రూ.5.70 లక్షల నగదు పట్టివేత | - | Sakshi
Sakshi News home page

రూ.5.70 లక్షల నగదు పట్టివేత

Published Wed, Feb 12 2025 12:35 AM | Last Updated on Wed, Feb 12 2025 12:35 AM

రూ.5.70 లక్షల  నగదు పట్టివేత

రూ.5.70 లక్షల నగదు పట్టివేత

తానూరు: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మండలంలోని బెల్‌తరోడా సరిహద్దులో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ వద్ద మంగళవారం రూ.5.70 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్సై శాముల్‌ తెలిపారు. కరీంనగర్‌ నుంచి మహారాష్ట్రలోని భోకర్‌కు వెళ్తున్న బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా నగదు పట్టుబడినట్లు ఆయన పేర్కొన్నారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందువల్ల ఎవరైనా రూ.50 వేలకు మించి తీసుకెళ్లవద్దని, ఒకవేళ తీసుకువెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement