విశాఖ ఆకస్మిక సర్వే.. ఓ తప్పుడు కథనం | Fack Check News: Eenadu Misleading On Vizag Forest land Survey | Sakshi
Sakshi News home page

విశాఖ ఆకస్మిక సర్వే.. ఓ తప్పుడు కథనం.. ఇదిగో వాస్తవం

Published Mon, Nov 28 2022 9:28 PM | Last Updated on Tue, Nov 29 2022 7:18 AM

Fack Check News: Eenadu Misleading On Vizag Forest land Survey - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ అధికార పార్టీ తీరును, నేతలను బద్నాం చేసేలా యెల్లో మీడియా వరుసగా అసత్య కథనాలతో వక్రబుద్ధి ప్రదర్శిస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా విశాఖ అటవీ భూముల్లో ఆకస్మిక సర్వే పేరుతో ఓ కథనం ప్రచురించింది ఈనాడు. అయితే.. సదరు కథనం పూర్తిగా అవాస్తవమని జిల్లా కలెక్టర్‌ పేరు మీద ఒక ప్రకటన విడుదల అయ్యింది. 

సదరు సర్వే.. అదొక సాధారణ స్పందన అర్జీలో భాగమని ప్రకటించారు. నవంబర్‌ 26వ తేదీన ఈ సర్వే జరిగిందని, ఇందుకుగానూ నోటీసులు 12 రోజుల ముందే అందించామని అధికారులు తెలిపారు. దరఖాస్తుదారు, డివిజనల్‌ ఫారెస్ట్‌ అధికారికి నోటీసులు అందించి.. నోటీసుల ప్రకారం ఈ తేదీనే TS.NO:88/B1, B2, B3 భూమిని సర్వే చేసినట్లు వెల్లడించారు.  

శీరంవహిత ఫర్మా ఒక రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌ను జత చేసి సర్వే చేయాలని స్పందన ద్వారా దరఖాస్తు పెట్టుకున్నారని అధికారులు వెల్లడించారు.  అంతేగానీ.. కడప ప్రాంతానికి చెందిన నేత ప్రమేయం ఉందంటూ ఈనాడులో వచ్చిన కథనం పూర్తిగా అవాస్తవమని జిల్లా కలెక్టర్‌ కార్యాలయం తరపున ఒక ప్రకటన వెలువడింది.

ఇదీ చదవండి: ‘రాజధాని అంటే జేబులు నింపుకోవడం కాదు’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement