
సాక్షి, అమరావతి: రేపటి నుంచి మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖపట్నంలో పర్యటించనున్నారు. వైజాగ్లో మార్చి 3,4 తేదీల్లో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో సీఎం పాల్గొనున్నారు. రేపు(గురువారం) సాయంత్రం 4 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 5.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు, రాత్రికి అక్కడే బస చేస్తారు.
3వ తేదీ షెడ్యూల్:
ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్కు చేరుకుని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో సీఎం పాల్గొంటారు. రాత్రి 8.00-9.00 గంటల సమయంలో ఎంజీఎం పార్క్ హోటల్లో జీఐఎస్ డెలిగేట్స్కు ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రాత్రి బస చేయనున్నారు.
4వ తేదీ షెడ్యూల్:
ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్కు చేరుకుని రెండో రోజు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో సీఎం పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 3.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
చదవండి: విజయవాడ: నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment