ఆరోగ్యశ్రీ దళారీకి దాఖలు | Coalition government is trying to put insurance in hands of brokers | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీ దళారీకి దాఖలు

Published Sun, Feb 23 2025 4:53 AM | Last Updated on Sun, Feb 23 2025 6:11 AM

Coalition government is trying to put insurance in hands of brokers

ఆరోగ్యశ్రీని బీమా పేరిట దళారుల చేతుల్లో పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు

మార్గదర్శకాల రూపకల్పన తుది దశకు.. 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేదలు, మధ్య­తరగతి కుటుంబాలకు సంజీవని వంటి ఆరోగ్య­శ్రీ­(ఎన్టీఆర్‌ వైద్య సేవ) పథకాన్ని బీమా పేరిట దళారుల చేతుల్లో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత కొద్ది నెలలుగా వైద్య సేవ ట్రస్ట్‌లో బీమా ప్రతిపాదనలను రూపొందిస్తున్నారు. ఈ ప్రక్రి­య తుది దశకు చేరినట్టు తెలుస్తోంది. రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌(ఆర్‌ఎఫ్‌పీ)ని ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులకు రూ.2.5 లక్షల కవరేజీతో ప్రభుత్వం బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. 

రాష్ట్రాన్ని రెండు జోన్‌లుగా విభజించి బీమాకు టెండర్‌లు పిలవాలని నిర్ణయించారు. ప్రస్తు­తం రాష్ట్రంలో 1.43 కోట్ల కుటుంబాలు ఆరోగ్య­శ్రీ పథకం కిందకు వస్తున్నాయి. ఈ కుటుంబాలను సగంగా విభజించి శ్రీసత్య­సాయి నుంచి గుంటూరు వరకూ ఒక జోన్, ఎన్టీఆర్‌ నుంచి శ్రీకాకుళం వరకూ మరో జోన్‌ కింద పరిగ­ణించనున్నారని తెలిసింది.

ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ రూ.25 లక్షల వరకూ ఆరోగ్య బీమా వర్తింపజేస్తామని కూటమి హామీ ఇచ్చింది. అధికారం చేతికొ­చ్చాక సూపర్‌ సిక్స్‌ల తరహాలోనే బీమా హామీకీ తిలోదకాలిచ్చింది. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు కాకుండా కేవలం ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోని కుటుంబాలకే రూ.2.5 లక్షల మేర బీమా కల్పించనుంది.

బీమా.. ఒక విఫలయత్నం 
దేశంలోనే మొదటిసారిగా రూ.25 లక్షల వరకూ కవరేజీతో వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథ­కాన్ని గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేసి­ంది. అప్పటి వరకూ రూ.5 లక్షల వరకూ ఉన్న కవరేజీని రూ.25 లక్షలకు పెంచారు. అంతేకా­కుండా 2019కి ముందు చంద్రబాబు ప్రభుత్వ­ంలో 1,059 ప్రొసీజర్‌లతో మొక్కు­బడిగా అమ­లైన పథకాన్ని ఏకంగా 3,257 ప్రొసీ­జర్‌లతో బలోపేతం చేశారు. 

తెల్లరేషన్‌ కార్డు­దా­రులతో పాటు, రూ.5 లక్షల్లోపు వార్షి­కా­దా­యం ఉన్న కుటుంబాలన్నింటినీ పథకం పరిధి­లోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 90 శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీ భరోసా లభించింది. అలాంటి పథకాన్ని ఇప్పుడు చంద్ర­బాబు ప్రభుత్వం దళారుల చేతుల్లో పెట్టా­లని నిర్ణయించడంపై తీవ్ర ఆగ్రహావే­శాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇప్పటికే కేరళ, మహా­రాష్ట్ర వంటి రాష్ట్రాల్లో బీమా విధానం విఫలమై తిరిగి ఏపీ తరహా ట్రస్ట్‌ విధానంలోకి మారారు. ఇప్పటికే పలు చోట్ల విఫలమైన ఒక విధానాన్ని రాష్ట్రంలో అమల్లోకి  తెచ్చి కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమా­డు­తోందని విమర్శలు వ్యక్తమవు­తు­న్నా­యి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement