bulletin
-
ద్వితీయార్ధంలో ఎకానమీ జోరు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వీతీయార్ధంలో ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నట్టు ఆర్బీఐ బులెటిన్ (ఫిబ్రవరి నెల) వెల్లడించింది. వాహన విక్రయాలు, విమాన ప్రయాణికుల రద్దీ, స్టీల్ వినియోగం, జీఎస్టీ ఈ–వే బిల్లులు తదితర కీలక గణాంకాలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నట్టు పేర్కొంది. డాలర్ బలోపేతం కావడంతో వర్దమాన ఆర్థిక వ్యవస్థల నుంచి పెట్టుబడులు వెనక్కి పోవడం కరెన్సీ రిస్క్ లను పెంచుతున్నట్టు తెలిపింది. ‘‘ఆర్థిక కార్యకలాపాలు స్థిరంగా కొనసాగనున్నాయి. బలమైన గ్రామీణ వినియోగానికి, వ్యవసాయ రంగం పటిష్ట పనితీరు మద్దతునివ్వనుంది. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, బడ్జెట్లో పన్ను రాయితీలు పెంపుతో పట్టణ వినియోగం సైతం కోలుకోనుంది’’అని బులెటిన్ వివరించింది. 27 రకాల కీలక సూచికల ఆధారంగా ఆర్థిక కార్యకలాపాల తీరును అంచనా వేస్తుండడం గమనార్హం. ద్రవ్యోల్బణం తగ్గుదల నిదానంగా ఉండడం, టారిఫ్ల రిస్క్ పట్ల ఫైనాన్షియల్ మార్కెట్లలో ఆందోళన నెలకొందని చెబుతూ.. వర్ధమాన మార్కెట్లలో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐలు) అమ్మకాలకు తోడు డాలర్తో కరెన్సీలు బలహీనపడడాన్ని ఈ బులెటిన్ ప్రస్తావించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిలోనే ఉన్నప్పటికీ, అది మోస్తరుగా ఉన్నట్టు తెలిపింది. ‘‘వృద్ధిని, ద్రవ్య స్థీకరణను యూనియన్ బడ్జెట్ చక్కగా సమతుల్యం చేసింది. మూలధన వ్యయాలలు, వినియోగానికి మద్దతుతోపాటు డెట్ స్థిరీకరణకు స్పష్టమైన కార్యాచరణను ప్రకటించింది. దీనికి అదనంగా రెపో రేటు తగ్గింపుతో దేశీ డిమాండ్ పుంజుకోనుంది’’అని ఆర్బీఐ బులెటిన్ వెల్లడించింది. 2025లో జీడీపీ 6.4 % మూడిస్ ఎనలిటిక్స్ అంచనా న్యూఢిల్లీ: భారత జీడీపీ 2025లో 6.4 శాతం మేర వృద్ధిని సాధించొచ్చని అంతర్జాతీయ సంస్థ మూడిస్ ఎనలిటిక్స్ తెలిపింది. యూఎస్ టారిఫ్లు, అంతర్జాతీయంగా డిమాండ్ బలహీనపడడం ఎగుమతులపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. 2024లో జీడీపీ 6.6%గా ఉందని గుర్తు చేసింది. 2025లో ఆసియా పసిఫిక్ వ్యాప్తంగా వృద్ధి నిదానిస్తుందని మూడిస్ ఎనలిటిక్స్ తెలిపింది. వాణిజ్య ఉద్రిక్తతలు, విధానపరమైన మార్పులు ఈ ప్రాంతం వృద్ధిపై ప్రభావం చూపిస్తాయని పేర్కొంది. చైనా జీడీపీ 2024లో 5%గా ఉంటే.. 2025లో 4.2%కి, 2026లో 3.9 శాతానికి తగ్గుముఖం పడుతుందని వివరించింది. భారత వృద్ధి 2024లో ఉన్న 6.6% నుంచి వచ్చే రెండేళ్లు 6.4 శాతానికి తగ్గొచ్చని అంచనా . -
కేజ్రీవాల్ ఆరోగ్యం.. తీహార్ జైలు కీలక ప్రకటన
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ జైలులో బరువు తగ్గలేదని తీహార్ జైలు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు జైలు అధికారులు కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై ఒక బులెటిన్ విడుదల చేశారు. కేజ్రీవాల్ జైలుకు వచ్చినపుడు 65 కేజీల బరువు ఉండగా ఇప్పుడు కూడా అంతే ఉన్నారని తెలిపారు. రక్తపోటు సాధారణ స్థాయిలోనే ఉందని, షుగర్ లెవెల్స్ మాత్రం హెచ్చుతగ్గులకు గురవతున్నాయని వెల్లడించారు. కేజ్రీవాల్ అరెస్టయిన మార్చ్ 22 నుంచి బుధవారం(ఏప్రిల్ 3) వరకు 4.5 కేజీల బరువు తగ్గారని ఆమ్ఆద్మీపార్టీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ బరువులో ఎలాంటి మార్పు లేదని తీహార్ జైలు అధికారులు వెల్లడించడం గమనార్హం. ఇదీ చదవండి.. అవమానించేందుకే అరెస్టు చేశారు -
TS: కరోనా కేసులపై దొంగ లెక్కలు?
హైదరాబాద్, సాక్షి: దేశంలో చాప కింద నీరులా కరోనా వైరస్ విస్తరిస్తోంది. తెలంగాణ విషయానికొస్తే.. మొన్నటిదాకా రాజధాని హైదరాబాద్లోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయని అనుకున్నారంతా. ఇప్పుడది పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చేరింది. భూపాలపల్లి, కరీంనగర్, తాజాగా మంచిర్యాలలో కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. కానీ, అధికారిక లెక్కల్లో మాత్రం వాటిని చూపడం లేదు!. కరోనా వైరస్లో జేఎన్.1 వేరియెంట్.. వ్యాప్తి శరవేగంగా ఉంటోంది. చలికాలం.. ఫ్లూ సీజన్ కావడంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం మొదటి నుంచి హెచ్చరిస్తూ వస్తోంది. అయితే ప్రజలను అప్రమత్తం చేయడంలో మాత్రమే కాదు.. ఆఖరికి కరోనా బులిటెన్ను విడుదల చేయడంలోనూ ఆరోగ్య శాఖ పూర్తి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోంది. గత రెండు రోజలుగా కరోనా లెక్కలపై ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటనేం చేయడం లేదు. అధికారుల్ని అడిగితే.. ప్రభుత్వమే ఇకపై గణాంకాలు విడుదల చేస్తుందంటూ ఓ ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మరోవైపు ప్రభుత్వం సైతం కరోనా లెక్కలపై ఎటూ తేల్చడం లేదు. రెండ్రోజులకొకసారి విడుదల చేస్తారని చెప్పినా.. అందులోనూ స్పష్టత లేదు. మరీ ఇంత తక్కువా? రెండు రోజుల కిందట బులిటెన్ను పరిశీలిస్తే.. 1,333 టెస్ట్లు చేయగా అందులో ఎనిమిది మందికి మాత్రమే కరోనా పాజిటివ్ గా తేలిందట. మొత్తంగా.. ఆ రోజునాటికి యాక్టివ్ కేసుల సంఖ్యను 63గా పేర్కొంటూ.. రెండు కరోనా మరణాలు సంభవించాయని ప్రకటించి ఆపేశారు. అయితే.. జిల్లా వైద్యాధికారులేమో అధికారిక లెక్కల విషయంలో పొంతనే లేదంటున్నారు. వింటర్ సీజన్.. బస్సుల్లో రద్దీ, మెట్రోలో రద్దీ, పైగా పెళ్లిళ్లతో పాటు పండుగ సీజన్ కావడంతో ఎక్కువగా జనం చేరుతుండటం వల్ల కూడా కేసుల సంఖ్య పెరిగే ఉంటుందని వాళ్లు అంచనా వేస్తున్నారు. వ్యక్తిగతంగా టెస్టులు చేయించుకుంటున్నవాళ్లు.. పాజిటివ్గా నిర్ధారణ అవుతున్నవాళ్ల లెక్కను అందులో కావాలనే చేర్చడం లేదనే విమర్శా బలంగా వినిపిస్తోంది. మరోవైపు.. వైరస్ విజృంభించే అవకాశాలున్న సమయంలో రాష్ట్రంలో కొవిడ్ కేసులపై దాపరిక ధోరణి సరికాదంటున్నారు వైద్యనిపుణులు. కొత్తగా నియమించబడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రజా ఆరోగ్య సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్ దీనిపై ఏదైనా ప్రకటన చేస్తారేమో చూడాలి. -
ద్రవ్యోల్బణం కట్టడి ఇప్పట్లో సాధ్యమేనా? ఆర్బీఐ కీలక ఆర్టికల్
ముంబై: ద్రవ్యోల్బణంపై పోరాటం చాలా కాలంపాటు కొనసాగుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అక్టోబర్ బులిటెన్లో ప్రచురితమైన ఒక ఆర్టికల్ ఒకటి పేర్కొంది. దీర్ఘకాల ద్రవ్య విధానంసహా, పలు చర్యలు ధరల కట్టడికి పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేసింది. ‘‘మనం ద్రవ్యోల్బణంపై విజయం సాధిస్తే, ప్రపంచంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్ ఆర్థికాభివృద్ధి అవకాశాలు మరింత సుస్థిరమవుతాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ద్రవ్యోల్బణం సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో భారత్ తగిన స్థాయిలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసినట్లవుతుంది. అలాగే ఈ హర్షణీయమైన పరిణామం విదేశీ పెట్టుబడిదారులను పునరుజ్జీవింపజేస్తుంది. మార్కెట్లను స్థిరీకరించి, శాశ్వత ప్రాతిపదికన భారత్ ఆర్థిక స్థిరత్వాన్ని పొందేలా చేస్తుంది’ అని డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం రాసిన కథనం పేర్కొంది. బులిటన్లో పబ్లిష్ అయిన ఆర్టికల్ అంశాలను ఆర్బీఐ అంగీకరించాల్సిన అవసరం లేకపోవడం గమనార్హం. 2022 సెప్టెంబర్ వరకూ గడచిన తొమ్మిది నెలల నుంచి ఆర్బీఐ పాలసీకి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం కేంద్రం సెంట్రల్ బ్యాంక్కు నిర్దేశిస్తున్న స్థాయి 6 శాతానికి మించి నమోదవుతున్న నేథ్యంలో ఈ ఆర్టికల్ వెలువడింది. కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం హద్దు మీరి పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది మే నుంచి వరుసగా నాలుగుసార్లు ఆర్బీఐ రెపోరేటు పెంచింది. మేలో 4 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) ఈ నాలుగు దఫాల్లో 190 బేసిస్ పాయింట్లు పెరిగి, ఏకంగా 5.9 శాతానికి (2019 ఏప్రిల్ తర్వాత) చేరింది. మరింత పెరగవచ్చనీ ఆర్బీఐ సంకేతాలు ఇచ్చింది. రిటైల్ ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటు అంచనా 6.7 శాతంకాగా, క్యూ2 , క్యూ3, క్యూ4ల్లో వరుసగా 7.1 శాతం, 6.5 శాతం, 5.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ రేటు 5.1 శాతానికి దిగివస్తుందని అంచనా వేసింది. అక్టోబర్, నవంబర్ల్లోనూ ద్రవ్యోల్బణం ఎగువబాటనే పయనిస్తే, తదుపరి పాలసీ సమీక్ష డిసెంబర్ 5 నుంచి 7 సమయంలో ఆర్బీఐ రెపో రేటును మరో అరశాతం పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడచిన తొమ్మిది నెలలుగా ద్రవ్యోల్బణం కట్టడిలో ఎందుకు లేదన్న అంశంపై కేంద్రానికి ఆర్బీఐ త్వరలో ఒక నివేదిక సమర్పిస్తుందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఆర్బీఐ పాలసీ నిర్ణయాల్లో కీలకమైన రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్లో ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయిని నమోదుచేసుకుంది. రేటు పెంపు ప్రభావానికి ఆరు క్వార్టర్లు ఆగాలి: వర్మ ద్రవ్యోల్బణం కట్టడికిగాను ఆర్బీఐ గడచిన మే నుంచి పెంచిన 190 బేసిస్ పాయింట్ల రెపో రేటు ప్రభావం వ్యవస్థలో కనబడ్డానికి 5 నుంచి 6 త్రైమాసికాలు (సంవత్సన్నర వరకూ) పడుతుందని ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యుడు జయంత్ ఆర్ వర్మ పేర్కొన్నారు. ‘‘కఠిన ద్రవ్య పరపతి విధానాన్ని అవలంభిస్తున్న నేపథ్యంలో ద్రవ్యోల్బణం తప్పనిసరిగా దిగొస్తుంది’’ అని ఒక టెలిఫోనిక్ ఇంటర్వూలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (అహ్మదాబాద్) ప్రొఫెసర్గా ఉన్న వర్మ, మాంద్యం భయాలు లేనప్పటికీ, భారత్ ఆర్థిక వృద్ధి వాస్తవానికి చాలా సంవత్సరాలుగా అనుకున్న స్థాయిలో లేదని ఈ సందర్భంగా వర్మ వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణం కట్టడి-వృద్ధి ప్రస్తుతం పరపతి విధానానికి సవాళ్లు విసురుతున్నట్లు పేర్కొన్నారు. అయితే ద్రవ్యోల్బణం కట్టడికే ఆర్బీఐ ఎంపీసీ తొలి ప్రాధాన్యతని వివరించారు. భారత్ రూపాయి చరిత్రాత్మక కనిష్టానికి పడిన విషయాన్ని ప్రస్తావిస్తూ, దాదాపు ప్రతి కరెన్సీపై డాలర్ ఇటీవల బలపడిందన్నారు. అమెరికా వాస్తవ ఎకానమీ పటిష్టత, ఫెడ్ అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానం డాలర్ బలపడ్డానికి కారణమని విశ్లేషించారు. అయితే ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రతికూల అంశమేనని పేర్కొన్నారు. -
భారత్కు పొంచి ఉన్న ముప్పు..! ఎకానమీపై తీవ్ర ప్రభావం..!
న్యూఢిల్లీ: భారీ స్థాయిలో ఎగుమతులు, విస్తృతంగా నిర్వహిస్తున్న టీకాల ప్రక్రియ, సవాళ్లను దీటుగా అధిగమిస్తున్న ఆర్థిక రంగం ఊతంతో దేశ ఎకానమీ పటిష్టమైన స్థితిలో ఉంది. అయితే, అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ పరిణామాలపరమైన సవాళ్లు మాత్రం పొంచే ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఏప్రిల్ 2022 బులెటిన్లోని ఒక వార్తాకథనంలో ఈ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వివిధ రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పుంజుకోవడంతో కరోనా వైరస్ మూడో వేవ్ను అధిగమించి, సంవత్ 2079లోకి దేశం అడుగుపెడుతోందని కథనం పేర్కొంది. రాబోయే రోజుల్లో నిలకడగా వృద్ధిని సాధించాలంటే ప్రైవేట్ పెట్టుబడులు ఊపందుకోవడం చాలా కీలకమని వివరించింది. భౌగోళికరాజకీయ రిస్కులు వేగంగా పెరుగుతున్నాయని, సరఫరా వ్యవస్థలపై ఒత్తిడి నెలకొందని .. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తులో అంతర్జాతీయంగా పరిస్థితులు అంత ఆశావహంగా కనిపించడం లేదని ఆర్టికల్ వివరించింది. ఇలాంటి అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల ప్రభావాలకు భారత ఎకానమీ అతీతం కాదని తెలిపింది. ‘భారత్పై కూడా ఈ పరిణామాల ప్రభావం ఉంటోంది. యుద్ధం (రష్యా–ఉక్రెయిన్ మధ్య), ప్రతీకార ఆంక్షలు మొదలైన వాటి పర్యవసానాలు ఇప్పటికే ద్రవ్యోల్బణం తదితర రూపాల్లో కనిపిస్తున్నాయి. అయితే, దేశీయంగా కొన్ని సానుకూల అంశాలు మాత్రం కాస్త ఉపశమనంగా ఉంటున్నాయి‘ అని కథనం వివరించింది. సరఫరా తగ్గిపోవడం, కమోడిటీల ధరలు.. ముఖ్యంగా ఆహారం, ఇంధనాల రేట్లు ఎగియడం తో ద్రవ్యోల్బణం పెరిగే రిస్కులు ఇప్పటికే కనిపిస్తు న్నాయని వివరించింది. అయితే, ఇందులో పొం దుపర్చిన అభిప్రాయాలన్నీ బులెటిన్ రూపకర్తలవేనని, ఇవన్నీ కచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయాలుగా భావించడానికి లేదని ఆర్బీఐ పేర్కొంది. ఫలితాలిస్తున్న ఆర్బీఐ చర్యలు .. ద్రవ్య పరపతి విధానాల ప్రయోజనాలను బ్యాంకులు సత్వరం వినియోగదారులకు బదలాయించే విషయంలో ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు.. ఫలితాలిస్తున్నాయని బులెటిన్ తెలిపింది. 2019 అక్టోబర్లో ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ ఆధారిత రుణ రేటు (ఈబీఎల్ఆర్)తో ఈ ప్రక్రియ మరింత వేగం పుంజుకుందని, రాబోయే రోజుల్లో ఇది ఇంకా మెరుగుపడగలదని పేర్కొంది. అంతర్గత బెంచ్మార్క్ రుణ రేట్ల వల్ల బేస్ రేటు/ఎంసీఎల్ఆర్ మొదలైన వాటి లెక్కింపు విషయంలో పక్షపాత ధోరణులు ఉండేవని, ఫలితంగా పరపతి విధాన ప్రయోజనాల బదలాయింపు సరిగ్గా జరిగేది కాదని బులెటిన్ వివరించింది. చదవండి: నోట్ల రద్దుతో అలా..భారత్పై ప్రపంచబ్యాంకు కీలక వ్యాఖ్యలు..! -
కొనసాగుతున్న కరోనా ఉధృతి.. తగ్గిన పాజిటివిటీ రేటు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటలలో 1,61,386 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 2,81,109 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 3,95,11,307 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 16,21,603 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ను ప్రకటించింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 9.26% శాతంగా ఉంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా శరవేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 167.29 కోట్ల మంది వ్యాక్సినేషన్ పూర్తిచేసుకున్నారు. India reports 1,61,386 fresh COVID cases and 2,81,109 recoveries in the last 24 hours Active cases: 16,21,603 Total recoveries: 3,95,11,307 Daily positivity rate: 9.26% Total vaccination: 167.29 crore pic.twitter.com/QD2jptRtG4 — ANI (@ANI) February 2, 2022 -
Corona Virus: భారత్లో స్వల్పంగా తగ్గిన కొత్త కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. నిన్నటితో పోల్చితే కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కానీ మరణాల సంఖ్య పెరగడం ఒకింత ఆందోళన కల్గిస్తుంది. గడిచిన 24 గంటలలో 1,67,059 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 2,54,076మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. అదే విధంగా, మహమ్మారి బారిన పడి 1192 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 17,43,059 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ను ప్రకటించింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 11.69% శాతంగా ఉంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా శరవేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 1,66,68,48,204 మంది వ్యాక్సినేషన్ పూర్తిచేసుకున్నారు. India's daily cases drop below 2 lakh; the country reports 1,67,059 new #COVID19 cases, 1192 deaths and 2,54,076 recoveries in the last 24 hours Active case: 17,43,059 (4.20%) Daily positivity rate: 11.69% Total Vaccination : 1,66,68,48,204 pic.twitter.com/7yjkgUUMB8 — ANI (@ANI) February 1, 2022 చదవండిః మరిదితో వెళ్లిపోయి.. మూడో భర్త ముందు పతివ్రతనే అని.. -
కరోనా ఉధృతి: భారత్లో 2 లక్షలు దాటిన కొత్త కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటలలో 2,09,918 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 2,62,628 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. అదే విధంగా, మహమ్మారి బారిన పడి 959 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 18,31,268 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ను ప్రకటించింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 15.77% శాతంగా ఉంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా శరవేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 1,66,03,96,227 మంది వ్యాక్సినేషన్ పూర్తిచేసుకున్నారు. చదవండిః నిర్మలమ్మా.. వీరి ఆశలన్నీ మీ పైనే! India reports 2,09,918 new #COVID19 cases, 959 deaths and 2,62,628 recoveries in the last 24 hours Active case: 18,31,268 (4.43%) Daily positivity rate: 15.77% Total Vaccination : 1,66,03,96,227 pic.twitter.com/ZTN2OJXQbE — ANI (@ANI) January 31, 2022 -
తెలంగాణలో కొత్తగా 2,707 మందికి కరోనా పాజిటివ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటలలో 84,280 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,707 మందికి పాజిటివ్గా నిర్దారణ అయింది. గత 24 గంటలలో కరోనాతో ఇద్దరు మృతి చెందారు. ఇప్పటివరకు తెలంగాణలో ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4,049కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న582 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,462 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ ఒక బులెటిన్ను విడుదల చేసింది. చదవండి: కరోనా ఉధృతి.. రాష్ట్ర సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ -
కరోనా కల్లోలం: భారత్లో భారీగా పెరిగిన కేసులు..
Covid Third Wave: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటలలో 1,94,720 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 60,405 మంది వైరస్ బారి నుంచి కొలుకున్నారు. అదే విధంగా, మహమ్మారి బారిన పడి 442 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 9,55,319 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ను ప్రకటించింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 11.05 శాతంగా ఉంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా శరవేగంగా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 4,868 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. చదవండి: Omicron: ఒమిక్రాన్ ప్రతీ ఒక్కరికి సోకుతుంది -
కరోనా ఉధృతి: భారత్లో 1.68 లక్షలు దాటిన కొత్త కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గడిచిన 24 గంటలలో 1,68,063 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 69,959 మంది వైరస్ బారి నుంచి కొలుకున్నారు. అదే విధంగా, మహమ్మారి బారిన పడి 277 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 8,21,446 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ను ప్రకటించింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 10.64 శాతంగా ఉంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా శరవేగంగా పెరుగుతున్నాయి. దేశంలో గత 24 గంటలలో 4,461 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. -
కరోనా బీభత్సం.. 1.79 లక్షలు దాటిన కొత్త కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా బీభత్సన్ని సృష్టిస్తోంది. గడిచిన 24 గంటలలో 1,79,723 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో మహమ్మారి బారిన పడి 146 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 7,23,619 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ను ప్రకటిచింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 13.29 శాతంగా ఉంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా శరవేగంగా పెరుగుతున్నాయి. దేశంలో గత 24 గంటలలో 4,033 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. చదవండి: కోవిడ్ టీకా సర్టిఫికెట్పై ప్రధాని ఫొటో ఉండదు -
కరోనా బీభత్సం.. 1.59 లక్షలు దాటిన కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోంది. కరోనా థర్డ్వేవ్ మరింత వేగంగా వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటలలో 1,59,632 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో మహమ్మారి బారిన పడి 327 మంది మృతి చెందారు. అదే విధంగా, 40,863 మంది కోలుకున్నారు. ప్రస్తుతం కోవిడ్ పాజిటీవిటీ రేటు 10.21 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 5,90,611 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ను విడుదల చేసింది. ఇక మరోవైపు ఒమిక్రాన్ కూడా బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే 27 రాష్ట్రాల్లో కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 3,623 కు పెరిగింది. ప్రస్తుతం అత్యధికంగా మహరాష్ట్రలో 1,009 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అదే విధంగా 1,490 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్ను విడుదల చేసింది. చదవండి: రైల్వేస్టేషన్లలో అదనపు బాదుడుకు ప్లాన్! రైలెక్కినా దిగినా రూ.10 నుంచి 50? -
కోరలు చాస్తున్న కరోనా.. భారత్లో ఒక్కరోజులో లక్షదాటిన కేసులు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా మహమ్మారి కోరలు చాస్తుంది. కరోనా కేసుల సంఖ్య లక్షను దాటింది. గడిచిన 24 గంటలలో కొత్తగా 1,17,100 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 302 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో కరోనా విజృంభణ ఎక్కువగా ఉంది. గడిచిన ఒక్కరోజులో అక్కడ 36,265 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 3,71,363 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ కరోనాపై బులెటిన్ను విడుదల చేసింది. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో 30,836 మంది, కరోనా మొదలైనప్పటి నుంచి మొత్తంగా 3,43,71,845 మంది వైరస్ బారినుంచి కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 7.74 శాతంగా ఉంది. తాజాగా నమోదైన 302 మరణాలతో మొత్తం భారత్లో 4,83,178 మరణాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటిదాకా 149 కోట్ల వ్యాక్సిన్ డోసుల్ని అందించినట్లు కేంద్రం ప్రకటించింది. ఒమిక్రాన్ అప్డేట్ ఇదిలా ఉంటే 27 రాష్ట్రాల్లో 3, 007 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని, వారిలో 1,199 మంది పేషెంట్లు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. చదవండి: ఒమిక్రాన్ ముప్పు: ఆశలన్నీ బూడిదపాలు.. వారంలో 200 కోట్ల నష్టం!! -
భారత్లో పెరుగుతున్న కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తుంది. రోజు వారి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 37,379 కేసులు నమోదయ్యాయి. కాగా, కరోనా కాటుకు 12 మంది మృతి చెందారు. గత 24 గంటలలో.. 11,007 కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో.. 1,71,830 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక ఒమిక్రాన్ కూడా చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఇప్పటి వరకు భారత్లో 1,892 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. -
Corona Virus: ఏపీలో కొత్తగా 186 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 32,036 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 186 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి ముగ్గురు మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,448 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 191 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 20 లక్షల 56 వేల 979 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 2,149 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,73,576 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 3,05,39,041 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. -
Corona Virus: ఏపీలో కొత్తగా 138 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 31,065 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 138 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి ఒకరు మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,445 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 118 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 20 లక్షల 56 వేల 788 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 2,157 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,73,390 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 3,05,07,005 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. -
ఏపీలో కొత్తగా 381 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 38,896 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 381 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా ఒక్కరు మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,365 కు చేరింది. గత 24 గంటల్లో 414 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 20,46,127 మంది ఏపీలో డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 4743 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,65,235 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,94,04,281 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. -
Corona Virus: ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రికార్డు స్థాయిలో తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 30,515 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 429 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి నలుగురు మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,029 కు చేరింది. ఒకరోజులో 1,149 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,89,391 మంది ఏపీలో డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం 9,753 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,53,192 కు చేరింది. ఏపీలో ఇప్పటివరకు 2,84,76,467 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 20,29,231 మంది కరోనా నుంచి కోలుకున్నారు. చదవండి: జైకోవ్–డి వ్యాక్సిన్ రూ.1,900 -
Corona Virus: ఏపీలో కొత్తగా 809 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 56,463 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 809 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో కరోనా బారిన పడి 10 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14186 కు చేరింది. ఒకరోజులో 1,160 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,89,391 మంది ఏపీలో డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం 11,142 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,51,133 కు చేరింది. ఏపీలో ఇప్పటివరకు 2,83,50,167 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 20,25,805 మంది కరోనా నుంచి కోలుకున్నారు. చదవండి: వైరల్: కోవిడ్ టెస్ట్ చేయించుకొని.. బిల్లు చూసి షాకయ్యాడు.. -
Corona Virus: ఏపీలో కొత్తగా 1,010 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 58,054 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,010 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో కరోనా బారిన పడి 13 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,176 కు చేరింది. ఒకరోజులో 1,149 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,89,391 మంది ఏపీలో డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం 11,503కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,50,324 కు చేరింది. ఏపీలో ఇప్పటివరకు 2,82,93,704 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 20,24,645 మంది కరోనా నుంచి కోలుకున్నారు. చదవండి: TS: కేంద్రం తోడ్పాటు.. ఆస్పత్రుల్లోనే ఆక్సిజన్ ఉత్పత్తి -
Corona Virus: ఏపీలో కొత్తగా 1,084 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 57,345 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,084 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లో కరోనా బారిన పడి 13 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,163 కు చేరింది. ఒకరోజులో 1,328 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,89,391 మంది ఏపీలో డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం 11,655 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,49,314కు చేరింది. ఏపీలో ఇప్పటివరకు 2,81,78,305 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 20,23,496 మంది కరోనా నుంచి కోలుకున్నారు. చదవండి: కరోనా దెబ్బ.. ఆయుషు తగ్గింది! -
Corona Virus: ఏపీలో కొత్తగా 771 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 45,592 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 771 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 8 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,150 కు చేరింది. గత 24 గంటల్లో 1,333 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,89,391 మంది ఏపీలో డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 11,912 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,48,230 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,81,78,305 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. చదవండి: పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్: తెలిసినవారి పేర్లు కూడా మర్చిపోతున్నారా? -
Corona Virus: ఏపీలో కొత్తగా 618 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 38,069 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 618 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 6 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 14,142 కు చేరింది. గత 24 గంటల్లో 1,178 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,89,391 మంది ఏపీలో డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 12,482 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,47,459 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,81,32,713 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. చదవండి: PM Modi: వ్యాక్సిన్ ఒక సురక్ష చక్రం -
Corona Virus: భారత్లో కొత్తగా 30,256 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటలలో దేశంలో కొత్తగా 30,256 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో ప్రకటించింది. దీంతో దేశంలో ప్రస్తుతం కరోనా బాధితుల సంఖ్య 3,34,78,419 కి చేరినట్లు వెల్లడించింది. ఈ మహమ్మారి బారినపడి గత 24 గంటలలో 295 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 4,45,133 కి చేరింది. కరోనా నుంచి తాజాగా, 43,938 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,45,133 కేసులు యాక్టివ్గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. చదవండి: Covaxin: కోవాగ్జిన్పై అక్టోబర్ 6న డబ్ల్యూహెచ్ఓ భేటీ -
ఏపీలో కొత్తగా 1,190 కరోనా పాజిటివ్ కేసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,190 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 11 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 45,533 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం బులెటిన్ను విడుదల చేసింది. వైరస్ నుంచి 1,226 మంది బాధితులు కోలుకోగా.. ఇప్పటివరకు 20,00,877 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా వైరస్ బారినపడి ఇప్పటివరకు 13, 998 మంది మృతి చెందారు. చదవండి: సెక్యూరిటీ గార్డే డాక్టరైండు.. పేషెంట్కు ఇంజెక్షన్ -
Corona Virus: ఏపీలో కొత్తగా 1,520 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 64,739 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,520 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 10 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,887 కు చేరింది. గత 24 గంటల్లో 1,290 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,89,391 మంది ఏపీలో డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 14,922 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 2018200 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,68,09,774 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. చదవండి: viral diseases: నిండిపోతున్న పిల్లల వార్డులు, ఆందోళనలో పేరెంట్స్ -
Corona Virus: ఏపీలో కొత్తగా 1,378 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 59,566 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,378 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 10 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,877 కు చేరింది. గత 24 గంటల్లో 1,139 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,88,101 మంది ఏపీలో డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 14,702 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,16,680 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,67,45,035 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. చదవండి: జాతీయ మెడికల్ కమిషన్ కీలక నిర్ణయం -
Corona Virus: ఏపీలో కొత్తగా 1,186 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 56,155 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,186 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 10 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,867 కు చేరింది. గత 24 గంటల్లో 1,396 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,86,962 మంది ఏపీలో డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 14,473 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,15,302 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,66,85,469 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. చదవండి: భారత్లో కొత్త వేరియంట్ వస్తేనే థర్డ్వేవ్! -
Corona Virus: ఏపీలో కొత్తగా 878 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 41,173 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 878 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 13 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,838 కు చేరింది. గత 24 గంటల్లో 1,182 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,84,301 మంది ఏపీలో డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 14,862 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,13,001 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,65,76,995 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. చదవండి: దేశంలో 45,083 కొత్త కేసులు -
Corona Virus: ఏపీలో కొత్తగా 1,601 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 71,532 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,601 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 16 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,766 కు చేరింది. గత 24 గంటల్లో 1,201 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,78,364 మంది ఏపీలో డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 14,061 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 20,06,191 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,62,70,356 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. చదవండి: దేశంలో కొత్తగా 37,593 కరోనా కేసులు -
భారత్లో కొత్తగా 30,948 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటలలో దేశంలో.. కొత్తగా 30,948 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. ఈ మహమ్మారి బారిన పడి గత 24 గంటలలో 403 మంది మరణించారు. ఇప్పటి వరకు దేశంలో 4,34,367 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 3,53,398 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కొత్తగా 38,487 మంది కరోనా నుంచి కోలుకోగా.. ప్రస్తుతం రికవరీల సంఖ్య 3,16,36,49 కి చేరింది. ఇప్పటి వరకు 58.14 కోట్ల మంది వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. చదవండి: ఇస్రోలో ఉద్యోగం సాధించిన ఇల్లెందు వాసి.. -
Corona Virus: భారత్లో కొత్తగా 36,571 కేసులు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటలలో కొత్తగా 36,571 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం బులెటిన్ను విడుదల చేసింది. ఈ మహమ్మారి బారిన పడి గత 24 గంటలలో 540 మంది మృతి చెందారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,33,589కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,63,605 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. కొత్తగా 36,555 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రికవరీ రేటు 97.54 శాతానికి పెరిగింది. -
Corona Virus: ఏపీలో కొత్తగా 1,506 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 65,500 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,506 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 16 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,647 కు చేరింది. గత 24 గంటల్లో 1,835 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,62,185 మంది ఏపీలో డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 17,865 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,93,697 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,56,61,449 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. -
Corona Virus: ఏపీలో కొత్తగా 1,746 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 73,341 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,746 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 20 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,582 కు చేరింది. గత 24 గంటల్లో 1,648 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,58,275 మంది ఏపీలో డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 18,766 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,90,656 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,55,26,861 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. -
Corona Virus: ఏపీలో కొత్తగా 1,869 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 71,030 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,869 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 18 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,582 కు చేరింది. గత 24 గంటల్లో 2,316 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,55,052 మంది ఏపీలో డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 18,417 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 198,57,051 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,53,82,763 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. -
Corona Virus: ఏపీలో కొత్తగా 1,461 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 63,849 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,461 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 15 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,564 కు చేరింది. గత 24 గంటల్లో 2,113 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,52,736 మంది ఏపీలో డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 18,882 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,85,182 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,53,11,733 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. -
Corona Virus: ఏపీలో కొత్తగా 1,413 కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 85,283 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,413 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 18 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,549 కు చేరింది. గత 24 గంటల్లో 1,795 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,50,623 మంది ఏపీలో డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం19,549 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,83,721 కి చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,52,47,884 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. -
Corona Virus: తెలంగాణలో కొత్తగా 449 కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కాగా, గడిచిన 24 గంటలలో కొత్తగా 449 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే విధంగా కరోనా మహమ్మారి బారినపడి ఇద్దరు మరణించారని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కరోనాపై ఆదివారం బులెటిన్ను విడుదల చేసింది. గత 24 గంటలలో కరోనా నుంచి కొలుకుని 623 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. అయితే, ప్రస్తుతం తెలంగాణలో 8,406 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయని వెల్లడించింది. -
Corona Virus: ఏపీలో కొత్తగా 2,050 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 85,283 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,050 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 18 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,531 కు చేరింది. గత 24 గంటల్లో 2,458 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,48,828 మంది ఏపీలో డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 19,949 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,82,308 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,51,93,429 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. -
Corona Virus: ఏపీలో కొత్తగా 2,209 కరోనా కేసులు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 81,505 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,209 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 22 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,490 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1,896 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,44,267 మంది ఏపీలో డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 20,593 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,78,350 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,50,27,770 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. -
Corona Virus: ఏపీలొ కొత్తగా 2,145 కేసులు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 82,297 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,145 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 24 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,468 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 2,003 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,42,371 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 20,302 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,76,141 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,49,46,265 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. -
Corona Virus: ఏపీలో కొత్తగా 2,442 కేసులు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 85,822 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,442 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 16 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,444 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 2,412 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,40,368 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 20,184 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,73,996 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,48,63,968 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. -
Corona Virus: ఏపీలో కొత్తగా 1,546 కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 69,606 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,546 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 18 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,428 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1,940 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,37,956 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 20,170 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,71,554 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,47,78,146 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. -
Corona virus: ఏపీలో కొత్తగా 1,546 కేసులు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 59,641 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,546 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 15 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,410 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1,968 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 19,36,016 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 20,582 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,70,008 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,47,08,540 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. -
దేశంలో కొత్తగా 44,230 కరోనా కేసులు
న్యూఢిల్లీ: భారత్లో కరోనా మహమ్మారి మరొసారి విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు క్రమంగా పెరుతున్నాయి. గడిచిన 24 గంటలలో కొత్తగా 44,230 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే విధంగా, 555 మంది కొవిడ్ బారిన పడి మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 4,05,155 కేసులు యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం బులెటిన్ను విడుదల చేసింది. ఇప్పటి వరకు దేశంలో 3.07 కోట్ల మంది కరోనా బారినుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో దేశంలో రికవరీ రేటు 97.38 శాతంగా ఉందని అధికారులు తెలిపారు. గత 24 గంటలలో 42,360 మంది కొలుకున్నారు. కాగా, ఇప్పటి వరకు 45.60 కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ వేయించుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. -
దేశంలో కొత్తగా 43,509 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 43,509 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కాగా, గత 24 గంటల్లో 640 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 4,03,840 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటి వరకు దేశంలో 3,07,01,612 మంది కరోనా బారి నుంచి క్షేమంగా కొలుకున్నారు. ఇప్పటి వరకు 45.07 కోట్ల మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. గత 24 గంటలలో 17,28,795 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అదే విధంగా, దేశంలో ఇప్పటి వరకు 46,26,29,773 సాంపుల్ను పరీక్షించారు. ప్రస్తుతం రికవరీ రేటు 97.38 శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. -
Corona Virus: తెలంగాణలో కొత్తగా 578 కేసులు..
హైదరాబాద్: తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, వైరస్ వ్యాప్తి మాత్రం ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఈ క్రమంలో గడిచిన 24 గంటలలో తెలంగాణలో కొత్తగా 578 కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్ను విడుదల చేసింది. అదేవిధంగా, మహమ్మారి కారణంగా గత 24 గంటలలో ముగ్గురు మరణించగా.. 731 మంది కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో తెలంగాణలో ప్రస్తుతం 9,824 కేసులు యాక్టివ్గా ఉన్నాయని వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. -
Corona Virus: తెలంగాణలో కొత్తగా 729 కేసులు..
హైదరాబాద్: తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, వైరస్ ఉధృతి మాత్రం ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఈ క్రమంలో గడిచిన 24 గంటలలో తెలంగాణలో కొత్తగా 729 కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అదేవిధంగా, మహమ్మారి కారణంగా గత 24 గంటలలో 5 గురు మరణించగా.. 772 మంది కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో తెలంగాణలో ప్రస్తుతం 9,980 కేసులు యాక్టివ్గా ఉన్నాయని వైద్యారోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. -
Corona virus: ఏపీలో కొత్తగా 2,982 కేసులు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతుంది. గత వారం రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య తగ్గడంతోపాటు, రికవరీల రేటు పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 91,070 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,982 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 28 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,946 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 3,461 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 18 లక్షల 69 వేల 417 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ గురువారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 31,850 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,14,213 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,26,99,142 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. -
Corona Virus: ఏపీలో కొత్తగా 3,042 కేసులు..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతుంది. గత వారం రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య తగ్గడంతోపాటు, రికవరీల రేటు పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో 88,378 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,042 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 28 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,898 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 3,748 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 18 లక్షల 61 వేల 937 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 33,230 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,90,8065 కు చేరింది. ఏపీలో ఇప్పటి వరకు 2,25,24,187 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. -
తెలంగాణలో కొత్తగా 1,280 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో 91,621 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 1,280 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్ బాధితుల్లో 15 మంది మరణించారు. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 2,261మంది డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం 21,137 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు 6,03,369 మందికి కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 165 కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇప్పటి వరకు తెలంగాణలో 5,78,748 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్య శాఖ ఆదివారం కరోనా కేసుల బులెటిన్ను విడుదల చేసింది. చదవండి: పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష -
ఏపీలో కొత్తగా 8,239 కరోనా కేసులు
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 1,01,863 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8,239 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 17,93,227 మందికి కరోనా వైరస్ సోకింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 61 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 11,824కు చేరింది. గడిచిన 24 గంటల్లో 11,135 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 16 లక్షల 88 వేల 198 మంది డిశ్చార్జ్ అయ్యారు.ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 96,100 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,02,39,490 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు శ్రీకాకుళం- 421, విజయనగరం- 254, విశాఖ- 500 , తూ.గో- 1271, ప.గో- 887, కృష్ణా- 462, గుంటూరు- 488, ప్రకాశం- 561, నెల్లూరు- 407, చిత్తూరు- 1396 , అనంతపురం- 698, కర్నూలు- 201, వైఎస్ఆర్ జిల్లా- 693 కేసులు నమోదయ్యాయి. చదవండి: టెస్టులు, వ్యాక్సిన్లో ఏపీ సరికొత్త రికార్డు -
ఏపీలో కొత్తగా 8,976 కరోనా కేసులు..
అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 83,690 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 8,976 పాజిటివ్గా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కారణంగా 90 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారి నుంచి 13,568 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తంగా.. 16 లక్షల 23 వేల 447 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,23,426 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 1,97,91,721 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈమేరకు ఏపీ రాష్ట్రవైద్యారోగ్య శాఖ కరోనాపై ఆదివారం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. చదవండి: ప్రతి ప్రభుత్వ ఆస్పత్రికి 10 ఐసీయూ బెడ్లు -
దడ పుట్టిస్తున్న సెకండ్ వేవ్ .. ఒక్కరోజే 3,498 మరణాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి ధాటికి అనేక మంది ప్రాణాలను కోల్పోతున్నారు. భారత్లో వరుసగా తొమ్మిదో రోజు 3.8 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటలలో దేశంలో కొత్తగా 3,86,452 కరోనా కేసులు నమోదైనట్లు తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,87,62,976 కు చేరింది. గురువారం ఒక్కరోజే 3,498 మరణించినట్లు కేంద్రం తెలిపింది. దీంతో మృతుల సంఖ్య 2,08,330 కు చేరింది. ఇప్పటి వరకు మొత్తం 1,53,84,418 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. కాగా దేశంలో ప్రస్తుతం 31,70,228 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 15,22,45,179 మందికి వ్యాక్సిన్ అందించారు. తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు.. తెలంగాణలోను కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటలలో కొత్తగా 7,646 కరోనా కేసులు నమోదుకాగా, 53 బాధితులు మరణించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 4,35,606 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 3,55,618 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, 2,208 మంది మరణించారు. తెలంగాణలో ప్రస్తుతం 77,727 కరోనా కేసులు ఆక్టివ్గా ఉన్నాయి. కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో 1,441, మేడ్చల్ 631, రంగా రెడ్డి 484, సంగారెడ్డిలో 401, నిజామాబాద్ 330, నల్గొండ 285, సిద్దిపేటలో 289, సూర్యాపేట 283, కరీంనగర్లో 274 ,మహబూబ్నగర్ 243, జగిత్యాల 230, ఖమ్మంలో 212 , నాగర్ కర్నూల్ 198, వికారాబాద్లో 189 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. -
కరోనా పరీక్షల్లో దూసుకుపోతున్న ఏపీ
-
ఈ పాకిస్తాన్ జర్నలిస్ట్ గుర్తున్నాడా?
ఇస్లామాబాద్: పాకిస్తాన్ జర్నలిస్ట్ అమిన్ హఫీజ్ మరోసారి వార్తల్లోకెక్కాడు. గతంలో గేదెను ఇంటర్వ్యూ చేసిన అతను ఇప్పుడు మరో వినూత్న పద్ధతిలో రిపోర్టింగ్ చేశాడు. అమిన్ హఫీజ్ పాకిస్తాన్లోని జియో న్యూస్ చానల్లో ఓ జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. అతను చక్రవర్తి వేషం ధరించి చేతిలో కత్తి, మెడపై కిరీటంతో న్యూస్ రిపోర్ట్ చేశాడు. అతని వెనకాల ఇద్దరు భటులు నిలబడగా తన చేతిలోని కత్తిని తిప్పుతూ ముఖ్యాంశాలను వివరించాడు. ఈ తతంగాన్ని మరో జర్నలిస్టు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. క్షణాల్లో ఇది వైరల్గా మారింది. పైగా అతని వినూత్న రిపోర్టింగ్ యధాతథంగా టీవీ బులిటెన్లో ప్రత్యక్షమైంది. దీన్ని వీక్షించిన నెటిజన్లు ‘బాబోయ్ ఈ జర్నలిస్ట్ మళ్లీ వచ్చేశాడ్రా బాబూ’ అని తలలు పట్టుకుంటూనే ఈ వీడియోలను చూసి సరదాగా నవ్వుకుంటున్నారు. తన వృత్తిలో కొత్తదనం చూపించాలనుకుంటాడో ఏమో కానీ అతను ఎప్పుడూ ఏదో ఒక రకంగా వార్తల్లోకి నిలుస్తూనే ఉంటాడు. గతంలో అతను గేదెలను ఇంటర్వ్యూ చేస్తూ వాటిపై ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆ తర్వాత కూడా అతను మరోసారి విచిత్రంగా వ్యవహరించాడు. ఓ గాడిదపై స్వారీ చేస్తూ అక్కడి ప్రేక్షకులతో సంభాషించాడు. ఇది చూసిన జనాలు ‘పిచ్చి పట్టినట్లుంది, అతన్ని ఎవరికైనా చూపించండ్రా’, ‘నీలా రిపోర్టింగ్ ఎవరూ చేయలేరు మహాప్రభో’ అంటూ రకరకాలుగా సెటైర్లు వేశారు. -
9గంటలకు హెల్త్ బులెటన్ విడుదల
-
మంట పెట్టిన బులెటిన్
సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ, బీజేపీలకు చెందిన పలువురు సభ్యులు పోడియం వద్దకు దూసుకొచ్చి.. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించారంటూ పార్లమెంటు సభ్యులకు సమాచారం అందించే బులెటిన్లో ప్రచురించడం రాజ్యసభలో మంట పెట్టింది. అందులో తమ పేర్లను వెల్లడించడంపై టీడీపీ, బీజేపీ సభా కార్యక్రమాలను బహిష్కరించాయి. ప్రధాన ప్రతిపక్షం లేకుండా సభా కార్యక్రమాలు జరగడం ఏమిటంటూ మిగతా పక్షాలు కూడా అడ్డుకోవడంతో.. దీనిపై చర్చిద్దామని, ఒక కొత్త విధానాన్ని రూపొందిద్దామని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, మంత్రులు హామీ ఇచ్చారు. దీంతో వివాదం సద్దుమణిగింది. ఉదయం సభ ప్రారంభం కాగానే.. బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు బులెటిన్ అంశాన్ని లేవనెత్తారు. ఇది సభ్యుల హక్కులను హరించే విధంగా, అవమానపరిచేలా ఉందని.. దానిని తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. అయితే.. దీనిపై తర్వాత తన చాంబర్లో చర్చిద్దామని చైర్మన్ హమీద్ అన్సారీ సూచించినా.. బీజేపీ, అన్నాడీఎంకే, శివసేన సభ్యులు వాకౌట్ చేశారు. ఆ తర్వాత సభ వాయిదాపడింది. తిరిగి సభ సమావేశమయ్యాక.. సైనికుల కాల్చివేత ఘటనపై ప్రకటన చేస్తున్న రక్షణ మంత్రి ఆంటోనీని అన్నాడీఎంకే, ఏజీపీ, ఎస్పీ, జేడీయూ, బీఎస్పీ సభ్యులు అడ్డుకున్నారు. ప్రధాన ప్రతిపక్షం లేకుండా సభ నిర్వహణకు సహకరించబోమని స్పష్టం చేశారు. దీంతో చైర్మన్ చాంబర్లో రాజకీయ పక్షాల నేతల సమావేశాన్ని నిర్వహించి ఒక అవగాహనను కుదుర్చుకున్నారు. బులెటిన్ నుంచి సభ్యుల పేర్లను తొలగించే విషయాన్ని చైర్మన్ పరిశీలిస్తారని సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్ హామీ ఇచ్చారు. కాగా.. నియమావళి ఉల్లంఘనకు పాల్పడినట్లు తమ పేర్లను బులిటెన్లో పెట్టడం అన్యాయమని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. -
సాక్షి ది హెడ్ లైన్ షో 8th July 2013
-
సాక్షి భవిత 30th June 2013