
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 12వ పీఆర్సీ Pay Revision Commission (PRC) ఏర్పాటు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్సింగ్ ఈ కమిషన్కు చైర్మన్గా వ్యవహరించనున్నట్లు తెలిపింది.
గత కేబినెట్లో తీసుకున్న నిర్ణయం మేరకు కమిషన్ ఏర్పాటు ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణపై ఈ కమిషన్ నివేదికను రూపొందించనుంది. ఏడాది.. అంతకు లోపే నివేదికను సమర్పించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: మన టమాటలకు టైమొచ్చింది
Comments
Please login to add a commentAdd a comment