సెంటర్లో అందరూ ఉండగా అక్కడ ఉన్న ఓ పెద్దాయన కురెమెళ్ల మూలయ్య చేతిలో ఉన్న కర్రను తీసుకుని వెంకటరమణ, శివలపై దొరబాబు, ఆయన తమ్ముడు రామచంద్రరావు తీవ్ర పదజాలంపై కర్రలు, కత్తితో దాడికి పాల్పడ్డారు. ఇరువర్గాల మధ్య తీవ్ర దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. దీనిపై ఎస్ఐ మౌనికను వివరణ కోరగా ఇరువర్గాల ఫిర్యాదులతో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
అగ్ని ప్రమాదంలో లారీ, బైక్ దగ్ధం
మండపేట: పట్టణంలోని బైపాస్ రోడ్డులోని మెకానిక్ షెడ్డు వద్ద గురువారం మంటలు చెలరేగాయి. ప్రమాదంలో లారీ, బైకు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం బైపాస్ రోడ్డులోని గంగరాజు మెకానిక్ షెడ్లో లారీ మరమ్మతుల్లో భాగంగా గ్యాస్ కటింగ్ చేస్తుండగా ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. డీజిల్ ట్యాంకుకు లీకేజీ ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు. లారీకి సమీపాన ఉన్న బైక్ సైతం అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గురైన లారీ రాయవరం మండలం సోమేశ్వరానికి చెందిన అబ్బిరెడ్డి సింహాచలానికి చెందినదిగా గుర్తించారు. -
శ్రీ ప్రకాష్లో నృత్య సంధ్య వేడుకలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): శ్రీ ప్రకాష్ సినర్జీ పాఠశాలలో శుక్రవారం నృత్య సంధ్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బ్రహ్మాశ్రీ చాగంటి కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై మానవుని మేధస్సు నుండి ఉద్భవించిన అద్భుత విషయాలలో కళ ఒకటని, కళను అదరించడం, అభిమానించడం కళాత్మకతకు అద్దం పడతాయన్నారు. తెలుగు సాహిత్యంలో కవిత్వానిది ప్రత్యేక స్థానమని, పద్యం రాయడం ఒక తపస్సు అయితే, పదమును గానం చేయడం తపమేనన్నారు. కలరీ పయట్టు అనే ప్రాచీన యుద్ధ విద్యకు సంబంధించి విన్యాసాలను కేరళకు చెందిన కృష్ణదాస్, కుమార్తె కావ్యలు 45 రోజుల పాటు విద్యార్థులకు నేర్పించి మంచి ప్రదర్శన ఇవ్వడం సంతోషమన్నారు. పాఠశాల డైరక్టర్ విజయప్రకాష్ మాట్లాడుతూ సాంప్రదాయ విలువలు, సంస్కృతి పునాదులుగా చేసుకుని భారతీయతకు అద్దం పడుతూ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ విద్యార్థుల భవితకు బాటలు వేయడమే శ్రీప్రకాష్ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
టిఫిన్ సెంటర్లో అగ్నిప్రమాదం
అయినవిల్లి: మండల కేంద్రమైన ముక్తేశ్వరం సెంటర్లోని దేవీగణేష్ ప్లాజాలో ఉన్న టిఫిన్ హోటల్లో గురువారం సాయంత్రం గ్యాస్ సిలిండర్ లీకై అగ్ని ప్రమాదం సంభవించింది. దీనికి సంబంధించి స్థానికులు, హోటల్ యజమాని, అమలాపురం ఫైర్ ఆఫీసర్ మురళీ కొండబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముక్తేశ్వరం సెంటర్లోని దేవీ గణేష్ ప్లాజాలో నిర్వహిస్తున్న చిట్టూరి ఏడుకొండలుకు చెందిన హోటల్లో టిఫిన్లు తయారు చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ లీకై అగ్ని ప్రమాదం సంభవించింది. హోటల్ యజమాని, సిబ్బంది అక్కడి నుంచి దూరంగా వెళ్లి ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ప్రమాదంలో టిఫిన్ తయారీకి సంబంధించిన సామాన్లు, విద్యుత్ పరికరాలు, ఫర్నిచర్ పూర్తిగా కాలిబుడిదయ్యాయి. స్థానికుడు పాస్టర్ పాల్ ఇచ్చిన సమాచారంతో విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను ఆదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ.1.5 లక్షలు నష్టం వాటిల్లినట్టు ఫైర్ ఆఫీసర్ మురళీ కొండబాబు తెలిపారు.రూ.1.5 లక్షల అస్తిష్టం -
సూక్ష్మ కళతో దేశభక్తి
● చాక్ పీస్, పెన్సిల్ ముల్లుపై జాతీయ జెండా రూపకల్పన గండేపల్లి: చాక్ పీస్, పెన్సిల్ ముల్లుపై జాతీయ జెండాను చెక్కి తన దేశ భక్తిని చాటుకున్నాడు ద్రాక్షారామకు చెందిన పెంకే కృష్ణ స్వామి. మండలంలోని సూరంపాలెం ప్రగతి ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్సీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఆయన పనిచేస్తున్నారు. 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తన దేశ భక్తిని చాటుకున్నారు. జెండాను ప్రదర్శిస్తున్నట్టుగా చాక్ పీస్పై, పెన్సిల్ ముల్లుపై ఎగురుతున్న జాతీయ జెండాను చెక్కాడు. సహోపాధ్యాయులు, విద్యార్థులు స్వామికి అభినందనలు తెలియజేశారు. ఆయన గతంలో పెన్సిల్, చాక్ పీస్, ఆకులపై పలువురి దేశ నేతలు, రాజకీయ నాయకుల చిత్రాలను గీసి తన ప్రతిభను చాటుకున్నారు. -
కన్నుల పండగగా పవిత్రోత్సవం
ఆత్రేయపురం: వాడపల్లి శ్రీ, భూ సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో రెండో రోజు గురువారం పవిత్రోత్సవాలు కన్నుల పండువగా నిర్వహించారు. వేదపండితులు, అర్చకులు వేద మంత్రాలతో ఆలయ ప్రాంగణం శోభిల్లింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని తిలకించారు. స్వామి, దేవేరుల త్రయాహ్నిక దీక్షా పూర్వక పవిత్రోత్సవాలను పశ్చిమ గోదావరి జిల్లా నడిపూడి గ్రామానికి చెందిన వేదపండితులు ఖండవల్లి రాజేశ్వరవర ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వామి వారికి దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈఓ భూపతిరాజు కిషోర్కుమార్ పట్టు వస్త్రాలను అందజేశారు. పవిత్రోత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొనడంతో గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులకు అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ ఈఓ ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. నేటితో ముగియనున్న పవిత్రోత్సవాలు ఉదయం 8 గంటలకు సంకల్పం, మహాశాంతి హోమం, ప్రాయశ్చిత్త హోమం, మహా పూర్ణహుతి, పవిత్ర విసర్జన, మహదాశీర్వచనం తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈఓ తెలిపారు. ఎల్బ్రోస్పై త్రివర్ణ పతాకం కాకినాడ సిటీ: కాకినాడ జిల్లా ఫారెస్టు అధికారి ఎస్.భరణి యూరప్లోనే అతి ఎత్తైన పర్వతం ఎల్బ్రోస్ 5,642 మీటర్లు (18,505 అడుగులు) ఎక్కి త్రివర్ణ పతాకాన్ని గురువారం ఉదయం 12.30 గంటలకు ఎగురవేశారు. ఈమె కాకినాడ జిల్లా అధికారి కావడం జిల్లాకు గర్వకారణమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతటి ఘనత సాధించిన డీఎఫ్ఓ భరణిని జిల్లా అధికారులు అభినందించారు. -
ఇంటింటా వరాలమ్మకు ఆహ్వానం
రాయవరం: శ్రావణం దేవతలకు ఇష్టమైన మాసమని పురాణాలు చెబుతున్నాయి. ముత్తైదువలు, దీర్ఘ సుమంగళీతనం కోసం ఆచరించే వరలక్ష్మీ వ్రతానికి విశేష ప్రాముఖ్యం ఉంది. శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి మొదట వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మీ వ్రతం మహిళలకు అత్యంత ప్రీతిపాత్రమైనది. అష్టలక్ష్మి రూపాన్ని మహిళలు వరలక్ష్మిగా కొలుస్తారు. దీర్ఘకాలం సుమంగళిగా ఉండాలని వివాహితులు, మంచి భర్త లభించాలని యువతులు వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతం ఆచరించడం ద్వారా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని భక్తుల నమ్మకం. వ్రతం రోజున వేకువనే ఇంటిని శుభ్రపర్చుకుని, గుమ్మాలకు పచ్చని మామిడి తోరణాలు, బంతిపూలను కట్టి అందంగా తీర్చిదిద్దుతారు. వ్రతం నిర్వహించే ప్రదేశంలో పిండితో ముగ్గు వేసి, కలశానికి పసుపు పూసి, నీటితో నింపి మామిడి ఆకులు, కొబ్బరికాయను ఉంచి కొత్త రవికెను కలశంపై ఉంచి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. అష్టోత్తర శతనామాలతో దేవిని పూజించి షడ్రసోపేతమైన మహా నైవేద్యాన్ని ఉంచి భుజిస్తారు. చుట్టుపక్కల ఉన్న సువాసినులను వ్రతానికి పిలిచి వాయనాలు, తాంబూలాలు అందజేసి పూజ ముగిస్తారు. ఇళ్లతో పాటు ఆలయాల్లోనూ వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు. అమ్మవారి ఆలయాల్లో నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. పూలు, పండ్లకు గిరాకీ మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే వరలక్ష్మీ వ్రతం పూజా సామగ్రి కొనుగోలుతో మార్కెట్ సందడిని సంతరించుకుంది. జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి పూజా సామగ్రి విక్రయాలు చేపట్టారు. వ్రతానికి అవసరమైన పసుపు, కుంకుమ, గంధం, పూలు, మామిడాకులు, అరటిపండ్లు, అమ్మవారి ఫొటో, కలశం, కొబ్బరికాయలు, తమలపాకులు, వక్కలు తదితర పూజా వస్తువులు సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో పూలకు, పండ్లకు, కొబ్బరికాయలకు గిరాకీ పెరిగింది. కిలో చేమంతి పూలు రూ.400 వరకు ధర పలుకుతున్నాయి. కొబ్బరికాయ ధర రూ.20 నుంచి రూ.30 పలుకుతుండగా, అరటిపండ్లు డజను రూ.50 నుంచి రూ.70 వరకు విక్రయిస్తున్నారు. ఒక్కో తామరపూవు రూ.25 నుంచి రూ.40 వరకు విక్రయిస్తున్నారు. వరలక్ష్మీ వ్రతం విశిష్ఠత నేపథ్యంలో మహిళల భక్తిని వ్యాపారులు సొమ్ము చేసుకున్నారు. ఇక పండ్ల ధరలు చెప్పనక్కరలేకుండా ఉన్నాయి. అలాగే ఇళ్లకు వచ్చి వ్రతాలు చేసే పురోహితులకు సైతం డిమాండ్ పెరిగింది. రూపు అంటే మాటలా! శుభప్రదమైన శ్రావణమాసంలో వ్రతం చేస్తే సిరిసంపదలకు లోటుండదనేది భక్తుల విశ్వాసం. అయితే శ్రావణంలో పూజలు చేయాలంటే మార్కెట్లో పెరిగిన ధరలు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని రూ.5 వేలు అయినా అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంప్రదాయంగా పూజలో ఉంచే లక్ష్మీదేవి బంగారం రూపు, నూతన వస్త్రాలు, పండ్లు, పూల ధరలు మహిళలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ మాసంలో బంగారం కొంటే మంచిదని మహిళల నమ్మకం. వరలక్ష్మీ పూజకు విధిగా బంగారం రూపు ఉండాలని వారు కోరుకుంటారు. ప్రస్తుతం తులం బంగారం రూ.85,150 పలుకుతోంది. అణా బరువున్న వరలక్ష్మీ రూపు రూ.5,500 వేలు ఉంది. గ్రాము రూపు రూ.7,500 చెప్తున్నారు. వరలక్ష్మి రూపులు రూ.2,000, రూ.4000, రూ.5,000 ధరల్లో లభిస్తున్నాయి. తక్కువ ధరకు కొంటే అందులో పైపూత తప్ప లోపలంతా రాగే. ఈ పరిస్థితుల్లో మంచి రేటు పెట్టి కొనకుంటే వరలక్ష్మీ రూపు రావడం గగనమే. సకల శుభాలు కలుగుతాయి శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి. తొమ్మిది సూత్రాలతో కూడిన దారాన్ని అమ్మవారి విగ్రహం వద్ద ఉంచి వ్రతపూజలు చేసుకుని కుడిచేతికి కట్టుకుంటే ఎంతో మంచిది. వరలక్ష్మీ వ్రతాన్ని ఎవరి శక్తి కొలది వారు చేసుకోవాలి. – కూరెళ్ల శివ, పురోహితుడు, రాయవరం వరలక్ష్మీ రూపులు నేడు వాడవాడలా వరలక్ష్మి వ్రతం వ్రతమాచరించనున్న మహిళలు మార్కెట్లకు శ్రావణ శోభ -
‘అత్యవసర’ సేవలకు జూడాలు దూరం
కాకినాడ క్రైం: కాకినాడ జీజీహెచ్లో కొనసాగుతున్న అత్యవసర వైద్య సేవలను జూనియర్ డాక్టర్లు బహిష్కరించారు. కోల్కతాలో ఆర్జీ కార్ వైద్య కళాశాలకు చెందిన పల్మనాలజీ పీజీ విద్యార్థిని దారుణ హత్యాచారం నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ (ఎఫ్ఏఐఎంఏ) పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా శాంతియుత నిరసన చేపడుతున్న జూడాలు గురువారం నుంచి అత్యవసర సేవలకు కూడా హాజరుకావద్దని నిర్ణయించుకున్నారు. ఘటన జరిగిన వైద్య కళాశాల ఆవరణలో నిరసన చేస్తున్న వైద్య విద్యార్థులపై బుధవారం అర్థరాత్రి వేల మంది రౌడీ మూకలు దాడికి తెగబడ్డాయని కాకినాడ జీజీహెచ్లో నిరసన చేపడుతున్న ఆర్ఎంసీ జూనియర్ డాక్టర్లు తెలిపారు. దారుణం జరిగిన హాల్ని ధ్వంసం చేసి సాక్ష్యాలు లేకుండా చేశారన్నారు. ఈ ఘోరాన్ని దేశమంతా చూసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని, వైద్యుల సంరక్షణ కోసం సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతవరకు ఎఫ్ఏఐఎంఏ ఆదేశాల మేరకు తమ నిరసన నిరవధికంగా కొనసాగుతుందన్నారు. నిరసన నేపథ్యంలో కాకినాడ జీజీహెచ్లోని పోర్టికో వద్ద జూనియర్ డాక్టర్లు పలువురు రోగులతో మాట్లాడారు. అత్యవసర వైద్య సేవలు జీజీహెచ్లో కొనసాగుతాయనీ, కేవలం జూనియర్ డాక్టర్లు మాత్రమే హాజరుకారనీ నిరసనలో కొనసాగుతారని తెలిపారు. కలకత్తాలో వైద్య విద్యార్థినిపై జరిగిన దారుణాన్ని పలువురు రోగులు, వారి బంధువులకు వివరించారు. తమ నిరసనకు సంఘీభావం తెలపాలని కోరారు. గురువారం జూడాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జీజీహెచ్ ఆవరణలో నిరసనలో పాల్గొన్నారు. సాయంత్రం పీఆర్ కాలేజ్ సర్కిల్ వద్ద మానవహారంగా ఏర్పడి దారుణంపై ప్రభుత్వం స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శుక్రవారం నాటి ర్యాలీలో యూజీ విద్యార్థులు కూడా పాలుపంచుకోనున్నారు. కోలకతా పీజీ విద్యార్థినిపై హత్యాచారానికి సంఘీభావం రోగులు, వారి బంధువులను తమకు మద్దతు తెలపాలని విన్నపం -
వినాయక ప్రతిమావంతులు..!
●● చవితి ఉత్సవాలకు విగ్రహాలు సిద్ధం ● కళా కౌశలం ప్రదర్శిస్తున్న రాజస్తాన్, బెంగాల్ కళాకారులు ● వేల సంఖ్యలో వస్తున్న ఆర్డర్లు ● మట్టి విగ్రహాలకు పెరిగిన గిరాకీ జిల్లాలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) విగ్రహాల తయారీ రాజస్తాన్, బెంగాల్ నుంచి వచ్చే కుటుంబాలు – 350 తయారు చేసే విగ్రహాలు – 50 వేలకు పైగానే పని చేస్తున్న కార్మికులు – 850 మంది ఏటా విక్రయాలు – రూ.15 కోట్లకు పైగా విగ్రహాల పరిమాణం – అడుగు నుంచి 25 అడుగులకు పైగా ధర – రూ.5 వేల నుంచి లక్ష వరకు మట్టి విగ్రహాల తయారీ తయారు చేసే వారు – బెంగాల్ కార్మికులు విగ్రహాల ధర – రూ.10 నుంచి రూ.13 వేల వరకు తయారు చేస్తున్న ప్రాంతం – పిఠాపురం పిఠాపురం: ఓ బొజ్జగణపయ్య నీబంటు నేనయ్యా అంటు ఉత్సవ నిర్వాహకులు వినాయక చవితి వేడుకలకు సిద్ధమవుతుంటే ఓ బొజ్జ గణపయ్య మా బొజ్జ నింపయ్యా అంటూ విగ్రహ తయారీదారులు కోరుకుంటున్నారు. వినాయక చవితి ఉత్సవాలు దగ్గర పడుతుండడంతో వినాయక విగ్రహాల తయారీ ఊపందుకుంది. కాకినాడ జిల్లాలో పిఠాపురం, కాకినాడ, తుని తదితర ప్రాంతాల్లో రాజస్థాన్, అనకాపల్లి జిల్లా ఏటికొప్పాక తదితర ప్రాంతాల నుంచి వచ్చిన నిపుణులు వినాయక విగ్రహాల తయారీ దారులు ఇప్పటికే వందల సంఖ్యలో సిద్ధం చేశారు. కళ్లు మిరుమిట్లు గొలుపుతున్న రంగు రంగుల విగ్రహాలను మండపాలలో నిలిపేందుకు వివిధ పరిమాణాల్లో నిలబెట్టేందుకు జోరుగా విక్రయాలు సాగుతున్నాయి. కుటుంబ సమేతంగా.. రాజస్థాన్కు చెందిన కళాకారులు తమతమ కుటుంబాలతో సహా వివిధ జిల్లాలకు ఆరు నెలల ముందుగానే వచ్చి విగ్రమాల తయారీ ప్రారంభించారు. ప్రధాన పట్టణాలు, గ్రామాల్లో ముఖ్య కూడళ్ల సమీపంలో ఖాళీ ప్రదేశాన్ని అద్దెకు తీసుకుని భారీ గుడారాలు వేసి అక్కడే నివసిస్తూ విగ్రహాలు తయారు చేస్తున్నారు. కుటుంబంలో అందరు కలిసి పని చేస్తుంటారు. సిద్ధం చేసిన విగ్రహాలను వినాయక చవితి వరకు విక్రయించి తరువాత తమ స్వగ్రామాలకు వెళ్లి పోతారు. కొందరైతే ఇక్కడే ఉండిపోయి ఇతర చిన్న విగ్రహాలు తయారు చేసి అమ్ముకుంటూ ఉండిపోతున్నారు. భారీ విగ్రహాలకు పెరిగిన ఆదరణ గతంలో 2 నుంచి 5 అడుగుల మట్టి విగ్రహాలకే ప్రాధాన్యం ఇవ్వగా, కొన్నేళ్ల నుంచి ఉత్సవ కమిటీల మధ్య పోటీ పెరిగి ఒకరిని మించి ఒకరు భారీ పరిమాణంలో విగ్రహాలు నిలబెడుతున్నారు. దీంతో అడుగు నుంచి 25 అడుగుల ఎత్తు వరకు విగ్రహాలు తయారు చేయాలని రెండు నెలల ముందుగానే ఆర్డర్లు ఇస్తున్నారు. భారీ విగ్రహాలు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు ఉండగా వేలల్లో వీటికి ఆర్డర్లు రావడం గమనార్హం. మరీ భారీ పరిమాణంలో కావాలనుకున్న వారికి మండల పాల వద్దే కార్మికులు తయారు చేసి ఇస్తున్నారు. వీటి విలువ రూ.లక్షకు పైగానే ఉంటుందని తయారీ దారులు చెప్తున్నారు. మట్టి విగ్రహాలకు పెరుగుతన్న ఆదరణ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలకే ప్రాధాన్యం ఇవ్వాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నప్పటికీ ఎక్కువగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) తో చేసిన వాటికే గిరాకీ ఉంటోంది. ఆలయాలు, ఇళ్ల వద్ద మాత్రం మట్టి విగ్రహాలకే ప్రాధాన్యం ఇస్తుండగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసే మండపాల వద్ద మాత్రం పీఓపీతో చేసిన వాటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. అతి బారీ పరిమాణంలో విగ్రహాలతో పాటు ఆకర్షణీయంగా ఉండాలన్న ఆలోచనతో వీటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ఈ ఏడాది పిఠాపురంలో మట్టి విగ్రహాల తయారీ ప్రారంభించడంతో వాటికి ప్రాధాన్యం పెరిగింది. కళా నైపుణ్యం అంతా చేతితోనే.. మాది బెంగాల్ ఎన్నో ఏళ్లుగా మా కుటుంబ అంతా ఇదే పనిలో ఉన్నారు. గతంలో పీఓపీతో విగ్రహాలు తయారు చేసే వాళ్లం. పర్యావరణవేత్త, ప్రకృతి వ్యవసాయ వేత్త విజయ్రాం సూచనల మేరకు ఈ ఏడాది మట్టి విగ్రహాలు తయారు చేస్తున్నాం. మట్టి విగ్రహాలను చేతితోనే చేయాల్సి ఉంటుంది. వీటికి మౌల్డ్లు ఉండవు. ప్రతీ అవయవం మట్టితో నైపుణ్యంగా తయారు చేయాల్సి ఉంటుంది. నెల రోజులుగా మట్టి విగ్రహాల తయారీ ప్రారంభించాం. ఒక విగ్రహం తయారు చేయడానికి ముగ్గురు కార్మికులు కష్టపడితే ఒక రోజులో పూర్తవుతుంది. – సంతోన్, మట్టి విగ్రహాల తయారీ కార్మికుడు, బెంగాల్ గ్యారీ బాయ్ విగ్రహ తయారీదారు, రాజస్థాన్ పీఓపీతో చేసినవే అడుగుతున్నారు ఎక్కువగా పెద్దపెద్ద మండపాలలో నిలిపేందుకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసినవే అడుగుతున్నారు. ముందుగా వచ్చి వివిధ భంగిమలలో తయారుచేయాలని ఆర్డర్లు ఇచ్చారు. ఈ ఏడాది ఎక్కువగా పెద్ద విగ్రహాలకు గిరాకీ ఉంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి విగ్రహాలు కొని తీసుకెళుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల కొంత ఇబ్బందిపడినా ఎక్కువగానే విగ్రహాలు తయారు చేశాం. దానికి తగ్గట్టుగానే విక్రయాలు కూడా ఉన్నాయి. పెట్టుబడులు పెరగడంతో లాభాలు తక్కువగా ఉంటాయి. – సోనా రామ్ విగ్రహ తయారీదారుడు, రాజస్థాన్ పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహంగా.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ ఏడాది మట్టి విగ్రహాల తయారీ పిఠాపురంలో ప్రారంభించాం. కేవలం మట్టి గోనె సంచులు మాత్రమే ఉపయోగించి మట్టి విగ్రహాలు ఆకర్షణీయంగా తయారు చేయిస్తున్నాం. విగ్రహాలు కేవలం మట్టి రంగులోనే ఉంటాయి ఏ విధమైన రంగులు వేయరు. ఆకర్షణ కోసం వరి పిండి పసుపు కుంకుమలతో అలంకారం చేస్తారు. ఈ మట్టి విగ్రహం ఎక్కడైనా ఏ నీటిలో అయినా నిమజ్జనం చేయవచ్చు. కేవలం 3 రోజుల్లో పూర్తిగా నీటిలో కరిగిపోతుంది. నీటికి గాని పర్యావరణానికి గాని ఎటువంటి హానీ ఉండదు. విగ్రహాలు కొనుగోలు చేసిన వారికి విగ్రహంతో పాటు బియ్యం, గొడుగు, బెల్లం, పంచె ఇస్తున్నాం. ఇవన్నీ ప్రకృతి వ్యవసాయంలో పండించినవే. పంచె చేనేత వస్త్రం మాత్రమే ఇస్తున్నాం. ప్రస్తుతం వీటికి గిరాకీ బాగానే ఉంది ఇప్పటి వరకు సుమారు 130 విగ్రహాలకు ఆర్డర్లు వచ్చాయి. కళాకారుల నైపుణ్యం కళ్లకు కట్టినట్టు కనిపిస్తుంది. వీటిని ప్రోత్సహిస్తే వచ్చే ఏడాది మరిన్ని మట్టి విగ్రహాల తయారీకి చర్యలు తీసుకుంటాము. – విజయ్రాం, ప్రకృతి వ్యవసాయ వేత్త -
బధిర క్రీడాకారుడికి చేయూతనివ్వండి
పిఠాపురం: ఆసియా, పసిఫిక్ బధిర బాస్కెట్ బాల్ చాంపియన్షిప్నకు భారత దేశం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మిడి ఏసు కుమార్కు ఆర్థిక సాయం అందించి ఆ పోటీలో పాల్గొనే అవకాశం కల్పించాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి బొజ్జా మాణిక్యాలరావు దాతలను కోరుతున్నారు. ఇంటర్నేషనల్ బాస్కెట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ డెఫ్ (డీఐబీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలు ఆస్ట్రేలియా దేశం మెల్బోర్న్లో ఈ ఏడాది సెప్టెంబర్ 12 నుంచి 29 వరకూ జరుగుతాయని, ఇంత మంచి అవకాశాన్ని దక్కించుకున్న ఏసుకుమార్ పిఠాపురానికి గర్వకారణమన్నారు. దేశ వ్యాప్తంగా 12 మందికి అవకాశం రాగా, తెలుగురాష్ట్రాల నుంచి అతనొక్కడే ఎంపికయ్యారని ఆయన అన్నారు. పోటీలకు వెళ్లి వచ్చేందుకు అయ్యే ఖర్చును క్రీడాకారులే భరించాలని ఆల్ ఇండియా స్పోర్ట్స్ కౌన్సిల్ ఆఫ్ డఫ్ షరతు విధించిందని, అక్కడకు వెళ్లేందుకు రూ.2.06 లక్షల ఖర్చవుతుందని ఆ మొత్తాన్ని భరించే స్థితి అతని కుటుంబానికి లేదని మాణిక్యాలరావు పేర్కొన్నారు. తండ్రి సుబ్బారావు మరణం తర్వాత తల్లి వెంకట లక్ష్మితో కుమార్ వెల్డింగ్ షాపులో పనిచేస్తూ ఆమెకు ఆసరాగా ఉన్నాడన్నారు. స్థానిక రాజీవ్ గాంధీ మున్సిపల్ హైస్కూల్ బాస్కెట్ బాల్ కోర్టులో శిక్షణ పొందిన ఏసు కుమార్ అనేక జాతీయ, రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చూపాడన్నారు. దాతలు ఉమ్మిడి వెంకట లక్ష్మి ఆకౌంట్ నెంబర్ 043210100139503, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఠాపురం బ్రాంచ్ ఐఎఫ్ఎస్ఈ కోడ్ యూబీఐ 804321కు కానీ, ఉమ్మిడి ఏసు కుమార్ ఫోన్ పే నెంబర్ 9347199153 సాయం చేయవచ్చని ఆయన కోరారు. -
మోటార్ సైకిల్ ఢీకొని వ్యక్తి మృతి
అయినవిల్లి: మండలంలోని విలస గ్రామం వద్ద గురువారం ఓ వ్యక్తి మోటార్ సైకిల్ ఢీకొని మృతి చెందాడు. దీనికి సంబంధించి అయినవిల్లి ఎస్సై బి.శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం రాజోలు నుంచి అయినవిల్లి వైపు మోటార్ సైకిల్పై వస్తున్న వడ్డేపల్లి శ్రీనివాసరావు (55)ను ముక్తేశ్వరం నుంచి అమలాపురం వైపు వస్తున్న మరో మోటార్ సైకిలిస్టు అతి వేగంగా వచ్చి ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావు అక్కడిక్కడే మృతి చెందాడు. అంబులైన్స్లో మృతదేహాన్ని అమలాపురం ఏరియా అస్పత్రికి తరలించారు. మృతిని భార్య జ్యోతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు. దేశభక్తి పరుడికి సత్కారం సామర్లకోట: స్థానిక బ్రాహ్మణ అగ్రహరంలో నివాసం ఉంటున్న 101 సంవత్సరాల దివిటి అప్పారావును స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా యువత ఘనంగా సత్కరించింది. యువతలో దేశభక్తి కలిగించడమే లక్ష్యంగా ఆయన 10 ఏళ్లు గా జాతీయ జెండాను భుజాన వేసుకొని పెద్దాపురం నియోజకవర్గం అంతా తిరుగుతూ ఉన్నా రు. ఎవరైనా డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే నిరాకరించడంతో పాటు కాలినడకనే ఎంత దూరం అయినా వెళుతూ ఉంటాడు. 60 ఏళ్ల వయస్సులోనే నడవలేక పోతున్న రోజుల్లో 101 సంవత్సరాల వయస్సులోని కాలినడకనే తిరుగు తూ దేశభక్తి కోసం జాతీయ జెండాను మోస్తున్న అప్పారావును సత్కరించాలని నియోజకవర్గ శోభాయాత్ర నిర్వాహకుడు కర్రి అప్పలరాజు నిర్ణయించారు. ఈ మేరకు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్థానిక నీలమ్మ చెరువు గట్టుపై ఉన్న వివేకానంద గ్రంథాలయంలో యువత సత్కరించారు. పెద్దాపురం మాతృత్వ సేవా సంస్థ, ఫేజ్ బుక్ ఫ్రెండ్స్, శోభా యాత్ర నిర్వాహకులు దివిటి అప్పారావును సత్కరించారు. కుండలేశ్వరుడి దేశభక్తి కాట్రేనికోన: మండలంలోని కుండలేశ్వరంలో వేంచేసిఉన్న పార్వతీ సమేత కుండలేశ్వర స్వామి గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాక రంగులతో భక్తులకు దర్శనమిచ్చాడు. ఆలయ అర్చకుడు కాళ్లకూరి కామేశ్వరశర్మ కుండలేశ్వర స్వామిని జాతీయ పతాకం రంగులున్న పూలతో సుందరంగా అలంకరించారు. -
మహనీయుల త్యాగాలే స్ఫూర్తి
●● రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి సుభాష్●● ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు ● కొనసీమ జిల్లా వ్యాప్తంగా పండగ వాతావరణ ● బాలయోగి స్టేడియంలో ఆకట్టుకున్న పోలీసులు కవాతు ● వివిధ శాఖల ప్రగతి శకటాల ప్రదర్శన సాక్షి, అమలాపురం: స్వతంత్య్ర పోరాటంలో మహనీయులు చేసిన త్యాగాలు మరువలేమని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. నాటి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని నేటితరం యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జిల్లాను ప్రగతి పథంలో పయనింప చేయడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై కావాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లా వ్యాప్తంగా గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అమలాపురం బాలయోగి స్టేడియంలో నిర్వహించిన వేడుకలు అంబరాన్ని అంటాయి. రాష్ట్ర కార్మిక శాఖమంత్రి వాసంశెట్టి సుభాష్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం పోలీసు వర్గాలు కవాతుతో చేసిన గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు. జిల్లా గత ఏడాది సాధించిన అభివృద్ధి ప్రగతిని ఆయన చదివి వినిపించారు. స్వేచ్చా, స్వాతంత్య్రలకు సూచికగా శాంతి కపోతాలను ఎగురవేశారు. మువ్వన్నల జెండాల రెపరెపల మధ్య స్వాతంత్య్ర దినోత్సవాన్ని జిల్లాలో అంభరాన్నంటేలా నిర్వహించారు. మూడు రంగుల జెండాలు, విద్యుత్ దీపాల అలంకరణాలతో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల కార్యాలయాలతో జిల్లాలో జాతీయ జెండా ఆవిష్కరణలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు, జాతీయ గీతాలాపనలతో పండుగ వాతావరణం నెలకొంది. అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షకులను అలరించాయి. దేశభక్తి గీతాలు, స్వాతంత్య్ర ఉద్యమ గేయాలతో నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి. గుడిమెళ్లంక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులు చేసిన ప్రాచీన క్రీడ మల్ల కంబ ఆహూతులను విశేషంగా ఆకర్షించింది. ఈ సందర్భంగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఉత్తమ సేవకులకు పురస్కారాలు వివిధ ప్రభుత్వ శాఖలలో విశిష్ట సేవలు అందించిన జిల్లా అధికారులు ఎనిమిది మందికి, అలాగే ఆయా విభాగాల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న సుమారు 245 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్, జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, ఎస్పీ బి.కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి, ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎస్పీ ఖాదర్ బాషా, డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, అమలాపురం, రామచంద్రపురం, కొత్తపేట ఆర్డీవోలు జి.కేశవవర్ధన్ రెడ్డి, ఎస్.సుధాసాగర్, జీవీవీ సత్యనారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన జిల్లా గత ఏడాది సాధించిన ప్రగతి ఆధారంగా ఆయా శాఖలు చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ శకటాల ప్రదర్శన నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సామాజిక పింఛన్ల పంపిణీ శకటం ప్రథమ స్థానంలో నిలిచింది. అలాగే గనులు, భూగర్భ శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఇసుక విధానం తెలిపే శకటానికి ద్వితీయ స్థానం, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అన్నా క్యాంటిన్ల శకటానికి తృతీయ స్థానం ప్రకటించారు. వీటితో పాటు దేవదాయ ధర్మదాయ, వ్యవసాయ, ఉద్యాన, గృహ నిర్మాణ, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక శాఖలకు చెందిన శకటాల ప్రదర్శన జరిగింది. కలెక్టరేట్లో జాతీయ జెండా ఆవిష్కరణ 78వ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా అమలాపురం కలెక్టరేట్లో జాతీయ జెండాను కలెక్టర్ మహేష్ కుమా ర్ ఆవిష్కరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ నేరాలతో జాగ్రత్త
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ప్రిన్సిపల్ జిల్లా జడ్జి సునీత రాజానగరం: అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజ హితంగా వాడుకోవలసి ఉండగా, కొంతమంది స్వార్థపరులు తమ స్వార్థానికి వాడుతున్న నేపథ్యంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ప్రిన్సిపల్ జిల్లా జడ్జి సునీత గంధం అన్నారు. ఈ సమయంలో యువత అప్రమత్తంగా ఉంటూ సైబర్ నేరాలను అదుపు చేయడంలో కీలకపాత్ర వహించాలని సూచించారు. స్థానిక గోదావరి గ్లోబర్ యూనివర్సిటీలో ‘డ్రగ్స్ దుర్వినియోగం – యాంటీ ర్యాగింగ్’ అనే అంశంపై ఇంజినీరింగ్ విద్యార్థులకు మంగళవారం చైతన్య సదస్సు నిర్వహించారు. కళాశాలలు, యూనివర్సిటీలలో సీనియర్లు, జూనియర్లను వేధింపులకు గురిచేసి ర్యాగింగ్కి పాల్పడం తీవ్రమైన నేరంగా పేర్కొన్నారు. ఈ సమయంలో అటువంటి వారిపై విధించే కేసులు, చట్టాల గురించి అవగాహన కలిగించారు. సీనియర్లు ఎల్లప్పుడూ జూనియర్లకు తమ విజ్ఞానాన్ని పంచుతూ మార్గదర్శకులుగా ఉండాలిగాని, శత్రువుల్లా మారకూడదన్నారు. ఈ విధంగా చేస్తే ర్యాంగింగ్కి పాల్పడిన వ్యక్తుల జీవితాలు నాశనమవుతాయని హెచ్చరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.ప్రకాశ్బాబు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు ఏ ఒక్కరూ బానిసలు కావొద్దన్నారు. అదనపు ఎస్పీ ఎస్ఆర్ రాజశేఖరరాజు మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు ఏవిధంగా మోసాలకు పాల్పడుతున్నారో వివరించారు. కార్యక్రమంలో జీజీయూ రిజిస్టార్ డాక్టర్ పీఎంఎంఎస్ శర్మ, ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.జయానంద్కుమార్, డాక్టర్ ఎస్వీఎస్ఎన్ మూర్తి, రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ తేతలి రామారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. -
సర్దుబాటు బహిష్కరణ
అమలాపురం టౌన్: విద్యాశాఖ తలపెట్టిన వర్క్ అడ్జస్ట్మెంట్ (ఉపాధ్యాయుల పని సర్దుబాటు)పై ఉపాధ్యాయ సంఘాలు ససేమిరా అంటున్నాయి. అసంబద్ధమైన ఈ ప్రక్రియను తాము బహిష్కరిస్తున్నట్లు జిల్లా ఫాప్టో శాఖ స్పష్టం చేసింది. అలాగే పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం కూడా పని సర్దుబాటును బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. ఈ రెండు జిల్లా స్థాయి సంఘాలకు చెందిన ఉపాధ్యాయులు సర్దుబాటు కార్యక్రమానికి సహాయ నిరాకరణ ఉంటుంటుందని చెబుతున్నారు. జిల్లా ఫాప్టోకు సంబంధించిన ఎస్టీయూ, యూటీఎఫ్ జీహెచ్ఎం అసోసియేషన్ నాయకులు నాగిరెడ్డి శివప్రసాద్, పోతంశెట్టి దొర బాబు, ఎస్ఎస్ పల్లంరాజు, పెంకే వెంకటేశ్వరరావు, నారాయణ శ్రీనివాసరావు, నిమ్మకాయ ల గణేశ్వరరావు అమలాపురంలో జరిగిన సమావేశంలో పని సర్దుబాటును వ్యతిరేకించారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు దీపాటి సురేష్బాబు, ప్రధాన కార్యదర్శి వాడ్రేవు శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ మొంగం అమృతరావు సైతం ఆ ప్రక్రియను వ్యతిరేకించారు. అగ్రి కోర్సు దరఖాస్తులకు ఆహ్వానం రాజమహేంద్రవరం రూరల్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 4 సంవత్సరాల బీఎస్సీ(హానర్స్) కోర్సు ప్రవేశం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ డి.శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో ఆరు ప్రభుత్వ కళాశాలలు, ఆరు అనుబంధ కళాశాలలు ఉన్నాయన్నారు. 2024–25 విద్యాసంవత్సరం కోర్సు ప్రవేశాలకు ఆసక్తిగల విద్యార్థులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఎన్జీఆర్ఏయూ.ఏసీ.ఐఎన్ యూనివర్శిటి వెబ్సైట్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఇందులో కోర్సు వివరాలు, అర్హత, వయోపరిమితి, రైతు వారి కోటా వివరాలు ఇస్తామన్నారు. అపరాధ రుసుంతో ఈనెల 30వతేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ‘పంపా’ రైతుల ఆశలకు లీకేజీ అన్నవరం: స్థానిక పంపా రిజర్వాయర్ బ్యారేజీ గేట్లుకు ఎన్ని సార్లు మరమ్మతులు చేసినా సమస్య మళ్లీ మొదటికి వస్తోంది. గత జూన్లో పంపా బ్యారేజీ గేట్లకు సుమారు రూ.20 లక్షలతో మరమ్మతులు చేపట్టినా నాలుగో నెంబర్ గేటు మాత్రం ఇంకా రిజర్వాయర్ అధికారులకు సమస్యగానే మిగిలింది. పంపా రిజర్వాయర్లో వంద అడుగుల నీటిమట్టంతో గణనీయంగా నీరు ఉన్నప్పటికీ నాలుగో నంబర్ గేటు నుంచి ఇంకా నీరు లీకవుతోంది. ఈ గేటు ద్వారా పది క్యూసెక్కుల నీరు వృఽథాగా పోతుండడంతో అటు అధికారులు, ఇటు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ నీటి లీకేజీని అరికట్టేందుకు ఎండుగడ్డి మోపులుగా కట్టి గేటు దిగువన ఉంచేందుకు రిజర్వాయర్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఖరీఫ్పై ఆశ చిగురించిన వేళ... నీటి లీకేజీ.. జూలై రెండో వారం నుంచి ఆగస్టు మొదటి వారం వరకు కురిసిన భారీ వర్షాల కారణంగా పంపా రిజర్వాయర్ నీటిమట్టం పెరగడంతో ఆయకట్టు రైతులకు ఖరీఫ్ పంటపై ఆశలు చిగురించాయి. జూలై 23న పంపా ఆయకట్టుకు నీరు విడుదల చేశారు. మొదట 30 క్యూసెక్కులు చొప్పున విడుదల చేశారు. తరువాత వంద క్యూసెక్కులకు పెంచారు. ప్రస్తుతం రైతాంగం ఖరీఫ్ పనుల్లో బిజీగా ఉండగా రిజర్వాయర్ బ్యారేజీ గేటు నుంచి నీరు వృథాగా పోతుండడం అశనిపాతంలా మారింది. పుష్కరాలకు కార్యాచరణ రాజమహేంద్రవరం రూరల్: గోదావరి పుష్కరాలు – 2027 నిర్వహిణకు పటిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళదామని కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో ఆమె వివిధ అంశాలపై చర్చించారు. ఆమె మాట్లాడుతూ గతంలో జరిగిన పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు సూచనలను సలహాలను పరిగణనలోకి తీసుకొని చర్యలు తీసుకుంటా మన్నారు. శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాసు మాట్లాడుతూ రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ రహదారులపై అవగాహనకు వచ్చానన్నారు. ఎస్పీ డి.నరసింహ కిషోర్ మాట్లాడుతూ ట్రాఫిక్ మళ్లింపు అంశాలపై ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. -
16 నుంచి రెవెన్యూ సదస్సులు
సాక్షి అమలాపురం: భూ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 30 వరకూ జిల్లాలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ మహేష్కుమార్ తెలిపారు. వీటి నిర్వహణకు సంబంధించి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతితో కలిసి మంగళవారం తహసీల్దార్లతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు 45 రోజుల పాటు జిల్లాలో అన్ని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామన్నారు. గ్రామాల వారీగా సదస్సులు నిర్వహించే తేదీలపై ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. మ్యూటేషన్, వెబ్ ల్యాండ్లో మార్పులు, 1బి, దారి సమస్య, భూ తగాదాలు ఎక్కువగా ఉంటాయని, ఇలాంటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సదస్సులను నిర్వహిస్తోందన్నారు. ఉపాధి హామీ పనులకు ప్రణాళికలు అమలాపురం రూరల్: ఉపాధి హామీ పనులకు ఆయా శాఖల అధికారులు ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. 2025 మార్చి 31 వరకు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉపాధి పథకం కింద 56 లక్షల పని దినాలకు అనుమతి మంజూరైందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో మెటీరియల్ కాంపోనెంట్ కింద సుమారు రూ.100 కోట్లు వచ్చే అవకాశం ఉందన్నారు. అన్ని శాఖల అధికారులు సంబంధిత శాఖలోని పనులను గుర్తించి వారం రోజుల లోపు ప్రతిపాదనలు పంపాలన్నారు. సహకార అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లాలోని 166 ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీలలో ఆగస్టు 31వ తేదీ లోపు కంప్యూటరైజేషన్ పూర్తిచేయాలని కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆయన చాంబర్లో మంగళవారం జిల్లా సహకార అభివృద్ధి కమిటీ 3వ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని సహకార సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు పీఎసీఎస్లు పెట్రోల్ బంకులు నడపడానికి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాయన్నారు. -
సర్దుపాట్లు
● వర్క్ అడ్జెస్ట్మెంట్కు ప్రభుత్వం సన్నాహాలు ● ఉపాధ్యాయుల అభ్యంతరం రాయవరం: ఉపాధ్యాయుల సర్దుబాటుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సాధారణంగా ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయుల సర్దుబాట్లు చేయాలి. ప్రస్తుతం విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచింది. మరో 10 రోజుల్లో ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలకు కూడా విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. ఈ దశలో ప్రభుత్వం ఉపాధ్యాయుల సర్దుబాటుకు ఆదేశాలు ఇచ్చింది. వీటిపై ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సోమవారం వర్క్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నామని, మిగులు ఉపాధ్యాయులు కౌన్సెలింగ్కు రావాలని మండల విద్యాశాఖాధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు సర్దుబాటు ప్రక్రియను వ్యతిరేకిస్తూ ఈ ప్రక్రియకు దూరంగా నిలిచారు. ఆందోళనలో టీచర్లు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ఇప్పుడు సర్దుబాటు బెంగ పట్టుకుంది. జీవో 117కు వ్యతిరేకంగా గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల విలీనంపై ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నూతన విద్యా విధానంలో భాగంగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. ఈ క్రమంలో విద్యార్థుల సంఖ్య, దూరం ఆధారంగా ప్రాథమిక పాఠశాలల్లో ఒకటి, రెండు తరగతులను సమీపంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. అనంతరం ఉపాధ్యాయుల్ని సర్దుబాటు చేశారు. ఎన్నికలకు ఏడాది ముందు ఉపాధ్యాయ బదిలీలు కూడా చేపట్టారు. అప్పట్లో వ్యతిరేకించిన టీడీపీ విలీన ప్రక్రియను అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న ప్రస్తుత ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. అధికారంలోకి రాగానే 117 జీవోను రద్దు చేస్తామని కూడా ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ ప్రకటించింది. అయితే ఇప్పుడు 117 జీవోను రద్దు చేయకుండా, ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడాన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ ప్రక్రియను నిలుపుదల చేయాలని, విద్యా సంవత్సరం మధ్యలో సర్దుబాటు ప్రక్రియ చేపట్టడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు నష్టపోతుందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీఐఎస్లో సమాచారం టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్లో ఉపాధ్యాయుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం సేకరించింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా సర్దుబాట్లు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇటీవల కాలంలో పలు కారణాలతో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఈ క్రమంలో చాలా పాఠశాలల్లో విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తిలో తేడా వచ్చింది. దీంతో ఉపాధ్యాయులు సర్దుబాటు కోసం ఫేషియల్ అటెండెన్స్ యాప్లో టీచర్ల వివరాలను నమోదు చేయించారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా మిగులు ఉపాధ్యాయులను ఇప్పటికే గుర్తించారు. మరోవైపు పలు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్నట్లుగా గుర్తించారు. సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చేందుకు మిగులు సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీ)లను వారి విద్యార్హత ఆధారంగా సబ్జెక్టు టీచర్లుగా పంపించాలని నిర్ణయించారు. మరోవైపు వచ్చే ఏడాది జనవరి నాటికి డీఎస్సీ నియామకాలు చేపడతామని ఇప్పటికే ప్రకటించారు. డీఎస్సీ 2024 నియామకాల అనంతరం తిరిగి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. జూనియర్లకు ఎఫెక్ట్ మిగులు పోస్టుల నిర్దారణలో కేడర్(సర్వీస్) సీనియార్టీని ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. ఒక పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల్లో మిగులు టీచర్లు ఉన్పప్పుడు వారిలో జూనియర్లను మిగులు టీచర్లుగా నిర్దారిస్తారు. గతంలో సీనియర్ కోరుకుంటే వారిని సర్దుబాటు జాబితాలో చేర్చేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా కేవలం కేడర్ జూనియర్ను మాత్రమే సర్దుబాటు చేయనున్నారు. ఈ ప్రక్రియ 14వ తేదీలోగా పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేశారు. మిగులు టీచర్లను నిర్ధారించి, మిగులు టీచర్లకు సోమవారం కౌన్సెలింగ్ చేయాలని నిర్ణయించారు. వ్యతిరేకించిన ఉపాధ్యాయ సంఘాలు మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. జీవో నంబరు 117, 128 ప్రకారం సర్దుబాటు ప్రక్రియను చేపడుతున్నారు. 117 జీవోనే రద్దు చేయమని డిమాండ్ చేస్తున్నప్పుడు ఆ జీవోను ఆధారంగా చేసుకుని ఉపాధ్యాయుల సర్దుబాటు ఏ విధంగా చేస్తారనేది ఉపాధ్యాయ సంఘాల ప్రధాన డిమాండ్గా ఉంది. ముందుగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం సోమ, మంగళవారాల్లో మిగులు టీచర్ల సర్దుబాటు చేయాల్సి ఉండగా, సోమవారం ఫాఫ్టో, జాక్టో అసోసియేషన్ల ఆధ్వర్యంలో సర్దుబాటు ప్రక్రియను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ఈ నేపథ్యంలో సోమవారం జరగాల్సిన సర్దుబాటు ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేశారు. జీవో నంబరు 117, 128 ప్రకాారం కాకుండా జీవో 53 ప్రకారం చేయాలని ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మండల స్థాయిలోనే కౌన్సెలింగ్ మండల స్థాయి ప్రాతిపదికగానే వర్క్ అడ్జస్ట్మెంట్ చేపట్టాలి. మండల స్థాయిలో పాఠశాలల్లో వాస్తవంగా ఉన్న విద్యార్థుల సంఖ్యను ఆధారంగా చేసుకుని ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టాలి. జీవో 53 ప్రకారం వర్క్ అడ్జస్ట్మెంట్ చేపట్టాలి. – చింతాడ ప్రదీప్ కుమార్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ 117 జీవో రద్దు చేయాలి ఉపాధ్యాయుల సర్దుబాటుకు ముందుగా జీవో 117ను రద్దు చేయాలి. దానిని రద్దు చేస్తానంటూ ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలి. అసంబద్ధంగా ఉన్న జీవో ప్రకారం ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం వల్ల విద్యావ్యవస్థకు నష్టం జరుగుతుంది. – పెంకే వెంకటేశ్వరరావు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, అమలాపురం, ప్రభుత్వ నిర్ణయం అసంబద్ధం ఉపాధ్యాయుల సర్దుబాటును 117, 128 జీవోల ప్రకా రం చేప ట్డం అన్యాయం. ఈ నిర్ణయం పూర్తి అసంబద్ధంగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్పప్పుడు ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్ స్వయంగా జీవో 117 రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తయినప్పటికీ జీవో రద్దుకు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించక పోవడం శోఛనీయం. – పొతంశెట్టి దొరబాబు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు, అమలాపురం ఉపాధ్యాయ సంఘాల ప్రధాన డిమాండ్లు జీవో నంబరు 53 ప్రకారం ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలి. మండల పరిధిలోనే సర్దుబాట్లు ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో డివిజన్ స్థాయిలో చేపట్టాలి. జిల్లాల దాటి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయరాదు. ప్రస్తుత అకడమిక్ విద్యా సంవత్సరంలో ఉద్యోగ విరమణ చేస్తున్నవారిని సర్దుబాటు నుంచి మినహాయించాలి. ఫ్లస్–2, సీబీఎస్ఈ అమలవుతున్న పాఠశాలల్లో వర్క్ అడ్జస్ట్మెంట్ చేయరాదు. స్టడీ లీవ్, మెటర్నటీ లీవ్లో ఉన్న ఉపాధ్యాయులు ఉన్న చోట వర్క్ అడ్జస్ట్మెంట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. పీఎస్ హెచ్ఎంను అదే పాఠశాలలో ఉన్న రోల్తో సంబంధం లేకుండా కొనసాగించాలి. 6 నుంచి 10 తరగతులు ఉన్న పాఠశాలల్లో 10 సెక్షన్లు దాటితే రెండవ హిందీ, రెండవ పీఎస్ పోస్టు మంజూరు చేయాలి. -
స్వర్ణ ధ్వజస్తంభానికి మరిన్ని హంగులు
రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు వెంకటేష్ మామిడికుదురు: విశాఖపట్నంలో ఈ నెల 17వ తేదీ నుంచి జరిగే రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు మామిడికుదురుకు చెందిన డిగ్రీ విద్యార్థి కడలి దివ్యతేజ వెంకటేష్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డీవీవీ సత్యనారాయణ మంగళవారం తెలిపారు. కాకినాడలో ఈ నెల 11వ తేదీన జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా తరఫున పాల్గొన్న వెంకటేష్ బంగారు పతకం సాధించాడన్నారు. తద్వారా రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించినట్టు తెలిపారు. వెంకటేష్ తో పాటు అతడి కోచ్ కె.చిన్నను ప్రిన్సిపాల్ సత్యనారాయణ, అధ్యాపకులు మోకా రంగారావు, యాలంగి రవికుమార్, పెచ్చెట్టి రాధ అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న వెంకటేష్ కవల కొబ్బరి కాయ కొత్తపేట: సహజంగా కొబ్బరికాయకు మూడు కన్నులు ఉంటాయి. కానీ గతంలో రెండు, నాలుగు కన్నుల కొబ్బరికాయలను చూశాం. ఇప్పుడు కొత్తగా ఒక కొబ్బరికాయలో కవల (రెండు) కాయలు బయటపడ్డాయి. కొత్తపేటకు చెందిన పురోహితుడు పెద్దింటి రామచంద్ర శ్రీహరి (రామం) ఇంట శ్రావణ మంగళవారం సందర్భంగా లక్ష్మీదేవి పూజలో కొబ్బరి కాయను కొట్టారు. దానిలో కవల కాయలు కనిపించాయి. పీచు తొలగించగా రెండు కనులు ఉన్నాయి. వీటిని పలువురు భక్తులు తిలకించారు. హోటల్ సర్వర్ అనుమానాస్పద మృతి అమలాపురం టౌన్: అమలాపురం గడియారం స్తంభం సెంటర్లోని ఒక హోటల్లో సర్వర్గా పనిచేస్తున్న పులిదిండి సత్యనారాయణ (50) సోమవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పట్టణ సీఐ కె.క్రిష్టోఫర్ తెలిపిన వివరాల ప్రకారం.. అల్లవరం మండలం కొమరగిరిపట్నానికి చెందిన పులిదిండి సత్యనారాయణ పదేళ్లుగా ఇదే హోటల్లో పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి వరకూ పనిచేసి నిద్రపోయాడు. హోటల్ యజమాన్యం మంగళవారం ఉదయం చూసే సరికి మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న అతడి కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని విలపించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సత్యనారాయణ హృదయ సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడని సమాచారం. కలుపు మందు రుచి చూసిన యువకుడి మృతి పి.గన్నవరం: పొలంలో కలుపు నివారణకు ఉపయోగించే మందు ఎలా ఉంటుందోనని రుచి చూసిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఏఎస్సై పట్టాభిరామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పి.గన్నవరం మండలం ఊడిమూడి గ్రామానికి చెందిన అడబాల శివ (26) ఈ నెల 6న తన పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ ఉన్న కలుపు నివారణ మందును ఎలా ఉంటుందో రుచి చూద్దామనుకున్నాడు. దీంతో కొద్దిగా తాగి, వెంటనే బయటకు ఊసేశాడు. కానీ ఈ విషయం ఇంట్లో చెప్పలేదు. ఈనేపథ్యంలో ఈ నెల 12న అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అతడిని రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శివ మంగళవారం మృతి చెందాడు. డీజిల్ ట్యాంకర్ నుంచి మంటలు తాళ్లరేవు: జాతీయ రహదారిపై తాళ్లరేవు వద్ద డీజిల్ ట్యాంకర్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి వాటిని అదుపు చేశారు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం నుంచి యానాం వెళుతున్న డిజిల్ ట్యాంకర్ తాళ్లరేవుకు వద్దకు వచ్చేసరికీ టైర్ పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు రేగా యి. గమనించిన డ్రైవర్ ప్రాణభయంతో పరుగులు తీశాడు. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. కోరంగి ఎస్సై పి.సత్యనారాయణ అక్కడకు చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన వీర వేంకట సత్యనారాయణస్వామివారి దేవస్థానంలోని స్వర్ణ ధ్వజస్తంభానికి మరిన్ని హంగులు సమకూరనున్నాయి. నెల్లూరుకు చెందిన భక్తుడి విరాళం సుమారు రూ.మూడు కోట్లతో ఈ నెల తొమ్మిదో తేదీన స్వామివారి సన్నిధిలో స్వర్ణ ధ్వజస్తంభాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ధ్వజస్తంభం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. దీని ఏర్పాటు కోసం స్వామివారి ఆలయం ఎదురుగా గల శ్లాబ్కు గుండ్రంగా రంధ్రం చేశారు. ధ్వజస్తంభం ఆ రంధ్రంలోంచి ఆలయ శిఖరానికి సమాన ఎత్తు వరకూ వచ్చింది. దాని చివరలో సుదర్శన చక్రం, మేఖలాలు ఏర్పాటు చేశారు. అయితే వర్షం వస్తే ఆ ధ్వజస్తంభం రంధ్రంలోంచి వర్షం చినుకులు దిగువకు పడే అవకాశం ఉంది. దీంతో దాన్ని చెక్కలతో తాత్కాలికంగా మూసివేశారు. ఇప్పుడు ధ్వజస్తంభం నుంచి పైకి చూస్తే శ్లాబ్ రంధ్రానికి వేసిన చెక్కులు తప్పు మరేమీ కనిపించవు. ఈ నేపథ్యంలో ఆ చెక్కలకు బదులు గ్లాస్తో తయారు చేసిన డోమ్ లాంటిది ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల దిగువ నుంచి చూస్తే గ్లాస్ డోమ్లోంచి ధ్వజస్తంభం చివరి వరకూ కనిపించే అవకాశం ఉంటుంది. వైదిక కార్యక్రమాలకు అవసరమైనపుడు ధ్వజస్తంభం మీద గ్లాస్ డోమ్ తొలగించేలా ఏర్పాటు చేయనున్నట్లు దేవస్థానం డీఈఈ ఉదయ్ తెలిపారు. అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య కరప: అప్పుల బాధ తట్టుకోలేక విష గుళికలు తిని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరప గ్రామానికి చెందిన వజ్రపు సత్యనారాయణ వెల్డింగ్ పనిచేసుకుంటూ భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. ఆరు నెలల క్రితం వెల్డింగ్ షాపు తీసుకుని సొంతంగా వ్యాపారం ప్రారంభించాడు. పనులు అంతగా లేక, వ్యాపారం సాగక షాపు నిర్వహణకు అప్పులు చేశాడు. వాటిని తీర్చే దారిలేక తాగుడుకు అలవాటు పడ్డాడు. ఈ నేపథ్యంలో అప్పుల బాధ తట్టుకోలేక మంగళవారం ఉదయం వెల్డింగ్ షాపు వద్ద విష గుళికలు తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు వాంతులు చేసుకోవడాన్ని గమనించిన ఒక బాలుడు ఇంటికి వెళ్లి విషయం చెప్పాడు. అతడి భార్య దేవి వెంటనే షాపు వద్దకు వచ్చి భర్తను వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడి చికిత్స పొందుతూ సత్యనారాయణ మృతి చెందాడు. దేవి ఫిర్యాదు మేరకు కరప ఇన్చార్జి ఎస్సై పి.శోభన్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. కొనసాగుతున్న శిక్షణ సామర్లకోట: స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో 11 జిల్లాలకు చెందిన అధికారులకు సుస్థిరాభివృద్ది లక్ష్యాలపై ఇస్తున్న శిక్షణ మంగళవారం కూడా కొనసాగింది. దీనిలో భాగంగా మహిళా స్నేహ పూర్వక గ్రామం అనే అంశంపై తరగతులు జరుగుతున్నాయి. ప్యాకల్టీలు ప్రసాద్, నిహారిక, పద్మజ మాట్లాడుతూ మహిళా సంఘాల ఆర్థిక కార్యక్రమాలల్లో మహిళల భాగస్వామ్యంపై అవగాహన పెంచాలన్నారు. బాల్య వివాహాలకు అడ్టుకట్ట వేయాలని, శారీరక ఆరోగ్యం, మానసిక స్థితిపై శ్రద్ధ చూపాలని సూచించారు. కార్యక్రమంలో ఫ్యాకల్టీలు బి.వెంకటేశ్వర్లు, చక్రఫణిరావు, బి.ఆంజనేయులు పాల్గొన్నారు. -
రేషన్ బియ్యం పట్టివేత
పిఠాపురం: మండలంలోని బి.ప్రత్తిపాడు గ్రామంలో మంగళవారం పీడీఎస్ బియ్యం (రేషన్ బియ్యం) పట్టుకున్నట్లు రీజనల్ విజిలెన్స్ ఎస్పీ కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డి తెలిపారు. పక్కా సమాచారం మేరకు గ్రామంలో తనిఖీలు నిర్వహించగా ఒక వాహనంలో 58 బస్తాల్లో ఉంచిన 3,150 కేజీల బియ్యాన్ని గుర్తించామన్నారు. దీనిని అక్రమంగా తరలిస్తున్న ఆకుల గంగరాజుపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. సీజ్ చేసిన బియ్యం, వాహనం విలువ రూ.8,93,325 ఉంటుందన్నారు. తనిఖీలో విజిలెన్స్ ఎస్పై టి.జగనాథరెడ్డి, పిఠాపురం సీఎస్డీటీ వీరాస్వామి, కానిస్టేబుళ్లు లోవరాజు, శివ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. 16 నుంచి వెదురుపాక పీఠం వార్షికోత్సవాలు రాయవరం: మండలంలోని వెదురుపాక విజయదుర్గాపీఠం 52వ వార్షికోత్సవాన్ని ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకూ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు మంగళవారం పీఠంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వాడ్రేవు వెంకట సు బ్రహ్మణ్యం (గాడ్) 1972లో ఈ పీఠం ఏర్పాటు చేసినప్పటికీ నుంచి ఏటా వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 16వ తేదీ ఉదయం 9.18 గంటలకు జ్యోతిప్రజ్వలనతో వార్షికోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా విజయదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజ లు, నవగ్రహ మండపారాధన నిర్వహిస్తారు. కొల్హాపూర్ వేదపండితులతో శ్రీమహాలక్ష్మి అమ్మవారికి తిరుమంజనం అర్చన, హోమం, సాయంత్రం 6.30 గంటలకు తమిళనాడు తిరుత్తణి ఆలయ అర్చకులతో సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి కల్యాణం జరుగుతాయి. 17వ తేదీ ఉదయం అహోబిలం వేద పండితులతో లక్ష్మీనరసింహస్వామికి తిరుమంజనం, అర్చన అనంతరం హోమం, సాయంత్రం పీఠంలోని అనంతలక్ష్మి సమేత వీర వేంకట సత్యనారాయణస్వామి కల్యాణం నిర్వహిస్తారు. 18న సీతారామ పట్టాభిషేకం, సాయంత్రం వైఖానస పండితులతో శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కళ్యాణం జరుగుతుంది. విలేకరుల సమావేశంలో విజయదుర్గా సేవా సమితి ప్రతినిధులు భాస్కర నారాయణ, జి. సత్య వెంకట కామేశ్వరి, పి.సత్య కనకదుర్గ, బి. రమ, పీఠం పీఆర్వో వి.వేణుగోపాల్పాల్గొన్నారు. -
అనుమానంతో భార్యను చంపేశాడు
● పురుషోత్తపట్నంలో దారుణం ● కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు సీతానగరం/రాజానగరం: తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి అనుమానంతో తన భార్యను కిరాతకంగా కత్తితో నరికి హత్య చేశాడు. సీతానగరం మండలం పురుషోత్తపట్నంలో మంగళవారం ఈ దారుణం జరిగింది. వివరాల్లోకి వెళితే.. దేవీపట్నం మండలం దండంగికి చెందిన చాట్ల జాన్తో నేలకోటకు చెందిన దివ్యభారతి (30)కి 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి రమ్మిత్రీ 8వ తరగతి, కుమారులైన చెర్రి, పోసి ఆరు, ఐదు తరగతులు చదువుతున్నారు. జాన్, దివ్యభారతితో పాటు వారి తల్లిదండ్రులు కూడా సొంతూళ్లను వదిలి సీతానగరం మండలం పురుషోత్తపట్నానికి వచ్చేశారు. భార్యపై అనుమానం తాగుడుకు బానిసైన జాన్ తన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ ఆమెను వేధింపులకు గురిచేసేవాడు. జాన్ తాగుడుకు బానిస కావడంతో కుటుంబ బాధ్యతను దివ్యభారతి తీసుకుంది. పురుషోత్తపట్నంలో ఒక కూల్ డ్రింక్ షాపు అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తోంది. భర్త వేధింపులను భరించలేక, అతడి తీరులో మార్పురాకపోవడంతో విడిపోవాలనే నిర్ణయానికి వచ్చి వేరుగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనాలుగు రోజుల క్రితం వృద్ధురాలైన తన తల్లి సునీతకు ఆరోగ్యం బాగోక రాజమహేంద్రవరం ఆస్పత్రిలో ఉన్న ఆమెకు ఆసరాగా ఉండేందుకు వెళ్లింది. అక్కడి రెండు రోజుల క్రితమే ఇంటికి తిరిగొచ్చింది. కత్తితో నరికి.. దివ్యభారతి మంగళవారం తెల్లవారుజామున 4.45 గంటలకు బహిర్భూమికి వెళ్లిన సమయంలో జాన్ కత్తితో దాడి చేశాడు. ఆమె ఎంత బతిమలాడినా వినకుండా విచక్షణారహితంగా నరికేశాడు. చేతులు, మెడ, నడుము తెగిపోవడంతో దివ్యభారతి అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం జాన్ సిగరెట్టు కాల్చుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మృతురాలి తండ్రి సరిపల్లి చిట్టియ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ అడపా నాగమురళి తెలిపారు. ఘటనా స్థలాన్ని సీఐతో పాటు ఇన్చార్జి ఎస్సై ఆనంద్ కుమార్, సిబ్బంది పరిశీలించారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
దెందులూరు: ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లికి చెందిన దొమ్మేటి నాగార్జున (35), యాగంటి సుబ్రహ్మణ్యం (50), దొమ్మేటి మనోజ్ (21) అన్నదమ్ముల పిల్లలు. వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. ఇదిలా ఉండగా, విజయవాడలో ఆస్పత్రికి వెళ్లిన వీరు మంగళవారం తిరిగి దేవరపల్లికి కారులో బయలుదేరారు. సత్యనారాయణపురం వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న ఓ లారీని వీరి కారు అతివేగంగా వస్తూ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దొమ్మేటి నాగార్జున, యాగంటి సుబ్రహ్మణ్యం ఘటనా స్థలంలోనే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలై అపస్మారక స్థితిలో ఉన్న దొమ్మేటి మనోజ్ను హైవే పోలీసులు అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కారు నంబర్ ఆధారంగా మృతుల వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు ఎస్ఐ కే.స్వామి సమాచారం అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
నేటి నుంచి వాడపల్లిలో పవిత్రోత్సవాలు
● మూడు రోజుల పాటు నిర్వహణ ● ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులుఆత్రేయపురం: కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు బుధవారం ఉదయం నుంచి ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవదాయ ధర్మదాయశాఖ డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈఓ భూపతిరాజు కిషోర్కుమార్ తెలిపారు. పవిత్రోత్సవాల సందర్భంగా మూడు రోజులు పాటు ఆలయంలో అష్టోత్తర పూజలు, కల్యాణాలు, ఉపనయనాలు, వివాహాలను రద్దు చేశామన్నారు. పవిత్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతున్నారు. వివిధ రకాల పుష్పాలు, పువ్వులతో ముస్తాబు చేస్తున్నారు. కార్యక్రమాల వివరాలు పవిత్రోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 8 గంటలకు విష్వక్ష్సేన పూజ, పుణ్యహవచనం, సాయంత్రం 5 గంటలకు సంకల్పం, అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, గురువారం ఉదయం 8 గంటలకు సంకల్పం, విష్వక్ష్సేన పూజ, పుణ్యహవచనం, సాయంత్రం 5 గంటలకు పవిత్రారోహణం, విశేష అర్చన, పవిత్ర ప్రతిష్ట ప్రధాన హోమాలు, 16వ తేదీ ఉదయం 8 గంటలకు సంకల్పం, మహా శాంతిహోమం, ప్రాయశ్చిత్ర హోమం, మహాపూర్ణహుతి, పవిత్ర విసర్జన, మహదాశీర్వచనం నిర్వహించనున్నారు. -
వరి వడిగా..
పిఠాపురం: వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. జోరుగా వరినాట్లు జరుగుతున్నాయి. పొలాల్లో పనులు చేస్తున్న కూలీలలో పల్లెలు కళకళలాడుతున్నాయి. ముఖ్యంగా గొల్లప్రోలు మండలంలో ఉత్సాహంగా సాగు పనులు జరుగుతున్నాయి. ఒకే ప్రాంతంలోని మెట్ట భూముల్లో వాణిజ్య పంటలను, మాగాణీ భూములతో వరిని పండిస్తున్నారు. ఈ పనుల్లో వ్యవసాయ కూలీలు బిజీగా మారారు. కాగా.. ఇటీవల కురిసిన అధిక వర్షాలతో నాట్లు దశలోనే ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే వరినాట్లు 90 శాతం పూర్తవ్వగా, వాణిజ్య పంటల సాగు చివరి దశకు చేరుకుంది. వర్షాల వల్ల నీట మునిగిన పంటలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. దెబ్బతిన్న పంటలను కాపాడుకునే పనిలో రైతులు ఉన్నారు. మరో పక్క ఇంకా నాట్లు పడని ప్రాంతాల్లో నాట్లు వేసే పనులు ఊపందుకున్నాయి. -
శిక్షణతో ఉపాధి అవకాశాలు మెరుగు
రాజానగరం: పొందిన శిక్షణను ఆచరణలో పెట్టి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకోవాలని, వ్యవసాయాన్ని వ్యాపార సరళిలో చేపట్టి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని రాజమహేంద్రవరం సీటీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ మాగంటి శేషుమాధవ్ అన్నారు. నర్సరీ యాజమాన్యం – ఉద్యాన పంటలలో అంట్లు కట్టే పద్ధతులపై కలవచర్లలోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో వారం రోజుల పాటు జరిగిన శిక్షణ మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి డాక్టర్ శేషుమాధవ్ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ కేవీకే ద్వారా రైతులు, రైతు మహిళలు, యువతకు అనేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కేవీకే ప్రధానాధికారి డాక్టర్ వీఎస్జీఆర్ నాయుడు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కూడా ఉద్యాన పంటల విభాగంతో పాటు వెటర్నరీ, ఫిషరీస్, గృహ విజ్ఞానం, సస్యరక్షణ మున్నగు అంశాలపై జిల్లా ఆత్మ ప్రాజెక్టు సహకారంతో శిక్షణ కొనసాగిస్తామన్నారు. జిల్లా ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ వై.జ్యోతిర్మయి మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని సులువుగా అవగాహన చేసుకునే విధానాలను శిక్షణలో వివరించడం హర్షణీయమన్నారు. ఉమ్మడి జిల్లాలోని గొల్లప్రోలు, బిక్కవోలు, రాజానగరం, కడియం మండలాలకు చెందిన 15 శిక్షణకు హాజరుకాగా, వారికి సీటీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ శేషుమాధవ్ ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కేవీకే ఉద్యాన పంటల అధికారి జేవీఆర్ సత్యవాణి కోర్సు కో ఆర్డినేటర్గా వ్యవహరించారు. కార్యక్రమంలో గ్రామీణ ఫౌండేషన్ ప్రాజెక్టు డైరెక్టర్ సత్రుపా, కామానంద్ మిశ్రా, శాంతి వర్థన్ మినిస్ట్రీస్ డైరెక్టర్ వీరబాబు, రఘువీర్, సుచరిత పాల్గొన్నారు. -
జీజీహెచ్ ఉద్యోగికి షోకాజ్ నోటీసు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): అట్రాసిటీ కేసు పెడతానంటూ ఉన్నతాధికారులు, సహోద్యోగులను భయబ్రాంతులకు గురిచేస్తున్న ఓ ఉద్యోగికి రాజమహేంద్రవరం జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీసూర్యప్రభ మంగళవారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. దారా గౌతమ్ రాంజీ అనే వ్యక్తి రాజమహేంద్రవరం జీజీహెచ్లో జనరల్ డ్యూటీ అటెండర్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అట్రాసిటీ కేసు పెడతానంటూ బెదిరిస్తున్నాడని కొద్దిరోజుల క్రితం అతడి వ్యవహారశైలిపై 38 మంది ఎంఎన్వోలు, జీడీఏలు విచారణాధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో సూపరింటెండెంట్ జోక్యం చేసుకుని సహోద్యోగులతో వ్యవహరించే తీరును మార్చుకొని రోగుల సంరక్షణ కోసం నిబద్ధతతో పనిచేయాలని, ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని రాంజీని మందలించారు. రాంజీ తీరులో మార్పు రాకపోగా ఫిర్యాదుదారులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు. అంతేకాకుండా అట్రాసిటీ కేసు పేరుతో బెదిరింపులకు గురిచేస్తున్నాడనే ఫిర్యాదుతో సూపరింటెండెంట్ మంగళవారం రాంజీకి షోకాజ్ నోటీసు జారీ చేశారు. -
జల తాండవం
● జలాశయంలో గరిష్ట స్థాయికి నీటి నిల్వలు ● రోజుకు 300 క్యూసెక్కుల ఇన్ఫ్లో కోటనందూరు: తాండవ జలాశయంలో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతూ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 380 అడుగులు కాగా సోమవారం సాయంత్రానికి 375.5 అడుగులకు చేరింది. క్యాచ్మెంట్ ఏరియా నుంచి రోజూ 300 క్యూసెక్కుల వరకూ ఇన్ఫ్లో వస్తుండడంతో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయని డీఈఈ అనురాధ తెలిపారు. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా నీటి నిల్వలు 378 అడుగులకు చేరిన తరువాత అదనపు జలాలను స్పిల్వే ద్వారా సముద్రానికి విడిచిపెడతామని వివరించారు. సముద్రానికి నీటిని విడిచిపెట్టాల్సి వస్తే రెవెన్యూ, పోలీసు శాఖలతో పాటు ఆయకట్టు రైతులకు సమాచారం ఇస్తామని తెలిపారు. 19న నీటి విడుదల తాండవ జలాశయం నుంచి ఆయకట్టుకు ఈ నెల 19న ఉదయం 8 గంటలకు నీటిని విడుదల చేయుటకు నిర్ణయం తీసుకున్నామని ప్రాజెక్టు డీఈఈ పి.అనురాధ తెలిపారు. ఆ రోజు గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా నీటిని విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం ఇంజినీరింగ్ విభాగం ముమ్మరంగా కాలువలపై పర్యటించి కాలువల స్థితిగతులను పరిశీలిస్తున్నామన్నారు. సాగునీరు వృథా పోకుండా శిథిలమైన కాలువ గట్ల మరమ్మతులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. రైతులంతా సమన్వయంతో సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. -
రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ కార్యవర్గంలో జిల్లాకు స్థానం
అమలాపురం టౌన్: రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్లో జిల్లాకు రెండు పదవులు దక్కాయి. రాష్ట్ర అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు యెనుముల కృష్ణ పద్మరాజు, రాష్ట్ర అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా జిల్లా అసోసియేషన్ కోశాధికారి దొమ్మేటి వెంకటరమణ ఎన్నికయ్యారు. వీరిద్దరూ అమలాపురానికి చెందిన వారే. దీనిపై అమలాపురంలో సోమవారం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి వంటెద్దు వెంకన్నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. విశాఖపట్నంలో ఆదివారం జరిగిన రాష్ట్ర అసోసియేషన్ ఎన్నికల్లో జిల్లాకు ప్రాధాన్యం ఇస్తూ కృష్ణ పద్మరాజు, వెంకటరమణలకు అవకాశం లభించారన్నారు. వీరి ఎన్నిక పట్ల జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కంకిపాటి వెంకటేశ్వరరావు, అసోసియేషన్ ప్రతినిధులు నగభేరి కృష్ణమూర్తి, గారపాటి చంద్రశేఖర్, కత్తుల శ్రీనివాసరావు, మట్టపర్తి సముద్రం తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఎస్పీ కార్యాలయానికి 25 అర్జీలు అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 25 అర్జీలు వచ్చాయి. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు ఫిర్యాదులను స్వీకరించారు. రాయవరం మండలం పసలపూడికి చెందిన కొవ్వూరి లక్ష్మి తన తండ్రి కృష్ణ మృతికి కారణమైన బాధ్యులను శిక్షించాలంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అలాగే కొందరు ఫిర్యాదుదారులు కుటుంబ సమేతంగా వచ్చి తమ కుటుంబ తగాదాలను ఎస్పీకి చెప్పుకుని న్యాయం చేయాలని కోరారు. కొన్ని ఫిర్యాదులను ఎస్పీ అక్కడిక్కడే పరిష్కరించారు. అయితే మిగిలిన అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆయా ప్రాంతాల డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలను ఆదేశించారు. జిల్లా ఎస్పీ కార్యాలయ ప్రజా సమస్యల పరిష్కార వేదిక పర్యవేక్షణ ఎస్సై డి.శశాంక పాల్గొన్నారు. తైక్వాండోలో క్రీడాకారుల ప్రతిభ అంబాజీపేట: స్థానిక శ్రీనివాస తైక్వాండో క్లబ్ విద్యార్థినులు పలు విభాగాల్లో మూడు గోల్డ్ మెడల్స్, సిల్వర్, రెండు బ్రాంజ్ మెడల్స్ సాధించినట్లు కోచ్ పితాని త్రిమూర్తులు తెలిపారు. సోమవారం అంబాజీపేట జెడ్పీ హైస్కూల్లో విజేతలను అభినందించారు. ఈ నెల 11న కాకినాడ జిల్లా స్టేడియంలో 30వ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్స్, సీనియర్స్ తైక్వాండో చాంపియన్ షిప్ పోటీలు జరిగాయని త్రిమూర్తులు తెలిపారు. సీనియర్ విభాగంలో పితాని భార్గవి శ్రీకళ, కె.లక్ష్మీప్రసన్న గోల్డ్ మెడల్స్, కె.వినూత్న సిల్వర్ మెడల్, డి.రాఘవేంద్ర బ్రాంజ్ మెడల్ సాధించారన్నారు. జూనియర్ విభాగంలో ఎ.ఆదిత్య గోల్డ్, ఏబీ చైతన్య బ్రాంజ్ మెడల్ కై వసం చేసుకున్నారన్నారు. క్రీడాకారులను ఎస్సై కె.చిరంజీవి, హెచ్ఎం కె.సాయిరామ్, ఎస్ఎంసీ చైర్మన్ పితాని త్రిమూర్తులు, పీడీ కె.ఆదిలక్ష్మి, పీఈటీ అందె సూర్యకుమారి అభినందించారు. వరలక్ష్మీ కానుక విజయవంతంగోకవరం: హిందూ ధర్మ పరిరక్షణకు చేపట్టిన బంగారు వరలక్ష్మీ కానుక విజయవంతం అయ్యిందని విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన వ్యవస్థాపక అధ్యక్షుడు కంబాల శ్రీనివాస్రావు వెల్లడించారు. గోకవరం సూర్యఫంక్షన్ హాలులో సోమవారం బంగారు వరలక్ష్మీ కానుక కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని మహిళలకు లక్కీడ్రా నిర్వహించి 133 మందికి బంగారు రూపులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో 17 వేల మంది పేర్లు నమోదు చేశామన్నారు. వీరిలో లక్కీ డ్రా ద్వారా 440 మందికి గ్రాము బంగారు రూపుని అందించామన్నారు. -
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు
అధికారులతో కలెక్టర్ మహేష్ కుమార్ అమలాపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదని అధికారులకు కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ సూచించారు. సోమవారం అమలాపురంలోని కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సుమారు 181 అర్జీలు ఇవ్వగా, వాటిని కలెక్టర్తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఫిర్యాదులను నిశితంగా పరిశీలించి గడువులోగా పరిష్కరించాలని సూచించారు. జిల్లా కేంద్రం వరకూ అర్జీదారులు రావాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే అధికారులు అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు. డీఆర్డీఏ పీడీ వి.శివశంకర్ ప్రసాద్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ ఎస్.మధుసూదన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎం.దుర్గారావు దొర పాల్గొన్నారు. అనంతరం 21న రావులపాలెం శ్రీసత్యసాయి విద్యా సంస్థల్లో వికాస ఆధ్వర్యంలో 25 కంపెనీల ప్రతినిధులతో నిర్వహించనున్న జాబ్ మేళా వాల్ పోస్టర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. 200 గ్రామాల్లో ప్రచార సదస్సులు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు నీకు తెలుసా అనే ఇంటెన్సివ్ ఫైడ్ ప్రచార అవగాహన సదస్సులను జిల్లాలోని 200 గ్రామాల్లో నిర్వహించడానికి కార్యాచరణ సిద్ధం చేసినట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. హెచ్ఐవీ ఎయిడ్స్పై సమాజంలో ఉన్న అపోహలను తొలగించేందుకు సదస్సులు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు ఏఆర్టీ మందులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందిస్తున్నారన్నారు. దీనిపట్ల సమగ్ర సమాచారాన్ని తెలుసుకునేందుకు నేషనల్ టోల్ ఫ్రీ హెల్ప్లైన్ 1097 ఏర్పాటు చేశారని అన్నారు. డీసీహెచ్ ఎస్.కార్తీక్రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎం.దుర్గారావు దొర, జిల్లా కుష్ఠు, ఎయిడ్స్, టీబీ నియంత్రణ అధికారి సీహెచ్ వి.భరతలక్ష్మి, హెచ్ఐవీ ఎయిడ్స్ నియంత్రణ సూపర్వైజర్ బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు. పారిశుధ్యంపై దృష్టి సారించండి గ్రామాల్లో పారిశుధ్య పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆయన ఎంపీడీఓలు, గ్రామ పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పారిశుధ్య నిర్వహణ, 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల నిర్వహణ అంశాలపై దిశానిర్దేశం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పారిశుధ్య సమస్య తలెత్తకుండా, వ్యాధులు ప్రబలకుండా సమగ్ర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, ఆర్డీఓలు జి.కేశవవర్ధన్రెడ్డి, ఎస్.సుధాసాగర్ పాల్గొన్నారు. -
మాజీ సీఎం జగన్ చిత్రం తొలగింపు
కరప: పాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ 2019లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వార్డు, గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇందులో భాగంగా ఆ ఏడాది అక్టోబర్ నెల 2 గాంధీ జయంతి రోజున రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ వ్యవస్థను కరప నుంచి ఆయన లాంఛనంగా ప్రారంభించి, పైలాన్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కరప గ్రామసచివాలయం–1 వద్ద ఏర్పాటు చేసిన పైలాన్కు నీలం, తెలపు, ఆకుపచ్చ రంగులు వేసి, పైభాగంలో నాలుగుపక్కలా నవరత్నాల చక్రం లోగోలో జగన్ ముఖచిత్రం ఉండేలా విద్యుద్దీపాలతో గ్రామసర్పంచ్ సాదే ఆశాజ్యోతి ఏర్పాటు చేశారు. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున పోటీచేసిన పంతం నానాజీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి ఆ పార్టీ మండల నాయకులు పైలాన్ను తొలగించాలని చూడగా గ్రామ కార్యదర్శి ఎస్కే నాగేంద్రకుమార్ జీఓ లేకుండా పైలాన్ తొలగించడానికి వీలులేదని చెప్పారు. తర్వాత నాగేంద్రకుమార్కు గ్రేడ్–1 కార్యదర్శిగా పదోన్నతి రాగా, బదిలీపై వెళ్లారు. తర్వాత మళ్లీ జేఎస్పీ నాయకులు పైలాన్పై ఉండే జగన్ చిత్రాన్ని తొలగించాలని పట్టుబట్టి తొలగించారు. పైలాన్ పైభాగంలో నాలుగుసింహాల బొమ్మను ఏర్పాటు చేసేందుకు పనులు చేపట్టారు. వైఎస్సార్ సీపీ జెండా రంగులు తొలగించి టీడీపీ, జనసేన రంగులు వేస్తే ఊరుకోబోమని, జాతీయజెండా రంగులు వేస్తే అభ్యంతరం లేదని, మాజీ ముఖ్యమంత్రి జగన్ పేరుతో ఉన్న శిలాఫలకం తొలగించినా అంగీకరించమని సర్పంచ్ ఆశాజ్యోతి తెలిపారు. పనులు పూర్తయ్యాక, రంగులు ఏమి వేస్తారో వేచి చూస్తామని వైఎస్సార్ సీపీ నాయకులు తెలిపారు. సచివాలయ వ్యవస్థ పైలాన్పై లోగో కూడా మాయం జనసేన నాయకుల నిర్వాకం -
చురుగ్గా సత్యగిరికి మెట్ల నిర్మాణం
రూ.10.50 లక్షలతో చేపట్టిన దేవస్థానంఅన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సత్యగిరి పై గల హరిహరసదన్, శివసదన్ సత్రాలలో బస చేసే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకు దేవస్థానం అధికారులు మెట్లదారి నిర్మాణం చేపట్టారు. సత్యగిరి దిగువన గల విద్యుత్ సబ్స్టేషన్ పక్క నుంచి సత్యగిరి ఘాట్రోడ్డు మూడో మలుపు వరకు రూ.10.50 లక్షల వ్యయంతో చేపట్టిన మెట్ల దారి నిర్మాణం ముగింపు దశకు చేరుకుంది. సత్యగిరిపై వంద గదుల హరిహరసదన్ సత్రం, 135 గదుల శివసదన్ సత్రం, రెండు ఉచిత కల్యాణ మంటపాలు, విష్ణుసదన్లోని 46 మ్యారేజ్ హాల్స్ ఉన్నాయి. సత్రాలలోని గదులలో భక్తులు బస చేస్తారు. బస చేసే భక్తులలో సొంత వాహనాలు లేనివారే అధికంగా ఉంటారు. స్వామివారి ఆలయానికి రావాలన్నా, మళ్లీ తిరిగి వెళ్లాలన్నా ఘాట్రోడ్ ద్వారా నడిచి లేదా వాహనాలలో వెళ్లాల్సి వచ్చేది. దేవస్థానం సత్యగిరి– రత్నగిరి మధ్య ఉచిత బస్సు నడుపుతున్నా అది అన్ని వేళలా అందుబాటులో ఉండదు. దాంతో ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఆటోలకు ఎక్కువ మొత్తంలో ఛార్జి చేస్తుండడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. మెట్ల దారి వల్ల ఎంతో మేలు సత్యగిరికి నిర్మిస్తున్న మెట్లదారి వలన భక్తులకు కొంతమేర ఇబ్బంది తొలగనుంది. సత్యగిరి ఘాట్రోడ్ ప్రారంభంలో గల విద్యుత్ సబ్స్టేషన్ నుంచి ఘాట్రోడ్ మొదటి మలుపు వరకు గల వంద మెట్లు, అక్కడ నుంచి రెండో మలుపు వరకు మరో 30 మెట్ల నిర్మాణం చేపట్టి దాదాపుగా పూర్తి చేశారు. ఈ మెట్ల నుంచి హరిహరసదన్, శివసదన్ సత్రాలు వంద మీటర్లు దూరం మాత్రమే ఉంటాయి. దీంతో ఆ సత్రాలలో బస చేసే భక్తులు ఆటోలు, బస్లు అందుబాటులో లేకపోయినా సులభంగా చేరుకోవచ్చు. ఈ మెట్లకు ప్రస్తుతం ప్లాస్టింగ్లు జరుగుతున్నాయని మరో వారం రోజుల్లో అవు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. -
కాలేజీ నిర్మాణం
ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వెళ్లాం మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు నిలిచిపోయిన విషయాన్ని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు దృష్టికి తీసుకు వెళ్లాం. ఆయన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రితో మాట్లాడతానని చెప్పారు. నిర్మాణ పనులు నిలిచిపోవడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. – పందిరి శ్రీహరి, జెడ్పీటీసీ సభ్యుడు, అమలాపురం ● జిల్లాలో వైద్య కళాశాల పనులకు గ్రహణం ● గత ప్రభుత్వంలో రూ.500 కోట్లు మంజూరు ● కొత్త ప్రభుత్వం రాకతో ఆగిన అభివృద్ధి ● గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసిన స్థానికులు సాక్షి, అమలాపురం: కోనసీమ వాసుల చిరకాల స్వప్నం తీరే దారి కనబడడం లేదు.. అమలాపురం సమీపంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం ఇంచు కూడా కదలడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మూడో దశలో ప్రారంభమైన ఈ కాలేజీల నిర్మాణాలకు నిధుల కొరత ఉండడంతో నిలిపివేయాలని సీఎం చంద్రబాబు సూచించడంతో పనులకు బ్రేక్ పడ్డాయని స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు చెబుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వారంతా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్కు సోమవారం మొరపెట్టుకున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ మంజూరు చేసింది. ఇందుకు రూ.500 కోట్లు కేటాయించింది. అమలాపురం రూరల్ సమనస, చిందాడగరువు పరిధిలో దీని నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి, రెండో దశలో నిర్మాణ పనులు మొదలు పెట్టిన పలు మెడికల్ కాలేజీలు పూర్తి కావడం, అక్కడ తరగతులు ప్రారంభం కావడం తెలిసిందే. మూడో దశలో అమలాపురంలో మెడికల్ కాలేజీ నిర్మాణం మొదలు పెట్టారు. దీనికి అనుబంధంగా అమలాపురం ఏరియా ఆసుపత్రిని బోధనాసుపత్రిగా గుర్తించారు. ఇది ప్రస్తుతం 100 పడకల ఆసుపత్రి కాగా, దీనిని వెయ్యి పడకల ఆసుపత్రిగా విస్తరించాలని నిర్ణయించారు. తొలి దశలో 650 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడంతోపాటు రెండో దశలో 350 పడకలు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల అమలాపురం నడిబొడ్డున అన్ని వసతులతో కూడిన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అందుబాటులోకి వస్తోందని ప్రజలు ఆనందపడ్డారు. అప్పుడు వేగం.. ఇప్పుడు జాప్యం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా జరిగాయి. పలు నిర్మాణాలు చురుగ్గా సాగాయి. కొన్ని భవనాలకు రెండు, నాలుగు అంతస్తులు నిర్మించారు. అయితే ఎన్నికల నాటి నుంచి నెమ్మదించిన పనులు కొత్త ప్రభుత్వంలో దాదాపు నిలిచిపోయే పరిస్థితికి వచ్చాయి. నిధుల కొరతతో మూడో దశ ఆసుపత్రి నిర్మాణ పనులు నిలిపివేయాలని కూటమి ప్రభుత్వం నుంచి సూచనలు అందడంతో నిర్మాణ సంస్థ మేఘా ఇంజినీరింగ్ ఇక్కడ పనులు ఆపేసినట్లు తెలిసింది. ఇందులో భాగంగా పనుల్లో వినియోగించే కీలక సామగ్రి తరలిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. దీనిపై స్పందించేందుకు ఆ సంస్థ ప్రతినిధులు నిరాకరించారు. పనులు కొనసాగించండి మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు నిలిచిపోయాయని స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానికులు సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై వారు వినతిపత్రంతో పాటు మెడికల్ కాలేజీ నిర్మాణ పనులకు వినియోగించిన సామగ్రి తరలిపోతున్న ఫొటోలను సైతం జత చేశారు. మెడికల్ కళాశాలకు గత ప్రభుత్వం 47 ఎకరాల భూమి కొనుగోలు చేసి నిర్మాణ పనులు మొదలు పెట్టింది. ఇప్పటి వరకూ 40 శాతం పనులు జరిగాయని వివరించారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత మూడో దశలో మెడికల్ కళాశాలల పనులు నిలిపివేయాలని ఆదేశాలు వచ్చినట్లు గుత్తేదారు సంస్థ చెబుతోందని, నిర్మాణ సామగ్రితోపాటు ఐరన్, ఇసుక, సిమెంట్ను మెగా సంస్థ తరలించుకుపోతోందని చెప్పారు. కళాశాలను పూర్తి చేయాలని వారు కోరారు. అమలాపురం జెడ్పీటీసీ సభ్యుడు పందిరి శ్రీహరి రామ్గోపాల్, సర్పంచ్ పొనకల గణేష్, ఉప సర్పంచ్ రాజులపూడి భాస్కరరావు, మాజీ సర్పంచ్ జలదాని కాశీ విశ్వేశ్వరరావు, కరెళ్ల సూరిబాబు, వై.ఏసుబాబు, సీహెచ్వీ రావు పాల్గొన్నారు. ఆశలపై నీళ్లు గత ప్రభుత్వం మెడికల్ కాలేజీకి అనుమతి ఇవ్వడంతో పాటు 47 ఎకరాలు కొనుగోలు చేసి పనులు మొదలు పెట్టింది. ఈ పనులు వేగంగా జరగడం చూసి కొత్తగా ఏర్పడిన కోనసీమ జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ, బోధనాసుపత్రి లేని లోటు తీరుతోందని జిల్లా వాసులు సంబరపడ్డారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజమహేంద్రవరాల్లో మాత్రమే ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు (జీజీహెచ్)లు ఉన్నాయి. కోనసీమలో కిమ్స్ ప్రైవేట్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి ఉన్నా రోగుల అవసరాలు పూర్తిగా తీర్చడం లేదు. అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీల్లో ఏరియా ఆసుపత్రులు ఉన్నాయి. జనరల్ ఆసుపత్రి లేని లోటు పట్టిపీడిస్తోంది. రామచంద్రపురం, మండపేటలకు కాకినాడ, రాజమహేంద్రవరం కొంత దగ్గర. కానీ అమలాపురం, కొత్తపేట, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాలకు దూరం అవుతోంది. ఇక్కడ జీజీహెచ్ నిర్మించాలని స్థానికులు దశాబ్దాలుగా కోరుతున్నా ఫలితం లేకుండా పోయింది. రూ.కోట్ల విలువైన చమురు, సహజ వాయువులను కొల్లగొట్టుకుపోతున్న చమురు సంస్థలు సీఎస్ఆర్ నిధులతో మెడికల్ కాలేజీ, జీజీహెచ్ నిర్మించాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. నగరం గ్యాస్ లీకేజీ వంటి భారీ ప్రమాదాలలో తక్షణం మెరుగైన వైద్యం అందించలేకపోయారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మెడికల్ కాలేజీ మంజూరు చేయడంతో ఆ లోటు తీరుతోందని, మెరుగైన వైద్యం అందుబాటులోకి వస్తోందని ఆశించినా ఇప్పుడు పనులు ఆగిపోవడం బాధాకరం. ప్రభుత్వం స్పందించి నిర్మాణం పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
దిగొచ్చిన సర్కారు..
అనేక ప్రయోజనాలు ● వరి రైతులు, కౌలు రైతులంతా ఈ–క్రాప్లో నమోదు చేసుకుంటే అనేక లాభాలు ఉంటాయి. ● ఈ నమోదు ఆధారంగా ఆ సర్వే నంబరు భూమి వివరాలు సమగ్రంగా ఉంటాయి. ● వరి రైతులకు అవసరమైన సూచనలు, సలహాలను ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అందిస్తుంది. ● రాయితీపై విత్తనాలు, ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ రాయితీలను సమయాన్ని బట్టి ఇస్తారు. ● వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతింటే పెట్టుబడి రాయితీ పొందే వీలుంటుంది. ● ఈకేవైసీ ఆధారంగా వరి సాగు చేపట్టని అనర్హులను తొలగించి అర్హులకు ప్రయోజనం చేకూరుస్తారు. ఆచితూచి అడుగు వేయకుంటే ఇలానే ఉంటోంది.. సరైన ప్రణాళిక లేకుంటే అందరి నుంచీ చీదరింపు ఎదుర్కోవాల్సి వస్తుంది. అచ్చం అలానే కూటమి ప్రభుత్వ తీరు ఉంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ తీసుకొచ్చిన ఈ–క్రాప్ విధానాన్ని వెనక్కి నెట్టేయాలని జాప్యం చేసిన బాబు ప్రభుత్వం చివరికి దిగొచ్చింది.. గత విధానాన్నే అమలు చేసేందుకు చర్యలు తీసుకుంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం... ఆలమూరు: ఈ–క్రాప్ అనే చిన్న పదం రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది. వ్యవసాయ రంగంలో సరికొత్త ఒరవడిని తీసుకొచ్చింది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. వరి సాగుపై ధీమా కల్పించింది. సాగు పేరిట దోపిడీకి అడ్డుకట్ట వేసింది. ఇటువంటి బృహత్తర విధానాన్ని ప్రవేశపెట్టిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని వేనోళ్ల కీర్తించింది. శుష్క వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ విధానాన్ని నిర్వీర్యం చేయాలని భావించింది. ఈ విధానాన్ని జాప్యం చేస్తూ కుట్రలకు తెరలేపింది. ఈ–క్రాప్ విశిష్టతను గుర్తించిన రైతాంగం ముందు కూటమి నేతల పన్నాగం ఫలించలేదు. రైతుల హెచ్చరికలు, నిరసనలతో రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. రైతుల ఆగ్రహాన్ని గ్రహించిన వ్యవసాయ శాఖ ఆలస్యంగానైనా ఈ–క్రాప్ అమలు చేయాలని నిర్ణయించింది. ఆగస్టు నెలాఖరు లోగా పూర్తవ్వాల్సిన ఈ విధానాన్ని తాత్సారం చేయడంతో సెప్టెంబర్ నెలాఖరు వరకూ వెళ్లింది. గతంలో అండగా నిలిచి.. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల సౌలభ్యం కోసం వ్యవసాయ శాఖ నిపుణుల సూచనల మేరకు ఈ విధానాన్ని అమల్లోకి తీసుకు వచ్చారు. ఆరుగాలం శ్రమించి రైతు పండించిన ప్రతి గింజకూ గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ విధానం సరికొత్త ఒరవడిని సృష్టించింది. అప్పటి ప్రభుత్వం 2019 రబీ సీజన్లో ప్రారంభించి ఐదేళ్లు పాటు సమర్థవంతంగా అమలు చేసింది. రైతులకు అన్నివిధాలా సహాయం అందిస్తూ నిర్ణీత వ్యవధిలోపు పంటను కొనుగోలు చేసి ధాన్యం సొమ్ము బ్యాంక్ ఖాతాల్లో పడేలా చేసి అండగా నిలిచింది. కూటమి ప్రభుత్వం కుట్ర ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ పథకాలు అమలు చేయకూడదని కుట్రలకు తెరలేపింది. రైతులకు అత్యంత మేలు కలిగించే ఈ–క్రాప్ నమోదును తాము కూడా అమలు చేస్తే గత ప్రభుత్వానికే ప్రాధాన్యం దక్కుతుందనే అభిప్రాయంతో ఇప్పటి వరకూ జాప్యం చేసింది. ఇది అమలు చేసేది లేదంటూ తమ అనుకూల ప్రచార మాధ్యమాల ద్వారా పరోక్షంగా లీకులిచ్చి అటకెక్కించాలని నిర్ణయించింది. ఈ దురాలోచనలను గమనించిన రైతులు వ్యవసాయ శాఖపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ–క్రాప్ విధానం అమలు చేయకుంటే ఉద్యమించేందుకు సిద్ధమంటూ ప్రకటించారు. అవసరమైతే పంట విరామానికి సైతం వెనుకాడేది లేదని హెచ్చరించారు. రైతుల్లో రోజు రోజుకూ పెరుగుతున్న ఆగ్రహానికి భయాందోళన చెందిన ప్రభుత్వం చివరికి అమలుకు ఆదేశాలు ఇచ్చింది. వచ్చే నెల 15 వరకూ.. రాష్ట్ర ప్రభుత్వం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాదిరిగానే ఈ–క్రాప్ విధానం అమలుకు షెడ్యూల్ ప్రకటించటంతో రైతులకు ఊరట దక్కింది. ఈ నెల తొలి వారంతో ప్రారంభమైన ఈ విధానం వచ్చే నెల సెప్టెంబర్ 15 వరకూ కొనసాగుతుంది. జిల్లాలోని 22 మండలాల్లో 2.21 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, అందులో 1.63 లక్షల ఎకరాల్లో సుమారు 96 వేల మంది రైతులు వరి సాగు చేపట్టారు. ఈ– క్రాప్ నమోదులో గ్రామసభల ద్వారా అభ్యంతరాల స్వీకరణ వచ్చే నెల 19–24 మధ్యలో ఉంటుంది. అర్హుల తుది జాబితా వచ్చే నెల 30న విడుదల చేస్తారు. ఇది నమోదు చేయించుకుంటే లభించే ప్రయోజనాలను క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ సిబ్బంది వివరిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకతతో పాటు రైతు సేవా కేంద్రాల్లో సంబంధిత రైతు సాగు చేసిన వివరాలు అందుబాటులో ఉంటాయని చెబుతున్నారు. అయితే ఈ–క్రాప్ ప్రారంభించిన నాటి నుంచి సర్వర్లు మొరాయించడంతో నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. జిల్లా పరిధిలోని ఒక్కో గ్రామంలో రోజుకు సుమారు 50 ఎకరాల వరకూ నమోదు చేయాల్సి ఉండగా, కేవలం పది ఎకరాల్లోపు మాత్రమే జరుగుతోంది. రైతుల ఒత్తిడితో తగ్గిన కూటమి ప్రభుత్వం ఈ–క్రాప్ అమలు చేసేందుకు అనుకూలం గత ప్రభుత్వ విధానానికే ఓటు ఆలస్యంగానైనా నమోదుకు షెడ్యూల్ ఖరారు నమోదుపై అవగాహన పెరిగింది రైతు భరోసా కేంద్రాల్లో ఐదేళ్ల నుంచి ఈ–క్రాప్ నమోదు చేసుకుంటున్నాం. గతంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సత్వరమే పరిహారం అందించేందుకు ఇది దోహదపడింది. ఆర్బీకేల్లో అధికారుల సహాయ సహకారంతో సాగుకు ఢోకా లేకుండా ఉండేది. – బొబ్బా వెంకన్న, రైతు, పెదపళ్ల రైతులకు అండగా.. ఈ–క్రాప్ నమోదు ద్వారా వరి సాగు చేసే తమలాంటి కౌలు రైతులకు వ్యవసాయంపై భరోసా ఏర్పడింది. సాగు చేసిన పంట ఆధారంగా పండించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. గత ఐదేళ్లలో ఈ–క్రాప్ రైతులకు అండగా నిలిచింది. – ఇల్లూరి పట్టాభి, కౌలురైతు, పినపళ్ల ఈ–క్రాప్తో మేలు పంట ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర, రాయితీలను అందించేందుకు ప్రవేశపెట్టిన ఈ–క్రాప్తో అనేక ప్రయోజనాలు ఉ న్నాయి. వరి సాగు చేసే రైతులంతా సకాలంలో ఈ– క్రాప్ నమోదు చేయించుకోవాలి. ప్రభుత్వం నుంచి లభించే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి. రైతుల అభ్యర్థన మేరకు నమోదు గడువును పెంచాం. – ఓలేటి బోసుబాబు, జిల్లా వ్యవసాయాధికారి, అమలాపురం -
వర్మకు దొరాఘాతం
●● కూటమి నేతల మధ్య కోల్డ్ వార్ ● కూటమిలో చేరతానన్న దొరబాబు ● వర్మకు ప్రాధాన్యం తగ్గించే ఎత్తుగడ ● తొలి ఎమ్మెల్సీ అని చంద్రబాబు దగా సాక్షి ప్రతినిధి, కాకినాడ: పిఠాపురంలో కూటమి నేతల్లో వర్గపోరు ముదిరి పాకాన పడుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోనే వీరి ఆధిపత్య పోరు కొనసాగుతుండగా వారికి మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రూపంలో మరో తలపోటు వచ్చి పడింది. పిఠాపురం ఎమ్మెల్యే, జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కల్యాణ్ నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చి పోయే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుంచే పిఠాపురంపై పెత్తనం కోసం నేతలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమితో జత కట్టిన పవన్ కల్యాణ్ కోసం పిఠాపురం స్థానాన్ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ త్యాగం చేసి గెలుపు కోసం కష్టపడ్డారు. ఫలితంగా ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి ఎమ్మెల్సీగా వర్మకు అవకాశం కల్పిస్తామని బాబు మాట ఇచ్చారు. పవన్ కూ డా వర్మను ఆకాశాన్నికెత్తేసినంత పనిచేస్తూ వెంట తి ప్పుకున్నారు. ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటవడం.. పిఠాపురం నుంచి గెలిచిన పవన్ కల్యా ణ్ ఉప ముఖ్యమంత్రి కావడం చకచకా జరిగిపోయా యి. ఇంతలోనే మండలిలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ రానే వచ్చింది. తొలి ఎమ్మెల్సీ తనదేనని వర్మ గంపెడాశలు పెట్టుకుని తనకే ఆ ఇస్తారని అనుచరులు అందరికీ వర్మ చెప్పేసుకున్నారు. మాట ఇచ్చి మరచిపోవడంలో దిట్ట అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కోసం పిఠాపురం సీటు త్యాగం చేసిన వర్మకు జెల్ల కొట్టి ఆ సీటును రామచంద్రయ్యకు ఇచ్చేశారు. జనసేన నుంచి పిడుగు హరిప్రసాద్కు పవన్ సిఫార్సుతో లభించింది. మొదటి అవకాశంలోనే అందలం ఎక్కిస్తారనుకున్న వర్మ ఆశలపై నీళ్లు చల్లారు. వర్మకు ఎమ్మెల్సీ చాన్స్ రాకుండా తెర వెనుక జనసేన నేతలు బ్రేకులు వేశారనే చర్చ ఇరుపార్టీల నేతల మధ్య సాగింది. తార్కాణాలెన్నో.. ఎమ్మెల్సీ దక్కని అవమానం జీర్ణించుకోకుండానే పవన్ అలా వెళ్లగానే ఇలా వర్మ ప్రాధాన్యాన్ని తగ్గించేలా జనసేన నేతలు వ్యవహరిస్తుండటం మొదలు పెట్టారని ఆనోటా ఈనోటా అంటున్న మాట. ఇందుకు అనేక ఉదాహరణలను వర్మ అనుచరవర్గం ఎత్తి చూపుతోంది. పవన్ స్థానే సోదరుడు నాగబాబు నియోజకవర్గంలో అధికార, అనధికార వ్యవహారాలను తనే స్వయంగా చక్కబెడుతున్నారు. అంతే కాకుండా తాను లేదా, మర్రెడ్డి శ్రీనివాస్ సిఫార్సులకే ప్రాధాన్యం ఇవ్వాలని నాగబాబు ఇటీవల పలు సమీక్షల్లో స్పష్టం చేశారని గుర్తు చేస్తున్నారు. నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా, టీడీపీ ఇన్చార్జిగా ఉన్న వర్మకు కనీస ప్రాధాన్యం లేకుండా చేయడంతో ఆ వర్గం రగిలిపోతోంది. అలాగని బయటపడి వివాదాలకు పోకుండా అతని అనుచరులు సమయం కోసం కాసుకుని కూర్చున్నట్టుగా కనిపిస్తోంది. త్యాగానికి అడుగడుగునా అవమానం పవన్ కోసం త్యాగం చేసిన పాపానికి వర్మను అడుగడుగునా అవమానిస్తున్నారని ఆ వర్గం కారాలు మిరియాలు నూరుతోంది. ఏ క్షణానైన్నా వర్మ వర్గం రోడ్డెక్కే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూటమిలో చేరనున్నట్టు ఇటీవల ప్రకటించడం వర్మ వర్గీయుల్లో అగ్గి రాజేసింది. కూటమిలో చేరుతానన్న దొరబాబును తేదేపాలో చేర్చుకుంటే మాత్రం మూకుమ్మడిగా పార్టీని వీడి బయటకు పోవాలనే యోచనలో వర్మ వర్గం ఉందనే ప్రచారం సాగుతోంది. ఇటు జనసేన నేతలు కూడా దాదాపు ఇదే అభిప్రాయంతో ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటికే పిఠాపురంలో కూటమిలోని తేదేపా, జనసేన నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ తలపోట్లు సరిపోవన్నట్టు ఇప్పుడు దొరబాబు కూటమిలోకి వస్తే అతనికిచ్చే ప్రాధాన్యం ఏమిటనే ప్రశ్న కూటమి నేతలు ఆయా పార్టీల ముఖ్య నేతలకు సంధిస్తున్నారు. సీటు త్యాగంచేసిన మాజీ ఎమ్మెల్యే వర్మకు ప్రాధాన్యం లేకపోగా, ఇప్పుడు కొత్తగా దొరబాబును తీసుకువచ్చే ప్రయత్నాలపై వర్మ వర్గం అగ్గిమీద గుగ్గిలమవుతోంది. వర్మను పొమ్మనకుండా పొగడబెట్టే ఎత్తుగడతోనే దొరబాబును తీసుకువస్తున్నారనే ప్రచారం పిఠాపురంలో విస్తృతంగా జరుగుతోంది. ఎన్నికలు అయిపోయాక ఇప్పుడు దొరబాబును కూటమిలోకి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఇరుపార్టీల నేతలు ముఖ్య నేతలను ప్రశ్నిస్తున్నారు. -
నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
అమలాపురం రూరల్: స్థానిక కలెక్టరేట్ గోదావరి భవన్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక సోమవారం ఉదయం గంటల నుంచి యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువచ్చి తగు పరిష్కార మార్గాలు పొందాలన్నారు. భజే గణనాయకా.. అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వర స్వామివారి ఆలయం ఆదివారం భక్తులతో కిక్కిరిసింది. ఆలయ ప్రధానార్చకుడు అయినవిల్లి సూర్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో స్వామివారికి మేలుకొలుపు సేవ, పంచామృతాభిషేకాలు చేశారు. స్వామికి మహానివేదన అనంతరం వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. లఘున్యాస, ఏకాదశ రుద్రాభిషేకాల్లో 44 మంది, లక్ష్మీగణపతి హోమంలో 19 మంది, నూతన వాహన పూజ 40 మంది, చిన్నారులకు తులాభారం నిర్వహించారు. స్వామివారి అన్నదాన పథకంలో 1,425 మంది అన్నప్రసాదం స్వీకరించారు. ఆలయానికి వివిధ పూజలు, అన్నదాన విరాళాలుగా రూ.2,02,254 ఆదాయం లభించిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు. నేడు ధాన్యం బకాయిల విడుదల అమలాపురం రూరల్: జిల్లాకు సంబంధించి రబీ ధాన్యం రూ.154.63 కోట్ల బకాయిలను రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం విడుదల చేస్తారని కలెక్టర్ మహేష్కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో సాయంత్రం నాలుగు గంటలకు జరిగే ఈ సమావేశంలో మెగా చెక్కును మంత్రి విడుదల చేస్తారన్నారు. సత్యదేవుని ఆలయానికి భక్తుల తాకిడి ● 40 వేల మంది భక్తుల రాక ● ఘనంగా రఽథోత్సవం అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సత్యదేవుని సన్నిధిన శనివారం రాత్రి పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. అనంతరం నవ దంపతులు, ఇతర ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న వారు పెద్ద సంఖ్యలో సత్యదేవుని ఆలయానికి తరలివచ్చి వ్రతాలు చేసుకుని స్వామిని దర్శించుకున్నారు. భక్తులతో వ్రతమండపాలు, స్వామివారి దర్శనం అనంతరం సేదతీరే భక్తులతో విశ్రాంతి మండపాలు కిక్కిరిసిపోయాయి. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించగా స్వామివారి వ్రతాలు మూడు వేలు నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షలు ఆదాయం సమకూరింది. కన్నుల పండువగా సత్యదేవుని రథోత్సవం సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారి రథోత్సవం ఆదివారం కన్నుల పండువగా జరిగింది. ఉదయం పది గంటలకు రథాన్ని తూర్పు రాజగోపురం ముందుకు తీసుకువచ్చారు. అనంతరం దేవేరులతో స్వామివారిని రథంపై ప్రతిష్ఠించి పూజలు చేశారు. అనంతరం దేవస్థానం ఇన్చార్జి ఈఓ రమేష్ బాబు కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. రద్దయిన రైళ్ల పునరుద్ధరణ సామర్లకోట: స్థానిక రైల్వే స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తూ గతంలో రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరించినట్టు స్టేషన్ మేనేజర్ ఎం.రమేష్ ఆదివారం తెలిపారు. తిరుమల, ఉదయం, రత్నాచల్, విశాఖపట్నం–మచిలీపట్నం ఎక్స్ప్రెస్లతో పాటు సింహాద్రి, విశాఖపట్నం డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్, రాజమహేంద్రవరం– విశాఖపట్నం ఎక్స్ప్రెస్, గుంటూరు–రాయగడ ఎక్స్ప్రెస్లకు ఆదివారం నుంచి బుకింగ్ ప్రారంభించామన్నారు. ప్రయాణికులు గమనించాలని ఆయన సూచించారు. సుమారు 50 రోజుల క్రితం ఈ రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. -
లోవకు పోటెత్తిన భక్తులు
తుని: కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం తలుపులమ్మ తల్లిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శ్రావణం మాసం తొలి ఆదివారం కావడంతో పలు ప్రాంతాలకు చెందిన భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఉదయం 6 నుంచి సాయంత్రం వరకు 8 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఈఓ విశ్వనాథరాజు తెలిపారు. దేవస్థానానికి చెందిన కాటేజీలు నిండి పోవడంతో ప్రైవేటు కాటేజీలను భక్తులు ఆశ్రయించారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1,57,100, పూజా టికెట్ల ద్వారా రూ.97,350, కేశఖండన ద్వారా రూ.7,160, వాహన పూజ టికెట్ల ద్వారా రూ.4,400, కాటేజీల ద్వారా రూ.89,212, ఇతర విభాగాల నుంచి రూ.1,11,287 కలిసి రూ.4,67,509 ఆదాయం సమకూరినట్టు ఆయన తెలిపారు. భక్తులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సీఐ చెన్న కేశవరావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
ఏలేరుకు జలకళ
● ప్రస్తుత నిల్వ 16.06 టీఎంసీలు ● దిగువ ఆయకట్టుకు ధీమా ఏలేశ్వరం: కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఏలేరు ప్రాజెక్టులో నీటినిల్వలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో ప్రాజెక్టులో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. దీంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఏడాది వర్షాలు అశించిన స్థాయిలో పడడంతో ప్రాజెక్టులో నీటినిల్వలు ఒక్కసారిగా పెరిగాయి. వర్షాలకు జలాశయం పరివాహక ప్రాంతం నుంచి 2647 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరడంతో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. ఆదివారం నాటికి 86.56 మీటర్లకు గాను 82.12 మీటర్లు, 24.11 టీఎంసీలకు గాను 16.06 టీఎంసీలకు చేరుకున్నాయి. ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు చేరడంతో దిగువ ప్రాంతాలకు 300 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో మరింతగా నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నీటినిల్వలు పెరగడంతో దిగువ ఆయకట్టుకు ఢోకా లేదు. ఆయకట్టులో సుమారు 54 వేల ఎకరాల సాగుకు నీరందించేందుకు అధికారులు నిర్ణయించారు. ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లోని వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలకు ఆయకట్టుతో పాటు విశాఖకు నీటిఎద్దడి ప్రమాదం తప్పింది. నీటినిల్వలు పెరగడంతో దిగువ ఆయకట్టుతో పాటు విశాఖ, తిమ్మరాజుచెరువు, పంపా ప్రాజెక్టుకు నీటి విడుదలకు ఇబ్బంది లేదని అధికారులు పెర్కొన్నారు. -
ఎస్సీ వర్గీకరణ తీర్పును పునః సమీక్షించాలి
● మాల మహానాడు జేఏసీ డిమాండ్ ● అమలాపురంలో బహిరంగ సభ, ప్రదర్శన అమలాపురం టౌన్: ఎస్సీ వర్గీకరణ తీర్పును పునః సమీక్షించాలని మాల మహానాడు జిల్లా ఐక్య వేదిక బహిరంగ సభ డిమాండ్ చేసింది. అమలాపురం గడియారం స్తంభం సెంటర్లో మాల మహానాడు ఐక్య వేదిక (జేఏసీ) ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మాలల బహిరంగ సభ ఆదివారం జరిగింది. ఐక్య వేదిక నేత, జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు పండు అశోక్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు ఎమ్మెల్సీ డాక్టర్ పండుల రవీంద్రబాబు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఎంఏకే భీమారావు, తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు నాయకుడు యర్రమిల్లి రాములు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత పీవీ రావుకు నేతలంతా ఘన నివాళులు అర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. మాల జాతి కోసం ప్రాణాలు అర్పించిన పీవీరావు త్యాగ ఫలం వృథా కానివ్వమని ప్రతి వక్త తమ ప్రసంగంలో స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై మాల మహానాడు ఐక్య వేదిక పూర్తి వ్యతిరేకత వ్యక్తం చేస్తుందని వక్తలు అన్నారు. వర్గీకరణకు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పునాది వేస్తే, ప్రధాని మోదీ ఆ పునాదిపై మేడలు కడుతున్నారని విమర్శించారు. నరేంద్ర మోదీ, చంద్రబాబు అంతం, మాలల పంతం అంటూ నినాదాలు చేశారు. ఎస్సీ వర్గీకరణ తీర్పును పునః సమీక్షించాలని డిమాండ్ చేస్తూ మాల మాహానాడు జేఏసీ సుప్రీంకోర్టులో పిల్ వేయాలని బహిరంగ సభ తీర్మానం చేసింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు న్యాయస్థానాలకు సంబంధం లేకుండా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేసింది. రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉండ్రు బాబ్జి, రాష్ట్ర కార్యదర్శి నాతి శ్రీనివాసరావు, రాష్ట్ర నాయకులు పెయ్యల పరశురాముడు, మెండు రమేష్బాబు, జగడం సత్యనారాయణ, నక్కా సంపత్కుమార్, జల్లి శ్రీనివాస్, పెయ్యల శ్రీనివాసరావు తదితరులు సభలో ప్రసంగిస్తూ వర్గీకరణ జోలికి వచ్చిన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగిన సమయంలో బుద్ధి చెబుతామని ప్రకటించారు. అనంతరం మాల మృతవీరుల సంస్మరణ సభ జరిగింది. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో జరిగిన ఉద్యమంలో అశువులు బాసిన మాల మృతవీరులకు నివాళులు అర్పించారు. భారీ నిరసన ప్రదర్శన బహిరంగ సభకు ముందు అమలాపురం ప్రధాన రోడ్డుపై మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పట్టణ సీఐ కె.కృష్టోఫర్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. -
దాడికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి
మాజీ ఎంపీ చింతా అనురాధసాక్షి, అమలాపురం: అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తామని ప్రసంగాలతో ఊదరగొడుతున్న టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు విజయవాడలోని అంబేడ్కర్ విగ్రహంపై జరిగిన దాడికి ఎటువంటి సమాధానం చెబుతారని అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ ప్రశ్నించారు. శనివారం స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ అంబేడ్కర్ విగ్రహంపై దాడి అమానుషమన్నారు. అంబేడ్కర్ అడుగుజాడల్లో నడిచిన గత ప్రభుత్వం అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని ఆమె గుర్తు చేశారు. అలాగే 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి రాజ్యాంగ నిర్మాత పట్ల తన గౌరవ మర్యాదలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చాటారన్నారు. ఆయనపై కక్షతో విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని తొలగించడం అన్యాయమన్నారు. -
ముస్లింల మనోభావాలను దెబ్బతీయొద్దు
అమలాపురం టౌన్: వక్ఫ్ బోర్డు ఆస్తుల ద్వారా ముస్లిం సమాజ సంక్షేమం జరుగుతోందని జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖాదర్ అన్నారు. అలాంటి వక్ఫ్ ఆస్తులపై సవరణ బిల్లు తీసుకురావడం అంటే ముస్లింల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆయన స్పష్టం చేశారు. శనివారం అమలాపురంలో మీడియాతో ఆయన మాట్లాడారు. వక్ఫ్ ఆస్తులంటే తమ ఇష్ట దైవం అల్లాకు సంబంధినవేనని సెంట్మెంట్గా భావిస్తామని చెప్పారు. వక్ఫ్ చట్టాన్ని సవరణ చేయడం కేంద్రంలోని ప్రభుత్వానికి తగదని ధ్వజమెత్తారు. ఎన్డీయే ప్రభుత్వం ఆది నుంచి ముస్లింలను శత్రువులుగా చూస్తోందన్నారు. ముస్లింలకు వక్ఫ్ ఆస్తులు రాజ్యాంగపరంగా సిద్ధించినవేనని, ముస్లింల హక్కులను హరించేలా ఇప్పుడు చట్ట సవరణలు చేయడం అంటే తమ మత స్వేచ్ఛను కాలరాయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని ఖాదర్ డిమాండ్ చేశారు. లోక్సభలో వైఎస్సార్ సీపీ ఎంపీలు సవరణను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడంపై ముస్లిం సమాజం హర్షిస్తోందన్నారు. జిల్లాలో దాదాపు 2,100 ఎకరాల భూములను వక్ఫ్ బోర్డు ద్వారా పరిరక్షిస్తుంటే, ఆ హక్కులను కలెక్టర్ల చేతిలో పెట్టడం ఎంత వరకూ సమంజసమని ఖాదర్ ప్రశ్నించారు. నయనానందం.. బాలాజీ రూపం మామిడికుదురు: అప్పనపల్లిలోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీబాల బాలాజీ స్వామివారి క్షేత్రం నయనానందకంగా మారింది. పవిత్ర శ్రావణ మాసం, రెండో శనివారం సెలవు రోజు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఉదయం నుంచే వైనతేయ గోదావరి నదీతీరంలోని స్నానఘట్టం, పాత, కొత్త ఆలయాల వద్ద భక్తుల సందడి నెలకొంది. తొలుత స్వామివారికి తలనీలాలు సమర్పించారు. అనంతరం బాలాజీ స్వామిని దర్శించుకుని మొక్కులు సమర్పించారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.2,73,187 ఆదాయం లభించిందని ఈఓ గ్రంధి మాధవి తెలిపారు. లడ్డూ ప్రసాదం, దర్శనం టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.2,03,820, నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.69,367 విరాళాలుగా వచ్చిందన్నారు. స్వామివారిని 3,582 మంది దర్శించుకోగా, 2,896 మంది అన్న ప్రసాదం స్వీకరించారని తెలిపారు. లైన్మేన్లకు పదోన్నతులు కల్పించాలి రాయవరం: జూనియర్ లైన్మేన్ గ్రేడ్–2 ఉద్యోగులకు పదోన్నతి కల్పించాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జేఎల్ఎం గ్రేడ్–2 అసోసియేషన్ నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శనివారం పసలపూడిలో అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం సచివాలయ వ్యవస్థలో ఉద్యోగులను మాతృ సంస్థకు పంపిస్తున్నందున జూనియర్ లైన్మేన్ గ్రేడ్–2 ఉద్యోగులను ఏపీఈపీడీపీసీఎల్లో అనుసంధానం చేయాలన్నారు. సచివాలయ వ్యవస్థలో ఎనర్జీ అసిస్టెంట్లుగా నియమితులైన తమను జూనియర్ లైన్మేన్లుగా గుర్తించాలన్నారు. 2021 అక్టోబర్ 2 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తి చేసిన జేఎల్ఎంలను 2022 జూలై 1న ప్రొబేషన్ డిక్లేర్ చేసినందున 9 నెలల సర్వీసును కోల్పోతున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిది నెలల సర్వీసును ప్రొబేషన్ కలపాలని వారు కోరారు. అలాగే ఇతర జిల్లాల్లో, డివిజన్లతో ఉన్న జేఎల్ఎం గ్రేడ్–2లకు కూడా బదిలీలు కల్పించాలని, పదోన్నతి ఛానల్ వర్తింపజేయాలని తీర్మానించారు. కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా జేఎల్ఎం గ్రేడ్–2 అసోసియేషన్ అధ్యక్షుడు ఐ.తాతాజీ, ఉపాధ్యక్షుడు కె.వీరబాబు, ప్రధాన కార్యదర్శి జి.సూర్యనారాయణ, సలహాదారుడు ఎం.రాము, సభ్యులు పి.సత్యరాజేష్, డి.రాంజీ తదితరులు పాల్గొన్నారు. -
స్మృతివనంపై దాడి అమానుషం
సాక్షి, అమలాపురం: విజయవాడ నడిబొడ్డున దేశం గర్వించదగ్గ స్థాయిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెలకొల్పిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనంపై అప్రజాస్వామికంగా దాడికి తెగబడిన వారిని అరెస్ట్ చేయాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. దేశాన్ని అగౌరవపరిచేలా టీడీపీ నాయకులు వ్యవహరించారంటూ దళిత నాయకులు మండిపడ్డారు. సోమవారం జిల్లాలో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహంపై దాడి చేయడాన్ని, మాజీ సీఎం జగన్ పేరున శిలాఫలకాన్ని ధ్వంసం చేయడాన్ని వారు తప్పుపట్టారు. కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు హోరెత్తించారు. అంబేడ్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై విధ్వంసకాండకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు పి.గన్నవరం సెంటర్లో రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం రావణకాష్టంలా మారిందని మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. విజయవాడలో అంబేడ్కర్ విగ్రహంపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ కొత్తపేటలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వ విధానాలను ఖండించారు. ఈ ఆందోళనకు నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. అంబేడ్కర్ స్మృతివనంపై అప్రజాస్వామికంగా దాడికి తెగబడిన వారిని అరెస్ట్ చేయాలని కోరుతూ రామచంద్రపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశ్ ఆధ్వర్యంలో ద్రాక్షారామలో నిరసన తెలిపారు. అక్కడి యానాం సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. సూర్యప్రకాశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లూ సామాజిక న్యాయం జరిగిందన్నారు. ఇందులో భాగంగా విజయవాడలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలిపే మ్యూజియాలు ఏర్పాటు చేశారన్నారు. దీనిపై అక్కసుతో దాడి చేయడం దారుణమన్నారు. ఫ అంబేడ్కర్ విగ్రహానికి అవమానంపై నిరసనలు ఫ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు -
No Headline
సాక్షి, అమలాపురం/ రావులపాలెం: ఉచితమంటూనే మెలిక పెట్టారు.. అదనపు చార్జీల వసూలుతో వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఉచిత ఇసుక విధానంలో లారీలకు ‘వెయిటింగ్’ చార్జీల పేరుతో భారం మోపుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడే అదనంగా సొమ్ము చెల్లించాల్సి వస్తోంది. ‘అవకాశాలు సృష్టించుకోవాలి.. అలా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలంటూ’ ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ చెప్పే మాటలను ఆ పార్టీ నాయకులు అందిపుచ్చుకొంటున్నారు. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీలో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. ఉచిత ఇసుక పాలసీలో చెల్లించాల్సిన సొమ్ము కన్నా అదనంగా ‘బీ– వీ’ ట్యాక్స్లో వసూలు చేస్తున్న టీడీపీ నేతలకు దన్నుగా కొందరు లారీ డ్రైవర్లు తోడయ్యారు. వెయిటింగ్ చార్జీల పేరుతో నిర్దేశించిన రవాణా చార్జీలకు అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉచిత ఇసుక విధానం ప్రజలకు మోయలేని భారమైంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ర్యాంపుల వద్ద ఇసుకకు రుసుం వసూలు చేసిన దానికన్నా కూటమి ప్రభుత్వంలో స్టాక్ పాయింట్ వద్ద నిల్వఉన్న ఇసుక ధర అధికంగా ఉండడం గమనార్హం. ఇందుకు అతి పెద్ద ఉదాహరణ రావులపాలెంలో ఇప్పుడు పలుకుతున్న ఇసుక ధర. గత ప్రభుత్వంలో ఐదు యూనిట్ల ఇసుక (అప్పట్లో 22 టన్నుల వరకూ వచ్చేది) కొనుగోలు చేస్తే, లారీ రవాణా ఖర్చులతో కలిపి రూ.12,500 వరకూ అయ్యేది. అప్పట్లో ఇసుక ర్యాంపు వద్ద టన్ను రూ.475 వరకూ ఉండేది. ఐదు యూనిట్లు (22 టన్నులు) ధర రూ.10,450 వరకూ అయ్యేది. జొన్నాడ, గోపాలపురం ర్యాంపుల నుంచి రావులపాలేనికి రూ.1,500 నుంచి రూ.2 వేల వరకూ రవాణా చార్జీ ఇవ్వాల్సి వచ్చేంది. ఇలా ఐదు యూనిట్ల లారీ ఇసుక వినియోగదారుని వద్దకు చేరేసరికి రూ.12,500కు వచ్చేది. టన్ను రూ.475లోనే ప్రభుత్వానికి రూ.375 వరకూ ఆదాయం రూపంలో వెళ్లేది. ఇది కాకుండా ర్యాంపుల్లో లోడింగ్, బాటల నిర్వహణ, ఇతర ఖర్చులకు రూ.వంద వసూలు చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఉచిత ఇసుక పాలసీల్లో స్టాక్ పాయింట్ వద్ద టన్ను ధర రూ.265గా నిర్ణయించారు. ఇప్పుడు ఐదు యూనిట్లు (గరిష్టంగా 20 టన్నులు) ధర రూ. 5,300. బీ– వీ ట్యాక్స్ పేరుతో ఇస్తున్న స్లిప్లకు వసూలు చేస్తున్న రూ.5,100 కలిపి మొత్తం రూ.10,400 అవుతోంది. స్టాక్ పాయింట్ల వద్ద అనధికార ట్యాక్స్ వసూలు చేస్తున్న టీడీపీ తృతీయ శ్రేణి నాయకులు దీనికి అదనంగా రూ.వెయ్యి చార్జీ చేస్తున్నారు. మొత్తం అంతా కలిపి రూ.11,400 వరకూ అవుతోంది. ఇక రవాణా చార్జీ లారీకి ఏకంగా రూ.4 వేల నుంచి రూ.4,600 వరకూ తీసుకుంటున్నారు. ఇలా మొత్తం అంతా కలిపి రూ.16 వేలు అవుతోంది. ఇందులో కూడా రెండు టన్నుల ఇసుక తక్కువగా వస్తుండడం గమనార్హం. అదనపు భారం వేస్తూ.. గత ప్రభుత్వంలో ర్యాంపుల వద్ద వసూలు చేసిన సొమ్ములో మూడో వంతు అంటే సుమారు 78 శాతం ప్రభుత్వానికి ఆదాయం రూపంలో వెళ్లేది. ఇప్పుడు ప్రభుత్వం వసూలు చేస్తున్న రూ.265లో చాలా కొంత మొత్తం మాత్రమే సీనరేజ్, జీఎస్టీగా వసూలు చేస్తున్నారు. ఇందులో సీజరేజ్గా వసూలు చేసే ఆదాయం రూ.88ని జిల్లా పరిషత్, మండల పరిషత్, పంచాయతీలకు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక జీఎస్టీగా 18 శాతం ఆదాయం మాత్రమే ప్రభుత్వానికి వస్తోంది. ఈ విధానంతో వినియోగదారులపై భారం పడుతుంది. మిగతా చోట్లా ఇంతే.. రావులపాలెంలోనే కాదు జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇసుక ధర గతం కన్నా అధికంగా ఉంది. ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం గ్రామం సముద్రతీర ప్రాంతం. ఇక్కడకు ఐదు యూనిట్ల ఇసుక రవాణా చార్జీలతో కలిపి రూ.19 వేల నుంచి రూ.21 వేల వరకూ అయ్యేది. ఇప్పుడు రూ.23 వేల నుంచి రూ.25 వేల వరకూ అవుతుండడం గమనార్హం. అంతమాత్రాన ఇసుక అడిగిన వెంటనే దొరకడం లేదు. రవాణా చార్జీలపై అదుపు లేకపోవడంతో స్టాక్ పాయింట్కు దగ్గరగా ఉన్న ప్రాంతాలకు ఇసుక రవాణా చేసేందుకు లారీల యజమానులు మక్కువ చూపుతున్నారు. దీనివల్ల రోజులో కనీసం రెండు, మూడు ట్రిప్పులు వేసే అవకాశముంది. అదే దూర ప్రాంతమైతే ఒక ట్రిప్పు వేసే అవకాశం ఉండడం వల్ల రాబడి తక్కువగా ఉందని లారీల యజమానులు దూరానికి రవాణా పెద్దగా ఆసక్తి చూపడం లేదు.ఇ‘దందా’ వెయిటింగ్ వల్లే.. జిల్లాలో రావులపాలెంలో రెండు, మందపల్లి, కపిలేశ్వరపురం స్టాక్ పాయింట్ల వద్ద నుంచి ఇసుక ఎగుమతి అవుతోంది. ఇక్కడ ఇసుకకు అదనపు వసూలు చేయడమే కాకుండా ఎంపిక చేసిన లారీలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో మిగిలిన లారీల నిర్వాహకులు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఒక్కోసారి రోజంతా లైన్లో నిలబడాల్సి వస్తోంది. దీంతో లారీల యజమానులు వెయిటింగ్ భారాన్ని వినియోదారులపై వేస్తున్నారు. లారీలు వెయిటింగ్లో ఉండడం వల్ల డ్రైవర్లకు అదనపు బేటాలు చెల్లించాల్సి రావడంతోపాటు అదనపు చార్జీలు వసూలు చేయడం వినియోగదారులకు ఇబ్బందిగా మారింది. ఫ ఉచిత ఇసుకంటూ మెలిక పెట్టిన ప్రభుత్వం ఫ లారీలకు ‘వెయిటింగ్’ చార్జీల పేరుతో భారం ఫ కొత్త తరహా దోపిడీకి తెరదీసిన ఇసుకాసురులు ఫ గతంలో ర్యాంపు నుంచి ఐదు టన్నులు రూ.12,500 ఫ ఇప్పుడు స్టాక్ పాయింట్ల ద్వారా రూ.16 వేలకు పైగా వసూలు -
కొత్త ప్రభుత్వం చేసేదేంటో చెప్పాలి
యూటీఎఫ్ సభలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు అమలాపురం టౌన్: కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం శాఖల వారీగా విడుదల చేస్తున్న శ్వేతపత్రాల్లో గత ప్రభుత్వంపై విమర్శలే తప్ప అధికారంలోకి వచ్చిన తాము ఏం చేస్తామో చెప్పలేదని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ధ్వజమెత్తారు. శనివారం స్థానిక యూటీఎఫ్ భవన్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) స్వర్ణోత్సవాల సభకు ఎమ్మెల్సీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దీనికి యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంటీవీ సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, ఐవీ వెంకటేశ్వరరావు యూటీఎఫ్ జెండాను ఆవిష్కరించారు. యూటీఎఫ్ ఉద్యమ పితామహుల చిత్రపటాలకు ఎమ్మెల్సీలు, యూనియన్ రాష్ట్ర, జిల్లా నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ యూటీఎఫ్ 50 ఏళ్లలో సాధించిన విద్యా విజయాలను వివరించారు. స్వర్ణోత్సవ సంబరాలు పాటల సీడీని ఆవిష్కరించారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించారని చెబుతూ వారి త్యాగాలను కొనియాడారు. మధ్యాహ్నం నుంచి జరిగిన విద్యా సదస్సులో యూటీఎఫ్ పూర్వపు అధ్యక్షుడు జోజయ్య యూనియన్ 50 ఏళ్ల ప్రస్థానంలో సాధించిన విజయాలను వివరించారు. యూటీఎఫ్ ద్వారా ఉపాధ్యాయులు చేసిన సేవలు, సామాజిక బాధ్యతలు గొప్పవన్నారు. 1974 ఆగస్టు 10న యూటీఎఫ్ ఆవిర్భవించి నేటికి యాభై ఏళ్లు పూర్తి చేసుకుందని, ఉపాధ్యాయులంతా అదే స్ఫూర్తితో పనిచేయాలని వక్తలు పిలుపునిచ్చారు. -
సత్యదేవుని దర్శనానికి ఆంక్షలు
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని ప్రదక్షిణ ఓ ప్రహసనంలా మారింది. భక్తుల రద్దీని నియంత్రించే పేరుతో మధ్యాహ్నం మూడు గంటల తరువాత మాత్రమే ప్రదక్షిణ దర్శనానికి అనుమతిస్తున్నారు. రూ.300 టిక్కెట్తో రెండు నెలల క్రితం వరకు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రదక్షిణ దర్శనానికి భక్తులను అనుమతించేవారు. టిక్కెట్ల విక్రయం ద్వారా రోజుకు రూ.మూడు లక్షల నుంచి రూ.నాలుగు లక్షల వరకు ఆదాయం వచ్చేది. ప్రతి నెలా రూ.80 లక్షల నుంచి రూ. కోటి వరకు ఈ దర్శనం టిక్కెట్ల ద్వారా వచ్చేది. ప్రస్తుతం ఈ ప్రదక్షిణ దర్శనంపై ఆంక్షలతో ఆ ఆదాయానికి భారీగా గండి పడింది. ప్రస్తుతం అంతరాలయం దర్శనం పేరుతో రూ.200 టిక్కెట్ మీద లోపలకు పంపుతున్నా భక్తులు సంతృప్తి చెందడం లేదు. గతంలో రూ.300 టిక్కెట్తో ప్రదక్షిణ దర్శనం చేసుకునే భక్తుల్లో ఇప్పుడు సగం మంది కూడా రూ.200 టిక్కెట్తో అంతరాలయం దర్శనం చేసుకోవడం లేదు. దీనికి ప్రధాన కారణం ఉచిత దర్శనానికి అంతరాలయం దర్శనానికి పెద్ద తేడా లేకపోవడమే. కాగా, రెండు నెలల క్రితం ఆలయానికి వచ్చి రూ.300 టిక్కెట్లు తో గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ దర్శనం చేసుకున్న భక్తులు ఇప్పుడు మళ్లీ ఆలయానికి వచ్చినపుడు ప్రదక్షిణ దర్శనం ఎందుకు నిలిపివేశారని ప్రశ్నిస్తూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆంక్షల వల్ ఆదాయం కోల్పోతున్న విషయం తెలిసినా అధికారుల మీద భయంతో ఎవరూ నోరు మెదపడం లేదు. గత ఏడాది విజయదశమి నుంచి ప్రారంభమైన ప్రదక్షిణ దర్శనం గత ఏడాది విజయదశమి నుంచి సత్యదేవుని ఆలయంలో గర్భాలయ దర్శనం ప్రారంభమైంది. అప్పటి ఈఓ ఎస్ఎస్ చంద్రశేఖర్ అజాద్ ఈ దర్శనాన్ని ఏర్పాటు చేశారు. ఆయన కోరిక మేరకు ప్రముఖ పారిశ్రామికవేత్త, దానవాయిపేటకు చెందిన హేచరీస్ అధినేత చినబాబు రూ.25 లక్షల వ్యయంతో ప్రదక్షిణ దర్శనం మార్గంలో నాలుగు దిక్కులా బంగారు పూత కలిగిన శ్రీగంధం గిన్నె, లక్ష్మీ హుండీ, కల్పవృక్షం, కామధేనువులను ఏర్పాటు చేశారు. భక్తులు వీటిని దర్శిస్తూ ప్రదక్షిణగా స్వామివారి అంతరాలయంలోకి ప్రవేశించి స్వామిని దర్శించుకునే వీలు కల్పించారు. ప్రస్తుతం ఈ దర్శనాలు నిలిపివేయడంతో అవి ఏర్పాటు చేసిన దాతల ఆశయం నెరవేరడం లేదు. దానికి తోడు ప్రదక్షిణ దర్శనం మార్గంలో ఏసీలు, ప్రత్యేక దీపాలు ఏర్పాటు చేయడంతో ఎంతసేపు ఆలయంలో ఉన్నా భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండడంతో ఈ దర్శనానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. భక్తులు ఎవరూ లేని సమయంలో అనుమతి సాధారణంగా సత్యదేవుని ఆలయంలో భక్తులు ఉదయం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే ఉంటారు. ఆ తరువాత భక్తులు పెద్దగా ఉండరు. కానీ ప్రదక్షిణ దర్శనానికి మాత్రం మధ్యాహ్నం మూడు గంటల నుంచి మాత్రమే భక్తులను అనుమతించాలని ఈఓ కె.రామచంద్రమోహన్ ఆదేశించారు. కార్తీకమాసం, దశమి, ఏకాదశి, శనివారం వంటి రోజుల్లోనే ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు ఉంటారు. అయితే ఆ రోజుల్లో అసలు ప్రత్యేక దర్శనానికి అనుమతి ఇవ్వడం లేదు. దీంతో భక్తుల అసంతృప్తితో బాటు దేవుని ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఇప్పటికై నా ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రదక్షిణ దర్శనానికి భక్తులను అనుమతించాలని కోరుతున్నారు. దీనిపై పరిశీలిస్తాం గతంలో ఉన్న విధంగా ఉదయం నుంచి రాత్రి వరకు సత్యదేవుని ప్రదక్షిణ దర్శనానికి భక్తులను అనుమతించే విషయమై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం – ఇన్ఛార్జి ఈఓ రమేష్ బాబు మధ్యాహ్నం 3 తరువాతే ప్రదక్షిణ దర్శనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న భక్తులు రూ.300 టికెట్తో నిత్యం రూ.3 లక్షల ఆదాయం ఆదాయానికి గండి పడుతున్నా చర్యలు శూన్యం -
అలరించిన బాలోత్సవం
కొత్తపేట: విద్యార్థులకు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్లో నైపుణ్యం పెంపొందించేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తర్ఫీదు ఇవ్వాలని కొత్తపేట ఆర్డీఓ జీవీవీ సత్యనారాయణ అన్నారు. కొత్తపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో కోనసీమ బాలోత్సవం మొదటి పిల్లల పండుగ పేరిట రెండు రోజుల పాటు జరిగే కార్యక్రమాలను శనివారం ప్రారంభించారు. మనం ట్రస్ట్, జితేంద్ర సేవా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సత్యనారాయణ, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు నిర్దేశించేది పాఠశాలలేనని అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అనే నానుడితో కోనసీమ బాలోత్సవం నిర్వహించడం అభినందనీయమన్నారు. చిన్నప్పటి నుంచే విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటల్లో ఆసక్తి కలిగించాలని, తద్వారా వారిలో నైపుణ్యాన్ని వెలికితీయాలని సూచించారు. అనంతరం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విచిత్ర వేషధారణ, కోలాటాలు, నాట్య ప్రదర్శనలు, లఘు నాటికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జితేంద్ర సేవా ఫౌండేషన్ చైర్మన్ మట్టపర్తి జితేంద్రకుమార్, కోనసీమ బాలోత్సవ అధ్యక్షుడు కాశీ విశ్వనాథం, మనం ట్రస్ట్ ఇన్చార్జి యండూరి పవన్, మనం ట్రస్ట్ చైర్మన్ కె.వీరబాబులను అభినందించారు. సర్పంచ్ బూసి జయలక్ష్మి, ప్రముఖ అంతర్జాతీయ శిల్పి డి.రాజ్కుమార్ వుడయార్, మందపల్లి మాజీ సర్పంచ్ చింతం విజయకృష్ణ మోహన్, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి మట్టపర్తి సూర్యచంద్రరావు, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
వెనుక బడి.. ఎదురుగా గుడి
ఫ కూటమి ప్రోద్బలంతో తెరుచుకున్న పేకాట క్లబ్ ఫ పోలీసుల దాడి.. టీడీపీ నేతల పైరవీలు అమలాపురం టౌన్: కొన్నేళ్లుగా మూతపడిన అమలాపురం జార్జి రిక్రియేషన్ క్లబ్ కూటమి నేతల ప్రోద్బలంతో మళ్లీ తెరుచుకుంది. కొత్తగా ఎన్నికై న ప్రజాప్రతినిధి కూడా కొందరు నేతలకు వత్తాసు పలకడంతో క్లబ్ శుక్రవారం రాత్రి తెరుచుకునే ఏర్పాట్లు జరిగాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పేకాట క్లబ్లకు ఎంత మాత్రం అవకాశం లేకపోవడంతో అవి మూతపడ్డాయి. అయితే శనివారం ఆ క్లబ్లో పేకాట ఆడుతున్న సమయంలో పోలీసులు మెరుపు దాడి చేశారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే టీడీపీ నేతలు కొందరు పట్టణ పోలీస్ స్టేషన్కు వెళ్లి కేసు నమోదుకు ససేమిరా అంటూ పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. శనివారం అర్ధరాత్రి పొద్దుపోయే వరకూ కొందరు నేతలు పట్టణ పోలీస్ స్టేషన్ వద్దే ఉండి పోలీసులతో మంతనాలు జరిపారు. నేతల ఒత్తిడి, పైరవీలతో కేసు నమోదు చేస్తారా.. లేదా అనే సందేహాలు ప్రజల్లో నెలకొంది. ప్రజాప్రతినిధి ఇచ్చిన అభయమే అనధికార అనుమతిగా భావించి కొందరు కూటమి నేతలు క్లబ్ తెరిచి బరి తెగించి మరీ పేకాటకు తెర తీశారు. అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించేది లేదని జిల్లా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రకటనలతో ఊదరకొడుతుంటే ఈ పేకాట క్లబ్కు ఎలా అనుమతి ఇచ్చారంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దాడి చేసిన పోలీసులు పేకాటపై కేసు నమోదు చేస్తే సరేసరి. లేని పక్షంలో పోలీసులు కూటమి నేతల ఒత్తిళ్లకు గురయ్యారనే అనుమానాలు బలపడతాయి. ఈ క్లబ్ భవనం వెనుకే ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ఎదురుగా వినాయక గుడి ఉంది. అసాంఘిక కార్యకలాపాలకు గుడి, బడి నిబంధనలు వర్తిస్తాయి. ఆ నిబంధనలను కూటమి నేతలు తుంగలో తొక్కి మరీ క్లబ్ తెరవడంపై విమర్శలకు దారి తీస్తోంది. ఏదేమైనా ఇది ఎంతవరకూ వెళ్తుందో వేచి చూడాల్సిందే. -
కిక్కిరిసిన శృంగార వల్లభుని ఆలయం
పెద్దాపురం: మండలంలోని తొలి తిరుపతి స్వయం భూ శృంగార వల్లభుని ఆలయానికి శనివారం భక్తులు బారులు తీరారు. శనివారం కావడంతో అర్చకులు పెద్దింటి నారాయణాచార్యులు, పురుషోత్తమాచార్యులు స్వామివారిని ప్రత్యేక పుష్పాలతో అలంకరించి పూజలు చేశారు. భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఆలయంలో వివిధ సేవలు, టిక్కెట్లు, అన్నదానం, కేశ ఖండన ద్వారా రూ. 2,97,678 ఆదాయం సమకూరినట్లు ఈఓ తెలిపారు. సుమారు 18 వేల మంది స్వామి వారిని దర్శించుకోగా, నాలుగు వేల మంది భక్తులకు ప్రసాద వితరణ చేశారు. -
ఆర్టీసీ కండక్టర్ నిజాయితీ
అమలాపురం రూరల్: అమలాపురం ఆర్టీసీ బస్టాండ్లో ఓ ప్రయాణికుడు పోగొట్టుకున్న రెండు కాసుల బంగారు గొలుసును అతనికి అందించి ఓ కండక్టర్ నిజాయితీ చాటుకున్నాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. కాజులూరు మండలం అండ్రంగికి చెందిన మాచవరపు కృష్ణ కుటుంబ సభ్యులతో కలసి పాలకొల్లు వెళ్లడానికి అమలాపురం బస్టాండ్కు శుక్రవారం వచ్చారు. అతని రెండు కాసుల బంగారు గొలుసు బస్టాండ్లో పడిపోయింది. ఆ గొలుసు అమలాపురం డిపో కండక్టర్ పి.నారాయణరావుకు దొరికింది. దానిని డిపో అధికారులకు అప్పగించారు. గొలుసును పోగొట్టుకున్న ప్రయాణికుడు అమలాపురం బస్టాండ్లోని విచారణ కేంద్రం వద్ద సంప్రదించగా శనివారం ఆ గొలుసును సెక్యూరిటీ అధికారి, సీఐ పతిమాకుమారి, ఓపీఆర్ఎస్ ఇన్చార్జి ఎన్.వరహాలుబాబు సమక్షంలో కండక్టర్ నారాయణరావు ప్రయాణికుడు కృష్ణకు అందజేశారు. నిజాయితీ చాటుకున్న కండక్టర్ను డిపో మేనేజర్ సత్యనారాయణ మూర్తి అభినందించారు. -
సంరక్షణతో పశు సంపద
ఫ పెంపకంలో జాగ్రత్తలు అవసరం ఫ తద్వారా అధిక ఆదాయం కొత్తపేట: ఉదయం లేచింది మొదలు, రాత్రయ్యే వరకూ పాలు, టీ, కాఫీలంటూ తీసుకునే వారెందరో.. అలాంటి పాల ఉత్పత్తులు కావాలంటే పాడి పరిశ్రమ ఎంతో ఆధారం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న పాడి పరిశ్రమ ఎందరో రైతులకు జీవనోధారం అయ్యింది. ఒకపక్క వ్యవసాయంతో పాటు అనుబంధంగా పశు సంపదతో ఆర్థికాభివృద్ధి సాధించేవారు. కాలక్రమేణా నిర్వహణ భారమై పశు పోషణ తగ్గించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వ్యవసాయం, పాడి పరిశ్రమ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఆయా రంగాల వైపు రైతులను మళ్లించేందుకు ప్రోత్సాహక పథకాలు అమలు చేసింది. ప్రధానంగా పాడి పరిశ్రమ ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించేందుకు గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలను ప్రోత్సహించింది. దానితో పాడి రైతుల్లో పరిశ్రమ పట్ల ఆసక్తి పెరిగింది. దానికనుగుణంగానే ప్రస్తుతం పాల ఉత్పత్తులకు డిమాండ్ బాగా పెరిగింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పశువులు 1,60,403 గేదెలు, 75,839 ఆవులు పెంచుతున్నారు. జిల్లాలో పాల సేకరణ కేంద్రాలు 139, బల్క్మిల్క్ సెంటర్లు 5 ఉన్నాయి. నిత్యం 7,797 లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. పశువుల సంరక్షణ ద్వారా అధిక పాల ఉత్పత్తి, పాలు తీసే సమయంలో మెళకువలు, వాటిని కేంద్రాలకు, వినియోగదారులకు తరలించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తద్వారా ఆర్థికాభివృద్ధి తదితర అంశాలను పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, రావులపాలెం ప్రాంతీయ పశువైద్యాధికారి ఎస్.మహేశ్వరరెడ్డి వివరించారు. సంరక్షణ.. జాగ్రత్తలు ఫ నిత్యం పాడి పశువులకు పచ్చి, ఎండు గడ్డితో పాటు పోషకాలతో కూడిన దాణా అందించాలి. తగినంత నీరు తాగించాలి. ఫ పశువులకు దోమలు కుట్టకుండా సంరక్షించాలి. సౌకర్యవంతంగా పశు శాలను ఏర్పాటు చేయాలి. ఫ గేదె ఈనిన 15 రోజుల వరకూ పాల కేంద్రాలకు పాలను వేయరాదు. జున్ను పాలు కలిస్తే మంచి పాలు కూడా పాడైపోతాయి. ఫ పాలు తీయడానికి ముందు నేలను ఊడ్చి నీటితో కడగాలి. చుట్టుపక్కల బురద, పేడ కుప్పలు ఉండరాదు. ఫ పాలు తీసే ముందు పాడి పశువును గోరువెచ్చని నీటితో కడగాలి. పొదుగును శుభ్రం చేయాలి. అలా కుదరకపోతే పొదుగును కడిగి పొడి వస్త్రంతో తుడవాలి. ఫ పాలు తీసే వ్యక్తి చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. తడి చేతులతో పాలు పితకరాదు. ఫ ముందు తీసిన పాలలో సూక్ష్మజీవులు ఎక్కువగా ఉండి, వెన్న శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి ముందు పాలను దూడకు వదలాలి. వెనుక తీసిన పాలను కేంద్రానికి పోయాలి. ఫ పాలు వేయడానికి స్టీలు, అల్యూమినియం పాత్రలనే వాడాలి. ఫ నీళ్లు కలపడం వల్ల పాలలో వెన్న శాతంతో పాటు మిగిలిన ఘన పదార్థాలు తగ్గిపోతాయి. దీంతో పాల రేటు కూడా తగ్గిపోతుంది. ఫ పాలు చుట్టుపక్కల వాసనను వెంటనే గ్రహిస్తాయి. కాబట్టి ఉల్లి, వెల్లుల్లి, ఎండు చేపలు, మురుగు నీటి వాసన వస్తే పాలు ఆ వాసనను గ్రహించి పులిసిన వాసన వస్తుంది. పాలు పితికిన వెంటనే శుభ్రమైన వస్త్రంతో వడకట్టాలి. ఫ రాత్రి తీసిన పాలతో తర్వాత తీసినవి కలపకూదదు. తాజా పాలు కొంచెం తియ్యని వాసన కలిగి ఉంటాయి. ఫ పాలల్లో ఎరుపు జీర, తరకలు కనిపిస్తే పశువుల్లో పొదుగు వాపు గాని, గాయం గాని ఉండి ఉండవచ్చు. వెంటనే పశు వైద్యుడిని సంప్రదించాలి. పై నియమాలు పాటిస్తే లాభాలు పొందవచ్చు. ఇదే జీవనాధారం నాకు 10 పాడి గేదెలు ఉన్నాయి. ఇందులో 4 చూడివి కాగా, 6 పాలిచ్చే గేదెలు. పూటకు సుమారు 30 లీటర్ల పాల దిగుబడి రాగా, నాకు పాల సేకరణ కేంద్రం కూడా ఉంది. దీనిద్వారా పాడి రైతుల నుంచి 50 లీటర్లు సేకరించి రిటైల్గా వినియోగదారులకు విక్రయిస్తున్నాను. ఈ విధంగా పాల ఉత్పత్తి, పాల సేకరణ ద్వారా జీవనం సాగిస్తున్నాను. –చోడపనీడి వీవీ సత్యనారాయణ, పాడి రైతు, వాడపాలెం, కొత్తపేట మండలం శుభ్రంగా ఉంచాలి పశువుల శాలలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి. ముఖ్యంగా పశువులు వదిలిన మూత్రం అక్కడే నిల్వ ఉండకుండా పళ్లానికి వెళ్లేలా శాలలో తగిన విధంగా ఏర్పాట్లు చేయాలి. పాడి పశువుల పోషణలో జాగ్రత్తలు పాటిస్తే నాణ్యమైన అధిక పాల ఉత్పత్తి సాధించడంతో పాటు మంచి వెన్న శాతం వస్తుంది. తద్వారా లాభాలు పొందవచ్చు. –ఎస్.మహేశ్వరరెడ్డి, ఏడీ, పశుసంవర్ధక శాఖ, వైద్యాధికారి, ప్రాంతీయ పశు వైద్యశాల, రావులపాలెం -
భజే శ్రీనివాసా.. శ్రీవేంకటేశా
ఫ వాడపల్లికి శ్రావణ శోభ ఫ భారీగా భక్తజనం రాక ఆత్రేయపురం: ఆ చిద్విలాసుని క్షేత్రం భక్తజనంతో మురిసింది.. గంట గంటకూ కోలాహలంగా మారింది.. శ్రావణ మాసం, ఆపై రెండో శనివారం విద్యార్థులకు సెలవుదినం కావడంతో కిక్కిరిసింది. గోవింద.. హరి గోవింద నామస్మరణతో భక్తజనం ప్రదక్షిణ చేస్తుండగా, మరింత మంది తోడవడంతో ఆధ్యాత్మికత పరవళ్లు తొక్కింది. కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి క్షేత్రం మొదటి శ్రావణ శనివారం పురస్కరించుకుని రద్దీగా మారింది. ఉదయం స్వామివారిని ప్రత్యేక పుష్పాలతో వేద పండితులు, అర్చకులు అలంకరించారు. సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం తదితర పూజలను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. ఏడు శనివారాల నోము ఆచరించిన భక్తులు ఏడు ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అలాగే వివిధ ప్రాంతాల ప్రజలు కాలినడకన స్వామి ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. ఆలయ ఆవరణలో వేలాది మందికి అన్న సమారాధన నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తుల రాక మొదలైంది. క్యూలో బారులు తీరారు. అయితే ఉదయం 9 గంటల సమయంలో వర్షం వచ్చినా దానికి లెక్క చేయకుండా ప్రదక్షిణలు చేశారు. దేవదాయ ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈఓ భూపతిరాజు కిశోర్కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పురాణ ప్రసిద్ధి చెందిన ర్యాలి జగన్మోహినీ కేశవస్వామి ఆలయం, ఆత్రేయపురం శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివార్లను భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. -
మత్తు మందు ఇచ్చి చోరీ
కాకినాడ క్రైం: కాకినాడ గాంధీనగర్లో వృద్ధురాలు ఓ మహిళ చేతిలో మోసానికి గురైంది. పెద్దమ్మగారు అంటూ పంచన చేరిన ఆ మహిళ జ్యూస్లో మత్తు మందు కలిపి వృద్ధురాలికి ఇచ్చి బంగారంతో ఉడాయించింది. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ గాంధీనగర్కు చెందిన వంగా మణి (79) ఇంట్లో ఒంటరిగా జీవిస్తుంది. ఆ విషయాన్ని గమనించిన ఓ మహిళ కొద్ది రోజులుగా మీ పొరుగునే ఉంటున్నానంటూ మాట కలిపింది. చేదోడువాదోడుగా ఉంటుండడంతో మణి ఆమెను నమ్మింది. ఈ క్రమంలో గత నెల 24న ఉదయం పెద్దమ్మగారు మీరు చాలా నీరసంగా ఉన్నారంటూ అభిమానం కురిపించి వృద్ధురాలి ఇంట్లో ఉన్న బీట్రూట్తో జ్యూస్ చేసి ఇచ్చింది. ఆ జ్యూస్లో మత్తు మందు కలిపి మణితో తాగించింది. ఆమె మత్తులోకి జారిన తర్వాత ఇంట్లో ఉన్న 64 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకెళ్లిపోయింది. మూడు రోజుల పాటు ఆ వృద్ధురాలు మత్తులోనే ఉంది. మూడు రోజుల తరువాత 27న లేచి చూసే సరికి ఆ మహిళ ఇచ్చిన జ్యూస్, అది తాగిన తర్వాత మత్తులోకి వెళ్లానన్న విషయం గుర్తొచ్చింది. కంగారుగా బీరువా వెతికేసరికి అందులో ఉన్న బంగారం చోరీకి గురైందన్న విషయం గుర్తించింది. ఇప్పటివరకూ ఆమె కోసం గాలించినా ఫలితంలేక పోలీసులను ఆశ్రయించింది. -
అతివేగం.. ఆపై నిర్లక్ష్యం
ఫ ఆటోను ఢీకొన్న ఆర్టీసీ బస్సు ఫ పది మందికి గాయాలు అంబాజీపేట: అతివేగం.. ఆపై నిర్లక్ష్యంగా ఆర్టీసీ బస్సును నడిపి ఓ ఆటోను బలంగా ఢీకొనడంతో అందులో ప్రయాణికులు పది మంది గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. అల్లవరం మండలం నుంచి పది మంది మహిళలు పాసింజర్ ఆటోలో ముంగండ వద్ద రొయ్యిల పరిశ్రమలో పని నిమిత్తం బయలు దేరారు. వీరి ఆటో అంబాజీపేట నాలుగు రోడ్ల కూడలికి వచ్చేసరికి రావులపాలెం నుంచి వయా సీ్త్రల ఆస్పత్రి మీదుగా అమలాపురం వెళుతున్న ఆర్టీసీ బస్సు అతివేగంగా దూసుకువచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న బెండమూరిలంకకు చెందిన బొంతు లక్ష్మీరాధిక, మట్టపర్తి వరలక్ష్మి, వాసర్ల పద్మ, బొంతు దుర్గ, గోడితిప్పకు చెందిన కొల్లి లక్ష్మి, సరెళ్ల అనంతలక్ష్మి, బొంతు సత్యవతి, పిల్లా దేవి, సరెళ్ల దేవి, దేవగుప్తానికి చెందిన ఆటో డ్రైవర్ యు.నాగరాజులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక మహిళ స్వల్ప గాయాలతో బయటపడింది. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా నాలుగు స్థానిక రోడ్ల సెంటర్లో రాజోలు, అమలాపురం ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులు అతి వేగంగా వెళుతున్నాయని, వీటిని నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు. -
నయవంచన!
ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు అంగన్ వాడీలు, ఆశావర్కర్లు, యానిమేటర్లను చాలా చోట్ల తొలగిస్తున్నారు. వర్కర్లకు ఆరు నెలలుగా జీతాలు లేవు. చంద్రబాబు, లోకేష్లు తాము ఎవ్వరినీ ఇబ్బంది పెట్టడం లేదని చెబుతుంటే ఇక్కడ మాత్రం ఉద్యోగులను తొలిగిస్తామని భయపెడుతున్నారు. – జె.కృష్ణవేణి, సీఐటీయూ జిల్లా కోశాధికారి, మండపేటసాక్షి అమలాపురం: ‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం’ అన్నట్టు కాంట్రాక్ట్.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే లక్ష్యంగా కూటమి నాయకులు చెలరేగిపోతున్నారు. చిరు ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్నారు. గత ఎన్నికలలో తమకు అనుకూలంగా పనిచేయలేదని కొందరు.. నాటి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారని మరికొందరిని తొలగించాలని ఆయా శాఖల ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే వలంటీర్లను తిరిగి విధులలోకి తీసుకోకుండా వారి భవిష్యత్ను గాలికి వదిలేసిన కూటమి నేతలు మరోవైపు అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, ఉపాధి పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు, డ్వాక్రా యానిమేటర్లను వేధింపులకు గురి చేస్తున్నారు. గాలిలో వలంటీర్ల భవితవ్యం సంక్షేమ పథకాల అమలులోనే కాదు.. కరోనా.. గోదావరి వరదల వంటి విపత్కర పరిస్థితుల్లో సామాన్యులకు సేవలందించిన వలంటీర్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం కరివేపాకులా తీసిపడేసింది. గతంలో ఈ వ్యవస్థపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పలు సందర్భాల్లో విషం చిమ్మారు. అయితే ఎన్నికల సమయంలో వారిపై ఆవ్యాజమైన ప్రేమ కురిపిస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే నెలకు రూ.ఐదు వేల గౌరవ వేతాన్ని రూ.పది వేలకు పెంచుతామని, వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని వాగ్దానం చేశారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటుతున్నా ఇప్పటి వరకు వారిని తిరిగి విధులలోకి తీసుకోలేదు. జిల్లాలో 9,581 మంది వరకు వలంటీర్లు ఉన్నారు. తెల్లవారు జామును ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందించడంతో పాటు సంక్షేమ పథకాల లబ్ధి అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడంలో కీలకంగా వ్యవహరించారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హాయాంలో కుల, మత, ప్రాంతాలనే తేడా లేకుండా వంద శాతం అర్హులకు పథకాలు అందించి అన్నివర్గాలకు అండగా నిలిచారు. అలాగే కారోనా విపత్కర పరిస్థితుల్లో రెండేళ్ల పాటు వారు అందించిన సేవలు దేశ వ్యాప్తంగా ప్రశంసలందుకున్నాయి. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ఇంటింటా ఆరోగ్య సర్వే చేయడం, మందులు అందించడం, కరోనా బాధితుల యోగక్షేమాలు తెలుసుకోవడం వంటి సేవలందించారు. ఇక 2022 గోదావరికి రికార్డు స్థాయిలో వరదలు వచ్చిన సమయంలో వలంటీర్ల సేవలకు బాధితులు జేజేలు పలికారు. పీకల్లోతు వరద నీటిలో బాధితులకు ఆహారం, తాగునీరు సరఫరా చేయడం, ఒక్క రోజులోనే జిల్లా వ్యాప్తంగా బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ, బాధితులకు రూ.రెండు వేల నగదు పరిహారం అందించారు. ఏటిగట్ల కాపలా తదితర సేవలందించారు. ఇన్ని సేవలు చేసిన వలంటీర్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం గాలిలో ఉంచడం ద్వారా ఎన్నికల హామీకు తాను కట్టుబడి ఉండనని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. వలంటీర్లను తొలగించాలని అధికారులపై ఒత్తిడి జిల్లాలో 9,500 మంది పరిస్థితి ప్రశ్నార్థకం రూ.పది వేలిస్తామని వాగ్దానం చేసి ఉద్యోగాలకు ఎసరు పెడుతున్న వైనం కూటమి కీలక నేతల ఒత్తిడి తాళలేక కలెక్టరేట్ వద్ద వలంటీర్ల ఆందోళన అంగన్వాడీ, యానిమేటర్లదీ అదే పరిస్థితి -
ప్రతిభకు ప్రోత్సాహం
రాయవరం: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసి వారికి ఉపకార వేతనాలను అందిస్తోంది నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పథకం (ఎన్ఎంఎంఎస్). కేంద్ర మానవ వనరుల శాఖ ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పొందేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహించి అర్హత పొందిన విద్యార్థులకు ఉపకార వేతనాలను అందిస్తుంది. ఈ పథకానికి దరఖాస్తుల స్వీకరణ ఆన్లైన్లో ప్రారంభమైంది. 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు అందించే స్కాలర్షిప్ పథకానికి ఏటా ఆదరణ పెరుగుతోంది. 2008–09 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం పేద విద్యార్థుల్లో ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు 2008–09లో ఎన్ఎంఎంఎస్ పథకాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల సంచాలకుల ఆధ్వర్యంలో స్కాలర్షిప్కు అర్హత పొందేందుకు ప్రవేశ పరీక్షను నవంబర్లో నిర్వహిస్తారు. ఎంపికై న విద్యార్థులకు ఏటా రూ.ఆరు వేల స్కాలర్షిప్ను వారి అకౌంట్లలో వేస్తారు. పరీక్షా విధానమిలా.. ● ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్షిప్ ప్రవేశ పరీక్షకు అర్హులు. ● 7వ తరగతిలో మార్కుల ఆధారంగా పరీక్షకు అర్హత కల్పిస్తారు. ● ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఏడవ తరగతిలో 50శాతం, మిగిలిన తరగతుల వారు 55 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. బీసీ, ఓసీ విద్యార్థులు పరీక్ష ఫీజుగా రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 చెల్లించాల్సి ఉంది. ● ఆబ్జెక్టివ్ విధానంలో 150 మార్కులకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. ● జిల్లా ప్రాతిపదికగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ● దరఖాస్తు చేసుకునే విద్యార్థుల తల్లితండ్రుల ఆదాయం ఏడాదికి రూ. 3.5 లక్షలకు మించి ఉండకూడదు. ● డివిజన్ కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఈ నెల ఐదో తేదీన నోటిఫికేషన్ జారీ కాగా, రాత పరీక్ష డిసెంబర్ 8న నిర్వహించనున్నారు. సెప్టెంబరు 6 ఆన్లైన్ దరఖాస్తుకు తుది గడువు. కాగా పరీక్ష ఫీజు చెల్లింపునకు సెప్టెంబరు 10 చివరి తేదీ. పరీక్ష రుసుమును ఆన్లైన్ దరఖాస్తులో ఇవ్వబడిన ఎస్బీఐ కలెక్ట్ లింక్ ద్వారా మాత్రమే చెల్లించాలి. పూర్తి వివరాలకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్లో లేదా సంబంధిత జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంప్రదించాల్సి ఉంది. ● గతేడాది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10,233 మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో 9,830 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ ఏడాది దరఖాస్తుదారుల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారుల అంచనా. విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్లు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం జిల్లాల వారీగా గతేడాది వచ్చిన దరఖాస్తులు, పరీక్షకు హాజరైన వారి వివరాలు ఇలా.. జిల్లా దరఖాస్తులు పరీక్ష రాసినవారు కాకినాడ 4170 3974 కోనసీమ 3121 3051 తూర్పుగోదావరి 2,942 2,805 -
ప్రపంచానికి మూలవాసులు ఆదివాసీలు
సాక్షి, అమలాపురం: నాగరికత పరిఢవిల్లుతున్న ప్రపంచ సమాజాలన్నింటికీ మూలవాసులు ఆదివాసీలని కలెక్టర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జిల్లా స్థాయిలో కలెక్టరేట్లో నిర్వహించారు. ఆదివాసీల ఆశయాలను గిరిజనులు స్ఫూర్తిగా తీసుకుని గిరిజనాభివృద్ధికి తోడ్పడాలని ఆయన సూచించారు. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు వారసత్వంగా ఉన్నాయని, ప్రపంచీకరణ, నాగరికత ముసుగులో ఆదివాసీలు ఉనికి కోల్పోతున్నారని వాటిని కాపాడుకోవడానికి మూలవాసీలు నిరంతరం పోరాడుతూనే ఉన్నారన్నారు. ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు హక్కుల పరిరక్షణకై జరిగిన చర్చల ఫలితంగా ఐక్యరాజ్యసమితి ఆగస్టు 9 ని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించిందన్నారు. నైపుణ్యాభివృద్ధి మిషన్ ద్వారా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించుకుని వలసలు నివారించుకోవాలని సూచించారు. ఆదివాసీ సంఘాల ప్రతినిధులు లేవనెత్తిన అంశాలైన నకిలీ గిరిజన ధ్రువపత్రాల నిర్మూలన, పందుల పెంపకానికి స్థలాల కేటాయింపు, కమ్యూనిటీ హాలు, కళ్యాణ మండపం నిర్మించాలని అధికారులను కోరారు. ఎస్టీ స్టడీ సర్కిల్, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన తదితర సమస్యల పరిష్కారం దిశగా కృషి చేయనున్నట్టు తెలిపారు. ఆదివాసీ సంఘాల పెద్దలను కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, ఆర్టీవో జి.కేశవవర్థనరెడ్డి, ఉప్పు శ్రీనివాస్, మానుపాటి గోవిందరావు, బండారు సత్యనారాయణ, బండారు గోవింద్, వికాస జిల్లా మేనేజర్, జి.రమేష్ తదితరులు పాల్గొన్నారు. ● కలెక్టర్ మహేష్కుమార్ ● ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం -
మహిళా ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
అమలాపురం టౌన్: జిల్లాలో మహిళలు, బాలలు, యువతులు వివిధ సమస్యలపై ఇచ్చే ఫిర్యాదులపై మహిళా పోలీసులు తక్షణమే స్పందించాలని ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు సూచించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు మహిళా పోలీసు వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా శాఖ ప్రతినిధుల బృందం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కృష్ణారావును శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా మహిళా పోలీసు బృందంతో ఎస్పీ కొద్దిసేపు మాట్లాడారు. మహిళా పోలీసులు తమ సమస్యలను ఎస్పీ ముందు ఉంచి వాటిని పరిష్కరించాలని కోరారు. జిల్లా మహిళా పోలీసుల అసోసియేషన్ అధ్యక్షురాలు కొప్పిశెట్టి వెంకట ధనలక్ష్మి ఆధ్వర్యంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటు నాగ సుశీల, అదనపు ప్రధాన కార్యదర్శి టి.రాజేశ్వరి, కార్య నిర్వాహక ఉపాధ్యక్షురాలు ఎన్.ఝాన్సీ, సంయుక్త కార్యదర్శి జి. శ్రీకావ్య, కార్యవర్గ సభ్యులు సమనస పద్మ, రెడ్డి సువర్ణ లక్ష్మి, కె.శైలజ, జె.లక్ష్మి, ఎస్కే గౌస్య, తేజస్వి తదితరులు ఎస్పీని కలిసిన వారిలో ఉన్నారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు -
జాతీయస్థాయి ప్రదర్శనలు అభినందనీయం
సాక్షి అమలాపురం: జైపూర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మెర్స జాతీయస్థాయిలో స్కూల్ ఇన్నోవేటివ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇన్నోవేటివ్ కాంటెస్ట్ 2024’కు తొండవరం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపిక కావడం అభినందనీయమని కలెక్టర్ మహేష్కుమార్ అన్నారు. దేశవ్యాప్తంగా వచ్చిన దాదాపు రెండువేల ఎంట్రీలలో ఈ పాఠశాలకు చెందిన ఎన్. శ్రీరామ్, శ్రీమనస్విని, పార్వతి ఎంపికయ్యారని ఆయన పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం విద్యార్థుల ప్రయోగాన్ని ఆయన పరిశీలించారు. పాఠశాల మెంటర్ గణేష్ నరసింహారావు నేతృత్వంలో విద్యార్థులు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరిగే జాతీయస్థాయి ప్రదర్శనకు ఎంపిక కావడం జిల్లాకే గర్వకారణమన్నారు. జాతీయస్థాయికి కౌన్సిల్ ఏఐసీటీఈ నుంచి రూ.94 వేలు గ్రాంట్ పొందిన ఏకై క ప్రాజెక్టుగా నిలిచిందన్నారు. ఫ్యాక్టరీల నుంచి విడుదలయ్యే కార్బన్ డయాకై ్సడ్ నుంచి ఎదురయ్యే కాలుష్యాన్ని విద్యార్థులు తయారు చేసిన చిమ్నీ (ఫిల్టర్) కొంత వరకు నియంత్రిస్తుందని తెలిపారు. కుట్టి క్లీనర్ రోబోకు అభినందన ఉప్పలగుప్తం: విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక రంగం వైపు దృష్టి సారించి జాతీయ స్థాయి అటల్ మారథాన్ పోటీల్లో 376వ స్థానాన్ని దక్కించుకోవడం అభినందనీయమని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. ఈ పోటీల్లో ఉప్పలగుప్తం మండలం, గొల్లవిల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు తయారు చేసిన కిట్టీ ఫ్లోర్ క్లీనర్ రోబోట్ 2024 శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో విద్యార్థులు నూకల రేవతి భాను, మదిరి తనుష్ తేజ ప్రదర్శించి విధివిధానాలను కలెక్టర్కు వివరించారు. -
రోడ్డెక్కిన చిరుద్యోగులు
గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసుకునే అంగన్వాడీలపై సైతం కూటమి నాయకులు వేధిస్తున్నారు. జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, డీఆర్డీఏ పరిధిలోని యానిమేటర్లు, మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలలో పనిచేసేవారు, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు కొత్త ప్రభుత్వంలో కూటమి నాయకుల నుంచి వివక్షకు గురవుతున్నారు. జిల్లాలో 1,637 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా మినీ కేంద్రాలు 89 మంది వరకు ఉన్నాయి. వీటిలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు కలిపి 3,274 మంది ఉండగా, మినీలో 89 మంది పనిచేస్తున్నారు. వీరిని సైతం కూటమి నాయకులు వదలడం లేదు. అలాగే జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ)లలో పనిచేసే యానిమేటర్లకు సైతం రాజకీయ వేధింపులు తప్పడం లేదు. జిల్లాలో ఉన్న సుమారు 1,500 మంది వరకు యానిమేటర్లను తొలగించాలని కూటమి పార్టీలకు చెందిన కీలక ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఒక్క కొత్తపేట నియోజకవర్గం పరిధిలోనే 16 మంది వరకు యానిమేటర్లను తొలగించాలనే వత్తిడి ఉంది. ఈ వేధింపులు తాళలేక ఇటీవల ఆయా ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారంటే రెండు నెలల పాలన ఎంత అథమ స్థాయిలో ఉందో అర్థం చేసుకోచ్చు. -
జగన్ పేరుపైనా రాజకీయ కక్ష సాధింపేనా?
రాష్ట్ర మాల మహానాడు ప్రధాన కార్యదర్శి బాబ్జీ అమలాపురం టౌన్: విజయవాడ నడి బొడ్డులో అంబేద్కర్ సామాజిక న్యాయ మహా శిల్పం బోర్డుపై పచ్చ మూకలు చీకటి దాడి చేయడంతో పాటు ఆ భారీ విగ్రహాన్ని నెలకొల్పిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేరు ఉన్న అక్షరాలను కూడా ధ్వంసం చేయడం ఆటవిక చర్యేనని అమలాపురానికి చెందిన రాష్ట్ర మాల మహానాడు ప్రధాన కార్యదర్శి ఉండ్రు బాబ్జీ ధ్వజమెత్తారు. మహా శిల్పం బోర్డుపై స్టీల్ మెటల్తో ఉన్న జగన్ అక్షరాలను కూడా ధ్వంసం చేశారంటే ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపేనని ఆరోపించారు. అమలాపురంలో ఆయన విడుదల చేసిన ఓ ప్రకటనలో ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాతగా, దేశానికి ప్రజాస్వామ్య విలువలను అందించిన మహానీయుడు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ఎన్నికల వరకూ రాజకీయాలు తప్ప, ఆ తరువాత ప్రజా రంజక పాలనపై దృష్టిపెట్టాలని ఆయన అన్నారు. ఈ దాడి పరోక్షంగా అంబేడ్కర్ను అవమాన పరచడమేనని అన్నారు. ఘటన సమయంలో సరిగా స్పందించని పోలీసులు ఇప్పటికై నా దోషులను కఠినంగా శిక్షించాలని బాబ్జీ డిమాండ్ చేశారు. -
ఇన్స్పైర్ మనక్కు ప్రాజెక్టుల ఆహ్వానం
సాక్షి, అమలాపురం: సమగ్ర శిక్ష, విద్యాశాఖ సంయుక్తంగా చేపట్టే ‘ఇన్స్పైర్ మనక్ 2024–25’ కోసం వివిధ ప్రాజెక్టుల నమోదుకు నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్టు కలెక్టర్ ఆర్.మహేష్కుమార్ తెలిపారు. శుక్రవారం ఈ మేరకు పాఠశాల వారీగా ఐదు ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు కలెక్టరేట్లో వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్రస్థాయిలో జిల్లాకు మంచి పేరు తీసుకు వచ్చే ప్రాజెక్టులను ఎంపిక చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి రెండు వారాలకు తనతో పాటు, జిల్లా విద్యాశాఖ అధికారి పాఠశాల స్థాయి ప్రాజెక్టులను సమీక్షిస్తామని ఆయన పేర్కొన్నారు. డీఈవో ఎం.కమలకుమారి ఉప విద్యాశాఖ అధికారి సూర్యప్రకాష్ జిల్లా సైన్స్ అధికారి జీవీవీ సుబ్రహ్మణ్యం, సైన్స్ ప్రాజెక్ట్ అధికారి కడలి సాయిరాం తదితరులు పాల్గొన్నారు. సహకార సంఘాల డేటా ఆన్లైన్ చేయాలి అమలాపురం రూరల్: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న 166 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలలోని డేటాను ఆన్లైన్ చేయాలని జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి సంఘాల అధికారులను ఆదేశించారు. శుక్రవారం అమరావతి నుంచి రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ కార్యదర్శి అహ్మద్ బాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఈ విషయమై దిశా నిర్దేశం చేశారు. సమీక్ష అనంతరం జేసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ రెండు నాటికి రికార్డులను ఆన్లైన్ చేయాలని ఆదేశించిందని అన్నారు. ఈ మేరకు 166 ఫ్యాక్స్ కేంద్రాలలో సైట్ ప్రిపరేషన్కు చర్యలు చేపట్టి డేటాను ఆన్లైన్ చేయాలని ఆదేశించారు. రోజువారీగా ఆన్లైన్ చేసిన డేటాపై సమీక్షిస్తామన్నారు. అత్యంత పారదర్శకంగా, అవకతవకలకు ఆస్కారం లేకుండా ఆన్లైన్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఆమె తెలిపారు. వెబ్ ల్యాండ్ రెవెన్యూ రికార్డులు, మీసేవ మార్కెఫెడ్ కామన్ సర్వీస్ సెంటర్, సున్నా వడ్డీ పంట రుణాలు, తదితర అంశాలను ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 27 శాతం మాత్రమే కంప్యూటరైజ్ చేసినట్టు ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి ఎస్.మురళీకృష్ణ, సీనియర్ ఇన్స్పెక్టర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలల్లో డీఈఓ తనిఖీ హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు షోకాజ్ జారీ తాళ్లరేవు: మండల పరిధిలోని పలు పాఠశాలల్లో డీఈఓ పిల్లి రమేష్ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేశారు. విద్యార్థుల ప్రగతిని స్వయంగా పరిశీలించారు. పరిమితికి మించి సెలవులు పెట్టిన ఒక పాఠశాల హెచ్ఎంతో పాటు, మరో పాఠశాలలో పాఠశాల నిర్వహణ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మండల పరిధిలోని పటవల పంచాయతీ కొత్తూరు ఎంపీపీ పాఠశాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. స్కూల్ హెచ్ఎం ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారు 35 సెలవులు వాడడంతో పాటు సరైన సెలవు రికార్డుల నిర్వహించకపోవడంపై ఆమెకు షోకాజ్ జారీ చేశారు. అనంతరం కోరింగ జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ను సందర్శించి నాడు–నేడు పనులు, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. పాఠశాల నిర్వహణ, పథకాల రికార్డులు సక్రమంగా లేకపోవడంతో హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులందరికీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మండల విద్యాశాఖ కార్యాలయాన్ని సందర్శించి యూ డైస్ ప్లస్, స్టూడెంట్ డ్రాప్ బాక్స్ గురించి సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు. పాఠశాలల్లో విద్యాకానుకల పంపిణీ, మండలానికి కావలసిన కిట్ల గురించి అధికారులతో చర్చించారు. ఆయన వెంట సీఆర్పీలు, ఆఫీసు సిబ్బంది పాల్గొన్నారు. 12న వికాసలో జాబ్ మేళా కాకినాడ సిటీ: ఈ నెల 12వ తేదీ సోమవారం వికాస కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు వికాస పీడీ కె.లచ్చారావు శుక్రవారం తెలిపారు. ఈ జాబ్మేళాలో హెచ్డీఎఫ్సీ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్, సీఎంఆర్ టెక్స్టైల్స్ అండ్ జ్యూయలరీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్, కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్, క్యాషియర్ అండ్ సెక్యూరిటీ, రాక్మెన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, డిక్సాన్, హోండాయ్ మోబీస్ కంపెనీల్లో టెక్నిషియన్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు లచ్చారావు తెలిపారు. ఈ ఉద్యోగాలకు ఎస్ఎస్సి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమో, డిగ్రీ, బీటెక్ ఉత్తీర్ణులైన 35 ఏళ్ల లోపు అభ్యర్థులు అర్హులన్నారు. వీరికి నెలకు రూ.12 వేల నుంచి రూ. 20 వేల వరకు జీతం, ఇన్సెంటివ్స్, భోజనం, వసతి, రవాణా సౌకర్యం ఆయా ఉద్యోగాలను బట్టి ఉంటుందన్నారు. -
పెరిగిపోతున్న కూటమి అరాచకాలు
రాజోలు: కూటమి ప్రభుత్వ అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అన్నారు. విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతి వనం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాలు, విద్యుద్దీపాలను ధ్వంసం చేయడం దారుణమన్నారు. ఈ ఘటనను నిరసిస్తూ గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో తాటిపాక సెంటర్లో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆందోళన వ్యక్తం చేశారు. అంబేడ్కర్ను నిరంతరం స్మరించుకునేందుకు విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారని, ఆ శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం చాలా దారుణమన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాజకీయ కక్ష సాధింపు చర్యలు పెరిగిపోయాయని, భౌతికదాడులతో పాటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారన్నారు. జెడ్పీటీసీ సభ్యురాలు మట్టా శైలజ, మాజీ ఏఎంసీ చైర్పర్సన్ గుబ్బల రోజారమణి, మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కట్టా శ్రీనివాసరావు, కోటిపల్లి ఏస్తేరు రాణి తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి గొల్లపల్లి -
జిల్లాకు ఐదు సూపర్ లగ్జరీ బస్సులు
అమలాపురం రూరల్: జిల్లాకు ఐదు సూపర్ లగ్జరీ బస్సులను కేటాయించారు. అమలాపురం ఆర్టీసీ డిపోకు మూడు, రాజోలు డిపోకు రెండు చొప్పున బస్సులను కేటాయించినట్లు రవాణా శాఖ మంత్రి ఎం.రామప్రసాద్రెడ్డి గురువారం ఏలూరులో ప్రకటించారు. ఈ బస్సులను కోనసీమ జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి ఎస్.శ్రీనివాస్, అమలాపురం డీఎం చల్లా సత్యనారాయణ మూర్తికి మంత్రి అందజేశారు. ఇవి హైదరాబాద్, విశాఖపట్నం రూట్లలో తిరుగుతాయని డీఎం మూర్తి తెలిపారు. వీటిని ప్రయాణికుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. కలెక్టరేట్ విద్యుత్ ఫీడర్ ప్రారంభం అమలాపురం రూరల్: అమలాపురం సెక్షన్ పరిధిలో బాలయోగి ఘాట్ విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి కొత్తగా ఏర్పాటు చేసిన 11 కేవీ కలెక్టరేట్ ఫీడర్ను రాజమహేంద్రవరం ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజినీర్ టీవీఎస్ఎన్ మూర్తి గురువారం ప్రారంభించారు. దీనిని సుమారు రూ.35 లక్షలతో ఏర్పాటు చేశామన్నారు. ఈ ఫీడర్ ద్వారా కలెక్టరేట్, ఆర్టీఓ కార్యాలయం, గవర్నమెంట్ హాస్పటల్, కోర్టులు, ప్రభుత్య కార్యాలయాలకు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. కార్యక్రమంలో అమలాపురం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మోకా రవికుమార్, రాజమహేంద్రవరం కనెక్షన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వై.డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.. జాబ్ మేళాలో 83 మందికి ఉద్యోగాలు అమలాపురం రూరల్: అమలాపురంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో గురువారం జాబ్మేళా జరిగింది. కేఎల్ గ్రూప్ అమెజాన్ సంస్థ చైన్నెలో పనిచేయడానికి ఇంటర్వ్యూలు జరిగాయి. ఇందులో 83 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు లభించాయని జిల్లా ఉపాధి కల్పన అధికారి ఇ.వసంతలక్ష్మి తెలిపారు. ఉద్యోగానికి ఎంపికై న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అంచెలంచెలుగా ఎదగాలని సూచించారు. ఉద్యోగం చేస్తూ నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలని అన్నారు. ఈ మేళాలో 189 యువత పాల్గొనగా, ఎంపికై న వారికి నియామక పత్రాలు అందజేశారు. పంపా నుంచి 100 క్యూసెక్కుల విడుదల అన్నవరం: అల్పపీడనం ప్రభావంతో కొద్ది రోజులుగా భారీ వర్షాలు పడుతుండటంతో అన్నవరం పంపా రిజర్వాయర్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఫలితంగా రిజర్వాయర్ నీటిమట్టం గురువారం సాయంత్రానికి 100.3 అడుగులకు చేరుకుంది. రిజర్వాయ్ర్లోకి 160 క్యూసెక్కుల చొప్పున ఇన్ఫ్లో ఉంటటంతో నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. రిజర్వాయర్ గరిష్ట నీటిమట్టం 103 అడుగులు కాగా ప్రస్తుతం 100.3 అడుగులకు చేరింది. దీంతో ముందు జాగ్రత్తగా బ్యారేజీ రెండో నంబర్ గేటు ఎత్తి 100 క్యూసెక్కుల నీటిని సముద్రానికి విడుదల చేసినట్లు ఇరిగేషన్ పెద్దాపురం డివిజన్ ఈఈ శేషగిరిరావు గురువారం తెలిపారు. పంపా ఆయకట్టుకు 130 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. పంపా మెయిన్ కెనాల్ ద్వారా 120 క్యూసెక్కులు, సబ్సిడరీ డ్యామ్ ద్వారా పది క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. పంపా రిజర్వాయర్ గరిష్ట నీటి నిల్వ 0.43 టీఎంసీ కాగా ప్రస్తుతం 0.33 టిఎంసీ నీరు నిల్వ ఉంది. -
నేడు యూత్ మారథాన్ ర్యాలీ
అమలాపురం రూరల్: అమలాపురంలో యూత్ మారథాన్ ర్యాలీ నిర్వహణకు ఏర్పాట్లు చేశామని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ నియంత్రణ అధికారి సీహెచ్వీ భరతలక్ష్మి గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం ఈ ర్యాలీని భట్నవిల్లి వద్ద జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ప్రారంభిస్తారన్నారు. హెచ్ఐవీ ఎయిడ్స్పై యువతకు అవగాహన పెంచడానికి జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ సంస్థ కార్యాచరణ చేసిందన్నారు. ఇందులో భాగంగా మారథాన్ రెడ్ రన్–5 కిలోమీటర్లు జరుగుతుందన్నారు. ఉదయం 6 గంటలకు భట్నవల్లి బైపాస్ వద్ద నుంచి పేరూరు వై.జంక్షన్ వరకూ ఈ రన్ నిర్వహిస్తామన్నారు. ఈ నెల 13న ఉదయం 10.30 గంటలకు క్విజ్ పోటీలను అమలాపురంలోని ఏరియా హాస్పిటల్ జిల్లా సత్వర వైద్య సేవల కేంద్రం మీటింగ్ హాల్లో జరుపుతామన్నారు. -
పాఠశాల కమిటీల్లో పచ్చపాతం
ఆత్రేయపురం: పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికల్లో ‘పచ్చ’పాతం చూపారు.. అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు.. వైఎస్సార్ సీపీ అభ్యర్థి గెలిస్తే, అధికారులు మాత్రం డిపాజిట్ ఓట్లు కూడా దక్కించుకోలేని టీడీపీ నేత గెలిచినట్లు ప్రకటించారు. దీంతో ఈ పాఠశాల తమకొద్దు.. తమ పిల్లల టీసీలు ఇచ్చేయండంటూ తల్లిదండ్రులు ఆందోళన చేశారు. టీసీల కోసం దరఖాస్తులను హెచ్ఎమ్ సత్యనారాయణకు సమర్పించారు. ఇదంతా ఆత్రేయపురం పెదహరిజన వాడలో మండల పరిషత్ పాఠశాలలో గురువారం చోటుచేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు విద్యా కమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఆత్రేయపురం పెదహరిజన వాడ మండల పరిషత్ పాఠశాలలో విద్యా కమిటీ ఎన్నికలు నిర్వహించారు. పాఠశాలలో 21 మంది విద్యార్థులు ఉండగా 15 మంది ఓటర్లుగా గుర్తించారు. ఇందులో 12 మంది వైఎస్సార్ సీపీ బలపర్చిన అభ్యర్థికి అనుకూలంగా వేశారు. కేవలం 3 ఓట్లు మాత్రమే అధికార టీడీపీ బలపర్చిన అభ్య ర్థికి లభించాయి. గెలిచిన వైఎస్సార్ సీపీ అభ్యర్థిని కాకుండా టీడీపీ బలపర్చిన అభ్యర్థిని విజేతగా అధికారులు ప్రకటించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇదెక్కడి న్యాయం అంటూ నిలదీశారు. అయినా సరే అధికారులు అవేమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. టీసీలు ఇప్పించండి ఓటమి పాలైన అధికార పార్టీ నేతను విజేతగా ప్రకటించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు తక్షణమే పాఠశాల నుంచి టీసీలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. దరఖాస్తులను హెచ్ఎం సీహెచ్ సత్యనారాయణకు అందజేయబోగా.. ఆయన వాటిని తీసుకోకుండా వెళ్లిపోయారు. దీంతో తల్లిదండ్రులంతా తమ పిల్లలతో వెళ్లి ఎంఈఓ వరప్రసాద్, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకు వెళ్లారు. టీసీలు మంజూరు చేసేందుకు వారూ నిరాకరించడంతో తల్లిదండ్రులు ఆందోళన కొనసాగించారు. 24 గంటల్లో తమ పిల్లల టీసీలు ఇవ్వకపోతే కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పాఠశాలలో 21 మంది విద్యార్థులు ఉండగా, 15 మంది టీసీలు ఇవ్వాలని అధికారులను పట్టుబడుతున్నారు. దీనిపై ఎంఈఓ వరప్రసాద్ను వివరణ కోరగా, చైర్మన్ ఎన్నికలపై జరిగిన ఆందోళన నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల టీసీలు ఇవ్వాలని డిమాండ్ చేసినా మంజూరు చేయలేదన్నారు. శుక్ర, శనివారాల్లో తల్లిదండ్రులతో సామరస్యంగా చర్చిస్తామన్నారు. ఒకేసారి 12 మంది విద్యార్థులకు టీసీలను మంజూరు చేస్తే తాము ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందన్నారు.ఫ ఆత్రేయపురంలో అధికారుల అత్యుత్సాహం ఫ చైర్మన్గా గెలిచింది వైఎస్సార్ సీపీ నేత ఫ కానీ టీడీపీ అభ్యర్థికి పట్టం కట్టిన అధికారులు -
జిల్లాలో ‘ఎస్ఎంసీ’ ఎన్నికలు
రాయవరం: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ)ల ఎన్నికలు గురువారం నిర్వహించారు. ఆయా హెచ్ఎంల నేతృత్వంలో జిల్లాలో 1,273 ప్రాథమిక, 72 ప్రాథమికోన్నత, 237 ఉన్నత పాఠశాలల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 544 ప్రాథమిక, 25 ప్రాథమికోన్నత, 78 ఉన్నత పాఠశాలల్లో ఏకగ్రీవమయ్యాయి. 728 ప్రాథమిక, 47 ప్రాథమికోన్నత, 159 ఉన్నత పాఠశాలల్లో చేతులెత్తే విధానంలో ఎన్నికలు చేపట్టారు. కోరం లేక మలికిపురం మండలం గొల్లపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎన్నిక వాయిదా పడింది. ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్యలో తరగతుల వారీగా కమిటీ సభ్యుల ఎన్నిక చేతులెత్తే విధానంలో జరిగింది. తరగతికి ముగ్గురు చొప్పున సభ్యులను తల్లిదండ్రులు ఎన్నుకున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఎన్నికై న కమిటీ సభ్యులు చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నారు. రెండేళ్ల పదవికి కమిటీలు ఎన్నికయ్యాయి. వీటిని కలెక్టర్ మహేష్కుమార్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.కమలకుమారి, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ ఎ.మధుసూదనరావు, ఎస్ఎంసీ ఎన్నికల నోడల్ అధికారి, సీఎంఓ బీవీవీ సుబ్రహ్మణ్యం తదితరులు పర్యవేక్షించారు. -
అయ్యో ‘పాప’ం
రాజానగరం: నవమాసాలు మోసి కన్న పాపను పుట్టిన పది రోజులకే ఆ తల్లి దూరం చేసుకుంది. బిడ్డ దూరమైన బాధతో నిద్రలేని రాత్రిళ్లు గడిపింది. చివరకు నాలుగేళ్ల తర్వాత కలెక్టర్ను కలిసి తన గోడు విన్నవించింది. అధికారులు విచారణ చేసి తన బిడ్డను అప్పగించాలని కోరింది. వివరాల్లోకి వెళితే.. రాజానగరం మండలం తూర్పుగానుగూడెం గ్రామానికి చెందిన కొర్రేపు ఆదిలక్ష్మి, అప్పారావు భార్యభర్తలు. 2019 అక్టోబరు 30న రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రిలో ఆదిలక్ష్మి ఆడపిల్లకు జన్మనిచ్చింది. వారం రోజుల తరువాత బిడ్డతో ఇంటికి తిరిగివచ్చింది. అప్పారావుకు మద్యం తాగే అలవాటు బాగా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కొందరు అతడికి మద్యం ఆశ చూపి, బిడ్డకు తమకివ్వాలని అడిగారు. అంగీకరించిన అప్పారావు తన పది రోజుల బిడ్డను వేరొకరికి అప్పగించేశాడు. ఈ విషయంపై ఆదిలక్ష్మి తన భర్తను గట్టిగా నిలదీసింది. దీంతో అతడు ఇంటి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన జరిగిన నాలుగేళ్లు పూర్తయ్యింది. పరారైన అప్పారావు మళ్లీ తిరిగి తన భార్య దగ్గరకు వచ్చాడు. బిడ్డ సంగతి ఆదిలక్ష్మి మర్చిపోయి ఉంటుందని భావించాడు. కానీ ఆమె మళ్లీ తన భర్తను నిలదీసింది. మద్యం మత్తులోనే బిడ్డను వేరొకరికి అప్పగించానని అప్పారావు ఒప్పుకున్నాడు. ఎలాగైనా పాపను తిరిగి దక్కించుకోవాలని ఆ భార్యభర్తలు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ప్రశాంతిని కలిసి తమ సమస్యను తెలిపి, న్యాయం చేయాలని కోరారు. స్పందించిన కలెక్టర్ భార్యాభర్తల వేదనను అర్థం చేసుకున్న కలెక్టర్ ప్రశాంతి వెంటనే స్పందించారు. ఆమె ఆదేశాలపై జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ అధికారి విజయకుమారి ఆధ్వర్యంలో ఇన్చార్జి తహసీల్దార్ సునీత, పీహెచ్సీ వైద్యురాలు డాక్టర్ ఉదయ్ ఏంజిల్, ఏఎస్సై వెంకటేశ్వర్లు గురువారం తూర్పుగానుగూడెంలో విచారణ నిర్వహించారు. పాపను వేరొకరికి అప్పగించడంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరు నర్సులను పిలిచి వివరాలు అడిగారు. మొదట తెలియదన్నప్పటికీ తర్వాత నిజాన్ని అంగీకరించారు. ఆ పాపను తీసుకున్న టీచర్కు బదిలీ అయిపోయిందని, ఎక్కడ ఉందో తమకు తెలియదని చెప్పారు. ఈ ఘటనపై విచారణకు వచ్చిన ఒక అధికారి మాట్లాడుతూ పాప ఆచూకీపై విచారణ కొనసాగుతోందని, పూర్తయిన తర్వాత జిల్లా కలెక్టర్కు నివేదిక అందజేస్తామన్నారు. పది రోజుల బిడ్డను వేరొకరికి ఇచ్చేసిన తండ్రి నాలుగేళ్లుగా తల్లి ఎదురుచూపులు కలెక్టర్ ఆదేశాలతో అధికారుల విచారణ -
సమన్వయంతో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహిద్దాం
ఆ ప్రతిపాదన విరమించుకోండి రాష్ట్ర రహదారులపై టోల్ చార్జీలు వసూలు చేయాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విధానం సరికాదు. భవిష్యత్లో రాష్ట్రంలో ఉన్న 12,650 కిలో మీటర్ల రాష్ట్ర రహదారులపై టోల్ వసూలు చేసే ప్రమాదం ఉంది. రోడ్లను అభివృద్ధి చేయడం, వాటిని సక్రమంగా నిర్వహించడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. వాహన రిజిస్ట్రేషన్ల సమయంలో లైఫ్ ట్యాక్స్, డీజిల్, పెట్రోలు, రోడ్లపై సెస్లు వసూలు చేస్తూ రూ.కోట్లలో ఆదాయం పొందుతున్న ప్రభుత్వం ఇప్పుడు టోల్ పేరుతో అదనపు వసూళ్లకు ప్రతిపాదనలు చేయడం తగదు. – కారెం వెంకటేశ్వరరావు, సీపీఎం జిల్లా కన్వీనర్ సాక్షి, అమలాపురం: ‘మేము అధికారంలో వస్తే రాష్ట్ర ఆదాయం పెంచుతాం.. అభివృద్ధి పనులు చేస్తాం.. సంక్షేమ పథకాలను అమలు చేస్తాం’ ఎన్నికల ప్రచార సభల్లో ఎక్కడకు వెళ్లినా టీడీపీ అధినేత హోదాలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలివి. ఇది నమ్మిన జనం కూటమికి ఓట్లు వేశారు. అయితే బాబు మార్కు ఆదాయం పెంచడం వేరే అని ఇప్పుడు ప్రజలకు అర్థమవుతోంది. గత ప్రభుత్వ హయాంలో రూ.కోట్లతో ఆధునీకరించిన రోడ్లపై టోల్ గేట్లు ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టనర్షిప్ (పీపీపీపీ)లో భాగంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలు కీలక రహదారులను ఎంపిక చేసి ‘టోల్’ వసూలుకు రెడీ అయ్యింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కీలక రహదారుల్లో టోల్ వసూలుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. తొలి దశలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం నుంచి బొబ్బర్లంక (36.40 కిలోమీటర్లు), రాజవరం నుంచి పొదలాడ (30 కిలోమీటర్లు), కాకినాడ జిల్లా పరిధి కాకినాడ నుంచి జొన్నాడ (55 కిలోమీటర్లు), రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం మీదుగా భద్రాచలం (102 కిలోమీటర్లు) వరకూ ఉన్న ఆర్అండ్బీ రహదారులను టోల్ రోడ్లుగా గుర్తించి వసూలుకు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆర్అండ్బీ నుంచి ప్రభుత్వం సేకరించనుంది. ఇక్కడ టోల్ వసూలును బట్టి మిగిలిన కీలక రహదారుల్లో సైతం టోల్ నిర్ణయిస్తారు. కాసుల వేటకు రెడీ కోనసీమ జిల్లాలో అమలాపురం– బొబ్బర్లంక రహదారి అత్యంత కీలకం. జిల్లా కేంద్రం అమలాపురం నుంచి రావులపాలెం, అక్కడి నుంచి అటు తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళతారు. అలాగే రాజమహేంద్రవరం, భద్రాచలం వెళ్లేవారు సైతం ఇదే రహదారిపై రాకపోకలు సాగిస్తుంటారు. పొదలాడ– రాజవోలు రహదారి సైతం కీలకమైంది. రాజోలు దీవి నుంచి విజయవాడ, ఇటు రావులపాలెం మీదుగా రాజమహేంద్రవరం వెళ్తుంటారు. ఈ రెండు రహదారులపై వాహనాల తాకిడి అధికం. ప్రయాణికుల వాహనాలతోపాటు వ్యవసాయ, ఉద్యాన పంటలు, ఆక్వా ఉత్పత్తులు సైతం అధికంగా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. ఫ కాకినాడ నుంచి జొన్నాడ రహదారి ఉమ్మడి జిల్లాలోనే అత్యంత ప్రధానమైంది. ఇది కాకినాడ, కోనసీమ జిల్లాల పరిధిలో ఉంది. మధ్యలో రామచంద్రపురం, మండపేట పట్టణాలు కూడా ఉన్నాయి. వ్యవసాయ, ఉద్యాన పంటల ఉత్పత్తులతోపాటు కోడిగుడ్ల ఎగుమతి సైతం అధికంగా ఉంటోంది. రాజమహేంద్రవరం నుంచి ఏజెన్సీకి వెళ్లే రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు రహదారికి సైతం వాహనాల తాకిడి అధికం. కాకినాడ, రాజమహేంద్రవరం, కోనసీమ జిల్లాల నుంచి చింతూరు మీదుగా ఛత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రాలకు ఈ రహదారిపై ఉమ్మడి జిల్లా నుంచి ఎగుమతులు అధికంగా జరుగుతుంటాయి. ఇటువంటి కీలక రహదారులపై టోల్ గేట్లు పెట్టడం ద్వారా భారీగా ఆదాయాన్ని ఆర్జించాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. ఇప్పటికే జాతీయ రహదారులపై ఎడాపెడా టోల్ వసూళ్లతో వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. రావులపాలెం నుంచి విజయవాడ రహదారిలో ఏకంగా నాలుగు టోల్ గేట్లు ఉన్నాయి. వీటికి అదనంగా స్టేట్ హైవేలపై కూడా టోల్ గేట్లు మొదలైతే ప్రయాణికులపై మరింత భారం పడనుంది. అన్ని రోడ్లలోనూ.. స్టేట్ హైవేలుగా గుర్తించిన ఈ రోడ్లతోపాటు ఇంచుమించు అన్ని రోడ్లను పీపీపీ పద్ధతిలో ఆధునీకరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టత ఇచ్చారు. స్టేట్ హైవేలు అన్నింటినీ పీపీపీ పరిధిలోకి తీసుకు రావాలని ఆయన ఆదేశించారు. తద్వారా ప్రతి స్టేట్ హైవేలపై భవిష్యత్లో టోల్ వసూలు తప్పదని ఆయన తేల్చి చెప్పారు. గత వైఎస్సార్ సీపీ హయాంలో ఆధునీకరించిన అమలాపురం– బొబ్బర్లంక రహదారిఅమలాపురం రూరల్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని జిల్లా యంత్రాంగం సమన్వయంతో నిర్వహించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం అమలాపురం కలెక్టరేట్లో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లపై జేసీ టి.నిషాంతి, జిల్లా అడ్మిన్ ఎస్పీ ఖాదర్ బాషా, జిల్లా సమన్వయ కమిటీ సభ్యులతో ఆయన సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖల పరిధిలో విధి నిర్వహణలో విశిష్ట సేవలందించిన ఉద్యోగులను ఇద్దరి చొప్పున అవార్డులకు ఎంపిక చేయాలన్నారు. చిన్నారులు, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేలా వేడుకలు ఉండాలన్నారు. ఈ వేడుకలకు జిల్లా ప్రజలు, స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబికులు, ఇతర ప్రముఖులు ఆహ్వానితులేనని అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల శకటాలను సిద్ధం చేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎస్.మనోహర్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. యువతకు ఉపాధి కల్పించండి స్థానికంగా లభించే కొబ్బరి, ఆక్వా ముడి ఉత్పత్తులను విలువ ఆధారితంగా మార్చే రంగంలో స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. కలెక్టరేట్లో జిల్లా నైపుణ్య కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో నిరుద్యోగ యువతకు స్థానికంగా లభించే ముడి సరకు ఆధారంగా విలువ ఆధారిత రంగాల్లో నైపుణ్యం పెంపొందించే దిశగా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ద్వారా శిక్షణ ఇవ్వాలన్నారు. మండలాల వారీగా 18–45 మధ్య వయసున్న నిరుద్యోగ యువతను గుర్తించడం, మండలాల పరిధిలో ప్రస్తుతం నడుస్తున్న వివిధ రకాల యూనిట్ల వివరాలతో ఈ నెల 22 నాటికి నివేదిక ఇవ్వాలన్నారు. జిల్లా ఉపాధి కల్పనాధికారి ఇ.వసంతలకి్ష్మ్, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి లోకమాన్, వికాస పథక సంచాలకుడు కె.లచ్చారావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.కమలకుమారి, డీఆర్డీఏ పీడీ శివశంకర్ ప్రసాద్ పాల్గొన్నారు.ఫ ఆర్అండ్బీ రహదారులపై టోల్ వసూళ్లకు సిద్ధం ఫ ఉమ్మడి జిల్లాలో నాలుగు ప్రధాన రోడ్ల ఎంపిక ఫ స్పష్టత ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ పీపీపీపీ పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లు గత ప్రభుత్వంలోనే ఆధునీకరణ కూటమి ప్రభుత్వం తొలి దశలో టోల్కు ఎంపిక చేసిన రోడ్లను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలోనే ఆధునీకరించారు. మరీ ముఖ్యంగా రాజవోలు నుంచి పొదలాడ రహదారిని రెండు దశల్లో రూ.26 కోట్లతో అభివృద్ధి చేశారు. పి.గన్నవరం ప్రధాన పంట కాలువను ఆనుకుని ఉన్న ఈ రహదారి పలుచోట్ల కాలువ వైపు కుంగిపోవడంతో తరచూ ప్రమాదాలు జరిగేవి. వాహనాలు కాలువలోకి దూసుకుపోయి పలువురు మృత్యువాత పడిన సంఘటనలూ ఉన్నాయి. ఈ రహదారిని విస్తరించడంతో పాటు పలుచోట్ల ఐరెన్ రెయిలింగ్ వేశారు. అలాగే అమలాపురం నుంచి కొత్తపేట, రావులపాలెం మీదుగా బొబ్బర్లంక వరకూ రూ.రెండు దశల్లో రూ.11.13 కోట్లతో ఆధునీకరించారు. గత ప్రభుత్వం తీర్చిదిద్దిన ఈ రోడ్లపై టోల్ గేట్లు పెట్టడం ద్వారా ఆదాయం పొందాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. గత ప్రభుత్వ హయాంలో స్టేట్ హైవేలపై టోల్ ప్రతిపాదనలు లేకున్నా అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం టోల్ వసూలు చేసేస్తోందని సోషల్ మీడియా వేదికగా ఐ–టీడీపీ, జనసేన ఫాలోవర్లు నానాయాగి చేశారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు కలెక్టర్ల సమావేశం ‘సాక్షి’గా ప్రకటించినా కిమ్మనకుండా ఉండడం వివేషం. కలెక్టర్ మహేష్ కుమార్ -
‘జ్యోతిర్మయి వ్రతం’ రద్దు
అన్నవరం: సత్యదేవుని సన్నిఽధిలో జ్యోతిర్మయి సత్యదేవుని వ్రతం నిర్వహించేందుకు గతంలో ఇచ్చిన ఆదేశాలను దేవదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ రద్దు చేశారు. గత ఏడాది ఎస్ ఎస్ చంద్రశేఖర్ అజాద్ ఈఓగా ఉన్నప్పుడు జ్యోతిర్మయి సత్యదేవుని వ్రతం ప్రారంభించేందుకు కమిషనర్ అనుమతి ఇచ్చారు. దాంతో రామాలయం వద్ద అకౌంట్స్ సెక్షన్ కార్యాలయాన్ని ఈ వ్రతం నిర్వహించేందుకు వీలుగా మంటపంగా తయారు చేశారు. వ్రతం నిర్వహణకు ఎనిమిది గంటలకు పైగా పడుతుందని అంత సమయం భక్తులు ఉండలేరనే అభిప్రాయం వ్యక్తమైంది. గత నవంబర్లో ఈఓగా బాధ్యతలు స్వీకరించిన కె.రామచంద్రమోహన్ దేవస్థానం వైదిక కమిటీ అభిప్రాయం కోరగా, నిర్వహణ కష్టమని చెప్పడంతో ఆ ఆదేశాలను రద్దు చేస్తూ ఆదేశాలిచ్చారు. ఈ వ్రతాన్ని ప్రారంభించి ఆ తర్వాత సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోండిలా..
● టెన్త్ విద్యార్థులకు ఈ నెల 30 వరకు అవకాశం ● అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల ● మే 24 నుంచి జూన్3 వరకు పరీక్షలు ● త్వరలో టైమ్ టేబుల్ విడుదల రాయవరం: పదవ తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు విద్యా సంవత్సరం నష్టపోకుండా మే నెలలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను విద్యాశాఖ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. మార్కులు తక్కువ వచ్చినట్లు అనుమానం ఉన్నవారు పునఃమూల్యాంకనం (రీ వెరిఫికేషన్) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. హెచ్ఎంకు మాత్రమే ఫీజు చెల్లించాలి ఈ ఏడాది పది పరీక్షలు రాసిన విద్యార్థులు పాసైనా/ఫెయిలైనా పునఃమూల్యాంకనానికి దరఖాస్తు చేసుకోవచ్చు. రీ వెరిఫికేషన్/రీ కౌంటింగ్ కోసం మంగళవారం నుంచి ఈ నెల 30వ రాత్రి 11 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. శ్రీరీ వెరిఫికేషన్/రీ కౌంటింగ్ ఫలితాలు వచ్చినా, రాకున్నా ఫెయిలైన విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. జవాబు పత్రాల రీ కౌంటింగ్/రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత పాఠశాల హెచ్ఎం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. హెచ్ఎంకి మాత్రమే ఫీజును సమర్పించాలి. అన్ని రుసుము చెల్లింపులు ఆన్లైన్ అప్లికేషన్లో మాత్రమే చేయాలి. శ్రీసీఎఫ్ఎంఎస్ సిటిజన్ చలాన్ ద్వారా ఫీజు చెల్లింపులు ఆమోదించరు. ముఖ్య సూచనలు అభ్యర్థులు వారి దరఖాస్తులను సంబంధిత పాఠశాల హెచ్ఎంలు అటెస్టేషన్ చేయించి, సంబంధిత విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలి. నేరుగా విజయవాడలోని డీజీఈ కార్యాలయం(ఎస్ఎస్సీ బోర్డు)కు పంపించరాదు. దరఖాస్తులు పోస్టు ద్వారా స్వీకరించరు. రీ వెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు రీ కౌంటింగ్కు దరఖాస్తు చేసుకోనవసరం లేదు. రీ వెరిఫికేషన్ అంటే పరీక్ష పేపర్లను తిరిగి మొత్తం మూల్యాంకనం చేయరు. ఇచ్చిన మార్కులను తిరిగి లెక్కిస్తారు. రాసిన సమాధానాలన్నింటికీ మార్కులు వచ్చాయా లేదా అని ధ్రువీకరిస్తారు. జవాబు పత్రంలో దిద్దని ప్రశ్నలు ఉంటే దిద్ది మార్కులు కేటాయిస్తారు. స్కానింగ్ చేసిన విద్యార్థి జవాబు పత్రాలను ఆన్లైన్లో అందిస్తారు. రీ కౌంటింగ్ విషయంలో మార్కుల మొత్తం మరోసారి కూడతారు. తప్పుగా కూడి ఉంటే సరి చేసి మార్కులు వేస్తారు. అంతేగాని పేపరు విద్యార్థికి ఇవ్వరు. అడ్వాన్స్ సప్లిమెంటరీ దరఖాస్తు ఇలా.. మే 24వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల టైమ్టేబుల్ను ఎస్ఎస్సీ బోర్డు త్వరలో ప్రకటించనుంది. వచ్చే నెలలో నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులు పరీక్ష ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి. రీ కౌంటింగ్/రీ వెరిఫికేషన్ కోసం విద్యార్థులకు ప్రతీ పాఠశాల హెచ్ఎం/సిబ్బంది అందుబాటులో ఉండాలని ఇప్పటికే డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష ఫీజును నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు అపరాధ రుసుం లేకుండా చెల్లించే వీలుంది. శ్రీమే ఒకటో తేదీ నుంచి 23వ తేదీ వరకు రూ.50ల అపరాధ రుసుంతో ఫీజును చెల్లించే వీలుంది. నాలుగు రోజుల్లో మార్కుల జాబితాలు ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్మీడియెట్ ఫస్టియర్ కోర్సుల్లో చేరేందుకు నాలుగు రోజుల తర్వాత మార్కుల జాబితాలను అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.మీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్లో అందుబాటులో ఉంచనున్నారు. సంబంధిత హెచ్ఎం స్కూల్ లాగిన్ నుంచి పాఠశాలల వారీగా మార్కుల మెమొరాండం, వ్యక్తిగత షార్ట్ మెమోలను డౌన్లోడ్ చేసుకునే వీలుంది. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లకుండానే నేరుగా అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఆర్ఈఎస్యుఎల్టీఎస్.బీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్ నుంచి ఫలితాలు, షార్ట్ మెమోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉత్తీర్ణులైన అభ్యర్థులందరికీ నిర్ణీత సమయంలో ఎస్ఎస్సీ సర్టిఫికెట్లు సంబంధిత పాఠశాలలకు పంపిస్తారు. మార్చి–2024, ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థుల నామినల్ రోల్ ఈ నెల 24 నుంచి అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్లో అందుబాటులో ఉంచుతారు. ఫీజుల వివరాలు చెల్లించాల్సిన ఫీజులను ఆన్లైన్లో ఆయా పాఠశాల హెచ్ఎం లాగిన్ ద్వారా చెల్లించాలి. డీడీలు స్వీకరించరు. శ్రీరీ వెరిఫికేషన్ ఫీజుగా ఒక్కో సబ్జెక్టుకు రూ.1,000 చెల్లించాలి. శ్రీరీ కౌంటింగ్కు ఒక్కో సబ్జెక్టుకు రూ.500 చెల్లించాలి. -
టెన్త్ ఫలితాల్లో శ్రీ షిర్డీ సాయి ముందంజ
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలలో శ్రీషిర్డీసాయి విద్యానికేతన్ రాజమహేంద్రవరం, కడియం విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించినట్లు విద్యాసంస్థల డైరెక్టర్ టి. శ్రీవిద్య తెలిపారు. తమ లక్ష్య ఓరియంటేషన్తో 10 వ తరగతి చదివిన వి. ఉదయ రుషిత 600 మార్కులకు 593 సాధించి ప్రథమ స్థానంలో నిలువగా ఎన్.సాయి అక్షయ, బి.యశశ్విని 592 మార్కులు, ఎం. జాహ్నవి, ఎస్. దేవికృష్ణసిరి 591, ఎ. లోహిత్ కుమార్ 590 మార్కులు సాధించినట్లు వివరించారు. ఆరుగురు విద్యార్థులు 590కి పైగా మార్కులు సాధించగా, 24 మంది 580 మార్కులకు పైగా, 44 మంది 570కి పైగా మార్కులు, 75 మంది 550కి పైగా మార్కులు సాధించారు. హాజరైన మొత్తం164 మంది విద్యార్థులు ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయినట్లు తెలిపారు. విద్యార్థులను, ఉపాధ్యాయ బృందాన్ని శ్రీ షిర్డీసాయి విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, లక్ష్య అకాడమీ డీన్ కె. శ్రీనివాస్ అభినందించారు. -
నేత్రపర్వంగా తెప్పోత్సవం
● మేళతాళ మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవం ● విద్యుత్ దీపాలంకరణ, బాణసంచా కాల్పులు ● వాడపల్లి వెంకన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు ఆత్రేయపురం: కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. వేకువ జామునే స్వామివారికి సుప్రభాత సేవ, నీరాజన మంత్రపుష్పం, పుణ్యహవచనం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం స్వామివారిని పుష్పాలతో అలంకరించారు. స్వామి వారి కల్యాణోత్సవాలు వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం వేదపండితులు శ్రీమాన్ ఖండవల్లి వర ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛరణ నడుమ కన్నుల పండువగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు స్వస్తి వచనం, కల్యాణోత్సవ ప్రధాన హోమాలు, దిగ్దేవతా బలిహరణ, విశేషార్చన, నీరాజన మంత్రపుష్పాలు, సాయంత్రం 6 గంటలకు సంకల్పం, ప్రధాన హోమాలు నిర్వహించారు. కేరళ వాయిద్యాలతో స్వామివారి గ్రామోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. అనంతరం గౌతమీ గోదావరి నదిలో విద్యుత్ దీపాలంకరణతో సుందరీకరించిన హంస వాహనంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహించారు. బాణసంచాకాల్పులు, భక్తజనం గోవింద నామస్మరణ నడుమ స్వామివారు ఉభయ దేవేరులతో గౌతమీ గోదావరిలో విహరించడాన్ని భక్తజనం తన్మయత్వంతో వీక్షించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను రంజిపజేశాయి. ఈ కార్యక్రమాలను దేవదాయ ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈఓ భూపతిరాజు కిషోర్కుమార్ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. స్వామి వారి కల్యాణోత్సవాల్లో భాగంగా మంగళవారం గౌతమీ గోదావరినదిలో స్వామివారి చక్రస్నాన మహోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో వివరించారు. గౌతమీ గోదావరిలో సాగిన స్వామివారి తెప్పోత్సవం -
11న జాతీయ లోక్ అదాలత్
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): మే 11వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో అత్యధిక కేసులు పరిష్కరించేందుకు రెవిన్యూ, పంచాయతీరాజ్ అధికారులు తమ పరిధిలో ఉన్న రాజీపడదగిన కేసులను గుర్తించాలని తొమ్మిదవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి తెలిపారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థాన ఆవరణలో ఆమె ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని జిల్లా రెవెన్యూ, పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా తొమ్మిదవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి రాజీపడదగిన జాబితాను అధికారులు సిద్ధం చేసి జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందించాలన్నారు. తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.ప్రకాష్ బాబు, గవర్నమెంటు ప్లీడరు సీహెచ్వీ ప్రసాద్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రెవెన్యూ, పంచాయితీ అధికారులు పాల్గొన్నారు. -
విస్తృత తనిఖీల్లో మద్యం పట్టివేత
● 18 మంది అరెస్ట్ ● రూ.2.06 లక్షల నగదు సీజ్ అమలాపురం టౌన్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ, ఎస్ఈబీ, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు అక్రమ రవాణాను పసిగట్టేందుకు దాడులు, తనిఖీల వేగాన్ని మరింత పెంచాయి. ఎస్పీ సుసరాపు శ్రీధర్, ఏఎస్పీ ఎస్.ఖాదర్ బాషా ఆధ్వర్యంలో ఆది, సోమవారాల్లో జరిగిన దాడులు, తనిఖీల్లో అక్రమ రవాణాను అడ్డుకుని 18 మందిని అరెస్ట్ చేశారు. నగదు రూ.2.06 లక్షలు సీజ్ చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్ట్లు, స్వాధీనాల వివరాలను జిల్లా ఎస్పీ కార్యాలయం సోమవారం రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో వివరించింది. ● అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 30 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలు, 5.4 లీటర్ల ఇండియన్ మేడ్ లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు. ● రావులపాలెంలో నిఘా బృందాలు వాహనాలను తనిఖీ చేసి రూ.2.06 లక్షల నగదును సీజ్ చేశారు. ● ఆలమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 5 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న అయిదుగురిని అరెస్ట్ చేసి వారి నుంచి రూ.3,220 నగదు సీజ్ చేశారు. 4 మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ● రామచంద్రపురం, ద్రాక్షారామ, పామర్రు పోలీసు స్టేషన్ల పరిధుల్లో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి 70 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలు, 18.03 లీటర్ల ఇండియన్ మేడ్ లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు. ● అమలాపురం, రాజోలు, ఆలమూరు, రామచంద్రపురం, కొత్తపేట ముమ్మిడివరం ఎస్ఈబీ స్టేషన్ల పరిధిలో ఎనిమిది మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 83 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలు, 15.51 లీటర్ల ఇండియన్ మేడ్ లిక్కర్, 10 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు. ● ఎన్నికల్లో సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ కేంద్రాలైన ఐ.పోలవరం మండలం మురమళ్ల,పశువుల్లంకలలో స్థానిక పోలీసు అధికారులు కేంద్ర బలగాలతో కలసి సోమవారం సాయంత్రం కవాతు నిర్వహించాయి. ఆయా గ్రామాల్లో స్థానిక ప్రజలతో పోలీసు అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు హక్కు వినియోంచుకునేలా భరోసా ఇస్తూ అవగాహన కల్పించారు. -
చోరీ కేసుల్లో నిందితుడి అరెస్ట్
రూ.8.97లక్షల విలువైన 128.27 గ్రాముల ఆభరణాల స్వాధీనం కొవ్వూరు: వివిధ చోరీలకు పాల్పడిన పాత నేరస్తుడైన చుక్కపల్లి బాబి అనే ప్రవీణ్కుమార్ను సోమవారం అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ వి.జగదీశ్వరరావు తెలిపారు. అతని వద్ద నుంచి 128.27 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పా రు. గతంలో కొవ్వూరులో ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఒక ఇంటిలోను, ఆరికిరేవుల గ్రామంలో ఒక రేకుల షెడ్లోను, కుమారదేవం, పోలవరంలోను ఇళ్లల్లో పగటి పూట ఎవరూ లేని సమయంలో ఇళ్లల్లోకి చొరబడి విలువైన బంగారు ఆభరణాలు, నగ దు అపహరించుకుని పో యాడన్నారు. సోమవా రం కొవ్వూరు ఏటిగట్టుపై ఉన్న శివాలయం ఎదురుగా ఉన్న వీధిలో నిందితుడు అద్దెకి ఉంటున్న ఇంటి వద్ద అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. చోరీ సోత్తు విలువ రూ.8,97,190 ఉంటుందన్నారు. నిందితుడు గోపాలపురం మండలం భీమోలు గ్రామానికి చెందిన వాడన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు ఆయన తెలిపారు. నిందుతుడిని అరెస్ట్ చేయడంలో ఎస్సై కె.జగన్మోహన్రావు, సిబ్బంది సహకరించారన్నారు. -
10వ తరగతి ఫలితాలలో తిరుమల విజయభేరి
రాజమహేంద్రవరం రూరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో రాజమహేంద్రవరంలోని తమ తిరుమల ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్యార్థులు అద్భుత ఫలితాలను సాధించారని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. కె.రఘువీర్ 595 మార్కులు, కె.సుప్రియ 595 మార్కులు, ఏపీఆర్ సాయిశ్రీలత, బి.లలితరాణి, కె.సత్యభాస్కర్ 594 మార్కులు, టి.ప్రీతిశరణ్య, ఎం.ఇబ్రహీం 593మార్కులు, కె.అశ్రిత, ఎంవీఎల్ఎ వాత్సల్య, ఎం.గ్రీషశ్రీ, బియు.ప్రసాద్, పి.శ్రీతుల్య, జేవీఎన్ సత్యసాయిదత్త, వై.తేజశ్వి, ఎస్.రంజిత్కుమార్ 592మార్కులు, వై.కృష్ణచైతన్య, ఎల్.వైష్ణవి, సీహెచ్.లోక్ప్రకాష్, ఎస్వీఎస్.శ్రీధర్, డి.చిన్మయి 591మార్కులు సాధించారన్నారు. 590పైన 34మంది విద్యార్థులు, 580పైన 223 మంది విద్యార్తులు, 570పైన 451మంది, 560పైన 642 మంది, 550పైన 779మంది, 500పైన 451మంది , 560పైన 642మంది, 550పైన 779మంది, 500పైన 1108 మంది విద్యార్థులు సాధించారని, 100 శాతం ఉత్తీర్ణత సాధించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులను నున్న తిరుమలరావు, డైరెక్టర్ సరోజినిదేవి, అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్బాబు, ప్రిన్సిపాల్ వి.శ్రీహరి అభినందించారు. -
నన్నయ వీక్షిత్ భారత్
రాజానగరం: దేశాభివృద్ధిలో యువత కీలకపాత్ర పోషిస్తుందని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య కె.పద్మరాజు అన్నారు. యూనివర్సిటీ 18వ ఫౌండేషన్ డేని పురస్కరించుకుని ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో సోమవారం నిర్వహించిన వీక్షిత్ భారత్ థీమ్ కార్యక్రమాలను వీసీ ప్రారంభించారు. శ్రీరాపర్తి రామ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కానవరం విద్యార్థులు ఉదయం యోగ ఆసనాలు వేయించి, యోగ సాధన ఆవశ్యకతను తెలియజేశారు. మధ్యాహ్నం వీక్షిత్ భారత్ 2047 థీమ్ ఓరియెంటెడ్ డాన్స్, మైమ్, స్కిట్స్లను క్యాపంస్, అనుబంధ కళాశాలల విద్యార్థులు ప్రదర్శించారు. సీటీఆర్ఐ డైరెక్టర్ ఎం.శేషుమాధవ్ మాట్లాడుతూ యూనివర్సిటీ ఆవిర్భావ లక్ష్యాలను నెరవేర్చే దిశగా యువత పయనించాలని సూచించారు. యూజీసీ వీక్షిత్ భారత్ జాబితాలో శ్రీనన్నయశ్రీ వర్సిటీ ఉండటం హర్షణీయమన్నారు. సీఎస్ఐఆర్ రిటైర్డ్ శాస్త్రవేత్త డాక్టర్ జి. భగవాన్ నారాయణ రీసెర్చ్ మెథడాలజీపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రిజిస్టార్ ఆచార్య జి.సుధాకర్, డాక్టర్ ఎన్.శేషారెడ్డి, డాక్టర్ రామచంద్రరాజు, డాక్టర్ సీహెచ్.సత్యనారాయణ, డాక్టర్ రామరాజు ప్రసంగించారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. -
అభిమానుల కోలాహలం మధ్య జగ్గిరెడ్డి నామినేషన్
కొత్తపేటలో నామినేషన్ వేస్తున్న వైఎస్సార్ సీపీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా చిర్ల జగ్గిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కొత్తపేట డివిజనల్ రెవెన్యూ కార్యాలయంలో ఆర్డీఓ, అసెంబ్లీ ఎన్నికల అధికారి జి.వి.వి.సత్యనారాయణకు నామినేషన్ సమర్పించారు. జగ్గిరెడ్డి నామినేషన్కు నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు వేలాదిగా తరలిరావడంతో రావులపాలెం – కొత్తపేట రహదారి, కొత్తపేట రోడ్లు జనసంద్రంగా మారాయి. జగ్గిరెడ్డి గోపాలపురంలో తన స్వగృహం వద్ద నుంచి బయలుదేరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడకు రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు మండలాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. వారు వెంట ర్యాలీగా రాగా జగ్గిరెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ కొత్తపేట చేరుకుని నామినేషన్లు సమర్పించారు. జై జగన్... జై జగ్గిరెడ్డి అనే నినాదాలు హోరెత్తాయి. జగ్గిరెడ్డి వెంట అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి రాపాక వర ప్రసాద్ కూడా ఉన్నారు. జగ్గిరెడ్డితోపాటు ఆయన సతీమణి లావణ్య 2 సెట్ల నామినేషన్లు వేశారు. -
వైఎస్సార్ సీపీ ఘన విజయం ఖాయం
కొత్తపేట: వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేస్తున్న తనతో పాటు ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయ మని రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం కొత్తపేటలో ఎమ్మెల్యే అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న రాపాక విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో ఎక్కడికి వెళ్లినా మంచి ప్రజాదరణ లభిస్తోందన్నారు. జనం మళ్లీ జగన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఎదురొచ్చి సాదరంగా స్వాగతిస్తున్నారని తెలిపా రు. గత టీడీపీ ప్రభుత్వంలో ఏవిధమైన లబ్ధి పొందని ప్రజానీకం, ప్రస్తుత ప్రభుత్వంలో తాము రూ.లక్షల్లో పొందిన లబ్ధిని వారే వివరిస్తున్నారన్నారు. 2014 ఎన్నికల్లో నోటికొచ్చిన హామీలిచ్చి తీరా అధికారం చేపట్టాక వాటిని గాలికొదిలేశారని, దానితో ఇప్పుడు ఎన్ని హామీ లిచ్చినా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల ప్రభావంతో రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు వైఎస్సార్ సీపీ గెలుస్తుందన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పాల్గొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనందరావుపై మూడు పోలీసు కేసులుఅమలాపురం టౌన్: అమలాపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు నామినేషన్ దాఖలు సమయంలో సమర్పించిన అఫిడవిట్లో తనపై మూడు పోలీసు కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. రోడ్లపై రాస్తారోకోలు చేసి ప్రజా జీవనానికి ఇబ్బంది పెట్టారన్న అభియోగంపై ఆయనపై బిక్కవోలు పోలీసు స్టేషన్లో ఒక కేసు, అమలాపురం పట్టణ పోలీసు స్టేషన్లో రెండు కేసులు నమోదయ్యాయి. 2022, 2023 సంవత్సరాల్లో ఈ కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. స్థిరాస్థులు తన పేరున 3.32 ఎకరాలు, తన భార్య పేరున 24 సెంట్ల భూములు ఉన్నట్టు పేర్కొన్నారు. తన సొంతూరు ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాంలో 217 చదరపు అడుగుల సొంత ఇల్లు ఉన్నట్లు తెలిపారు. అయితే ఆనందరావు కుటుంబం అమలాపురంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ ఖరీదైన వసతి గృహంలో జీవిస్తోంది. టీడీపీ అభ్యర్థి సుభాష్పై 13 కేసులు రామచంద్రపురం: రామచంద్రపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వాసంశెట్టి సుభాష్పై 13 కేసులు ఉన్నాయి. హత్యాయత్నం, నిర్భంధం వంటి కేసులు ఉన్నట్లు తాను సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ద్వారా ఆయన తెలియజేశారు. తన మీద మొత్తం13 కేసులు అమలాపురం కోర్టులో పెండింగ్లో ఉన్నట్లు తాను సమర్పించిన నామినేషన్ అఫిడవిట్లో పేర్కొన్నారు. అమలాపురం టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన వివిధ కేసులు ప్రస్తుతం అమలాపురం మేజిస్ట్రేట్ కోర్టులో ఉన్నట్లు వెల్లడించారు. సూసైడ్ కేసుతో పాటుగా హత్యాయత్నం, నిర్భంధం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వంటి కేసులు ఆయనపై ఉన్నాయి. ఘనంగా సత్యదేవుని ధ్వజస్తంభ ప్రతిష్ఠఅన్నవరం: సత్యదేవుని ఆలయ చరిత్రలో మరో చరి త్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సత్యదేవుని ఆలయం ముందు స్వర్ణ ధ్వజస్తంభం, జాతీయ రహదారిపై విశాఖపట్నం–విజయవాడ మార్గంలో డిగ్రీ కళాశాల సమీపంలో నిర్మించిన నమూనా ఆలయంలో సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ఠ, ఆలయ శిఖరంపై కలశ ప్రతిష్ఠా మహోత్సవాలు సోమవా రం ఉదయం 10.48 గంటల సుమూహూర్తంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. 22ఆర్సీపీ02: సుభాష్ -
కోలహలంగా నామినేషన్లు
22ఎఎంపీ01: వేణుగోపాలరావు నామినేషన్కు వచ్చిన పార్టీ శ్రేణులతో కిక్కిరిసిన పి.గన్నవరం కూడలి అట్టహాసంగా తరలివచ్చిన వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విశ్వరూప్, జగ్గిరెడ్డి, విప్పర్తి, గొల్లపల్లి సాక్షి అమలాపురం: ముహూర్తం కుదిరింది. సార్వత్రిక ఎన్నికలలో కీలకమైన నామినేషన్ల ప్రక్రియ మొదలైన తరువాత జిల్లాలో అత్యధికంగా సోమవారం నామినేషన్లు పడ్డాయి. అధికార వైఎస్సార్సీపీతోపాటు టీడీపీ, జనసేన, వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, స్వతంత్రులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. నాలుగో రోజు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వివిధ రాజకీయ పార్టీలు, స్వతంత్రులుగా 22 మంది అభ్యర్థులు మొత్తం 30 నామినేషన్లు పత్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. అమలాపురం పార్లమెంటరీ సభ్యుని స్థానానికి నామినేషన్లు దాఖలు కాలేదని కలెక్టర్, పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి హిమాన్షు శుక్లా తెలిపారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థుల నామినేషన్లతో జిల్లాలో ఎన్నికల పండగ వాతావరణం తలపించింది. అమలాపురం, కొత్తపేట, పి.గన్నవరం, రాజోలు అభ్యర్థులు పినిపే విశ్వరూప్, చిర్ల జగ్గిరెడ్డి, విప్పర్తి వేణుగోపాలరావు, గొల్లపల్లి సూర్యారావుల నామినేషన్లు కోలాహలంగా సాగింది. ఉత్సాహంగా విశ్వరూప్ నామినేషన్ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పినిపే విశ్వరూప్ అట్టహాసంగా నామినేషన్దాఖలు చేశారు. అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో జి.కేశవవర్థనరెడ్డికి రెండు జతల నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయనతోపాటు భార్య బేబీ మీనాక్షి కూడా నామినేషన్ వేశారు. నియోజకవర్గం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన పార్టీ నాయకులతో కలిసి ర్యాలీగా వచ్చారు. ప్రచార రథంపై నుంచి విశ్వరూప్ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. కామనగరువు, హౌసింగ్బోర్టు కాలనీ నల్లవంతెన రోడ్డు, కాటన్ పార్కు మీదుగా ర్యాలీగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. తీన్మార్, డీజే బ్యాండ్, యువకుల మోటార్ సైకిల్ ర్యాలీగా వెంటరాగా విశ్వరూప్ ఊరేగింపు అట్టహాసంగా జరిగింది. కార్యకర్తలు ఉరేగింపులో ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్ ర్యాలీలో పాల్గొన్నారు. విప్పర్తి నామినేషన్తో పి.గన్నవరం జనసంద్రం పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్ సీపీ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు పి.గన్నవరం తహసీల్దార్ కార్యాలయంలో ఎ.శ్రీరామచంద్రమూర్తికి రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఆయన కుమారుడు రామ్మోహన్రావు ఒక సెట్ నామినేషన్ వేశారు. పి.గన్నవరం, మామిడికుదురు, అంబాజీపేట, అయినవిల్లి మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. వేణుగోపాలరావు తన స్వగృహం నుంచి బయలుదేరి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు నడుచుకుంటూ వెళ్లారు. తరువాత అక్కడ నుంచి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అట్టహాసంగా గొల్లపల్లి నామినేషన్: రాజోలు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు మలికిపురం భారీ ఊరేగింపుతో రాజోలు తహసీల్దారు కార్యాలయానికి చేరుకున్నారు. ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్కు సమర్పించారు. గొల్లపల్లి నామినేషన్ వేసేందుకు వెళ్లున్నప్పుడు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అభివాదం చేయడంతో జై జగన్..జై గొల్లపల్లి నినాదాలు మారుమోగాయి. గొల్లపల్లితోపాటు రాపాక వర ప్రసాదరావు కూడా ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లాలో పలువురు నామినేషన్లు రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ , స్వతంత్ర అభ్యర్థిగా ఎర్రంశెట్టి వీర వెంకట సత్యనారాయణ రామరాజు, టీడీపీ అభ్యర్థి తరఫున వాసంశెట్టి లక్ష్మీ సునీత, స్వతంత్ర అభ్యర్థిగా గుత్తుల జై శ్రీ సూర్యంద్రనాథ్ బాబుజిలు నామినేషన్లు వేశారు. ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఆల్ ఇండియా ఫార్వర్డ బ్లాక్ పార్టీ తరఫున పెమ్మాడి స్వామి, స్వతంత్ర అభ్యర్థిగా దొంగ సత్య రామ్, అనగాడి రేవతి, జై భారత్ నేషనల్ పార్టీ తరఫున వనచర్ల బాబ్జిలు రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. రాజోలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి బహుజన సమాజ్ పార్టీ తరఫున పులపకూర లిలిని ఆసారాణి నామినేషన్ వేశారు. పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కొల్లాబత్తుల ఆనందరావు, జనసేన తరఫున గిడ్డి సత్యనారాయణలు నామినేషన్లు వేశారు. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా చీపురుమిల్లి కిరణ్కుమార్, మండపేట అసెంబ్లీ నియోజక వర్గానికి టీడీపీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు, వల్లూరి సాయికుమార్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరపున స్వతంత్ర అభ్యర్థిగా ఎస్.డేవిడ్ రాజ్ ఒక సెట్ నామినేషన్ వేశారు. -
ఫోర్ కొట్టిన కోనసీమ
22ఎండీపీ121: ● పది ఫలితాల్లో జిల్లాకు 4వ స్థానం ● గతేడాది కంటే తొమ్మిది స్థానాలు ముందుకు ● సత్తా చాటిన సర్కారీ స్కూల్స్ ● ఈ ఏడాదీ బాలికలదే పైచేయి ● జిల్లా వ్యాప్తంగా 14,459 మందికి ప్రథమ శ్రేణి రాయవరం/ముమ్మిడివరం: పదవ తరగతి ఫలితాల్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా విద్యార్థులు 91.88 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర స్థాయిలో నాల్గవ స్థానాన్ని కై వసం చేసుకున్నారు. గతేడాది జిల్లా పది ఫలితాల్లో 13వ స్థానంలో నిలువగా, ఈ ఏడాది తొమ్మిది స్థానాలు ముందుకు వెళ్లి నాల్గవ స్థానంలో నిలిచింది. అదేవిధంగా జోన్–2 పరిధిలో గతేడాది పది ఫలితాల్లో 2వ స్థానంలో నిలువగా ఈ ఏడాది ప్రథమ స్థానంలో నిలువడం గమనార్హం. జిల్లాలో ఎక్కడా ఎటువంటి ఆరోపణలకు తావు లేకుండా విద్యాశాఖ అధికారులు పకడ్బందీగా పరీక్షలను నిర్వహించారు. ఈసారీ బాలికలదే పైచేయి పదవ తరగతి ఫలితాల్లో ఈసారి కూడా బాలికలు పైచేయి సాధించారు. 9,471 మంది బాలురు, 9,316 మంది బాలికలు కలిపి 18,787 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో బాలురు 8,551 (90.29 శాతం), బాలికలు 8,711 (93.51 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 2023–24 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 18,787 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 17,262 మంది ఉత్తీర్ణత (91.88శాతం) సాధించారు. పటిష్టమైన ప్రణాళికతో.. పది ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో నాలుగవ స్థానంలో నిలవడానికి జిల్లా విద్యాశాఖ ప్రణాళికా బద్ధంగా చేసిన కృషి కారణంగా చెప్పవచ్చు. జిల్లా విద్యాశాఖాధికారి ఎం.కమలకుమారి పాఠశాలల పునఃప్రారంభం నుంచి పదవ తరగతిపై ప్రత్యేక దృష్టి సారించారు. గత విద్యా సంవత్సరంలో జూలై నుంచే ఉదయం, సాయంత్రం పది విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించారు. పదవ తరగతి విద్యార్థులపై పాఠశాలల హెచ్ఎంలు, సబ్జెక్టు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చేలా పర్యవేక్షణ చేశారు. 100 రోజుల ప్రణాళికను అమలు చేశారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా చర్యలు చేపట్టారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంల నుంచి ఆర్జేడీ స్థాయి వరకు పదవ తరగతిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. నవంబర్ నెలాఖరుకు సిలబస్ పూర్తి చేసి, ప్రతి రోజూ రివిజన్ చేపట్టారు. జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణ సంస్థ (డీసీఈబీ) ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు 70 రివిజన్ టెస్టులు తయారు చేసి విద్యార్థులకు తర్ఫీదునిచ్చారు. సబ్జెక్టు నిపుణులతో అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఒక మార్కు ప్రశ్నలు ఆడియో క్లిప్పింగ్స్ రూపంలో తయారు చేసి, ప్రత్యేక తర్ఫీదునిచ్చారు. జిల్లా పరిషత్ యాజమాన్యం కూడా విద్యాభారతి పేరుతో స్టడీ మెటీరియల్ సరఫరా చేసింది. ఇటువంటి చర్యలన్నీ మెరుగైన ఉత్తీర్ణతకు దోహదం చేసినట్లుగా పలువురు హెచ్ఎంలు చెబుతున్నారు. 153 పాఠశాలల్లో శత శాతం ఫలితాలు జిల్లాలో పదవ తరగతి ఫలితాల్లో 153 పాఠశాలలు శత శాతం ఫలితాలు సాధించాయి. ప్రభుత్వ యాజమాన్య పరిధిలో 47 పాఠశాలలు శత శాతం ఫలితాలు సాధించాయి. ప్రభుత్వ, ఎయిడెడ్, మున్సిపల్, బీసీ, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ యాజమాన్యాలకు చెందిన ఏడు పాఠశాలలు నూరు శాతం ఫలితాలు సాధిస్తే, జెడ్పీ యాజమాన్య పరిధిలో 40 పాఠశాలలు శత శాతం ఫలితాలు సాధించాయి. ప్రైవేట్ యాజమాన్య పరిధిలోని 106 పాఠశాలలు వంద శాతం ఫలితాలను సాధించాయి. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఫలితాలు ఇలా.. జిల్లాలోని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో 10వ తరగతి పరీక్షా ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో పది పరీక్షలు రాసిన 242 మంది విద్యార్థులకు 215 మంది ఉత్తీర్ణత(88.84శాతం) సాధించారు. వీరిలో 110 మంది బాలురకు 97 మంది, 132 మంది బాలికలకు 118 మంది ఉత్తీర్ణత సాధించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఆశించిన మేర ఫలితాలు వచ్చినట్లు డిప్యూటీ డైరెక్టరు పి.జ్యోతిలక్ష్మీదేవి తెలిపారు. బీసీ సంక్షేమ వసతి గృహ విద్యార్థులు జిల్లాలో తొమ్మిది బీసీ సంక్షేమ వసతి గృహాలు ఉండగా, ఐదు వసతి గృహాల్లో 10వ తరగతి విద్యార్థులు 31 మంది పరీక్షలకు హాజరయ్యారు. 27 మంది ఉత్తీర్ణులు కాగా, 22 మంది ప్రథమ శ్రేణి, నలుగురు ద్వితీయ శ్రేణి, ఒక విద్యార్థి తృతీయ శ్రేణిలో ఉత్తీర్ణులయినట్లు జిల్లా బీసీ సంక్షేమ వసతి గృహ సంక్షేమ అధికారి యడ్లపల్లి సాంబమూర్తి తెలిపారు. డీఈవో కమలకుమారిని అభినందిస్తున్న విద్యాశాఖ అధికారులు, సిబ్బంది కార్పొరేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పది ఫలితాల్లో సత్తా చాటారు. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా మార్కులు సాధించి, జిల్లాకే గర్వకారణంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిలువడం గమనార్హం. మండలాల వారీగా చూస్తే ముమ్మిడివరం మండలం 98.72 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో, 97.84 శాతం ఉత్తీర్ణతతో ఐ.పోలవరం మండలం రెండోస్థానం, 97.70 శాతం ఉత్తీర్ణతతో మలికిపురం మండలం తృతీయ స్థానంలో నిలిచాయి. 83.58 శాతం ఉత్తీర్ణతతో కొత్తపేట మండలం చివరి స్థానంలో నిలిచింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 18,787 ఉత్తీర్ణులైన వారు 17,262 ఉత్తీర్ణులైన బాలురు 8,551 ఉత్తీర్ణులైన బాలికలు 8,711 ప్రథమ శ్రేణి 14,459 ద్వితీయ శ్రేణి 1,970 తృతీయ శ్రేణి 833 590కి పైగా మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు విద్యార్థి పేరు పాఠశాల మండలం పొందిన మార్కులు పినపోతు ఈషిత జెడ్పీహెచ్ఎస్,ఓడలరేవు అల్లవరం 595 నూకపెయ్యి నవనీత్ జెడ్పీహెచ్ఎస్, చప్పిడివారిపాలెం కొత్తపేట 593 అక్కల బిందు శరణ్య జెడ్పీహెచ్ఎస్, గొల్లవిల్లి ఉప్పలగుప్తం 592 మల్లేశ్వరపు శిరీష జెడ్పీహెచ్ఎస్, ఏడిద మండపేట 591 బొంతు హర్షిత జెడ్పీహెచ్ఎస్,మొగలికుదురు మామిడికుదురు 590 అడబాల సూర్య జెడ్పీహెచ్ఎస్ మలికిపురం 590 నాగదేవి కీర్తన కేశనపల్లి గిడుగు శ్రీరామదుర్గ జెడ్పీహెచ్ఎస్, పెదపట్నంలంక మామిడికుదురు 590 -
నిరంతర కృషి, పర్యవేక్షణతోనే..
పదవ తరగతిలో మంచి ఫలితాలు నిరంతర కృషి, పర్యవేక్షణతోనే సాధించగలిగాం. ప్రధానోపాధ్యాయులతో పాటు సబ్జెక్టు ఉపాధ్యాయులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలతో పాటు విద్యార్థుల్లో అభ్యసనాలను మెరుగుపర్చడంతోనే ఈ ఫలితాలను సాధించగలిగాం. పది ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. సప్లిమెంటరీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రణాళికాబద్ధంగా చదివి మంచి ఫలితాలను సాధించుకోవాలి. – జి.నాగమణి, ఆర్జేడీ, పాఠశాల విద్యాశాఖ, అమలాపురం సంతృప్తికర ఫలితాలు పది ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయి. రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నాలుగవ స్థానంలో నిలిచింది. గతేడాది కంటే తొమ్మిది స్థానాలు ముందుకు వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు ప్రత్యేక తరగతులు, నిత్యం పరీక్షల నిర్వహణతోనే ఈ ఫలితాలు సాధించాం. ఈ విజయంలో భాగస్వాములైన హెచ్ఎంలు, ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులకు అభినందనలు. – ఎం.కమలకుమారి, డీఈవో, అమలాపురం స్ఫూర్తిదాయకమైన ఫలితాలు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు స్ఫూర్తిదాయకమైన ఫలితాలను సాధించారు. ఇదే ఒరవడిని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు మున్ముందు కూడా కొనసాగించాలి. ఈ ఫలితాలను స్ఫూర్తిగా తీసుకుని వచ్చే సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలి. ఉపాధ్యాయులు పడ్డ కష్టానికి మంచి ఫలితాలు వచ్చాయి. – నక్కా సురేష్, అసిస్టెంట్ కమిషనర్, ప్రభుత్వ పరీక్షల విభాగం, అమలాపురం 22ఎండీపీ121ఎ: 22ఎండీపీ121బి:22ఎండీపీ121సి: -
జాతీయ బాస్కెట్బాల్ పోటీలకు జగన్
అమలాపురం టౌన్: అమలాపురం పట్టణం కొంకాపల్లి జవహర్లాల్ నెహ్రు మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థి అప్పారి జగన్ జాతీయ బాస్కెట్బాల్ అండర్–17 పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె.ఘన సత్యనారాయణ తెలిపారు. ఇటీవల రాయవరంలో జరిగిన రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో సత్తా చాటిన జగన్ జాతీయ పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఈ నెల 27వ తేదీన హర్యానా రాష్ట్రం గురుగ్రామ్లో జరగనున్న జాతీయ అండర్ –17 బాస్కెట్ బాల్ పోటీల్లో తలపడనున్నాడని చెప్పారు. జాతీయ పోటీలకు ఎంపికై న జగన్ను పాఠశాలలో సోమవారం జరిగిన అభినందన సభలో ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ప్రశంసించారు. జగన్ను డీఈవో ఎం.కమలకుమారి, అమలాపురం డీవైఈవో గుబ్బల సూర్యప్రకాశం, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ మంచిగంటి వెంకటేశ్వరరావు అభినందించారు. -
నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు 13 నామినేషన్లు
రెండోరోజు పార్లమెంట్ నియోజకవర్గానికి నిల్ అమలాపురం రూరల్: అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి రెండోరోజు నామినేషను బోణీ కాలేదు. నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు 13 నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ తరుపుప పొన్నాడ వెంకట సతీష్కుమార్ మూడు సెట్లు, పొన్నాడ నీరజ ఒక సెట్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ నుంచి పాలెపు ధర్మారావు ఒక సెట్ సత్తిరాజు ఎస్వీయువీఆర్ఎస్ స్వామి బిరా రాజ్కుమార్ ఇండిపెండెంట్లుగా ఒక సెట్ చప్పున ఓక సెట్ నామినేషన్ వేశారు. రామచంద్రపురం నియోజకవర్గం నుంచి బహుజన సమాజ్ పార్టీ తరఫున మతా సుబ్రహ్మణ్యం ఒక సెట్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి జుట్టుక వెంకటరావు ఒక సెట్ నామినేషన్ వేశారు. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా అయితాబత్తుల ఆనందరావు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మండపేట నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా మందపల్లి రవి, నవతరం పార్టీ నుంచి నందికోళ్ల రాజు ఒక సెట్ నామినేషన్లు దాఖలు చేశారు. పవన్ది రాజకీయంలోనూ నటనే ఏపీ అగ్రి మిషన్ సభ్యుడు బాబి అమలాపురం టౌన్: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్ ఇంతకాలం సినిమాల్లో మాత్రమే నటిస్తారనుకున్నాం. ఆయన రాజకీయాల్లోనూ నటిస్తారని ఆయన స్థిరత్వంలేని మాటలే తేటతెల్లం చేస్తున్నాయని ఏపీ అగ్రిమిషన్ సభ్యుడు జిన్నూరి రామారావు (బాబి) అన్నారు. అమలాపురంలో బాబి స్థానిక మీడియాతో శుక్రవారం మాట్లాడారు. గతంలో టీడీపీ, బీజేపీని, ప్రధానమంత్రి మోదీ, చంద్రబాబు, లోకేష్లపై ఎన్నో ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్ ఆ నోటితోనే నేడు ఇంద్రుడు, చంద్రుడు అంటూ వారిని పొగడ్తలతో ముంచెత్తుతున్న తీరు సినిమాల్లోని ఆయన నటనను ప్రజలకు గుర్తుకు చేస్తోందని బాబి అన్నారు. వైఎస్సార్ సీపీ ఉభయ గోదావరి జిల్లాల కో ఆర్డినేటర్, ఎంపీ పి.మిధున్రెడ్డిని గోదావరి జిల్లాలో ఆయన పెత్తనం ఏమిటి? అని ప్రశ్నిస్తున్న పవన్కళ్యాణ్ నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో చదువుకున్నానని చెప్పే ఆయనకు పిఠాపురంతో పనేంటని బాబి ఎదురు ప్రశ్న వేశారు. గోదావరి జిల్లాల పార్టీ కో ఆర్డినేటర్గా వైఎస్సార్ సీపీని పర్యవేక్షిస్తున్న మిధున్రెడ్డిని పవన్ కళ్యాణ్కి విమర్శించే అర్హత లేదని చెప్పారు. పావలా పవన్ అంటూ తిట్టిన టీడీపీతోనే అంటకాగుతున్న నీ రాజకీయ పరిణితిపై ప్రజలు చర్చించుకుంటున్నారని బాబి పేర్కొన్నారు. -
భీమేశ్వరాలయ జీర్ణోద్ధరణ పనులు
ఈఓ తారకేశ్వరరావు రామచంద్రపురం రూరల్: త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా, పంచారామాల్లో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాల్లో 12వ శక్తి పీఠంగా విరాజిల్లుతున్న శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వరస్వామివారి ఆలయం జీర్ణోద్ధరణ పనులను కేంద్ర పురావస్తు శాఖ ఆదేశాల మేరకు ఈ నెల 24 నుంచి జూన్ 30 వ తేదీ వరకు చేపట్టనున్నట్లు ఆలయ ఈఓ పితాని తారకేశ్వరరావు శుక్రవారం విలేకరులకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో భీమేశ్వరస్వామి, మాణిక్యాంబా అమ్మవార్ల గర్భాలయాలను పురావస్తు శాఖ స్వాధీనం చేసుకుని మరమ్మతులు చేపడుతున్నందున ప్రత్యామ్నాయంగా శృంగేరి పీఠాధిపతులు శ్రీ భారతీ తీర్ధ మహాస్వామి అందజేసిన నర్మద బాణ లింగానికి, శ్రీ చక్ర యంత్రానికి ప్రతి నిత్యం ఉదయం 6 గంటలకు ప్రథమాభిషేకాలు, కుంకుమార్చనలు ఉదయం 10 గంటలకు అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించడంతో పాటు స్వామి, అమ్మవార్లకు ప్రతి నిత్యం ఆర్జిత సేవలు, నిత్య కై ంకర్యాలు యథావిధిగా నిర్వహిస్తామన్నారు. పోక్సో కేసులో జీవిత ఖైదు గోపాలపురం: పోక్సో కేసులో ఒక వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ ఏలూరు పోక్సో కోర్టు తీర్పు చెప్పినట్లు గోపాలపురం ఎస్పై కర్రి సతీష్కుమార్ శుక్రవారం తెలిపారు. తూర్పుగోదగోపాలపురం పెద్దగూడెం కాలనీకి చెందిన ముప్పడి సంపత్రావు(75)పై 2017లో పోక్సో కేసు నమోదు చేశారు. ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేశాడన్న నేరం రుజువు కావడంతో ఏలూరు పోక్సో కోర్టు జడ్జి ఎస్.ఉమాసునంద తీర్పు చెప్పినట్లు తెలిపారు. ముద్దాయికి జీవిత కాల శిక్షతో పాటు రూ.వేయి జరిమానా, బాధితురాలికి రూ.2లక్షల 50వేలు చెల్లించాలంటూ ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్సై పేర్కొన్నారు. -
మత్స్యకారులకు ఓఎన్జీసీ పరిహారంపై సీఎం జగన్ భరోసా
● మేమంతా సిద్ధం సభలో మీ బిడ్డ జగన్ వల్లనే ఓఎన్జీసీ కమిటీ ఏర్పాటని వెల్లడి ● ముమ్మిడివరంలో మాదిరిగా అందరికీ మంచి జరుగుతుందని హామీ కాకినాడ రూరల్: మత్స్యకారులందరికీ ఓఎన్జీసీ పరిహారంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. అచ్చంపేట జంక్షన్ వద్ద మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ మత్స్యకారులకు పరిహారం కోసం ఓఎన్జీసీ కమిటీ ఏర్పాటు చేసిందంటే దానికి కారణం మీ బిడ్డ జగన్, వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే కారణం అన్నారు. ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని, ఈ రోజు కమిటీ ఏర్పాటయ్యిందని, ఆ కమిటీ రికమండేషన్ ఆధారంగా ప్రతీ మత్స్యకార కుటుంబానికి మంచి జరిగేటట్టుగా మీ బిడ్డ అండగా ఉంటాడని హామీ ఇస్తున్నానన్నారు. ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యను పరిష్కరించి ముమ్మిడివరంలో మత్స్యకారులకు పరిహారం ఇచ్చామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతకుముందు బహిరంగ సభలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఈ తీరప్రాంతంలో ఓఎన్జీసీ ఒక సిస్మిక్ సర్వేతో 500 కిలోమీటర్ల మేర ఎక్కడా మత్స్యకారులు వేట చేయకూడదని, 35 కిలోమీటర్లు నో మ్యాన్ జోన్ అని ప్రకటించినప్పుడు మత్స్యకారుల ఉద్యమానికి అండగా నిలిచామన్నారు. తాను, సిటీ శాసనసభ్యుడు చంద్రశేఖరరెడ్డి, ఎంపీ వంగా గీత మత్స్యకారుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించి మాట్లాడడంతోపాటు సీఎం దృష్టికి తీసుకువెళ్లామన్నారు. దీంతో కమిటీ ఏర్పాటుకు ఓఎన్జీసీ ముందుకు వచ్చిందన్నారు. సరిగ్గా 5 సంవత్సరాల క్రితం 2019 ఎన్నికలకు ముందు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో విజయశంఖారావాన్ని తొలిసభలో పూరించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన జగన్మోహన్రెడ్డి మళ్లీ ఇప్పుడు నామినేషన్ల పర్వం ప్రారంభమైన వెంటనే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సభకు రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మనందరి తరపున థ్యాంక్యూ సీఎం సార్ అని చెబుతున్నానన్నారు. జగనన్నకు, ఈ కుటిల నీతితో రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుకు ఉన్న తేడా ఏమిటంటే మీతో పోలికే లేని నాయకుడు చంద్రబాబు తన మందీమార్బలాన్ని, మీడియా బలాన్ని వెనకేసుకుని ప్రతిరోజూ బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారన్నారు. మీరు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తానంటుంటే చంద్రబాబు నాణ్యమైన మద్యాన్ని అందిస్తానంటున్నాడని ఇది చాలు మీకు, ఆయనకు ఉన్న పోలిక ఏమిటో అర్థమవుందని సీఎంను ఉద్దేశించి అన్నారు. చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ, పని తక్కువ. సింపుల్ గా చెప్పాలంటే.. సంక్రాంతికి పప్పుబెల్లాలను చంద్రబాబు పంచిపెడితే, మీరు ఇచ్చే కానుకలు జీవితాలను నిలబెట్టేవి, భవిష్యత్ తరాలకు తల రాత రాసేవన్నారు. ఇంగ్లిష్ మీడియం మొదలుకుని వైద్యం, విద్య, ఆరోగ్యాల్లో ఒక విప్లవాన్ని మీరు సృష్టించారని, ఇంటి స్థలం, వైద్యం, ఆరోగ్యశ్రీ అదేవిధంగా ఎన్నో కానుకలు మీరు అందించి చేయూత, భరోసాలాంటివి కూడా అందించి భవిష్యత్ తరాలను తీర్చిదిద్దుతున్నారని సీఎంకు కన్నబాబు కృతజ్ఞతలు తెలిపారు. -
ఎన్నికలకు ప్రత్యేకాధికారుల నియామకం
సాక్షి అమలాపురం: జిల్లాలో పార్లమెంట్, అసెంబ్లీ సాధారణ ఎన్నికల నిర్వహణ తీరును పర్యవేక్షించేందుకు ఇద్దరు సాధారణ పరిశీలకులు, ముగ్గురు వ్యయ పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించిందని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజేశ్వర్ గోయల్ (ఐఏఎస్), ప్రదీప్ కుమార్ (ఐఏఎస్) సాధారణ పరిశీలకులుగా, ఉమేష్ కుమార్ (ఐఆర్ఎస్) పార్లమెంట్ స్థానానికి వ్యయ పరిశీలకులుగా, రాహుల్ ధింగ్రా (ఐఆర్ఎస్), సుమిత్ దాస్ గుప్తా (ఐఆర్ఎస్)లను ఏడు అసెంబ్లీ స్థానాలకు వ్యయ పరిశీలకులుగా ఎన్నికల సంఘం నియమించిందన్నారు. ఎన్నికలు నిష్ఫక్షపాతంగా నిర్వహించాలి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు ఉమేష్కుమార్ తెలిపారు. అకౌంటింగ్, వీడియో సర్వేలెన్స్, ఫ్లయింగ్ బృందాలతో కలెక్టరేట్లో శుక్రవారం ఆయన మాట్లాడారు. పార్లమెంట్, అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఖర్చుల గణనపై అవగాహన కల్పించారు. ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత చేపట్టిన గణాంకాలపై ఆయన సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ గత ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో వ్యయ పరిశీలకుడిగా పనిచేశానని సాధారణ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు బృందాలు కృషి చేయాలన్నారు. అనుమతులు సక్రమంగా లేని పక్షంలో వాహనాలు ఆర్వో ద్వారా సీజ్ చేయించాలని సూచించారు. నగదు అక్రమ రవాణా అడ్డుకట్ట వేసేందుకు సంబంధిత బృందాలు తనిఖీలు ముమ్మరం చేయాలన్నారు. రూ10 లక్షలు దాటి నగదు రవాణా అవుతున్నట్లయితే నగదు సీజ్ చేసి ఆదాయ పన్ను శాఖ అధికారులకు తెలియజేయాలన్నారు. మద్యం విక్రయాలు లిక్కర్ షాపుల ద్వారా ఎన్నికల సమయంలో పెరిగినట్టు గుర్తిస్తే నిఘా మరింత పెంచాలన్నారు. అభ్యర్థుల ఊరేగింపులు ర్యాలీలు, బహిరంగ సభల వీడియోలను సక్రమంగా చిత్రీకరించి అకౌంటింగ్ టీమ్కు అందించాలని, అకౌంటింగ్ టీం నిర్దేశిత రేట్ల ప్రకారం అభ్యర్థులకు సంబంధించిన వ్యయాలను గణించాలని సూచించారు. నామినేషన్లు వేసిన తేదీ నుంచి మరింత అప్రమత్తంగా గణాంకాలు చేపట్టాలన్నారు. బ్యాంకులలో నగదు లావాదేవీలు రోజువారీ నివేదికను జిల్లా ఎన్నికల అధికారి ఎల్డీఎంకు సమర్పించాలని సూచించారు. మరో వ్యయ పరిశీలకులు రాహుల్ ధింగ్రా మాట్లాడుతూ ఎన్నికల్లో మద్యం, నగదు, ఉచిత వస్తువులు పంపిణీ జరగకుండా పర్యవేక్షించాలన్నారు. సాధారణ ఎన్నికలు అత్యంత ఖర్చుతో కూడుకున్నాయని, అభ్యర్థుల ఖర్చుపై ఎన్నికల సంఘం పరిమితి విధించినందున ఆ ప్రకారం మాత్రమే ఖర్చు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రెజరీ అధికారి రామనాథం, నోడల్ అధికారి మురళీకృష్ణ, జిల్లా రవాణా అధికారి అశోక్ ప్రతాప్రావు పాల్గొన్నారు. అధికారి పేరు కేటాయించిన స్థానం సెల్ నెం. రాజేశ్వర్ గోయిల్ జనరల్ అబ్జర్వర్ 89789 62588 ప్రదీప్ కుమార్ జనరల్ అబ్జర్వర్ 89775 02588 ఉమేష్ కుమార్ వ్యయ పరిశీలకులు 78935 12588 రాహూల్ ధింగ్రా వ్యయ పరిశీలకులు 89784 52588 సుమిత్ దాస్ గుప్తా వ్యయ పరిశీలకులు 73308 62588 -
No Headline
రావులపాలెం సెంటర్లో జనవాహినికి అభివాదం చేస్తున్న సీఎం జగన్జననేత చూసేందుకు తోసుకుంటూ ముందుకు.. అదిగదిగో జగనన్ననవరత్నాలతో తమ బతుకుల్లో వెలుగులు పొదిగిన జగన్మోహనుడి రాక జనానికి ఏరువాకే అయింది. భగభగ మండే వేసవి ఎండలు గుండెల్లో ఉప్పొంగే అభిమానాన్ని ఏమీ చేయలేకపోయాయి. మేమంతా సిద్ధం బస్సుయాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించింది మొదలు జనం బ్రహ్మరథం పట్టారు. బాణసంచా కాల్చారు. అడుగడుగునా హారతులు ఇచ్చారు. పూలజల్లులు కురిపించారు. గజమాలలతో స్వాగతించారు. తమ నాయకుడి అభివాదానికి ప్రత్యభివాదంగా రెండు చేతులు ఊపుతూ కేరింతలు కొట్టారు. చిరునవ్వులు చిందించే జగనన్న మోమును తమ సెల్ఫోన్లలో బంధించి మురిసిపోయారు. పార్టీ జెండాలే తోరణాలుగా, ఫ్లెక్సీలే స్వాగత ద్వారాలుగా దారిపొడవునా వెల్లువెత్తిన అభిమానంతో బస్సుయాత్ర జాతరను తలపించింది. -
అక్రమ రవాణాను అడ్డుకుంటున్న నిఘా బృందాలు
అమలాపురం టౌన్: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటర్లకు ఎర వేసే ఏ అక్రమాన్నైనా జిల్లా పోలీసు శాఖ, ఎస్ఈబీ, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ నిఘా బృందాలు మాటు వేసి అడ్డుకుంటున్నాయి. జిల్లాలో బుధ, గురువారాల్లో జరిగిన దాడులు, తనిఖీలతో పట్టుబడ్డ మద్యం వివరాలను ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ● అమలాపురం, ముమ్మిడివరం, ఆలమూరు, రాజోలు, కొత్తపేట, రామచంద్రపురం ఎస్ఈబీ స్టేషన్ల పరిధిలో ఎనిమిది కేసులకు సంబంధించి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఒక నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం సీసా, 527 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలను, 99 లీటర్ల ఇండియన్ మేడ్ లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు. ● ఆలమూరు ఎస్ఈబీ స్టేషన్ పరిధిలో రెండు కేసులకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.7.86 లక్షల విలువైన 6,240 నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ● జొన్నాడ, గోపాలపురం, బొబ్బర్లంక, దిండి, ఎదుర్లంక, నరసాపురపుపేటల్లో ఏర్పాటు చేసి జిల్లా చెక్ పోస్టుల వద్ద గురువారం ప్రతి వాహనాన్ని నిలిపి ఆద్యంతం తనిఖీ చేసిన పిదపే నిఘా బృందాలు వదిలాయి. -
యానాంలో నేడు పోలింగ్
యానాం: పుదుచ్చేరి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాంలో శుక్రవారం జరిగే మొదటి దఫా పోలింగ్కు ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తం 33 పోలింగ్ బూత్లకు ఈవీఎంలు తదితర ఎన్నికల సామగ్రితో సిబ్బంది బస్సులో తరలివెళ్లారు. స్థానిక సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూమ్ నుంచి ఈవీఎంలను తీసుకువెళ్లారు. ప్రైసెడింగ్ ఆఫీసర్, పోలింగ్ ఆఫీసర్లు, వాలంటీర్లు, పోలీసుయంత్రాంగం సైతం ఆయా పోలింగ్బూత్లకు చేరుకున్నారు. యానాంతో పాటు పుదుచ్చేరి ప్రాంతం నుంచి సైతం అదనపు పోలీసు బలగాలు తరలివచ్చా యి. వీరితో పాటు పారా మిలటరీ దళాలను ఆయా పోలింగ్బూత్ల వద్ద నియమించారు. 33 పోలింగ్బూత్లకు 33 ఈవీఎంలతో పాటు రిజర్వుగా మరో 13 ఈవీఎంలు ఉంచినట్లు అధికారులు తెలిపారు. సుమారు 300కు పైగా ఎన్నికల సిబ్బందిని నియమించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అన్ని రాజకీయ పక్షాలు సహకరించాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి మునిస్వామి కోరారు. ఎస్పీ రాజశేఖరన్, సీఐ షణ్ముగం తదితరులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
కూటమి ఓ బోగస్ కంపెనీ
● జనసేన నుంచి వైఎస్సార్ సీపీలో చేరిన బొంతు రాజేశ్వరరావు ● మలికిపురంలో ఘన స్వాగతం మలికిపురం: రాష్ట్రంలో జగన్కు వ్యతిరేకంగా కూటమి సాగిస్తున్న రాజకీయం ఓ పెద్ద బోగస్ వ్యవహారమని జనసేన నుంచి వైఎస్సార్ సీపీలో చేరిన బొంతు రాజేశ్వరరావు పేర్కొన్నారు. తణుకులో బుధవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన ఆయన పార్టీ నాయకులు కేఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో మలికిపురంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఏదో సేవ చేద్దామని జనసేనలోకి వెళితే అక్కడ అంతా చంద్రబాబు ఆధ్వర్యంలో వచ్చే ఎన్నికల్లో ప్రజలను దోచేద్దామన్న కార్యక్రమానికి కార్యాచరణ రూపొందుతోందని అన్నారు. దీంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని అన్నారు. రాజోలు నియోజకవర్గంలోనే టీడీపీ, జనసేన కేడర్కు ప్రణాళిక ఏమీ లేదని, ఇక ప్రజలకు వారు ఏం చేస్తారని అనుమానం వచ్చి బయటకు వచ్చేశానని రాజేశ్వరరావు అన్నారు. వచ్చే ఎన్నికలలో మరోసారి జగన్ ముఖ్యమంత్రి అయ్యేందుకు కృషి చేస్తానని అన్నారు. అమలాపురం ఎంపీగా రాపాక వర ప్రసాదరావు, రాజోలు ఎమ్మెల్యేగా గొల్లపల్లి సూర్యారావు గెలుస్తారని అన్నారు. పీకే రావు, సూరిశెట్టి బాబి, కొల్లాబత్తుల కుమార్ పాల్గొన్నారు. -
ప్రచార ప్రకటనలకు అనుమతి తప్పనిసరి
అమలాపురం రూరల్: ప్రచార ప్రకటనలకు అనుమతి తప్పనిసరని నిబంధనలు అతిక్రమించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా తెలిపారు. గురువారం కలెక్టరేట్లో మీడియా సర్టిఫికేషన్ సమన్వయ కేంద్రాన్ని కలెక్టర్, ఎన్నికల వ్యయ పరిశీలకులు సుమిత్దాస్ గుప్తా, రాహుల్ దింగడాతో కలిసి సందర్శించి కేంద్ర నిర్వహణ తీరును పార్టీల ప్రచార ప్రకటనల ప్రెస్ క్లిప్పింగ్స్ రికార్డుల ఆధారంగా పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ వ్యయ పరిశీలకులకు కేంద్రం పనితీరును వివరిస్తూ వివిధ ఎలక్ట్రానిక్ ప్రసార మాధ్యమాల్లో ప్రసారమయ్యే రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మీడియాకు సూచించారన్నారు. దీని కోసం కలెక్టరేట్లో జిల్లా స్థాయి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రకటనలకు ముందస్తు అనుమతి మంజూరు చేయటంతో పాటు, చెల్లింపు వార్తలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందన్నారు మీడియా ఉల్లంఘనలను కూడా గుర్తించి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీలు లేదా వాటి తరఫున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రచార ప్రకటనలకు అనుమతి పొందటం కోసం నిర్ణీత నమూనాలో ప్రకటన ప్రసారం చేసే మూడు రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించామన్నారు. కులాలను, మతాలను కించపరుస్తూ గానీ, అశ్లీలం, ఇతరుల పరువుకు నష్టం కలిగిస్తూ, హింసను ప్రేరేపించే విధంగా గానీ ప్రకటనలు ఉండరాదన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమాధికా రానికి భంగం కలిగించేలా కానీ, న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా గానీ, కోర్టు ధిక్కరణ చేస్తూ గానీ ప్రకటనలు ఇవ్వరాదని స్పష్టం చేశామన్నారు. పేరు పెట్టి వ్యక్తిగత దూషణ చేయరాదని, వ్యక్తిగత జీవితాన్ని కించపరిచేలా ఉండరాదన్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, తదితర మత చిహ్నాలను, పోస్టర్లను, సంబంధిత సంగీతాన్ని వినియోగించరాదని తెలిపారు. నిజ నిర్ధారణ లేకుండా ఇతర పార్టీలపైగానీ, ప్రతినిధులపై గానీ ఆరోపణలు చేస్తూ ప్రకటనలు ఇవ్వరాదని ఇప్పటికే మీడియాకు తెలియజేశామని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా -
కల్యాణ వైభోగమే..
ఆత్రేయపురం: కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం నుంచి వారం రోజుల పాటు స్వామివారి కల్యాణోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కల్యాణోత్సవాలను ప్రారంభిస్తారు. దేవదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈఓ భూపతిరాజు కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులకు వసతులు కల్యాణోత్సవాలకు వచ్చే భక్తులకు ఎండ తగలకుండా చలువ పందిళ్ల వేయించారు. అక్కడ గాలి కోసం ఫ్యాన్లు అమర్చారు. స్వామివారి దర్శనానికి భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా భారీ క్యూలైన్లు కట్టారు. లొల్ల నుంచి వాడపల్లి వరకూ అడుగడుగునా స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించనున్నారు. చిరు వ్యాపారులు పలు దుకాణాలను ఏర్పాటు చేశారు. వాడపల్లి ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. భక్తులకు స్వామివారి ప్రసాదం కొరత రాకుండా సుమారుగా 50 వేల లడ్డూలను తయారు చేసి సిద్ధంగా ఉంచారు. 24న శ్రీపుష్పోత్సవంతో పూర్తి ధ్వజారోహణ, అంకురార్పణ, నిత్య బలిహరణ కార్యక్రమంతో గురువారం వాడపల్లి తీర్థ మహోత్సవం ప్రారంభమవుతుంది. శుక్రవారం రథోత్సవం, రాత్రి స్వామివారి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహిస్తారు. స్వామివారికి ప్రభుత్వం తరఫున ఆర్డీవో సత్యనారాయణ నూతన వస్త్రాలు సమర్పిస్తారు. రాత్రి 7.01 గంటలకు భూదేవి శ్రీదేవి సమేత వేంకటేశ్వరస్వామికి ఆగమన శాస్త్ర ప్రకారం కల్యాణ ఘట్టాన్ని వేదమంత్రోచ్ఛారణలతో జరుపుతారు. 20న పొన్నవాహన మహోత్సవం, 21న సదశ్యం, 22న స్వామివారికి ప్రత్యేక పూజలు, గౌతమి గోదావరిలో సాయంత్రం 7 గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. 23న గౌతమి గోదావరిలో భక్తుల సమక్షంలో స్వామివారికి చక్రతీర్థస్నానం జరుగుతుంది. 24న జరిగే శ్రీపుష్పోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. నేటి నుంచి వాడపల్లి వెంకన్న కల్యాణోత్సవాలు భక్తుల కోసం సర్వం సిద్ధం -
సీఎం జగన్ రోడ్ షో విజయవంతం చేయండి
కొత్తపేట: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సుయాత్ర రోడ్ షోను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే, నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి చిర్ల జగ్గిరెడ్డి పార్టీ శ్రేణులు, అభిమానులకు పిలుపునిచ్చారు. ఆయన బుధవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ సీఎం జగన్ రోడ్ షో షెడ్యూల్ను వివరించారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు సమీపంలో తేతలి నుంచి గురువారం ఉదయం 9 గంటలకు జాతీయ రహదారి మీదుగా రోడ్ షో ప్రారంభమవుతుందన్నారు. అక్కడి నుంచి తణుకు బైపాస్, పెరవలి, సిద్ధాంతం అడ్డరోడ్డు మీదుగా వశిష్ట వారధిని దాటి కొత్తపేట నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. అనంతరం గోపాలపురం, ఈతకోట మీదుగా ఉదయం 10.30 గంటలకు రావులపాలెం సెంటర్కు చేరుకుంటుందన్నారు. గౌతమి వారధి మీదుగా జొన్నాడ సెంటర్, మూలస్థానం, చొప్పెల్ల, చెముడులంక, మడికిలో సాగుతుంది. అక్కడితో కొత్తపేట నియోజకవర్గ రోడ్ షో పూర్తవుతుందని, ఆ తర్వాత పొట్టిలంక మీదుగా కడియపులంక చేరుకుంటుందన్నారు. అక్కడ భోజన విరామం అనంతరం 4 గంటలకు బయలుదేరి వేమగిరి సెంటర్, బొమ్మూరు సెంటర్, తాడితోట సెంటర్, దేవీచౌక్ సెంటర్, సీతంపేట, దివాన్చెరువు, రాజానగరం మీదుగా రోడ్ షో పూర్తి చేసుకుని ఎస్టీ రాజాపురంలో రాత్రి బస ఉంటుందన్నారు. నియోజకవర్గంలోని రావులపాలెం, ఆలమూరు మండలాల్లో రోడ్ షో జరుగుతుండగా ఆయా మండలాలతో పాటు కొత్తపేట, ఆత్రేయపురం మండలాల నుంచి అత్యధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానుల మోటార్ సైకిల్ ర్యాలీతో రోడ్ షో సాగుతుందన్నారు. నేటి ఉదయం 10 గంటలకు రావులపాలెం సెంటర్కు రాక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి -
వృద్ధురాలి దారుణ హత్య
కొత్తపేట: పెళ్లి చేసుకుని ఆనందంగా కాపురానికి వెళ్లిన ఆమె తన భర్త అనుమానపు జబ్బును చూసి బెంబేలెత్తిపోయింది. ఏదోలా రాజీపడి బతుకుతున్నా భర్త వేధింపులు ఎక్కువ కావడంతో భరించలేకపోయింది. తల్లి లేని ఆమె తన అమ్మమ్మ ఇంటికి ఇద్దరు కుమారులతో కలిసి వచ్చేసింది. అయితే కోపం పెంచుకున్న భర్త ఆ అమ్మమ్మను దారుణంగా హత్య చేశాడు. మండలంలోని గంటి గ్రామంలో శిరిగినీడి గంటాలమ్మ (78) హత్య కలకలం రేపింది. ఎస్సై ఎం.అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. గంటాలమ్మ మనవరాలు (కూతురి కుమార్తె) నాగదేవికి సుమారు 9 ఏళ్ల క్రితం తెలంగాణలోని ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామానికి చెందిన సాదం రామకృష్ణతో వివాహం జరిగింది. కొంత కాలం వీరి సంసారం సజావుగా సాగింది. అనంతరం భార్యపై అనుమానంతో రామకృష్ణ తరచూ గొడవలు పడేవాడు. ఆ క్రమంలో తన తమ్ముడి నరేష్తో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో అతడిని గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈ కేసులో అరైస్టెన రామకృష్ణ కొన్నేళ్ల క్రితం జైలు నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత పెద్దల సమక్షంలో భార్యాభర్తలు రాజీపడ్డారు. భార్య కోరిక మేరకు ఆలమూరు మండలం చెముడులంకలో కాపురం ప్రారంభించారు. కానీ రామకృష్ణ అనుమానంతో మళ్లీ నాగదేవిని చిత్రహింసలకు గురిచేశాడు. అవి భరించలేని నాగదేవి తన ఇద్దరు కుమారులతో గంటిలో అమ్మమ్మ గంటాలమ్మ ఇంటికి వచ్చేసింది. గత ఏడాది అక్టోబర్లో తన భార్యను కాపురానికి పంపించాలని గంటాలమ్మతో రామకృష్ణ ఘర్షణ పడ్డాడు. ఆమైపె దాడి చేసి, ఇంటిలో వస్తువులు చెల్లాచెదురుచేసి, చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో నాగదేవి కొత్తపేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా, రామకృష్ణను అరెస్టు చేశారు. స్థానిక సబ్ జైలు నుంచి బెయిల్పై విడుదలైన రామకృష్ణ బుధవారం తెల్లవారుజామున గంటాలమ్మ ఇంట్లోకి ప్రవేశించాడు. హాల్లో నిద్రిస్తున్న గంటాలమ్మ పీకను కత్తితో కోసేశాడు. ముఖం, భుజంపై విచక్షణారహితంగా నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అమ్మమ్మ కేకలకు పక్క గదిలో పిల్లలతో కలిసి నిద్రిస్తున్న నాగదేవి భయంతో తలుపులు వేసుకుని దాక్కుంది. రామకృష్ణ వెళుతూ ఏదోరోజు నిన్ను కూడా చంపేస్తానని భార్య ను బెదిరించాడు. సమాచారం అందుకున్న రావులపాలెం సీఐ రామ్కుమార్, ఎస్సై ఎం.అశోక్ సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కొత్తపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నాగదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అశోక్ తెలిపారు. నిద్రిస్తుండగా పీక కోసి చంపిన మనవరాలి భర్త కుటుంబ కలహాలతో ఘాతుకం -
నేటి నుంచి ధ్వజస్తంభ ప్రతిష్ఠ పూజలు
అన్నవరం: సత్యదేవుని ఆలయంలో నూతన స్వర్ణ ధ్వజస్తంభం ప్రతిష్ఠ కార్యక్రమాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించేందుకు యాగశాల నిర్మించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదు హోమగుండాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే ధ్వజస్తంభం కర్రను స్వామివారి ఆలయంలోని అనివేటి మండపం వద్దకు చేర్చారు. దానిని నిలబెట్టేందుకు కాంక్రీట్తో పునాదిని సిద్ధం చేశారు. మంటపం శ్లాబ్ నుంచి ధ్వజస్తంభం వెళ్లేందుకు వీలుగా ఏర్పాటు చేశారు. 22న ప్రతిష్ఠాపన నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠకు సంబంధించి గురువారం నుంచి ఈ నెల 22వ తేదీ వరకూ ప్రత్యేక పూజలు చేస్తారు. గురువారం ఉదయం 11 గంటలకు వినాయక పూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, మండపారాధన, జలాదివాసం నిర్వహిస్తారు. శుక్రవారం క్షీరాదివాసం, శనివారం పుష్పాదివాసం, ఆదివారం ధాన్యాదివాసం, 22వ తేదీ కలాన్యాశం, శయ్యాదివాసం తదితర పూజలు నిర్వహిస్తారు. అనంతరం 22వ తేదీ ఉదయం 10.48 గంటలకు ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించనున్నారు. ఆ తర్వాత స్తంభానికి రాగి రేకు అమర్చి స్వర్ణ రేకు తాపడం చేయనున్నారు. ఇందుకయ్యే ఖర్చంతా నెల్లూరుకు చెందిన భక్తుడి కుటుంబ సభ్యులు భరిస్తున్న సంగతి తెలిసిందే. ఽయాగశాలలో ప్రత్యేక హోమాలు ఽసత్యదేవుని ఆలయంలో పూర్తయిన ఏర్పాట్లు -
అక్రమ నగదు, మద్యం రవాణాపై ఉక్కుపాదం
అమలాపురం టౌన్: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లాలో కోడి పందేలు, పేకాటలతో పాటు అక్రమం మద్యం, నగదు రవాణాలపై అధికారుల తనిఖీలు, దాడులు విస్తృతంగా జరుగుతున్నాయి. వీటిలో భాగంగా జిల్లాలో 51 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.1.28 లక్షలు, 13 కోడి పుంజులను స్వాధీ నం చేసుకున్నారు. ఎస్పీ సుసరాపు శ్రీధర్, ఏఎస్పీ ఎస్ ఖాదర్ బాషా ఆధ్వర్యంలో పోలీస్, ఎస్ఈబీ, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు జిల్లాలో మంగళవారం చేపట్టిన తనిఖీలు, దాడుల వివరాలను జిల్లా ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటనలో వివరించింది. ● కాట్రేనికోన పోలీసు స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి, అతడి నుంచి 17 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలు, 3.06 లీటర్ల ఇండియన్ మేడ్ లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు. ● రావులపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో పేకాట, కోడి పందేలపై దాడులు చేసి 43 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 13 కోడి పుంజులు, 10 కోడి కత్తులు, 15 మోటారు సైకిళ్లు, మూడు కార్లు, రూ.1.28 లక్షల నగదు సీజ్ చేశారు. ● అమలాపురం, ముమ్మిడివరం, ఆలమూరు, రాజోలు, రామచంద్రపురం, కొత్తపేట ఎస్ఈబీ స్టేషన్ల పరిధిలో ఏడుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి 14 నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలు, 30 డ్యూటీ పెయిడ్ మద్యం సీసాలు, 8.34 లీటర్ల ఇండియన్ మేడ్ లిక్కర్, 15 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. అలాగే 200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. ● జొన్నాడ, గోపాలపురం, బొబ్బర్లంక, దిండి, ఎదుర్లంక, నరసాపురపుపేటల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో వాహనాల తనిఖీలు కొనసాగుతున్నాయి. ● సమస్యాత్మక గ్రామమైన పామర్రులో పోలీసు అధికారులు కేంద్ర బలగాలతో కలసి బుధవారం సాయంత్రం కవాతు నిర్వహించారు. పోలింగ్ బూత్లకు నిర్భయంగా వెళ్లి ఓటు హక్కు వినియోగించుకునేందుకు మేమంతా బందోబస్తుతో భరోసాగా ఉంటామని ప్రజలకు హామీ ఇచ్చాయి. 51 మంది అరెస్ట్, రూ.1.28 లక్షల స్వాధీనం విస్తృతంగా అధికారుల తనిఖీలు -
క్లీన్ స్వీప్పై పార్టీ శ్రేణుల గురి
సాక్షిప్రతినిధి, కాకినాడ: నాడు సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేసిన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ‘తూర్పు’న ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించనున్నారు. ఇందుకోసం మేమంతా సిద్ధం బస్సు యాత్ర 17వ రోజు గురువారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు తెరలేచిన తరువాత తొలిసారి వస్తోన్న జగన్మోహన్రెడ్డికి బ్రహ్మరథం పట్టేందుకు ప్రజలు, పార్టీ శ్రేణులు మేమతా సిద్ధమంటూ సన్నద్ధమవుతున్నాయి. మేమంతా సిద్ధం బస్సు యాత్ర వచ్చే మార్గంలో ప్రజలు అఖండ స్వాగతం పలికేందుకు స్వచ్ఛందంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉదయం తొమ్మిది గంటలకు పశ్చిమగోదావరి జిల్లా తణుకు శివారున తేతలి రాత్రి బస నుంచి బయలుదేరతారు. అక్కడి నుంచి ఈతకోట, రావులపాలెం, జొన్నాడ జంక్షన్ మీదుగా పొట్టిలంక చేరుకుంటారు. మధ్యాహ్న భోజన విరామం అనంతరం కడియపులంక, మేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోట జంక్షన్, చర్చి సెంటర్, దేవీచౌక్, పేపరుమిల్లు సెంటర్, దివాన్చెరువు, రాజానగరం మీదుగా ఎస్టీ రాజాపురంలో రాత్రి బస చేసే శిబిరానికి చేరుకుంటారు. ఆసక్తిగా అభిమానుల ఎదురుచూపులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జరిగే మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏర్పాట్లను ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త పెద్దిరెడ్డి మిధున్రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్ జిల్లా నేతలు నాలుగైదు రోజులుగా పరిశీలిస్తున్నారు. తొలిరోజు జగన్మోహన్రెడ్డి బస్సుయాత్ర తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్, రాజమహేంద్రవరం సిటీ, రాజానగరం, అనపర్తి ఆరు నియోజకవర్గాల్లో సాగనుంది. ఈ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర సుమారు 85 కిలోమీటర్లు మేర రోడ్షోగా సాగేలా షెడ్యూల్ రూపొందించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సాగే ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కోసం ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది ప్రజలు, పార్టీ శ్రేణులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బస్సు యాత్ర సాగే దారిపొడవునా ముఖ్యమంత్రి జగన్కు నీరాజనాలు పలికేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. బస్సు యాత్ర విజయవాడ వచ్చిన సందర్భంలో సింగ్నగర్లో జగన్మోహన్రెడ్డిపై పదునైన వస్తువుతో దుండగుడు దాడి చేయడంతో గాయపడిన అనంతరం జిల్లాకు వస్తుండటంతో అన్ని వర్గాలు జగన్ను కలవాలి, తమ అభిమాన నాయకుడిని పలకరించాలి అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో ప్రవేశించే సరికి కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతించి తమ అభిమానాన్ని చాటుకోవాలని కోనసీమ వాసులు సన్నాహాలు చేసుకుంటున్నారు. కోనసీమలోని ఏడు నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, ప్రజలు రావులపాలెం సెంటర్కు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడి నుంచి జాతీయ రహదారి గుండా రాజమహేంద్రవరం రూరల్, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర వెంట జనం వేలాదిగా తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్టుగా ట్రాఫిక్కు ఎటువంటి ఇబ్బంది ఎదురుకాకుండా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మూడు పార్లమెంటు స్థానాలను వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుంది. 19 అసెంబ్లీ స్థానాల్లో నాలుగు మినహా అన్ని స్థానాల్లోను వైఎస్సార్ సీపీ పాగా వేసింది. 2022 ఏప్రిల్లో జిల్లాల పునర్విభజన జరిగాక తూర్పుగోదావరి జిల్లా మూడు జిల్లాలైంది. తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లో 21 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వచ్చే ఎన్నికల్లో మూడు జిల్లాల్లో 21 స్థానాలకు 21 సెగ్మెంట్లలో క్లీన్ స్వీప్ చేయాలనే సంకల్పంతో వైఎస్సార్ సీపీ శ్రేణులు సమాయత్తమవుతున్నాయి. నాడు పాదయాత్రలో ప్రజల కష్టాలు కళ్లారా చూసి చలించిన ప్రతిపక్ష నేతగా జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలన్నింటినీ నూటికి నూరుశాతం అమలు చేశారు. అందుకే మీ ఇంటిలో మంచి జరిగి ఉంటేనే ఓటేయండని ముఖ్యమంత్రి జగన్ ధైర్యంగా అడుగుతున్న తీరు పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపుతోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపుతుందని నేతలు అభిలషిస్తున్నారు. -
ఎస్టీ రాజాపురంలో చురుగ్గా సీఎం బస ఏర్పాట్లు
రాజానగరం: ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి జిల్లాలో గురువారం పర్యటించనున్నారు. ఏడీబీ రోడ్డును అనుకుని ఎస్టీ రాజాపురం వద్ద రాత్రి బస చేయనున్నారు. ఇందుకు సంబంధించి పటిష్టమైన బందోబస్తుతోపాటు బస చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఎస్పీ పి.జగదీష్తోపాటు సీఎం భద్రతా సిబ్బంది, సెంట్రల్ డివిజన్, నార్త్, ఈస్ట్ డీఎస్పీలు, స్థానిక సీఐ, తదితరులు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కడియపులంకలో సీఎం భోజన విరామం కడియం: మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం కడియం మండలం రానున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం నుంచి జాతీయ రహదారి మీదుగా వస్తున్న ఆయన పొట్టిలంక వద్ద కడియం మండలంలో ప్రవేశిస్తారు. అక్కడి నుంచి కడియపులంక చేరుకుని అక్కడ మధ్యాహ్న భోజనం చేస్తారు. ఇందుకోసం వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం రూరల్ కో–ఆర్డినేటర్, మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. విరామం కోసం ఆగే ప్రాంతంలో సీఎం బస్సు, కాన్వాయ్ ట్రయల్ రన్ను కూడా అధికారులు పర్యవేక్షించారు. పొట్టిలంక నుంచి హైవేపై కుడివైపునకు సీఎం కాన్వాయ్ని మరల్చి, కడియపులంకలోని ఖాళీ స్థలం వద్దకు తీసుకురానున్నారు. సౌత్ జోన్ డీఎస్పీ అంబికా ప్రసాద్, కడియం ఎంపీడీఓ జి.రాజ్మనోజ్ ఇతర అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. -
No Headline
జిల్లాలో ఓటర్ల వివరాలు (జనవరి 22వ తేదీ నాటికి ) నియోజకవర్గం పోలింగ్ కేంద్రాలు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం ఓటర్లు రామచంద్రపురం 239 99,361 1,00,785 1 2,00,147 ముమ్మిడివరం 268 1,20,680 1,21,190 0 2,41,870 అమలాపురం (ఎస్సీ) 235 1,05,166 1,05,724 1 2,10,891 రాజోలు (ఎస్సీ) 205 96,552 98,637 1 1,95,190 పి.గన్నవరం (ఎస్సీ) 212 98,969 97,363 5 1,96,337 కొత్తపేట 262 1,23,389 1,11,692 5 2,48,392 మండపేట 223 1,05,949 1,11,69 4 2,17,645 మొత్తం 1,644 7,50,066 7,60,389 17 15,10,472 సాక్షి అమలాపురం: సార్వత్రిక ఎన్నికలలో కీలక ఘట్టానికి తెరలేవనుంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభం కానుంది. జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానానికి సంబంధించి నామినేషన్లు స్వీకరించనున్నారు. అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కలెక్టర్ కార్యాలయంలో, అసెంబ్లీలకు ఆయా రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలలో ఈ ప్రక్రియ జరుగుతుంది. నామినేషన్ల స్వీకరణకు గెజిట్ నోటిఫికేషన్ కూడా గురువారం విడుదల కానుంది. 25 వరకూ స్వీకరణ ఈ నెల 18 నుంచి 25 వరకూ (ప్రభుత్వ సెలవులలో మినహా) ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అనంతరం ఈ నెల 26న పరిశీలన జరుగుతుంది. 29న ఉపసంహరణకు అవకాశం ఉంది. అనంతరం పోటీలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మే 13న జరగనున్న విషయం తెలిసిందే. జిల్లాలోని ఓటర్ల తుది జాబితాను జనవరి 22వ తేదీన ప్రకటిస్తారు. ఆ ప్రకారం ఓటర్ల వివరాలు ఈ కింద తెలిపిన విధంగా ఉన్నాయి. జనవరి 22 తర్వాత కూడా ఓటర్ల నమోదు జరిగిన నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఎన్నో ప్రత్యేకతలు ● డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఎన్నికలు కావడంతో అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టారు. గోదావరి లంకలు, సముద్ర సంగమ ప్రాంతంలో పాయల మధ్య ఉన్న గ్రామాలలో పోలింగ్ నిర్వహణపై దృష్టి సారించారు. మరోవైపు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే వారిపైనా, నగదు, మద్యం సరఫరాపై పక్కాగా నిఘా పెట్టారు. ● నామినేషన్లను ఆన్లైన్లో స్వీకరించనున్నారు. ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్సైట్లో ఈ సౌకర్యం కల్పించారు. ఆన్లైన్లో నామినేషన్ వేసిన తర్వాత ధ్రువీకరణ పత్రాలను ఆర్వో కేంద్రంలో అందజేయాలి. ● ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో సామాన్య పౌరులను సైతం భాగస్వాములను చేస్తూ ఎన్నికల కమిషన్ పలు రకాల యాప్లను అందుబాటులోకి తెచ్చింది. సీవిజల్, సువిధ, అబ్జర్వర్, సాక్ష్యం, కేవైసీ, నేషనల్ గ్రీవెన్స్ సర్వీస్, ఓటరు హెల్ప్యాప్లు రూపొందించింది. ఎన్నికలకు సంబంధించి సమాచారం, కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదులకు, ఎన్నికల నియమావళి, ఓటర్లకు అవసరమైన సాయం, ఎన్నికల ఖర్చు, పోలింగ్ బూత్ల తదితర సమాచారాలు తెలుసుకునేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి. ● గత ఎన్నికల వరకూ ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లు, వాటికి ఎదురుగా అభ్యర్థుల గుర్తులు ఉండేవి. తాజాగా ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థిని సులువుగా గుర్తించి, ఓటు వేసేందుకు ఈ సౌకర్యం కల్పించారు. ● తొలిసారిగా ఉద్యోగులు, ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బందితో పాటు పాత్రికేయులకు సైతం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు. పోలింగ్ కేంద్రంలో కాకుండా ఇంటి వద్దే ఓటు హక్కును వినియోగించుకునే విధానాన్ని ఈ ఎన్నికల్లో ప్రవేశ పెడుతున్నారు. 85 ఏళ్లు పైబడిన వారు, దివ్యాంగులకు ఇలా ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ కల్పించింది. ఇందుకోసం ఫారం 12డీ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎన్నికల అధికారులు సాధారణ పోలింగ్కు ముందే ఇంటికి వచ్చి బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేయిస్తారు. ● ఓటింగ్ శాతం పెంచేందుకు నమూనా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆదర్శ పోలింగ్ కేంద్రాలను నియోజకవర్గానికి ఒకటి వంతున ఏర్పాటు చేయగా, ఈసారి ఎన్నికల్లో నియోజకవర్గానికి ఐదు వంతున ఏర్పాటు చేయనున్నారు. ఇక మహిళలు, దివ్యాంగులకు ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. గత ఎన్నికల్లో నియోజకవర్గానికి ఒకటి వంతున మాత్రమే మహిళలకు పోలింగ్ కేంద్రం ఉండేది. ఈసారి వాటి సంఖ్యను పెంచనున్నారు. సార్వత్రిక ఎన్నికలలో కీలక ఘట్టం జిల్లాలో 15.10 లక్షల మంది ఓటర్లు 1,644 పోలింగ్ కేంద్రాలు -
No Headline
● నేడు ఉమ్మడి ‘తూర్పు’లో మేమంతా సిద్ధం ● 85 కిలోమీటర్లు రోడ్షోగా బస్సుయాత్ర ● రెండు జిల్లాలు... ఆరు నియోజకవర్గాల్లో పర్యటన ● ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామంటూ ఎన్నికల్లో మద్దతు కోసం వస్తున్న జగన్ ● స్వాగతించేందుకు సిద్ధమవుతోన్న జనం -
బిల్డింగ్ పైనుంచి పడి తాపీమేస్త్రి మృతి
గోపాలపురం: బిల్డింగ్పై నుంచి పడి తాపీమేస్త్రి మృతి చెందిన ఘటన భీమోలు గ్రామంలో బుధవారం జరిగింది. ఎస్సై కర్రి సతీష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గోపాలపురానికి చెందిన షేక్ యాసీన్ (36) తాపీమేస్త్రి. బుధవారం భీమోలు గ్రామంలో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తూ బిల్డింగ్పై నుంచి జారి పడ్డాడు. తలకు తీవ్రగాయమైన అతడిని గోపాలపురం సీహెచ్సీకి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహిళ మెడలో గొలుసు చోరీ సామర్లకోట: పట్టపగలే మహిళ మెడలో గొలుసును దొంగ తెంపుకొని పారిపోయాడు. సత్యనారాయణపురంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. బాధితురాలు నాగం సత్యవతి సమీపంలోని రామాలయం వద్దకు వెళ్లడానికి తయారవుతోంది. ఆ సమయంలో సుమారు 40 ఏళ్ల ఒక వ్యక్తి ఇంటికి వచ్చాడు. ఏమి కావాలని అడిగేలోపు సత్యవతి పీకనొక్కి మెడలోని గొలుసును లాక్కుని పరారయ్యాడు. ఆ ఐదు కాసుల బంగారు గొలుసులో రెండు కాసుల ముక్కను దొంగ లాక్కుని పరారయ్యాడు. మూడు కాసుల ముక్క సత్యవతి చేతిలో ఉండిపోయింది. వార్డు కౌన్సిలర్ సేపెని సురేష్ ఫిర్యాదు మేరకు ఎస్సై మౌనిక సంఘటనా ప్రదేశానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
రమణీయం.. రత్నగిరి రాములోరి కల్యాణం
అన్నవరం : రత్నగిరి క్షేత్ర పాలకునిగా పూజలందుకుంటున్న శ్రీ సీతారాముల దివ్యకల్యాణం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుధవారం రత్నగిరి రామాలయం పక్కన గల వార్షిక కల్యాణ వేదికపై వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు తిలకిస్తుండగా ఉదయం పది గంటల నుంచి 12–30 గంటల వరకు కన్నుల పండువగా ఈ కార్యక్రమాన్ని దేవస్థానం ప్రధానార్చకుడు కోట సుబ్రహ్మణ్యశర్మ, వ్రత పురోహిత ప్రముఖుడు, వైదిక కమిటీ సభ్యుడు ఛామర్తి వేంకటరెడ్డి పంతులు (కన్నబాబు) తదితర పండితులు నిర్వహించారు. వెండి పల్లకిపై ఊరేగింపు ఉదయం ఏడు గంటలకు శ్రీ సీతారాములను వెండి ఆంజనేయ వాహనంపై, పెళ్లిపెద్దలు శ్రీసత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారిని వెండి పల్లకిపై గ్రామంలో ఊరేగించారు. అనంతరం వధూవరులు శ్రీసీతారాములను, సత్యదేవుడు, అమ్మవార్లను ఊరేగింపుగా రత్నగిరి కల్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. సర్వాంగసుందరంగా అలంకరించిన వేదికపై ప్రత్యేక సింహాసనం మీద సీతారాములను పండితులు ఉంచారు. ఆ సింహాసనం పక్కనే గల మరో ప్రత్యేక ఆసనంపై సత్యదేవుడు అమ్మవార్లను ఉంచారు. ఉదయం 10–15 గంటలకు విఘ్నేశ్వరపూజతో సీతారాముల కల్యాణం ప్రారంభమైంది. ఈఓ కె.రామచంద్రమోహన్ సీతారాములకు నూతన పట్టువస్తాలు, మంచి ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీతారాముల తల్లితండ్రులు, వారి గోత్రనామాలతో కూడిన ప్రవరను ఛామర్తి కన్నబాబు వివరించారు. తరువాత పుణ్యాహవచనం, యజ్ఞోపవీతధారణ, మహాసంకల్పం కార్యక్రమాలను పండితులు నిర్వహించారు. మధ్యాహ్నం 11 గంటల సుముహూర్తంలో సీతారాముల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ఉంచారు. అనంతరం మాంగల్య ధారణ, వైభవంగా తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. రామాలయంలోని సీతారాముల మూలవిరాట్లకు కూడా అర్చకులు తలంబ్రాలు పోశారు. నూతన దంపతులు సీతారాములకు వేదపండితులు ఆశీస్సులందజేశారు. తరువాత సీతారాములకు నివేదించిన పానకం, వడపప్పు ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు. కల్యాణం సమయంలో భక్తులకు ఆచారం ప్రకారం తాటియాకుల విసనకర్రలు పంపిణీ చేశారు. శ్రీసీతారాముల కల్యాణం అనంతరం శ్రీసత్యదేవుడు, అనంతలక్ష్మీ అమ్మవార్లకు నిత్య కల్యాణం అదే వేదికపై మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 2–30 గంటల వరకు నిర్వహించారు. ఆలయ ఏఈఓ కృష్ణారావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. పెళ్లి పెద్దలుగా వ్యవహరించిన సత్యదేవుడు, అమ్మవారు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ఈఓ కల్యాణానికి ముందు కన్నుల పండువగా ఊరేగింపు