జీజీహెచ్‌ ఉద్యోగికి షోకాజ్‌ నోటీసు | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌ ఉద్యోగికి షోకాజ్‌ నోటీసు

Published Wed, Aug 14 2024 8:14 AM | Last Updated on Wed, Aug 14 2024 8:14 AM

-

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): అట్రాసిటీ కేసు పెడతానంటూ ఉన్నతాధికారులు, సహోద్యోగులను భయబ్రాంతులకు గురిచేస్తున్న ఓ ఉద్యోగికి రాజమహేంద్రవరం జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లక్ష్మీసూర్యప్రభ మంగళవారం షోకాజ్‌ నోటీసు జారీ చేశారు. దారా గౌతమ్‌ రాంజీ అనే వ్యక్తి రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో జనరల్‌ డ్యూటీ అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అట్రాసిటీ కేసు పెడతానంటూ బెదిరిస్తున్నాడని కొద్దిరోజుల క్రితం అతడి వ్యవహారశైలిపై 38 మంది ఎంఎన్‌వోలు, జీడీఏలు విచారణాధికారికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో సూపరింటెండెంట్‌ జోక్యం చేసుకుని సహోద్యోగులతో వ్యవహరించే తీరును మార్చుకొని రోగుల సంరక్షణ కోసం నిబద్ధతతో పనిచేయాలని, ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని రాంజీని మందలించారు. రాంజీ తీరులో మార్పు రాకపోగా ఫిర్యాదుదారులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు. అంతేకాకుండా అట్రాసిటీ కేసు పేరుతో బెదిరింపులకు గురిచేస్తున్నాడనే ఫిర్యాదుతో సూపరింటెండెంట్‌ మంగళవారం రాంజీకి షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement