Andhra Pradesh : 1,461 New Positive Covid Cases Recorded In Last 24 Hours - Sakshi
Sakshi News home page

Corona Virus: ఏపీలో కొత్తగా 1,461 కరోనా కేసులు

Published Tue, Aug 10 2021 5:53 PM | Last Updated on Wed, Aug 11 2021 3:49 PM

AP Government Released The Bulletin On Corona Virus - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో  63,849 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,461 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 15 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,564 కు చేరింది. 

గత 24 గంటల్లో 2,113 మంది కోవిడ్‌ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అవ్వగా, ఇప్పటివరకు  19,52,736 మంది ఏపీలో డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ‍మంగళవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 18,882 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,85,182 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,53,11,733 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement