‘వైఎస్సార్‌ బీమా పథకం’ ప్రారంభం | CM YS Jagan Launches YSR Bheema Scheme Today | Sakshi
Sakshi News home page

‘వైఎస్సార్‌ బీమా పథకం’ ప్రారంభం

Published Wed, Oct 21 2020 12:05 PM | Last Updated on Wed, Oct 21 2020 3:01 PM

CM YS Jagan Launches YSR Bheema Scheme Today - Sakshi

నిరుపేద కుటుంబాలకు కొండంత అండగా నిలిచేందుకు వైఎస్సార్‌ బీమా పథకాన్ని ప్రారంభించింది.

సాక్షి, తాడేపల్లి: పెద్ద సంఖ్యలో సంక్షేమ పథకాలతో ప్రజా ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్‌ మరో కీలక ముందడుగు వేసింది. నిరుపేద కుటుంబాలకు కొండంత అండగా నిలిచేందుకు వైఎస్సార్‌ బీమా పథకాన్ని ప్రారంభించింది. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఈ పథకాన్ని ప్రారంభించారు. ‘వైఎస్సార్‌ బీమా పథకం’  ద్వారా బియ్యం కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరనుంది. కుటుంబ పెద్దకు జీవన భద్రత కల్పించేందుకు తీసుకొచ్చిన ఈ బీమా పథకం ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. కోవిడ్‌ వల్ల ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ నిరుపేద కుటుంబాలకు మేలు చేయాలన్న సంకల్పంతో వైఎస్సార్‌ బీమా పథకాన్ని అమలు చేసినట్టు సీఎం జగన్‌ తెలిపారు.
(చదవండి: ఏపీ: తుడాలో మరో 13 మండలాల విలీనం)

ఆయన మాట్లాడుతూ.. ‘నిరుపేదల కోసం వైఎస్సార్‌ బీమా పథకం తెచ్చాం. కేంద్రం తప్పుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం భరిస్తుంది. ఏడాదికి రూ.510 కోట్లు ప్రీమియం చెల్లిస్తున్నాం. ఈ పథకంతో 1.41 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. గ్రామ సచివాలయాల్లో ఇన్సూరెన్స్‌ జాబితా పెడతాం. ప్రమాదాల్లో మరణించిన, వైకల్యం కలిగిన కుటుంబాలకు బీమా కవరేజీ ఉంటుంది. 18-50 ఏళ్ల మధ్య వారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5లక్షలు బీమా. సహజ మరణానికి రూ.2లక్షల బీమా. ప్రమాదవశాత్తు పాక్షిక వైకల్యం కలిగితే రూ.1.50 లక్షల బీమా. 51-70 ఏళ్ల మధ్య ఉన్నవారు మరణిస్తే రూ.3లక్షలు బీమా. ప్రమాదవశాత్తు చనిపోయినవారి కుటుంబాలకు తక్షణం రూ.10వేలు అందిస్తాం.  గ్రామ సచివాలయం నుంచే రూ.10వేలు ఇస్తాం’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement