
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 9.30కు గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్తారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఢిల్లీలోని జనపథ్–1 నివాసానికి చేరుకుంటారు.
ఈ పర్యటనలో సీఎం జగన్.. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై ఆయన వారితో చర్చిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment