పరిహార బకాయిలను తక్షణమే విడుదల చేయాలి | Buggana Rajendranath Reddy Asks GST Council for Compensation arrears | Sakshi
Sakshi News home page

పరిహార బకాయిలను తక్షణమే విడుదల చేయాలి

Published Tue, Oct 6 2020 4:49 AM | Last Updated on Tue, Oct 6 2020 4:49 AM

Buggana Rajendranath Reddy Asks GST Council for Compensation arrears - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి రావాల్సిన పరిహార బకాయిలను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి జీఎస్టీ కౌన్సిల్‌ను కోరారు. ఢిల్లీలో సోమవారం 42వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రి బుగ్గన హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు రూ.67 లక్షల కోట్లు వ్యయం చేయగా, వాటిలో రాష్ట్రాలు రూ.40 లక్షల కోట్లు(60%), కేంద్రం రూ.27 లక్షల కోట్లు (40%) వ్యయం చేస్తున్నాయన్నారు. వాటిలో రక్షణ రంగం, ఇతరాలు తీసివేయగా కేంద్ర ప్రభుత్వం 35% మాత్రమే వ్యయం చేస్తోందన్నారు. అందువల్ల రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 

► రాష్ట్రాలకు ప్రస్తుతం ఉన్న పరిమితులకు రెండు శాతాన్ని అదనంగా రుణాన్ని సేకరించడానికి అనుమతులు ఇవ్వాలి. పరిహార బకాయిల విషయంలో ఎంత మేరకు రుణాన్ని సేకరించాలనే విషయంలో, 2019–20 ఆర్థిక సంవత్సరం అసలు వృద్ధిరేటు (సుమారు 3%)గా పరిగణించాలి. 
► జీఎస్టీ పరిహార విషయంలో రాష్ట్రాలకు చెల్లించాల్సిన బకాయిలను రుణంగా సేకరించినట్లయితే, బకాయిలను ప్రథమంగా చెల్లించాలి. తరువాత బకాయిల వడ్డీని, చివరి ప్రాధాన్యంగా బకాయిల అసలు చెల్లించాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement