
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మహిళలతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. బుధవారం ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లగా వారికి ప్రజలు ఎదురేగి స్వాగతం పలికారు.
పల్నాడు జిల్లా చెంఘిజ్ఖాన్పేటలో సంక్షేమ పథకాల లబ్ధిదారులతో మాట్లాడుతున్న మంత్రి విడదల రజిని
‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమకు అండగా నిలుస్తున్నాయని, ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నాయని చెప్పారు. వైఎస్ జగన్ పాలనలో తామంతా చాలా సంతోషంగా ఉన్నామని ప్రజలు చెబుతున్నారు. సీఎం వైఎస్ జగన్కు తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆనందంగా తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment