కేసుల నమోదులో జాప్యం వద్దు
బోథ్: కేసుల నమోదులో జాప్యం చేయొద్దని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గురువారం బోథ్ పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీకి సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై ప్రవీణ్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్స్టేషన్ ఆవరణలో మొక్క నాటి నీరు పోశారు. పరిసరాల ను పరిశీలించారు. కేసుల వివరాలు తెలుసుకుని ప లు సూచనలు చేశారు. సొనాల మండలంలోని ఘ న్పూర్ చెక్పోస్ట్ను తనిఖీ చేశారు. వాహనాల రాకపోకలు గమనించారు. ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి, పీఎస్సై రాజశేఖర్రెడ్డి సిబ్బంది ఉన్నారు.
బజార్హత్నూర్ ఠాణా తనిఖీ
బజార్హత్నూర్: మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. పలు సూచనలు చేశారు. డీఎస్పీ జీవన్రెడ్డి, సీఐ, ఎస్సై ఉన్నారు
Comments
Please login to add a commentAdd a comment