Gadapa Gadapaki Mana Prabhutvam
-
బంటుమిల్లి గ్రామంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం
-
చంద్రగిరి మండలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్న మంత్రి రోజా
-
కృష్ణ సముద్రం సచివాలయం పరిధిలో మంత్రి రోజా పల్లెనిద్ర
-
రాజోలు నియోజకవర్గంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
స్పీడ్ పెంచే సమయం వచ్చింది..సీఎం వైఎస్ జగన్ మాతో చెప్పిన అంశాలు ఇవే
-
Why not 175/175 for YSRCP : సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : వచ్చే ఎన్నికల్లో 175 సీట్లకు 175 సీట్లు గెలవాలనే లక్ష్యంతో పని చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి పార్టీ నేతలకు సూచించారు. 175కి 175 సీట్లు గెలవడం అసాధ్యం ఏమీ కాదని, కచ్చితంగా గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు సీఎం జగన్. ఈరోజు (మంగళవారం) తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలతో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు సీఎం జగన్. ఈ మేరకు పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కో-ఆర్డినేటర్లు, పార్టీ రీజినల్ ఇంచార్జులు హాజరయ్యారు. మనం గేర్ మార్చాల్సిన అవసరం వచ్చింది ‘ఇప్పటివరకూ మనం చేసిన కార్యక్రమాలు ఒక ఎత్తు.. రాబోయే కాలంలో చేపట్టే కార్యక్రమాలు మరో ఎత్తు. వచ్చే 6 నెలలు ఎలా పనిచేస్తామన్నది చాలా ముఖ్యం. మనం గేర్ మార్చాల్సిన అవసరం వచ్చింది. మన పార్టీ, ప్రభుత్వం పట్ల సానుకూల స్పందన చూశారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలి. క్షేత్రస్థాయిలో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. ఒంటరిగా పోటీ చేయలేక ప్రతిపక్షాలు పొత్తులకు వెళ్తున్నాయి. మన పార్టీ, మన ప్రభుత్వం పట్ల సానుకూల అంశం చూశాం. ఇదే ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకేయాలి’ అని సూచించారు సీఎం జగన్. ‘అసెంబ్లీ నియోజకవర్గాల్లో విభేదాలు లేకుండా చూసుకోవాలి. మనమంతా ఒక కుటుంబంలోని సభ్యులమే. టికెట్లు రానంత మాత్రాన నిరాశ వద్దు. కొందరికి టికెట్లు ఇవ్వొచ్చు.. మరికొందరికి ఇవ్వకపోవచ్చు. టికెట్లు రాని వారికి మరో అవకాశం కల్పిస్తాం’ అని సీఎం జగన్ స్పష్టం చేశారు. వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం చేపట్టబోతున్నాం ప్రజల్లో ఎవరికి ఇస్తే కరెక్ట్ అనే ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకోవచ్చు. టికెట్ ఇవ్వనంత మాత్రాన వాళ్లు నా వాళ్లు కాకుండాపోరు. టికెట్లపై ప్రతి ఒక్కరూ నా నిర్ణయాలను పెద్ద మనసుతో స్వాగతించాలి. టికెట్లు రాని వారికి మరొక అవకాశం కల్పిస్తాం. లీడర్, పార్టీ మీద నమ్మకం ఉండాలి. సర్వేలు కూడా తుది దశలోకి వస్తున్నాయి. చివరి దశ సర్వేలు కూడా జరుగుతాయి. ప్రజల్లో ఎక్కువగా ఉంటే మంచి ఫలితాలు. ప్రతి ఒక్కరూ ప్రజలతో మమేకమై ఉండాలి. వచ్చే నెలల్లో చేపట్టే కార్యక్రమాలు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం, వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమం చేపడతాం’ అని తెలిపారు సీఎం జగన్. మొత్తం ఐదు దశల్లో జగనన్న సురక్ష కార్యక్రమం జగనన్న సురక్ష కార్యక్రమం వల్ల చాలా పాజిటివ్ వచ్చింది. దాదాపు 98 లక్షల సర్టిఫికెట్లు ఇచ్చాం. అర్హులకు అవసరమైన సర్టిఫికెట్లను జారీ చేశాం.ఇప్పుడు ఆరోగ్య సురక్ష చేపడుతున్నాం. ఆరోగ్య పరంగా ప్రతి ఇంటిని జల్లెడ పడతాం. ఉచితంగా మందులు, పరీక్షలు చేస్తాం. గుర్తించిన వారికి మెరుగైన చికిత్సలు అందిస్తాం. విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్తో చేయూతనిస్తాం. ఇందులో ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులను మమేకం చేస్తాం.మొత్తం ఐదు దశల్లో జగనన్న సురక్ష కార్యక్రమం. తొలి దశలో వాలంటీర్లు, గృహ సారథులు ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్య సురక్ష కార్యక్రమం గురించి వివరిస్తారు.రెండో దశలో ఏఎన్ఎంలు, సీహెచ్ఓలు, ఆశా వర్కర్లు ప్రతి ఇంటికి పరీక్షలు చేయడానికి వెళ్తారు. మూడో దశలో వాలంటీర్లు, గృహ సారథులు ప్రజా ప్రతినిధులు క్యాంపు వివరాలు తెలియజేస్తారు. నాల్గో దశలో క్యాంపులను ఏర్పాటు చేస్తారు. ఐదో దశలో అనారోగ్యంతో ఉన్న వారిని గుర్తించి వారికి నయం అయ్యే వరకూ చేయూతనిస్తారు’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. -
గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష
-
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష
-
తేటగుంటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి అమర్నాథ్
-
గడప గడప వద్దే సమస్యల పరిష్కారం
-
అర్ధరాత్రి గడప గడపకు నిర్వహించిన ఎమ్మెల్యే విష్ణు
-
డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు ఏం చేసాడో చూడండి
-
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్
-
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్
-
గడప గడపకు మన ప్రభుత్వం...ఇంటింటికి వెళ్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు
-
ఏపీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
జగనన్న సురక్ష కార్యక్రమంతో ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు
-
ఆత్మకూరులో గడప గడపకు మన ప్రభుత్వం
-
ఏపీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
గడప గడపకు మన ప్రభుత్వం
-
ఆంధ్రప్రదేశ్ లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కాకాని
-
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
-
ఏపీలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
గడప గడపకు మన ప్రభుత్వంతో ప్రతి గడప పులకరింపు
-
AP: గడపల్లో ఘన స్వాగతం
సాక్షి, అమరావతి: ఓట్లు దండుకుని మొహం చాటేసిన మనుషులనే ఇన్నాళ్లూ చూశాం! ఎన్నికలు ముగియగానే మేనిఫెస్టోను మాయం చేసి చెత్తబుట్ట పాలు చేసిన పార్టీల గురించే మాకు తెలుసు! అధికారం చేపట్టాక ప్రజా సమస్యలను గాలికి వదిలేసి గ్రామాల వైపు తిరిగి చూడని నేతల పాలనలో దశాబ్దాల పాటు నలిగిపోయాం! మళ్లీ ఎన్నికలు వస్తే గానీ మా గుమ్మం తొక్కని నాయకులతో విసిగిపోయాం! అలాంటిది.. చరిత్రలో తొలిసారిగా 99 శాతం హామీలను నెరవేర్చి చిరునవ్వుతో, ఆత్మవిశ్వాసంతో మా గుమ్మం వద్దకు వస్తున్న ప్రజా ప్రతినిధులను ఇప్పుడే చూస్తున్నాం..! ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా? ఇంకా ఏమైనా సమస్యలున్నాయా?.. ఆశీర్వదించండంటూ ఆత్మీయంగా గడప గడపనూ పలుకరిస్తున్న నాయకులను చూడటం ఇదే మొదటిసారి అని రాష్ట్ర ప్రజానీకం పేర్కొంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంతో ప్రతి గడప పులకరిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ఈ నెల 20వతేదీ నాటికి ఎమ్మెల్యేలు 83,83,908 గృహాలను సందర్శించారు. ఆయా కుటుంబాలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేకూర్చిన ప్రయోజనాలను వివరించి వారి ఆశీర్వాదాలను పొందారు. రాష్ట్రంలోని మొత్తం 15,004 గ్రామ, వార్డు సచివాలయాలకుగానూ ఇప్పటివరకు ఎమ్మెల్యేలు 9,316 సచివాలయాలను సందర్శించారు. గడప గడపకూ మన ప్రభుత్వంలో భాగంగా సచివాలయాల వారీగా పర్యటిస్తూ ఇళ్ల వద్దకు వెళ్లి ప్రజలను కలుసుకుంటున్న ఎమ్మెల్యేలు ఆయా కుటుంబాలకు ప్రభుత్వం చేకూర్చిన మేలును వివరిస్తూ పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా? అని ఆరా తీస్తూ ఆయా కుటుంబాలతో టిక్ పెట్టిస్తున్నారు. ప్రాధాన్యత పనులను గుర్తించి నిధులు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం మేర వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసింది. నవరత్నాల్లో భాగంగా కులమతాలు, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులందరికీ పారదర్శకంగా, సంతృప్త స్థాయిలో ప్రయోజనాలను అందించింది. ఏటా సంక్షేమ క్యాలెండర్ను ముందుగానే ప్రకటించి ఆయా పథకాల కింద లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ చేస్తోంది. ఈ క్రమంలో ప్రజా ప్రతినిధులంతా ఇళ్ల వద్దకు వెళ్లి ప్రజలను కలుసుకునేలా గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని గతేడాది మే 11వ తేదీన ప్రారంభించింది. ఆయా కుటుంబాలకు ప్రభుత్వం చేకూర్చిన ప్రయోజనాలను వివరిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన లేఖలను అందజేస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే సచివాలయాల పరిధిలో రెండు రోజుల పాటు పర్యటించడంతో పాటు స్థానికంగా ప్రజలకు అవసరమైన, ప్రాధాన్యత కలిగిన పనులను గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా మంజూరు చేస్తున్నారు. ఒక్కో సచివాలయం పరిధిలో రూ.20 లక్షల చొప్పున అత్యంత ప్రాధాన్యత పనులను గుర్తించి వెంటనే మంజూరు చేస్తున్నారు. సచివాలయాలవారీగా నివేదికలు సిద్ధం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఈ నెల 20వతేదీ వరకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఎన్ని రోజులు పాల్గొన్నారనే వివరాలతో సచివాలయాలవారీగా నివేదికను ప్రణాళికా శాఖ రూపొందించింది. ఇప్పటి వరకు ఎన్ని గృహాలను సందర్శించారు? సచివాలయాల వారీగా ఎన్ని ప్రాధాన్యత పనులను గుర్తించారు? ఎన్ని పనులకు నిధులు మంజూరు చేశారు? ఎన్ని ప్రారంభమయ్యాయి? ఎన్ని పనులు పూర్తి చేశారు? తదితర వివరాలను నివేదికలో పొందుపరిచారు. సచివాలయాల్లో ఎన్ని రోజులు? (ఈనెల 20 వరకు) ► ఒక్కో సచివాలయంలో ఒక రోజు గడిపిన ఎమ్మెల్యేలు 9 మంది ► ఒక్కో సచివాలయంలో రెండేసి రోజులు గడిపిన ఎమ్మెల్యేలు 85 మంది ► ఒక్కో సచివాలయంలో మూడు రోజులు గడిపిన ఎమ్మెల్యేలు 46 మంది ► ఒక్కో సచివాలయంలో మూడు రోజులకు పైగా గడిపిన ఎమ్మెల్యేలు 11 మంది ఎంత మంది.. ఎన్ని రోజులు వెళ్లారు? (ఈ నెల 20 వరకు) ► 150 రోజులకు పైగా గడప గడపకూ వెళ్లిన ఎమ్మెల్యేలు 40 మంది ► 121 – 150 రోజులు గడప గడపకూ వెళ్లిన ఎమ్మెల్యేలు 43 మంది ► 91 – 120 రోజులు గడప గడపకూ వెళ్లిన ఎమ్మెల్యేలు 38 మంది ► 61 – 90 రోజులు గడప గడపకూ వెళ్లిన ఎమ్మెల్యేలు 18 మంది ► 31 – 60 రోజులు గడప గడపకూ వెళ్లిన ఎమ్మెల్యేలు 11 మంది ► 1 – 30 రోజులు గడప గడపకూ వెళ్లిన ఎమ్మెల్యే 1 గడప గడపకూ ప్రాధాన్యత పనులు ఇలా (ఈనెల 20 వరకు) ► రూ.1,454.30 కోట్ల విలువైన 37,725 ప్రాధాన్యత పనులు అప్లోడ్ ► రూ.1,342.68 కోట్ల విలువైన 34,767 పనులు మంజూరు ► రూ.1,179.06 కోట్ల విలువైన 31,346 పనులు ప్రారంభం ► రూ.251.22 కోట్ల విలువైన 6,554 పనులు పూర్తి -
పనితీరు బాగుంటేనే ఎమ్మెల్యేలను కొనసాగిస్తాం: సీఎం వైఎస్ జగన్
-
గడపగడపకూ కార్యక్రమం అత్యంత కీలకమని ఏపీ సీఎం వైఎస్ జగన్ సూచన...ఇంకా ఇతర అప్డేట్స్
‘‘రాష్ట్రంలో తొమ్మిది నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇవ్వాళ్టి నుంచి మనం వేసే ప్రతి అడుగు చాలా కీలకం. 175కు 175 శాసనసభ స్థానాల్లోనూ మనం గెలవాలి.
-
‘గడప గడపకూ’ వర్క్ షాప్ : పనితీరే ప్రామాణికం
ఎమ్మెల్యేల పనితీరు ప్రజల్లో బాగుంటే ఆ ఎమ్మెల్యేలను కొనసాగిస్తాం. ప్రజల్లో గ్రాఫ్ బాగా లేకపోతే ఆ ఎమ్మెల్యేలను కొనసాగించడం కుదరదు. ప్రతి ఒక్కరూ ఇది గుర్తుంచుకోండి. ఈ విషయం ఎందుకు చెబుతున్నానంటే కొన్ని కోట్ల మంది మనపై ఆధారపడి ఉన్నారు. కోట్ల మంది పేదలకు మంచి జరుగుతోంది. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు బాగా లేకపోతే.. వాళ్లను అక్కడే కొనసాగించడం వల్ల వారికీ నష్టం, పార్టీకీ నష్టం. కోట్లాది మంది పేదలకూ నష్టం జరుగుతుంది. మనం సర్వే చేసినప్పుడు మీ గ్రాఫ్లు బలంగా ఉండాలి. దీనికి గడప గడపకూ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ప్రజలకు చేరువగా ఉండేందుకు బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల మీ గ్రాఫ్ పెరుగుతుంది. సర్వేలు అనుకూలంగా లేకపోతే.. టికెట్లు ఇవ్వకపోతే.. నన్ను బాధ్యుడ్ని చేయొద్దు. రాజకీయాలను సీరియస్గా తీసుకోవాలి. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: ‘‘మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇవాళ్టి నుంచి మనం వేసే ప్రతి అడుగు చాలా కీలకం. 175కు 175 శాసనసభ స్థానాల్లోనూ మనం గెలవాలి. ఇంతకు ముందుకన్నా బ్రహ్మాండమైన మెజార్టీలు రావాలి. మన లక్ష్యం అదీ. అందుకే గడప గడపకూ కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకోవాలి..’’ అని సీఎం వైఎస్ జగన్ మార్గనిర్దేశం చేశారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం జగన్ వర్క్ షాప్ నిర్వహించారు. 175కు 175 స్థానాల్లో విజయబావుటా ఎగురవేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. నాలుగేళ్లలో రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా తెచ్చిన మార్పులను ‘వై ఏపీ నీడ్స్ జగన్..?’ (ఏపీకి జగన్ ఎందుకు కావాలి..?) అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ తెలియజేద్దామని పిలుపునిచ్చారు. ‘నెగెటివ్ మీడియాను అడ్డం పెట్టుకుని మారీచుల్లా మనపై యుద్ధం చేస్తున్నారు.. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారితో మనం యుద్ధం చేస్తున్నాం. ఆ దుష్ఫ్రచారాన్ని ప్రతి గడపలోనూ తిప్పికొట్టాలి..’ అని సూచించారు. వర్క్ షాప్లో ముఖ్యమంత్రి జగన్ ఇంకా ఏమన్నారంటే.. ప్రతి లబ్ధిదారుడినీ చైతన్యం చేయాలి.. ఇవాళ మూడు ప్రధాన కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తున్నాం. ఇందులో మొదటిది ఈ నెల 23వతేదీన ప్రారంభించబోతున్న జగనన్న సురక్ష కార్యక్రమం. రెండోది.. గడపగడపకూ మన ప్రభుత్వం. ఇక మూడో అంశం ‘‘వై ఏపీ నీడ్స్ జగన్..?’’ అనే కార్యక్రమం. నాలుగేళ్ల పరిపాలనలో గొప్పగా, దేశానికే ఆదర్శంగా నిలబడగలిగిన పనులు ఏం చేశామన్న విషయాలతోపాటు వాటికి సంబంధించి ఆధారాలతో సహా అవగాహన కలిగించేలా ‘వై ఏపీ నీడ్స్ జగన్..’ కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాం. మనం రాక్షసులతోనూ, మారీచులతోనూ యుద్ధం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు అయితేనే మనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తగినవిధంగా తిప్పికొట్టగలిగే పరిస్థితి ఉంటుంది. మనం చేస్తున్న మంచి ఏమిటన్నది ప్రతి మనిషి దగ్గరికి, ప్రతి కుటుంబం వద్దకు పదేపదే తీసుకెళ్లాలి. ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టగలిగే పరిస్థితిలోకి ప్రతి లబ్ధిదారుడిని తయారు చేయాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఆ భావనే ఆశీస్సులుగా మారి.. వచ్చే ఎన్నికల్లో మనం 175కు 175 నియోజకవర్గాలూ గెలవాలి. ఆ దిశగా అడుగులు పడాలి. అదేం కష్టమైన పనికాదు. ఎందుకంటే.. రాష్ట్రంలో సగటున 87 శాతం కుటుంబాలకు మంచి జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 92 శాతం కుటుంబాలకు మంచి జరగ్గా పట్టణ ప్రాంతాల్లో 84 శాతానికి మేలు జరిగింది. ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి. అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉన్నప్పుడు.. దేవుడి దయతో మన ప్రభుత్వం మంచి చేయగలిగిందని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పి ఆ ఇంట్లో ప్రతి అక్కచెల్లెమ్మ మనసులో ఇది నిజమే కదా అనే భావనను తేవాలి. ఆ భావనే ఆశీస్సులుగా మారి ప్రతి ఇళ్లూ మనకు ఓటు వేస్తుంది. అది జరిగితే ప్రతి గ్రామం మనకు ఓటు వేస్తుంది. ప్రతి నియోజకవర్గం ఆటోమేటిక్గా మనకే ఓటు వేసే పరిస్థితి వస్తుంది. 175కు 175 స్థానాల్లో మనం విజయం సాధిస్తాం. జగనన్న సురక్షతో సమస్యల పరిష్కారం..: ► మీతోపాటు క్యాడర్ను కూడా యాక్టివేట్ చేసి గృహ సారథులు, వలంటీర్లు, సచివాలయ కన్వీనర్లను ఏకం చేస్తూ ముందుకు సాగాలి. ఇప్పటికే ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం కొనసాగుతోంది. ఎక్కడైనా, ఏదైనా సమస్య మీరు ప్రయత్నం చేసినప్పటికీ పరిష్కారం కాకపోతే దాన్ని పరిష్కరించేలా భరోసా ఇస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దీనికి అనుబంధంగా, అదనంగా ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం కొనసాగుతుంది. ► ‘జగనన్న సురక్ష కార్యక్రమం’ ద్వారా మొత్తం సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థ, గృహ సారథుల వ్యవస్థ ప్రతి ఇంటికీ వెళ్లి జల్లెడ పడుతుంది. అర్హులై ఉండి కూడా ఇంకా ఎవరైనా మిగిలిపోయి పథకాలకు దూరం కాకూడదనే లక్ష్యంతో జల్లెడ పట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇంకా ఎక్కడైనా అర్హులు మిగిలిపోయిన వారు ఉంటే కుటుంబంలో విభజన చేసి రేషన్ కార్డు అందించడం నుంచి వివిధ రకాల సర్టిఫికెట్లు అక్కడికక్కడే మంజూరు చేసే కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్లి కాసేపు గడిపి సర్టిఫికెట్స్ పరంగా, పథకాల పరంగా సమస్యలుంటే జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా పరిష్కరిస్తాం. ► మండల స్థాయి అధికారులు ప్రతి సచివాలయంలో ఒకరోజు పాటు గడుపుతారు. తహసీల్దార్, పంచాయితీరాజ్ ఈవో ఒక బృందంగా.. ఎంపీడీవో, డిప్యూటీ తహసీల్దార్ మరొక బృందంగా ఏర్పడతారు. షెడ్యూల్ ప్రకారం సచివాలయాలకు వెళతారు. ఏ తేదీన ఎక్కడకు వెళతారో ముందే ప్రకటిస్తారు. ఉత్సాహం ఉన్నవారు ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. ► సచివాలయం పరిధిలో ప్రతి కుటుంబాన్నీ అధికారులతో కూడిన ఈ బృందాలు కలుస్తాయి. ప్రజల నుంచి సమస్యలు తెలుసుకోవడం, సర్టిఫికెట్ల జారీకి అవసరమైన డాక్యుమెంట్లు, పథకాల అర్హతకు సంబంధించిన పత్రాలు తీసుకుంటారు. వీటిని తీసుకుని తిరిగి గ్రామ, వార్డు సచివాలయాల వద్దకు చేరుకుంటారు. అక్కడ ప్రతి వినతికీ సర్వీసు నంబరు, టోకెన్ కేటాయించి ఆయా కుటుంబాలకు అందచేస్తారు. ► వారం తర్వాత అధికారులతో కూడిన బృందం ఆయా గ్రామ, వార్డు సచివాలయాలకు చేరుకుని సర్టిఫికెట్లు జారీ చేసే కార్యక్రమం చేపడుతుంది. అర్హులందరికీ పథకాలు మంజూరు చేస్తారు. ఒక పండగ వాతావరణంలో గ్రామానికి సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరిస్తారు. దీనివల్ల నూరు శాతం కార్యక్రమం సంతృప్తిగా జరుగుతుంది. ► జగనన్న సురక్ష కార్యక్రమం క్యాంపుల్లో దాదాపు 11 రకాల సర్టిఫికెట్లు జారీ చేస్తారు. కులం, ఆదాయం, జనన ధృవీకరణ, వివాహం, ఫ్యామిలీ మెంబర్, డెత్, బియ్యం కార్డులు, కుటుంబాల విభజన, సీసీఆర్సీ, మ్యుటేషన్లు, ఫోన్ నంబర్లకు ఆధార్ లింకేజి లాంటివన్నీ అందించే కార్యక్రమం జరుగుతుంది. ► మండలంలో ప్రతి రోజూ రెండు క్యాంపులు జరుగుతాయి. నియోజకవర్గంలో ఎన్ని మండలాలుంటే అన్నింటా రెండేసి క్యాంపులు చొప్పున జరుగుతాయి. ప్రతి క్యాంపు దగ్గర ఎమ్మెల్యేలు కనిపించాలి. జగనన్న సురక్ష కార్యక్రమంపై ఈ నెల 23 నుంచి శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. జూలై 1 నుంచి క్యాంపులు ప్రారంభం అవుతాయి. దుష్ఫ్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టండి.. ► గతంలో చంద్రబాబు పాలన, ఇవాళ మన ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమాలతో నాడు – నేడు కంటెంట్ తయారు చేసి ప్రజల దగ్గరకు చేర్చాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 ద్వారా వెలువడుతున్న వ్యతిరేక కథనాలకు సంబంధించి నిజాలేమిటో ప్రజలకు వివరిస్తూ నెగెటివ్ మీడియా చేస్తున్న దుష్ఫ్రచారాన్ని తిప్పికొట్టాలి. ► ప్రభుత్వం చేస్తున్న మంచిని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలి. సోషల్ మీడియాను విస్తృతంగా వాడుకోవాలి. అబద్ధాలు, విష ప్రచారాలను పూర్తిస్థాయిలో తిప్పికొట్టాలి. రాబోయే రోజుల్లో మనపై దుష్ప్రచారం పెరుగుతుంది. సోషల్ మీడియాలో అబద్ధాలను ఇంకా ఎక్కువగా ప్రచారంలోకి తెచ్చే కార్యక్రమం చేస్తారు. ఇంత దారుణమైన ఎమ్మెల్యే ఎవరూ లేరంటూ వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు. ప్రతి ఒక్కరిపైనా వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు. వీటిని ఎదుర్కొంటూ ముందుకు పోవాలి. గ్రామ స్ధాయి నుంచి మన సోషల్ మీడియా టీమ్లను తయారు చేసుకోవాలి. ఈ కౌంటర్ మెకానిజం కచ్చితంగా ఉండాలి. దీనికి సిద్ధం కావాలి. ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ... ‘‘జగనన్న సురక్ష’ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో ఏ చిన్న సమస్య ఉన్నా పరిష్కారం కావాలి. ఏకంగా 1.50 లక్షల మంది సచివాలయ సిబ్బంది, 2.60 లక్షల మంది వలంటీర్లు, 3 వేల మంది మండల స్థాయి సిబ్బంది, 26 మంది సీనియర్ ఐఏఎస్లు, 7.5 లక్షల మంది గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు ప్రతి గ్రామంలో ఒక రోజు కేటాయిస్తూ 15 వేల క్యాంపులు నిర్వహిస్తారు. 30 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ఇంకా ఎవరైనా అర్హులు ప్రభుత్వ పథకాలకు దూరమయ్యారేమో పరిశీలించి వారికి కూడా ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకుంటారు. ఇలా ప్రతి సమస్యను పరిష్కరించాలన్న ధృక్పథంతో అడుగులు వేస్తోన్న పరిస్ధితి దేశ చరిత్రలో ఎక్కడా ఉండదు. ఈ రాష్ట్రంలో మాత్రమే జరుగుతోంది’’ – ‘జగనన్న సురక్ష’పై సీఎం జగన్ -
గడపగడపకు మన ప్రభుత్వంపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
నేడు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం సమీక్ష
-
పుదూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని సంక్షేమ పథకాలు సీఎం జగన్ ఇచ్చారు: డిప్యూటీ సీఎం కొట్టు
-
ఇదేందయ్యా ఇది.. టీడీపీ నేతల ఓవరాక్షన్
పూతలపట్టు: గ్రామానికి ఎమ్మెల్యే వస్తున్నారని తెలిసి గ్రామంలో ఎవరూ ఉండకూడదని స్థానిక టీడీపీ నేతలు ప్రజలను భయాందోళనకు గురి చేసి ఇళ్లకు తాళాలు వేయించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని పేట అగ్రహారం పంచాయతీలో జరిగింది. అయితే, గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు బుధవారం పేట అగ్రహారం పంచాయతీలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో ఇంటింటికీ ఎమ్మెల్యే వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తుండటాన్ని స్థానిక టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ప్రజలను ఎమ్మెల్యే కలవకుండా చేయాలని పంచాయతీలోని 5 గ్రామాల్లో ప్రజలంతా తాళాలు వేసుకుని వెళ్లిపోవాలని టీడీపీ నేతలు హుకుం జారీ చేశారు. తాళాలు వేసుకుని వెళ్లకుంటే అంతు చూస్తామని తీవ్రంగా భయపెట్టారు. దీంతో పల్లెల్లో ఒకటి రెండు ఇళ్లు మినహా మిగిలినవారంతా భయపడి తాళాలు వేసుకుని పక్క గ్రామాలకు, పొలాల వద్దకు వెళ్లిపోయారు. పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే ఏం జరిగిందని అధికారులను ప్రశ్నించారు. ఎవరూ ఉండకూడదని టీడీపీ నాయకులు భయపెట్టడంతో జనం తాళాలు వేసుకుని వెళ్లారని అధికారులు చెప్పారు. దీనిపై ఎమ్మెల్యే టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేట అగ్రహరంలో 498 మంది లబ్ధిదారులకు రూ.2.15 కోట్లు లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. ఇది కూడా చదవండి: ఏపీకి మరో జాతీయ అవార్డు -
మహాయజ్ఞంలా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పుష్ప శ్రీవాణి
-
‘చంద్రబాబుతో అంటకాగితే జనసేన అడ్రస్ గల్లంతే’
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పార్టీ, కులం, మతం, ప్రాంతం ఇలా అన్నింటికీ అతీతంగా అర్హులందరికీ అందుతున్నాయని డిప్యూటీ సీఎం, దేవదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ మండలం ఆరుగొలను గ్రామంలో శుక్రవారం రెండో రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా గ్రామంలోని గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీచేసిన వడ్డూరి రాంబాబు ఇంటి వద్ద ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మంత్రి సత్యనారాయణ గడపగడపకు కార్యక్రమంలో భాగంగా జెడ్పీటీసీ అభ్యర్థి ఇంటి వద్ద ఆ కుటుంబానికి జగనన్న సంక్షేమ పథకాలు ద్వారా చేకూరిన లబ్ధిని చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగనన్నకు సంక్షేమ పథకాలు అమలులో పార్టీ, కులం, మతం, ప్రాంతం వంటి ఎలాంటి భేదం లేవన్నారు. అన్నింటికీ అతీతంగా అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందాలనేదే ముఖ్యమంత్రి జగనన్న ఆశయమన్నారు. గడపగడపకు వెళ్లి ఆయా కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా చేకూరిన లక్షలాది రూపాయల లబ్ధిని చదువుతుంటే వారు స్వయంగా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మళ్ళీ మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. రాష్ట్రానికి ఏలినాటి శని లాంటి చంద్రబాబు.. నవరత్నాలను నవ మోసాలు అంటూ విమర్శించడం చాలా దారుణమని తీవ్రంగా ఖండించారు. 14 ఏళ్ల పాటు పాలించిన చంద్రబాబు ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకుని సీఎం జగన్లా నేను ఎందుకు చేయలేకపోయాను అని పశ్చాత్తాపపడితే బాగుంటుందని హితవు పలికారు. అంతేగానీ, ఇప్పటికీ వయసు మీద పడినా పదవీ కాంక్షతో చంద్రబాబు పిశాచిలా ప్రజలను పట్టిపీడిస్తున్నారని ఫైరయ్యారు. జనసేన పార్టీకి రాజకీయ సిద్ధాంతం లేదు. పవన్ కళ్యాణ్కు గమ్యం లేదని.. స్థిరమైన అభిప్రాయాలు లేవన్నారు. పవన్ రాజకీయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రాణించలేడని ప్రముఖ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికైనా పవన్ కళ్ళు తెరిచి మర్రిచెట్టు లాంటి చంద్రబాబును విడిచి బయటకు వస్తే భవిష్యత్తు ఉంటుందన్నారు. అంతేగానీ, చంద్రబాబుతోనే అంటకాగితే తెలుగుదేశంతో పాటు జనసేనకు అడ్రస్ కూడా గల్లంతుకావడం ఖాయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆరుగొలను గ్రామంలో ఆయన గడపగడపకు వెళ్లి ఆయా కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలతో చేకూరిన ఆర్థిక లబ్ధిని గణాంకాలతో సహా చదివి వినిపించారు. ఈ క్రమంలోనే ఏ ప్రభుత్వంలో మేలు జరిగింది.. ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే మన కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది అనేది ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు. ఇది కూడా చదవండి: థాంక్యూ సీఎం సార్.. మీ సాయంతో అంతరిక్షం అందుకుంటున్నా -
మహాయజ్ఞంలా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
ఏపీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
సున్నిపెంట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం
-
ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే నాని
-
ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ పథకాలపై వివరించిన రోజా
-
ఏపీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
ఏ రాజకీయ పార్టీ చేయలేని సాహసం YSRCP చేస్తుంది
-
రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని వర్గాల నుంచి స్వచ్ఛందంగా మద్దతు
-
గడప గడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తున్నాం
-
ఇంటింటికెళ్లి సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆరా తీసిన ఎంపీ అవినాష్ రెడ్డి
-
నెల్లూరు జిల్లాలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
-
మిమ్మల్ని మళ్లీ గెలిపించాలనే ఈ కార్యక్రమాలన్నీ: సీఎం జగన్
రాజకీయాలంటే.. మానవ సంబంధాలు నేను నాన్న దగ్గర నుంచి నేర్చుకున్న అంశం ఏమిటంటే.. రాజకీయాలంటే మానవ సంబంధాలు! ఏ ఒక్క ఎమ్మెల్యేనూ పోగొట్టుకోవాలని నేను అనుకోను. ఏ ఒక్క కార్యకర్తనూ పోగొట్టుకోవాలని కూడా అనుకోను. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 మాటలను నమ్మవద్దు. మీతో పని చేయించి.. మిమ్మల్ని మళ్లీ గెలిపించాలనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ అడుగులన్నీ అందుకోసమే. మీరంతా మళ్లీ గెలిచి రావాలనే ఇవన్నీ చేస్తున్నాం. మనం సరైన పద్ధతుల్లో పనిచేయకపోతే, ప్రజల్లో మీ గ్రాఫ్ సరిగా లేకపోతే పార్టీకి, కేడర్కు నష్టం. మనం అధికారంలో లేకపోతే కోట్ల మంది ప్రజలు నష్టపోతారు. అందుకే మన గ్రాఫ్ పెంచుకోవాలి. గ్రాఫ్ పెరగాలంటే ఎన్నికలు సంవత్సరంలో ఉన్నాయని గుర్తు పెట్టుకోవాలి. అందుకే గడప గడపకూ కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకోండి. అది సక్రమంగా నిర్వహిస్తే కచ్చితంగా గ్రాఫ్ పెరుగుతుంది. – సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: ‘మనం మారీచులతో యుద్ధం చేస్తున్నాం. చంద్రబాబు అనే వ్యక్తి ఒక ముసుగులో గజదొంగల ముఠా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, పవన్కళ్యాణ్ కలసి చేస్తున్న దోచుకో.. పంచుకో.. తినుకో.. కార్యక్రమానికి మనం అధికారంలోకి వచ్చాక తెరపడింది. మళ్లీ చంద్రబాబును అధికార పీఠంపై కూర్చోబెట్టి దోపిడీని కొనసాగించేందుకు ప్రభుత్వంపై ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా భ్రమ కల్పించేలా గజదొంగల ముఠా దుష్ఫ్రచారం చేస్తోంది. రానున్న రోజుల్లో ఇది మరింత ఎక్కువ చేస్తారు. దాన్ని ఎక్కడికక్కడ సమర్థంగా తిప్పి కొట్టాలి’ అని మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్లు, ప్రాంతీయ సమన్వయకర్తలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. గడప గడపకూ కార్యక్రమం సగం సచివాలయాల పరిధిలో ఇప్పటికే పూర్తైందని, మిగతా సగం సచివాలయాల పరిధిలో ఆగస్టులోగా పూర్తి చేయాలని నిర్దేశించారు. నెలకు 25 రోజుల చొప్పున సచివాలయాల్లో పర్యటించాలన్నారు. ఇది పూర్తయితే సెప్టెంబరు నుంచి ఇతర కార్యక్రమాలకు శ్రీకారం చుడదామని తెలిపారు. సంక్షేమ క్యాలెండర్ ప్రకారం వివిధ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో బటన్ నొక్కి డబ్బులు జమ చేసే బాధ్యతను తాను నిర్వర్తిస్తానని, గడప గడపకూ వెళ్లి చేసిన మంచిని వివరిస్తూ ప్రజలతో మమేకమై ఆశీర్వాదాలు పొందే బాధ్యతను నేతలు సక్రమంగా నెరవేర్చాలని సూచించారు. నేను, మీరూ ఏకమై సమన్వయంతో, సమర్థంగా బాధ్యతలు నిర్వర్తిస్తే 175కు 175 శాసనసభ స్థానాల్లోనూ విజయం సాధించడం ఖాయమని నేతల్లో ఉత్సాహాన్ని ఉరకలెత్తించారు. సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే... రెట్టించిన వేగంతో గడప గడపకూ.. ఫిబ్రవరి 13న గడప గడపకూ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ మార్చి 16 వరకూ కొనసాగింది. ఆ తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఆసరా కార్యక్రమాలు మొదలయ్యాయి. దీనివల్ల గడప గడపకూ కార్యక్రమానికి కాస్త గ్యాప్ వచ్చింది. మళ్లీ ఆ కార్యక్రమాన్ని ఉద్ధృతంగా చేపట్టాలి. గేర్ మార్చి రెట్టించిన వేగంతో చేయాలి. అందుకే ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నేరుగా రూ.2 లక్షల కోట్లు జమ.. దేవుడి దయ వల్ల రాష్ట్ర చరిత్రే కాదు.. దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా నాలుగేళ్లు గడవక ముందే రూ.2 లక్షల కోట్ల పైచిలుకు సొమ్మును ఎలాంటి వివక్షకు తావులేకుండా, లంచాలకు అవకాశం లేకుండా అక్కచెల్లెమ్మల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశాం. పట్టణ ప్రాంతాల్లో 84 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 92 శాతం కుటుంబాలకు సగటున 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా మంచి చేయగలిగాం. ఆ ఇళ్లల్లో అక్కచెల్లెమ్మలకు మేలు జరిగింది. ఇలా అండగా నిలబడ్డ పరిస్థితి గతంలో ఎప్పుడూ జరగలేదు. అర్హులను పారదర్శకంగా గుర్తించి ప్రయోజనం చేకూర్చాం. పేదలు మిస్కాకుండా వెరిఫికేషన్ చేసి మరీ సంతృప్త స్థాయిలో పథకాలు అందిస్తున్నాం. పరిమితి పెంపుతో మరింత ప్రయోజనం మనం అధికారంలోకి రాక ముందు గ్రామీణ ప్రాంతాల్లో రూ.5 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.6 వేలు మాత్రమే నెలకు ఆదాయ పరిమితిగా ఉన్న బీపీఎల్ నిర్వచనాన్ని మారుస్తూ గ్రామీణ ప్రాంతాల్లో పరిమితిని రూ.10 వేలకు, అర్బన్ ప్రాంతాల్లో రూ.12 వేలకు పెంచి పథకాలు అందిస్తున్నాం. తద్వారా 87 శాతం ఇళ్లకు డీబీటీ ద్వారా బటన్ నొక్కి నేరుగా మేలు చేస్తున్నాం. ఇది ఏ రకంగా రిప్రజెంటేటివ్ శాంపిల్? ఈమధ్య కాలంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, చంద్రబాబును చూసి కొన్ని మాటలు మాట్లాడుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్పగా గెలిచామని మాటలు చెబుతున్నారు. వాస్తవాలు అందరికీ తెలియాలి. 21 స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే 17 స్థానాల్లో మనం గెలిచాం. ఒక ఎమ్మెల్సీ స్థానం అంటే 34 – 39 నియోజకవర్గాల పరిధి ఉంటుంది. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో కనీసం 2.5 లక్షల మంది ఓటర్లు ఉంటారు. అంటే 80 లక్షలకుపైగా ఓట్ల పరిధిలో ఎమ్మెల్సీ స్థానం ఉంటుంది. ఆ పరిధిలో 87 శాతం అక్క చెల్లెమ్మల కుటుంబాలకు నేరుగా బటన్ నొక్కి సంక్షేమ పథకాలతో మంచి చేస్తున్నాం. 80 లక్షల కుటుంబాల్లో కేవలం రెండున్నర లక్షల మంది మాత్రమే ఓటర్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదు చేసుకున్నారు. మనం మంచి చేసిన 87 శాతం మందిలో ఎమ్మెల్సీ ఓటర్లు చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. దాదాపు రెండున్నర లక్షల మంది ఎమ్మెల్సీ ఓటర్లలో 80 శాతం మంది డీబీటీలో లేనివారే ఉన్నారు. కేవలం 20 శాతం మంది మాత్రమే డీబీటీలో ఉన్నవారు కనిపిస్తున్నారు. మరి అలాంటప్పుడు ఇది ఏ రకంగా రిప్రజెంటేటివ్ శాంపిల్ అవుతుంది? అంతా ఏకమైనా మొదటి ప్రాధాన్యతతో నెగ్గలేకపోయారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరొక అంశం.. ఒకటో ప్రాధాన్యం, రెండో ప్రాధాన్యం, మూడో ప్రాధాన్యతలకు సంబంధించినది. మిగిలిన పార్టీలంతా కలిశాయి. మనం ఒంటరిగా పోటీ చేశాం. అయినప్పటికీ కూడా టీడీపీ మొదటి ప్రాధాన్యతతో గెలవలేకపోయింది. రెండో ప్రాధాన్యత ఓటు బదిలీ కావడం, ఇంతమంది ఏకం కావడం వల్ల జరిగిన అంశం ఏ రకంగానూ ప్రభావం చూపలేదు. ఒక వాపును చూపించి.. అది బలం అన్నట్లుగా చంద్రబాబు ప్రొజెక్ట్ చేసుకోవడం, దానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంత పాడటాన్ని చూస్తున్నాం. లిస్టు కూడా తయారు చేస్తున్నారంటూ... రాబోయే రోజుల్లో ఇంకా రూమర్లు ప్రచారం చేస్తారు. టికెట్లు ఇవ్వని 50 – 60 మంది ఎమ్మెల్యేల లిస్టు కూడా తయారు చేస్తున్నారని చెబుతారు. ఆ జాబితాలో ఇంతమంది వెళ్లిపోతున్నారంటూ ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఈనాడు అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. ఇంతకంటే దారుణమైన ఎమ్మెల్యే ఉండరని మన పార్టీకి చెందిన ప్రతి ఎమ్మెల్యేపైనా ప్రచారం చేస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేను టార్గెట్ చేసి మరీ విష ప్రచారం చేస్తున్నారు. వాటిని మనం తిప్పికొట్టే కార్యక్రమం చేయాలి. ప్రతి ఊరులో, ప్రతి నియోజకవర్గంలోనూ దీన్ని గట్టిగా చెప్పాలి. లబ్ధిదారులే మన ప్రచారకర్తలు.. సంవత్సరంలో ఎన్నికలు జరగనున్నాయి. మన క్యాడర్ అత్యంత క్రియాశీలకంగా ఉండాలి. సోషల్ మీడియాను బాగా వినియోగించుకోవాలి. క్యాంపెయిన్ను ఉద్ధృతం చేసుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో గృహ సారథులు, సచివాలయ కన్వీనర్ల నియామక వ్యవస్థను పూర్తి చేసుకోవాలి. ప్రతి లబ్ధిదారుడిని మన ప్రచారకర్తగా తయారు చేసుకోవాలి. ప్రతి లబ్ధిదారుడు వారికి జరిగిన మంచిని నలుగురితో పంచుకునేలా ప్రోత్సహించాలి. సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులను మమేకం చేయాలి. వారంతా కలసి ప్రతి ఇంటికీ మన ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రతి కుటుంబానికీ తీసుకెళ్లాలి. ఇది మీరు కచ్చితంగా చేయాలి. నెలకు 25 రోజులు గడప గడపకూ.. దాదాపు 15 వేల సచివాలయాలు ఉండగా సగం సచివాలయాల పరిధిలో గడప గడపకూ కార్యక్రమం పూర్తయింది. మిగిలిన సగం కూడా వచ్చే 5 నెలల్లో అంటే ఆగస్టు నాటికి పూర్తి చేయాలి. నెలకు 9 సచివాలయాలను పూర్తి చేయాలి. నెలకు 25 రోజుల చొప్పున సచివాలయాల్లో తిరగాలి. ఇది పూర్తయితే సెప్టెంబరు నుంచి ఇతర కార్యక్రమాలకు శ్రీకారం చుడదాం. 7న ‘జగనన్నే మన భవిష్యత్తు’ ప్రారంభం.. ‘జగనన్నే మన భవిష్యత్తు’ కార్యక్రమాన్ని ఏప్రిల్ 7వతేదీన ప్రారంభిస్తున్నాం. ఇది ఏప్రిల్ 20 వరకు జరుగుతుంది. సచివాలయాల కన్వీనర్, గృహ సారథులను ఏకం చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. గ్రామ స్థాయిలో మన వ్యవస్ధను ఏకం చేసి ప్రతి ఇంటికి పంపుతున్నాం. ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లేలా ఇది పక్కాగా జరగాలి. 13న ‘జగనన్నకు చెబుదాం’... వ్యక్తిగత సమస్యలను పరిష్కరించే కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డు స్ప్లిట్ కాకపోవడం లాంటి సమస్యలు గ్రామాల్లో ఒకటి అరా ఉంటే వాటిని కూడా మిస్ కాకూడదని ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ నెల 13న దీన్ని చేపడుతున్నాం. ఎవరికి సమస్య ఉన్నా నేరుగా నాకే ఫోన్ చేయవచ్చు. వాటిని పరిష్కరిస్తాం. -
గడప గడపకు మన ప్రభుత్వంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష (ఫోటోలు)
-
ఆ రూమర్లను కొట్టిపారేసిన ఏపీ సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలపై గత కొన్నిరోజులుగా చక్కర్లు కొడుతున్న ప్రచారాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫుల్స్టాప్ పెట్టారు. ముందస్తు ఎన్నికలు, మంత్రివర్గ మార్పూ అంటూ సోషల్ మీడియాతో పాటు యెల్లో బ్యాచ్ అనుకూల మీడియాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారాయన. సోమవారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్ ఇన్ఛార్జిలు పాల్గొన్న సమావేశంలో సీఎం జగన్.. తాజా రాజకీయ ప్రచారాలపై మాట్లాడారు. షెడ్యూలు ప్రకారమే ఎన్నికలకు వెళ్తున్నట్లు పార్టీ శ్రేణులకు స్పష్టం చేసిన సీఎం జగన్.. మంత్రుల మార్పుల సహా, ఇతరత్రా రూమర్లపైనా ఎమ్మెల్మేలతో చర్చించారు. రాబోయే కాలంలో ఇలాంటి రూమర్లు మరిన్ని వస్తాయన్న ఆయన.. వాటిని అంతే బలంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: గేరు మార్చండి.. జెట్ స్పీడ్తో పని చేయండి: సీఎం జగన్ -
CM Jagan: రెట్టించిన స్పీడ్తో పనిచేయాలి
సాక్షి, తాడేపల్లి: గడప గడపకు మన ప్రభుత్వం సమీక్షలో భాగంగా.. నేడు(సోమవారం) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ సమన్వయ కర్తలు, రీజినల్ ఇన్ఛార్జిలు హాజరయ్యారు. గడపగడపకూ మన ప్రభుత్వంతో పాటు గృహసారథుల అంశాలపై ఈ సమావేశంలో సీఎం జగన్, పార్టీ శ్రేణులతో చర్చించారు. ఈ సమావేశంలో సీఎం జగన్ ఏమన్నారంటే.. ఫిబ్రవరి 13న గడపగడపకూ కార్యక్రమం మీద రివ్యూ చేశాం దాని తర్వాత కార్యక్రమానికి కాస్త గ్యాప్ వచ్చింది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా గ్యాప్ వచ్చింది మార్చి 16వరకూ కోడ్ కొనసాగింది తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగాయి తర్వాత ఆసరా కార్యక్రమాలు మొదలయ్యాయి దీనివల్ల గడపగడపకూ కాస్త గ్యాప్ వచ్చిందిమళ్లీ గడపగడపకూ కార్యక్రమానికి ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లాలి గేర్ మార్చి రెట్టించిన స్పీడ్తో కార్యక్రమం చేయాలి రాష్ట్ర చరిత్రే కాదు… దేశ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా నాలుగు సంవత్సరాలు గడవక ముందే.. రూ.2లక్షల కోట్ల పైచిలుకు ఎలాంటి వివక్ష, లంచాలకు తావులేకుండా మన అక్క చెల్లెమ్మల కుటుంబాల అక్కౌంట్లో పడింది అర్బన్ ప్రాంతంలో 84శాతం, రూరల్ ప్రాంతంలో 92 శాతం కుటుంబాలు, యావరేజీన 87శాతం కుటుంబాలకు మంచి చేయగలిగాం ఇలా అండగా నిలబడ్డ పరిస్థితి ఎప్పుడూ జరగలేదు 87శాతం కుటుంబాలను గమనించినట్టైతే… అర్హులుగా ఉన్నవారిని చాలా పారదర్శకంగా గుర్తించి అమలు చేశాం పేదవాడు మిస్కాకుండా వెరిఫికేషన్ చేసిన మరీ… వారికి పథకాలు అందిస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేల లోపు ఉన్న కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేల లోపు ఉన్న కుటుంబాల్లో వారిని అర్హులుగా గుర్తించి పథకాలు ఇచ్చాం: బీపీఎల్ నిర్వచనాన్ని మారుస్తూ… గ్రామీణ ప్రాంతాల్లో పరిమితిని రూ.10వేలకు, అర్బన్ ప్రాంతాల్లో రూ.12వేలకు పెంచి పథకాలు. ఇచ్చాం ఇలా చేస్తే 87శాతం ఇళ్లకు నేరుగా డీబీటీ ద్వారా బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమచేస్తున్నాం ఈ మధ్యకాలంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-౫, చంద్రబాబును చూసినా కొన్ని మాటలు మాట్లాడుతున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గొప్పగా గెలిచామని ఏదో మాటలు చెప్తున్నారు 21 స్థానాల్లో ఎన్నికలు గెలిస్తే.. 17 స్థానాల్లో మనం గెలిచాం మనం మారీచులతో యుద్ధంచేస్తున్నాం ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమ కల్పించే ప్రచారం చేస్తున్నారు కొన్ని వాస్తవాలు అందరికీ తెలియాలి: ఒక్క ఎమ్మెల్సీ స్థానం అంటే 34 నుంచి 39 నియోజకవర్గాల పరిధి ఒక్కో అసెంబ్లీ సెగ్మెంటులో కనీసం 2.5 లక్షల మంది ఉంటారు అంటే ఎమ్మెల్సీ స్థానం పరిధి.. దాదాపు 80 లక్షల ఓట్ల పరిధి ఉంటుంది ఆ పరిధిలో 87శాతం అంటే.. అక్క చెల్లెమ్మల కుటుంబాలు, మన కుటుంబాలు ఉన్నాయి అలాంటి 80 లక్షల కుటుంబాల్లో, కేవలం రెండున్నర లక్షలు మాత్రమే ఓటర్లుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నమోదుచేసుకున్నారు వీళ్లంతా రకరకాల యూనియన్లకు చెందినవారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లైన ఈ రెండున్నర లక్షల మంది ఓటర్లలో దాదాపు చాలా శాతం మంది డీబీటీలో లేనివారు కేవలం 20శాతం మంది మాత్రమే డీబీటీలో ఉన్నవారు ఇది ఏరకంగా రిప్రజెంటేటివ్ శాంపిల్ అవుతుంది రాష్ట్రంలో ఎలక్టోరల్ రిప్రజెంటేటివ్ శాంపిల్ ఏదైతే.. ఉందో.. అది ఇది కాదు ఒకటో ప్రాధాన్యం.. రెండో ప్రాధాన్యం… మూడో ప్రాధాన్యాలు ఉన్నాయి మిగిలిన పార్టీ అందరూ కలిశారు.. మనం ఒక్కరిమే అయినప్పటికీ కూడా… తెలుగుదేశం పార్టీ మొదటి ప్రాధాన్యతతో గెలిచింది లేదు ఇంతమంది ఏకం కావడంవల్ల, రెండో ప్రాధాన్యత ఓటు వారికి ఉందికాబట్టి.. జరిగింది అయినా కూడా ఒక వాపును చూపించి.. అది బలం అని చూపిస్తున్నారు దానికితోడు ఈనాడు రాయడం, ఆంధ్రజ్యోతి రాయడం, టీవీ-౫ చూపడం రాబోయే రోజుల్లో ఇంకా రూమర్లు ప్రచారం చేస్తారు 60 మందికి టిక్కెట్లు ఇవ్వని లిస్టు కూడా తయారుచేస్తున్నారని చెప్తారు ఇదే పనిగా పెట్టుకుని ప్రచారం చేస్తున్నారు ఇంతకంటే.. దుర్మార్గమైన ఎమ్మెల్యేలు ఉండరని కూడా ప్రచారం చేస్తున్నారు ఒక్కో ఎమ్మెల్యేను టార్గెట్ చేసి మరీ విష ప్రచారంచేస్తున్నారు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఉంటాయి అందుకే అంటున్నా.. మనం మారీచులతో యుద్ధంచేస్తున్నాం వారంతా గజ దొంగల ముఠా దోచుకో.. పంచుకో.. తినుకో.. కార్యక్రమానికి మనం వచ్చాక గండిపడింది అందుకే గజదొంగల ముఠా ఇవన్నీ చేస్తున్నాయి రూమర్లు వస్తున్నాయనే మాట మనకు తెలిసి ఉండాలి వాటిని తిప్పికొట్టాలి సంవత్సరంలో మనం ఎన్నికలకు వెళ్తున్నాం కేడర్ అత్యంత క్రియాశీలకంగా ఉండాలి సోషల్ మీడియాను బాగా వినియోగించుకోవాలి సోషల్ మీడియాలో క్యాంపెయిన్ను ఉద్ధృతం చేసుకోవాలి గృహసారథులను, సచివాలయ కన్వీనర్లు.. వ్యవస్థను పూర్తిచేసుకోవాలి ప్రతి లబ్ధిదారును మన ప్రచారకర్తగా తయారుచేసుకోవాలి వాలంటీర్లను, గృహసారథులను మమేకం చేయాలి వీళ్లంతా ఒక్కటై.. ప్రతి ఇంటికీ మన ప్రభుత్వంచేస్తున్నమంచిని ప్రతికుటుంబానికీ తీసుకెళ్లాలి దాదాపుగా ఇప్పటికి సగం సచివాలయాల్లో గడపగడపకూ పూర్తిచేశాం ఈ సగం వచ్చే 5 నెలల్లో, అంటే ఆగస్టు నాటికి పూర్తిచేయాలి నెలకు 9 సచివాలయాలను పూర్తిచేయాలి నెలకు 25 రోజుల చొప్పున సచివాలయాల్లో తిరగాలి సెప్టెంబరు నుంచి వేరే కార్యక్రమాలకు శ్రీకారంచుడదాం ఒకవైపున గడపగడపకూ జరుగుతుంది… రెండోవైపున సచివాలయ కన్వీనర్లు, గృహసారధులతో మమేకం చేసే కార్యక్రమాలు ఉంటాయి వీటికి పార్టీ పరంగా కార్యాచరణ చేస్తున్నాం రాజకీయాల్లో నేను నాన్న దగ్గరనుంచి నేర్చుకున్న అంశం ఏంటంటే.. రాజకీయం అంటే.. మానవ సంబంధాలు ఏ ఒక్క ఎమ్మెల్యేను పోగొట్టుకోవాలని నేను అనుకోను ఒక్క కార్యకర్తనూ కూడా పోగొట్టుకోవాలని అనుకోను మీతో పనిచేయించి.. మిమ్మల్ని మళ్లీ గెలిపించాలనే.. ఈ కార్యక్రమాలు ఈ అడుగులన్నీ కూడా దానికోసమే కొన్ని కోట్లమంది మన మీద ఆధారపడి ఉన్నాకు ప్రతి నియోజకవర్గంలో లక్షలమంది మనపై ఆధారపడి ఉన్నారు ప్రజల్లో మీ గ్రాఫ్ సరిగ్గాలేకపోతే పార్టీకి, కేడర్కు నష్టం మన అధికారంలో లేకపోతే కోట్ల మంది ప్రజలు నష్టపోతారు అందుకే మన గ్రాఫ్ పెంచుకోవాలి ఎన్నికలు సంవత్సరంలో ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి అందుకే గడపగడపకూ కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకోండి ఈ కార్యక్రమం జరిగితే.. కచ్చితంగా గ్రాఫ్ పెరుగుతుంది నేను చేయాల్సింది.. నేను చేయాలి మీరు చేయాల్సిది మీరు చేయాలి ఈరెండూ సంయుక్తంగా, సమర్థవంతంగా జరిగితే… అప్పుడు కచ్చితంగా 175కి 175 గెలుస్తాం ఇదీ చదవండి: బోధనాస్పత్రుల బలోపేతం -
అంకుపల్లి.. మంత్రి కాకాణి వైపే.. మంత్రికి అపూర్వ స్వాగతం
సాక్షి, నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం ఆర్.వైపాళెం సచివాలయ పరిధిలోని అంకుపల్లి గ్రామంలో ఆదివారం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లిన మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుతో పాటు స్థానిక సమస్యలను తెలుసుకొని వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి కాకాణి అభివృద్ధి కార్యక్రమాలకు మద్దతుగా నిలుస్తామని అంకుపల్లి గ్రామస్తులు అన్నారు. -
ప్రతి ఎమ్మెల్యే మళ్లీ గెలవాలి: సీఎం జగన్
-
సీఎం జగన్ అధ్యక్షతన విస్తృత స్థాయి సమావేశం (ఫొటోలు)
-
వాళ్లను తిప్పికొడదాం.. ‘జగనన్నే మా భవిష్యత్తు’ నినాదంతో ముందుకు పోదాం
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్రెడ్డి నేతృత్వంలో.. ఆయన క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో ఈ సమీక్ష సమావేశం జరిగింది. రాబోయే రోజుల్లో పార్టీ పరంగా ప్రారంభించనున్న కార్యక్రమాలపై దిశానిర్దేశం చేసిన సీఎం జగన్.. ‘జగనన్నే మా భవిష్యత్తు’ నినాదంతో ప్రతీ గడపకూ వెళ్లి గృహ సారథులు పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపు ఇచ్చారు. గడపగడపకూ కార్యక్రమం అత్యంత కీలకం. నిర్దేశించుకున్న విధంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. ప్రతి ఇంటికి వెళ్లి గత ప్రభుత్వం, మన ప్రభుత్వం మధ్య వ్యత్యాసం వివరించాలని సీఎం జగన్ ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. అలాగే.. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో గడప గడప మన ప్రభుత్వం కొనసాగించాలని, ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా మిగతా జిల్లాల్లో నిర్వహించాలని సూచించారు. 93 శాతం గృహసారథుల నియామకం పూర్తి దాదాపు 5 లక్షల మంది గృహసారథులను నియమించుకున్నామని ఈ సందర్భంగా పార్టీ కేడర్ను ఉద్దేశించి సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 16 లోగా అక్కడక్కడా మిగిలిపోయిన నియామకాలను పూర్తిచేయాలి. పార్టీకార్యక్రమాలు నిరంతరరాయంగా జరగాలంటే గృహసారథులనేవాళ్లు చాలా ముఖ్యమైనవాళ్లు. గృహసారథులు, సచివాలయ కన్వీనర్ల మొదటి బ్యాచ్కు శిక్షణ కార్యక్రమాలు 387 మండలాల్లో ముగిశాయి. రెండో బ్యాచ్కు శిక్షణ కార్యక్రమాలు మిగిలిన మండలాల్లో రేపటి(మంగళవారం) నుంచి ప్రారంభమై, ఫిబ్రవరి19 వరకూ నడుస్తాయి. మండలాల వారీగా జరిగే ఈ శిక్షణ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాలి. ఈ శిక్షణ కార్యక్రమాలు ముగిసిన తర్వాత క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలి. డోర్ టు డోర్ క్యాంపెయిన్ సచివాలయ కన్వీనర్లు, గృహసారథుల రూపేణా వైయస్సార్ కాంగ్రెస్పార్టీకి సుమారు 5.65 లక్షలమందితో క్షేత్రస్థాయిలో పార్టీ సైన్యం ఉంది. వీరంతా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో పాల్గొంటారు. దాదాపు 1.65 కోట్ల గృహాలను సందర్శిస్తారు. మార్చి 18 నుంచి 26 వరకూ కూడా జగనన్నే మా భవిష్యత్తు క్యాంపెయిన్ను పార్టీకి చెందిన సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు డోర్ టు డోర్ నిర్వహిస్తారు. గత ప్రభుత్వం కన్నా.. ఈ ప్రభుత్వం అందించిన మెరుగైన పాలన, అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తారు. గృహసారథులను కో–ఆర్డినేట్ చేసే బాధ్యతను సచివాలయ కన్వీనర్లకు అప్పగించాలన్నారు. వాళ్లను తిప్పికొడదాం సుమారు 14 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. టీడీపీకి బాకా ఊదుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 లాంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తున్నాం. ఉన్నది లేనట్టుగా, లేనివి ఉన్నట్టుగా అవి చూపిస్తున్నాయి. ప్రజలకు నిరంతరం ఏదో ఒక భ్రమ కల్పించే పనులు చేస్తున్నాయి. వాటిని తిప్పికొడుతూ మనం ముందుకు సాగాలి. గ్రాడ్యుయేట్లు, టీచర్లకు సంబంధించిన ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల పరిశీలకులు వీరంతా కలిసికట్టుగా పనిచేయాలని సీఎం జగన్ సూచించారు. పుంజుకోవాల్సిందే గడప గడపకూ మన ప్రభుత్వంపైన కూడా ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకూ దాదాపు 7,447 సచివాలయాల్లో గడపగడపకూ కార్యక్రమం నిర్వహణ జరిగింది. సగటున నెలలో సుమారు 6 సచివాలయాలను సందర్శించారు ఎమ్మెల్యేలు. అలాగే.. ప్రతి ఇంట్లో ఉన్నవారిని కూడా పలకరించి వారితో కొంత సమయం గడపాలని సీఎం జగన్.. ఎమ్మెల్యేలకు సూచించారు. గడప గడప కి మనప్రభుత్వ కార్యక్రమం నిర్వహణ అత్యంత కీలకమని మరోసారి స్పష్టంచేసిన సీఎం జగన్.. నిర్వహణలో వెనకబడ్డ ఎమ్మెల్యేలు పుంజుకోవాలని చెప్పారు. వచ్చే సమీక్ష సమావేశం నాటికి ఆ ఎమ్మెల్యేలు మెరుగుపడాలని తెలిపారు. మళ్ళీ ప్రతి ఎమ్మెల్యే గెలవాలి. నిరంతరం ప్రజలోనే ఉండాలని ఆయన ఎమ్మెల్యేలకు సూచించారు. -
‘గడపగడపకూ’ అభివృద్ధి
భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): స్థానిక సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా చేపట్టిన ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా గుర్తించిన సమస్యలను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసేందుకు ప్రభుత్వం సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది. ప్రధానంగా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తోంది. దీనిలో భాగంగా జిల్లాలో చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం (జీజీఎంపీ) పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు గడపగడపకు కార్యక్రమంలో భాగంగా వారి దృష్టికి వచ్చిన మౌలిక వసతుల సమస్యలను గుర్తించి ఆయా పనులకు తీర్మానం చేయించి జీజీఎంపీ పనుల్లో నిధులు మంజూరు చేయించి త్వరితగతిన పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏఏ పనులంటే.. సచివాలయ పరిధిలో ప్రభుత్వం మంజూరు చేసిన రూ.20 లక్షలతో రోడ్లు, డ్రెయిన్లు, తాగునీరు, పారిశుద్ధ్య, లైటింగ్ తదితర పనులు చేపడుతున్నారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో అత్యవసరమైన పనులకు ముందుగా ప్రాధాన్యమిస్తూ నిధులను వెచ్చిస్తున్నారు. 22.05 కిలోమీటర్ల మేర సీసీ రోడ్డు జిల్లావ్యాప్తంగా జీజీఎంపీ నిధులతో 22.05 కిలోమీటర్లు మేర సీసీ రోడ్లు మంజూరు చేయగా ఇప్పటివరకు 8.02 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. సీసీ రోడ్లకు సంబంధించి మొత్తం 414 పనులు చేపట్టగా 95 పనులు పూర్తయ్యాయి. జిల్లావ్యాప్తంగా 1,035 పనులు జిల్లాలో ఇప్పటివరకూ 1,035 పనులు మంజూరు చేయగా 837 పనులు జరుగుతున్నాయి. సుమారు 100 పనులు పూర్తయ్యాయి. మరో 158 పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. జిల్లాలోని 19 మండలాలు, 6 మున్సిపాలిటీల్లో పనులు 80 నుంచి 90 శాతం మేర పురోగతిలో ఉన్నాయి. జీజీఎంపీ నిధులు మైనర్ పంచాయతీలకు వరంలా మారాయి. ఆయా నిధులతో మౌలిక వసతులు కల్పించడంతో గ్రామంలో సమస్యలు పరిష్కారమవుతున్నాయి. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. శాఖల వారీగా పనులు ఇలా.. పంచాయతీరాజ్ శాఖ ద్వారా 466 పనులు మంజూరు కాగా 424 పనులు చేపట్టారు. 42 పనులు చేపట్టాల్సి ఉంది. ఆర్డబ్ల్యూఎస్ శాఖ ద్వారా 172 పనులు మంజూరు కాగా 158 పనులు చేపట్టారు. 14 పనులు చేపట్టాల్సి ఉంది. విద్యుత్ శాఖ ద్వారా 5 పనులు మంజూరు కాగా 3 పనులు చేపట్టారు. 2 పనులు చేపట్టాల్సి ఉంది. మున్సిపాలిటీల్లో 392 పనులు మంజూరు కాగా 184 పనులు జరుగుతున్నాయి. 108 పనులు చేపట్టాల్సి ఉంది. రోడ్డు, డ్రెయిన్ నిర్మాణం ప్రభుత్వం మా గ్రామ సచివాలయానికి రూ.20 లక్షలు మంజూరు చేసింది. గడపగడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ దృష్టికి సమస్యలను తీసుకువెళ్లగా ఆయన వెంటనే స్పందించి జీజీఎంపీ నిధులతో సీసీ రోడ్డు, డ్రెయిన్, కల్వర్ట్ నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. మూడు పనులు జరుగుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. సీఎం జగన్కు కృతజ్ఞతలు. – వీరవల్లి శ్రీనివాస్, సర్పంచ్, తోకలపూడి జిల్లావ్యాప్తంగా పనులు జిల్లావ్యాప్తంగా జీజీఎంపీ పనులు జరుగుతున్నాయి. సీసీ, గ్రావెల్ రోడ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు చేపట్టాం. కలెక్టర్ ఆదేశాలు, సలహాల మేరకు వేగంగా పనులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో సుమారు 100 పనులు పూర్తికాగా 837 పనులు సాగుతున్నాయి. వీటిని వేగంగా పూర్తిచేసేందుకు కృషిచేస్తున్నాం. – కేఎస్ఎస్ శ్రీనివాస్, జిల్లా పంచాయతీరాజ్ ఈఈ, భీమవరం -
అన్నా మీ మేలు మరువలేము..
ఒంగోలు: ‘‘అన్నా మీ మేలు మరువలేము, అడగకుండానే అన్నీ ఇస్తున్నారు. ఇంతకంటే మాకేం కావాలి..తప్పకుండా వచ్చే ఎన్నికల్లో మీ వెంటే ఉంటామంటూ’’ ప్రజలు స్పష్టం చేశారు. స్థానిక విజయ్నగర్ కాలనీలో శుక్రవారం రాత్రి నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి డివిజన్ కార్పొరేటర్ తన్నీరు నాగజ్యోతి నాగేశ్వరరావు, వడ్డెపాలెం కొండలు ఘనంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి వారికి ప్రభుత్వ పరంగా అందిన కార్యక్రమాలను వివరించారు. పథకాల అమలులో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ వారిని అడిగి తెలుసుకున్నారు. కొంతమంది ఇళ్ల పట్టాల గురించి అడగ్గా మార్చినెలలో ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తిచేస్తామని వివరించారు. జగనన్న విద్యాదీవెన, అమ్మ ఒడి పథకం అందుతున్న చిన్నారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు బాలినేని సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. వారికి బాలినేని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో తమ్మిశెట్టి అంజయ్య, తమ్మిశెట్టి వాసు, బండారు ఏడుకొండలు, తమ్మిశెట్టి శ్రీను, బండారు దుర్గయ్య, బండారు వెంకటేశ్వర్లు, బండారు డేవిడ్, బండారు శ్రీను, బండారు అంకమ్మ, గుంజి శివదుర్గ, మక్కిల దుర్గ , శ్రీను, వల్లపు ఆనంద్, గుంజి భరత్, బండారు శివ, బండారు గణేష్, బండారు అంజయ్య, బండారు రమేష్, బండారు ఆంజనేయులు తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో బాలినేనితోపాటు ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు, నగర మేయర్ గంగాడ సుజాత, 31వ డివిజన్ కార్పొరేటర్ తన్నీరు నాగజ్యోతి నాగేశ్వరరావు, డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవరావు, వైఎస్సార్సీపీ ప్రచార విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామరాజు క్రాంతికుమార్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కటారి శంకర్, రాష్ట్ర కార్యదర్శి గోలి తిరుపతిరావు, మోడుబోయిన సురేష్యాదవ్, సంయుక్త కార్యదర్శి పటాపంజుల శ్రీనివాసులు, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గంటా రామానాయుడు, ట్రేడ్ యూనియన్ జిల్లా, నగర అధ్యక్షుడు కేవీ ప్రసాద్, గోవర్థన్రెడ్డి, మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు మీరావలి, వైఎస్సార్సీపీ నాయకులు పులుగు అక్కిరెడ్డి, పటాపంజుల అశోక్, బడుగు ఇందిర, పోకల అనూరాధ, తమ్మినేని మాధవి, దాసరి కరుణాకర్, వల్లెపు మురళి, జాజుల కృష్ణ, నగర పాలక సంస్థ కమిషనర్ యం.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
జగన్ పాలనలోనే ఎస్సీ, ఎస్టీలకు న్యాయం
తాడేపల్లిగూడెం రూరల్(పశ్చిమగోదావరి జిల్లా): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. గురువారం సాయంత్రం తాడేపల్లిగూడెం మండలం కృష్ణాపురం గ్రామంలో వందవ రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, ప్రజాప్రతినిధులకు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఎస్సీల అభివృద్ధికి రూ.33,635 కోట్లు ఖర్చు చేస్తే, వైఎస్ జగన్ మూడున్నరేళ్ల పాలనలో రూ.48,909 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఎస్టీల అభివృద్ధికి చంద్రబాబు రూ.12,487 కోట్లు వెచ్చిస్తే, వైఎస్ జగన్ పాలనలో రూ.15,589 కోట్లు ఖర్చు చేశారన్నారు. దీన్ని బట్టి చూస్తే సీఎం జగన్ పాలనలోనే వారి అభివృద్ధికి అధిక నిధులు వెచ్చించినట్లు తేటతెల్లమవుతుందన్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఎస్సీ, ఎస్టీలతో పవన్ ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రకటించకపోవడం శోచనీయమన్నారు. ఆయా సామాజికవర్గాలకు చంద్రబాబు హయాంలో అన్యాయం జరుగుతుంటే ఏనాడు పవన్ ప్రశ్నించలేదని దుయ్యబట్టారు. అయితే, జగన్ ప్రభుత్వంపై ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. సంక్షేమ పథకాల పేరిట రాష్ట్రాన్ని జగన్ అప్పులపాలు చేస్తున్నారని విషప్రచారం చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో పెద్దవాటాదారుడు ఎవరంటే రామోజీరావు అని వ్యాఖ్యానించారు. రూ.11వేల కోట్ల విలువైన పోలవరం ప్రాజెక్టును నామినేషన్ పద్ధతిలో రామోజీరావు అల్లుడికి కేటాయించిన ఘనుడు చంద్రబాబు అని విమర్శించారు. అటువంటి వ్యక్తులు నేడు పచ్చమీడియా వేదికగా ప్రభుత్వంపై అసత్యప్రచారాలు చేస్తున్నారన్నారు. దేశంలో అతి తక్కువ అప్పు కలిగిన రాష్ట్రంగా నాల్గవ స్థానంలోనూ, అప్పులు సక్రమంగా చెల్లిస్తున్న రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని, దీనిని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో ఏ రకమైన బడ్జెట్ ఉందో అదే విధమైన బడ్జెట్ నేడు జగన్ పాలనలో ఉందన్నారు. అయితే, నాడు చంద్రబాబు ఇంతటి సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. రాష్ట్రంలో నేడు సమర్థవంతమైన పాలన సాగుతుందన్నారు. గతంలో వైఎస్సార్, సీఎం వైఎస్ జగన్ ప్రజలకు న్యాయం చేసేందుకు పాదయాత్రలు చేశారని, నేడు లోకేష్ పాదయాత్ర దేనికోసమని ప్రశ్నించారు. వార్డు మెంబరుగా కూడా గెలవలేని వ్యక్తి దొడ్డిదారిన ఎమ్మెల్సీగా, మంత్రిగా లోకేష్ పనిచేశాడన్నారు. మరలా ప్రజాక్షేత్రంలో పోటీ చేస్తే తుక్కుతుక్కుగా ఓడించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్ ధ్వయంలో పవన్ను సీఎం చేస్తానంటేనే గాని ఓట్లు పడే పరిస్థితి లేదని, దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తొలుత గ్రామంలో రూ.60లక్షలు వ్యయంతో నిర్మించనున్న గ్రామ దేవత అలుసులమ్మ ఆలయానికి శంకుస్థాపన చేశారు. జెడ్పీటీసీ సభ్యుడు ముత్యాల ఆంజనేయులు, ఎంపీపీ పొనుకుమాటి శేషులత, వైస్ ఎంపీపీలు కట్టా రంగబాబు, సూర్పని రామకృష్ణ, సర్పంచ్లు రాజమహేంద్రవరపు లక్ష్మణరావు, పిచ్చుకల రాజారావు, ఎలిపే గాంధీ, ఎంపీటీసీ సభ్యులు మట్టా సత్యనారాయణ, మార్లపూడి సుబ్బారావు, జంపెల్ల సత్యవతి, నార్ని శంకరరావు, కళింగ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ సంపతరావు కృష్ణారావు, మండల సచివాలయాల కన్వీనర్ ముప్పిడి సంపత్కుమార్, జిల్లా నీటి సంఘం మాజీ డైరెక్టర్ ఈదర వెంకటేశ్వరరావు, సొసైటీ చైర్మన్లు వెలిశెట్టి నరేంద్రకుమార్, జడ్డు హరిబాబు, చిక్కాల సత్యనారాయణ, ఉప సర్పంచ్లు మేణ్ణి రామారావు, చిట్టూరి కాశీవిశ్వనాథం, తహసీల్దార్ వైకేవీ.అప్పారావు, ఎంపీడీవో ఎం.వెంకటేష్ పాల్గొన్నారు. -
గడప గడపకు మన ప్రభుత్వంపై సజ్జల సమీక్ష
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఆదివారం తాడేపల్లిలో పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. గృహసారధుల నియామకాలపై ప్రధానంగా చర్చించారాయన. వాస్తవానికి నిన్నటితో(శనివారం) గృహసారధుల నియామక సమయం ముగిసింది. అయితే.. అన్ని నియోజకవర్గాల్లో నియామకాలు పూర్తి కాలేదు. ఈ క్రమంలో.. ఈనెలాఖరు వరకు ఆ సమయం పెంచుతూ సజ్జల ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు.. ఫిబ్రవరి 1వ తేదీ నుండి గృహసారధులతో మండలాల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారాయన. -
టీడీపీ మాజీ ఎంపీ కుటుంబానికి పథకాల లబ్ధి రూ.45,702
సాక్షి, నాయుడుపేట టౌన్ (తిరుపతి జిల్లా): రాష్ట్ర ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా రూ.45,702 లబ్ధి చేకూరింది. వైఎస్సార్ ఆసరా ద్వారా 2020–21, 2021–22లకు రూ.17,261 చొప్పున, సున్నా వడ్డీ కింద 2020లో రూ.2,628, 2021లో రూ.1,575, 2022లో రూ.1,112 నగదు అమృతసరళ బ్యాంక్ ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది. పంట రుణాల సున్నా వడ్డీ నగదును రెండు విడతలుగా రూ.5,865 నెలవల బ్యాంక్ ఖాతాలో వేసింది. బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సూళ్లూరుపేట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సంక్షేమ పథకాల బుక్లెట్ను నాయుడుపేటలో నెలవలకు అందజేశారు. చదవండి: (తిరుమలలో అద్దె గదుల ధరల పెంపుపై ఈవో ధర్మారెడ్డి క్లారిటీ) -
కళ్లలో కారం చల్లి, కర్రలతో దాడి
లబ్బీపేట, కృష్ణలంక (విజయవాడ తూర్పు): విజయవాడలో టీడీపీ వర్గీయులు వైఎస్సార్సీపీ మహిళా నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. వైఎస్సార్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్ చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొనడానికి మంగళవారం తారకరామ నగర్లో పలువురు వైఎస్సార్సీపీ మహిళా నేతలు ఎదురు చూస్తున్నారు. అంతలో టీడీపీకి చెందిన షేక్ ఫాతిమా రమీజా మరికొందరు అక్కడికి వచ్చి వారితో దురుసుగా వ్యవహరించారు. మాటలతో రెచ్చగొడుతూ వారిపైకి దూసుకెళ్లారు. వెంట తెచ్చుకున్న కారం వారి కళ్లల్లో చల్లి.. కర్రలతో దాడి చేస్తూ భయానక వాతావరణం సృష్టించారు. ఈ దాడిలో వైఎస్సార్సీపీకి చెందిన బచ్చు మాధవి, సునీత మరికొందరికి గాయాలయ్యాయి. అక్కడే ఉన్న వలంటీర్ శాంతిరెడ్డిపైనా దాడికి యత్నించారు. టీడీపీ దాడిలో గాయపడిన సునీత, బచ్చు మాధవి సౌత్ ఏసీపీ రవికిరణ్, కృష్ణలంక సీఐ దుర్గారావు పోలీసు సిబ్బందితో వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తమ కళ్లల్లో కారం చల్లి, దాడి చేశారని బి.సునీత.. టీడీపీకి చెందిన షేక్ ఫాతిమా, రమీజా, శైలు, మరో 10 మందిపై ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని, వైఎస్సార్సీపీ నేతలే తమ వాళ్లపై దాడి చేశారని ఆందోళన చేపట్టారు. బచ్చు మాధవి, రామిరెడ్డి, దామోదర్, మరో 11 మంది తమపై దాడి చేశారంటూ ఫాతిమా, రమీజా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాల ఫిర్యాదులను స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో తనకు లభిస్తున్న ఆదరణ చూసి ఓటమి భయంతోనే టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని దేవినేని అవినాష్ మండిపడ్డారు. -
Andhra Pradesh: వేగంగా ‘ప్రాధాన్యత’ పనులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో మంత్రులు, ప్రజాప్రతినిధులు గుర్తించిన ప్రాధాన్యత పనులు వేగంగా జరుగుతున్నాయి. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రతి సచివాలయం పరిధిలో అత్యంత ప్రాధాన్యత గల పనులను గుర్తించి, ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. ఇలా అత్యంత ప్రాధాన్యతగా గుర్తించిన రూ.1,002.34 కోట్ల విలువైన 25,934 పనులను పోర్టల్లో అప్లోడ్ చేశారు. వీటిలో ఇప్పటివరకు రూ.922.88 కోట్ల విలువైన 23,845 పనులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో రూ.758 కోట్లకు పైగా విలువైన 20,408 పనులు ప్రారంభం కాగా, రూ.32.15 కోట్ల విలువైన 813 పనులను పూర్తి చేశారు. రాష్ట్రంలో మొత్తం 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ నెల 2వ తేదీ వరకు 5,173 సచివాలయాలను మంత్రులు, ప్రజాప్రతినిధులు సందర్శించారు. వాటి పరిధిలో ప్రజలకు అవసరమైన అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యత పనులను గుర్తించి, వాటి వివరాలను గడప గడపకు మన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత పనుల పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇలా అప్లోడ్ చేసిన పనులను వెంటనే మంజూరు చేయడం, వాటిని ప్రారంభించడం నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. ఈ పనులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఒక్కో సచివాలయం పరిధిలోని పనులకు రూ.20 లక్షల చొప్పున రూ.3,000 కోట్లు మంజూరు చేయడమే కాకుండా, పూర్తయిన పనుల బిల్లుల చెల్లింపునకు తొలి విడతగా రూ.500 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను డీడీవోలకు పంపింది. ఈ పనుల పురోగతిని కూడా ఎప్పటికప్పుడు గడప గడపకు మన ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత పనుల పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఎంపీడీవోలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. పూర్తయిన పనుల బిల్లులను సీఎఫ్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేసి నిబంధనల ప్రకారం చెల్లించాలని డీడీవోలను ఆదేశించింది. పనుల పురోగతి, బిల్లుల చెల్లింపులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. -
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి
-
తలరాత మార్చే చైతన్యదీప్తి.. గడప గడపలో నూతన శోభ!
అద్దె చెల్లించాల్సిన బాధ తప్పి సొంత ఇంట్లో ఉన్నామనే సంతోషం ఉందని నియోజకవర్గంలో గడప గడపకు తిరుగుతున్నప్పుడు చాలామంది మహిళలు చెబుతున్నారు. ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఉన్నారు. నూతన సంవత్సర శోభ పల్లె గడప తొక్కిందని చెప్పడానికి ఇది కేవలం ఒక ఉదాహరణ. ఇలాంటి ఉదాహరణలు రాష్ట్రంలో కోకొల్లలుగా మనకు కనిపిస్తున్నాయి. జీవన ప్రమాణాలు మెరుగు పడటమే నిజమైన అభివృద్ధి అని గట్టిగా నమ్మిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం... పాలనను ప్రజల గడప వద్దకు తీసుకెళ్లింది. సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. కరోనా విపత్తు సృష్టించిన ఆర్థిక అల్లకల్లోలం నుంచి తేరుకోవడానికి ప్రయత్నిస్తూనే... పేదల జీవితాలకు ఆసరాగా నిలబడాలనే చిత్తశుద్ధి ప్రభుత్వం అందుకుంటున్న ప్రతి పథకం లోనూ ప్రజలకు ప్రస్పుటంగా కనిపిస్తోంది. ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా ప్రజల గుమ్మం ముందుకు వెళుతున్న క్రమంలో.. పేదల జీవితాల్లో వస్తున్న మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సొంతింటి కల నెరవేరిన అక్కాచెల్లెమ్మల కళ్లల్లో, ఎవరి మీదా ఆధార పడకుండా ఒకటో తేదీ వేకువనే అందుతున్న పెన్షన్తో గౌరవంగా బతుకుతున్న అవ్వాతాతల ముఖాల్లో, ఆసరా–చేయూతతో తన కాళ్ల మీద నిలబడి ఆత్మగౌరవంతో జీవిస్తున్న అక్కల ఆత్మీయ పలకరింపుల్లో, పిల్లలకు మంచి చదువులు చెప్పించడానికి అండగా నిలిచిన ‘అమ్మఒడి’ అందుకుంటున్న చెల్లెమ్మల సంతోషంలో, అన్నం పెడుతున్న అమ్మను గౌరవించడాన్ని బాధ్యతగా తీసుకొని ఇంటి ముందుకు ప్రభుత్వం పంపించిన వాహనం నుంచి బియ్యం తీసు కుంటున్న మహిళల మోముల్లో, వ్యవసాయాన్ని పండగ చేయడానికి అండగా నిలిచిన రైతు భరోసా కేంద్రాల సేవలు అందుకుంటున్న రైతన్నల ఆనందంలో... ఒకరేమిటి... ఊరిలో అన్ని వర్గాల ప్రజల్లో వ్యక్తమవుతున్న సంతృప్తిలో కొత్త సంవత్సరం శోభ కనిపిస్తోంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యం సొమ్ము రైతుల ఖాతాల్లో పడుతోంది. మిల్లర్లు, దళారుల బెడద లేకుండా మద్దతు ధరకు రైతులు ధాన్యం విక్రయిస్తున్నారు. ఊరికే కొత్త రూపుతెచ్చిన గ్రామ సచివాలయాలు... ప్రజల ముంగిటకు పాలనను తీసుకొచ్చి ప్రజల అవసరాలు తీర్చి వారి ముఖాల్లో సంతోషానికి కారణంగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు అందుబాటులోకి రావడంతో నూతన సంవత్సరం శోభ ఇనుమ డిస్తోంది. సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో లక్ష మందికి ఒకేసారి ప్రొబేషన్ ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్యోగులు తమ ఇళ్లతో పాటు వారు పనిచేస్తున్న సచివాలయం పరిధిలోని ఇళ్లకూ నూతన సంవత్సరం శోభను తీసుకురావడానికి, ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన సందేశాన్ని మోసుకెళ్లడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. అవ్వాతాతలకు ఇస్తున్న పెన్షన్ ఈ జనవరి 1 నుంచి రూ. 2,750 పెంచారు. పెన్షన్ పెంపుతో 64 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. రైతు భరోసాను అర కోటి మందికి పైగా రైతులకు అందిస్తున్నారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద దాదాపు 4 లక్షల మంది అక్కాచెల్లెమ్మలు లబ్ధి పొందుతున్నారు. జగనన్న చేదోడు 3 లక్షల మందికి, జగనన్న తోడు దాదాపు 5.5 లక్షల మందికి... ఇలా చెప్పుకొంటూపోతే, పల్లె గడపలో ప్రభుత్వం నుంచి పథకాలు అందుకోని వారు ఉండరనే చెప్పాలి. అందుకే ప్రగతిపథం వైపు అడుగులేస్తున్న ప్రతి ఇంటి గడపలో నూతన సంవత్సరం శోభ కనిపిస్తోంది. చదువు ఒక్కటే పేదల తలరాత మారుస్తుందని నమ్మిన ప్రభుత్వం ఇది. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే దృఢ సంకల్పం ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఉండటం వల్లే ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉచితంగా ట్యాబ్లు ఇచ్చి... అందులో బైజూస్ పాఠాలు అందిస్తున్నారు. ఒకప్పుడు కేవలం కార్పొరేట్ స్కూళ్లకే పరిమితమయిన ఇలాంటివి ఇప్పుడు ప్రభుత్వ బడుల్లో సాకారం కావడం.. రాజ్యాంగం ఇచ్చిన సమాన అవకాశాలు పొందే హక్కును రక్షించడమే. నాణ్యమైన చదువులతో పైకొస్తున్న ప్రతి విద్యార్థి.. ఒక తరం తలరాత మార్చే చైతన్యదీప్తి. ఈ వెలుగులతో కొత్త సంవత్సరం శోభ పల్లె గడప తొక్కింది. (క్లిక్ చేయండి: బాబోయ్! హ్యాండిల్ విత్ కేర్...) - కైలే అనిల్ కుమార్ ఎమ్మెల్యే, పామర్రు, కృష్ణా జిల్లా -
‘సంక్షేమ పాలన’కు టీడీపీ ఎంపీటీసీ స్వాగతం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధుల హృదయాలను సైతం కదిలిస్తున్నాయి. ఇందుకు విశాఖజిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురం కాలనీలో మంగళవారం జరిగిన ఘటన అద్దం పడుతోంది. భీమునిపట్నం ఎమ్యెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కృష్ణాపురం ఎస్సీ కాలనీలో నిర్వహించారు.తమ గడప ముందుకు వచ్చిన ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు టీడీపీ ఎంపీటీసీ సభ్యురాలు కంటుబోతు లక్ష్మి హారతి ఇచ్చి స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పాలనను కొనియాడారు. –పద్మనాభం(విశాఖజిల్లా) -
ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని ఎవరూ అలక్ష్యం చేయొద్దు: సీఎం జగన్
-
ఇది వర్గాల యుద్ధం: సీఎం జగన్
మనం పాలకులం కాదు ప్రజా సేవకులం. అధికారం చలాయించడం కోసం కాదు మనం ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఉండేది.. నేను సీఎంగా ఉండేది.. ఎదిగే కొద్దీ ఒదగాలి. అధికారంలో ఉండేకొద్దీ ఇంకా ఎక్కువ ఒదగాలి. అప్పుడే ప్రజల నుంచి ఇంకా మంచి స్పందన లభిస్తుంది. ఈ వాస్తవాన్ని గుర్తించకపోతే నష్టపోతాం. ప్రతి గ్రామానికి వెళ్లండి. ప్రతి ఇంటినీ సందర్శించండి. ఏ ఇంటికైనా వెళ్లకపోతే.. మీరు తమ ఇంటికి రాలేదని, వారు మనకు వ్యతిరేకం అయ్యే అవకాశం ఉంది. వారు మనకు ఓటేయరని తెలిసినా వెళ్లండి. ఎందుకంటే వారికి ఎంతగా మంచి చేశామనే రికార్డులు మన దగ్గర ఉన్నాయి. వాటిని చిరునవ్వుతో వివరిస్తే, వారి మనసు మారొచ్చు. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘రాష్ట్రంలో ఇవాళ కులాల మధ్య కాదు.. క్లాస్ల మధ్య.. అంటే పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధం జరుగుతోంది. మనం పొరపాటున అధికారంలోకి రాకపోతే, రాష్ట్రంలో ఉన్న ఏ పేదవాడికీ న్యాయం జరగదు. పేదవాడి ప్రతినిధి మనమే. మనం నష్టపోతే పేదలు నష్టపోతారు. వారికి న్యాయం జరగాలంటే మళ్లీ మనం తప్పకుండా అధికారంలోకి రావాలి. ఇందుకోసం ప్రతి గడపనా కనీసం ఐదు నిమిషాల పాటు గడపాలి. మూడున్నరేళ్లలో మనం చేసిన మంచి గురించి చెప్పాలి’ అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలకు ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్బోధించారు. ‘దయచేసి అందరూ గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై ధ్యాస పెట్టండి.. మూడున్నరేళ్లుగా మనం చేస్తున్న మంచిని.. రానున్న రోజుల్లో చేయబోయే మేలును వివరించండి. మంచి చేసిన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరండి. మీరు ఆ ఇంటికి కేటాయించే సమయం మీకు ఎంతో మేలు చేస్తుంది. మీ నియోజకవర్గంలో ప్రతి ఇంటిని మీకు చేరువ చేస్తుంది. మీ గెలుపునకు బాటలు వేస్తుంది’ అంటూ దిశా నిర్దేశం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమం కొనసాగుతున్న తీరుపై సమీక్షించారు. ఇకపై మరింత మెరుగ్గా నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలకు మార్గ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. గడప గడపకు మన ప్రభుత్వంపై నిర్వహించిన వర్క్షాప్లో పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు సమర్థులనే పార్టీ కన్వీనర్లుగా నియమించండి ► నాయకత్వం వహించే సామర్థ్యం ఉన్న ముగ్గురు కార్యకర్తలనే సచివాలయ కన్వీనర్లుగా నియమించాలి. అందులో తప్పనిసరిగా ఒక మహిళ ఉండాలి. ఎమ్మెల్యేలకు ఇష్టం వచ్చిన వారిని నియమించుకోవచ్చు. వారికి తప్పనిసరిగా స్మార్ట్ ఫోన్ ఉండి తీరాలి. ఆ తర్వాత ప్రతి 50 ఇళ్లకు ఒక తమ్ముడు, ఒక చెల్లిని గృహ సారథులుగా నియమించాలి. వారు ఆ 50 ఇళ్లకు సంబంధించిన వారై ఉండాలి. ఎక్కడా వలంటీర్లు గృహ సారథులుగా ఉండకూడదు. ► పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు జనవరిలో ఆసరా మూడో దఫా రూ.6,500 కోట్లు చెల్లించబోతున్నాం. దానికి సంబంధించి ఇంటింటా ప్రచారం చేస్తూ, వారికి లేఖలు అందిస్తాం. ఆ తర్వాత గృహ సారథుల నియామకానికి సంబంధించి మరో దఫా వెరిఫికేషన్ ఉంటుంది. ఎమ్మెల్యేల ద్వారా ట్యాబ్ల పంపిణీ ► రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యేల ద్వారా ట్యాబ్ల పంపిణీ మొదలవుతుంది. పగలు ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని.. సాయంత్రం గడప గడపకూ కార్యక్రమాన్ని నిర్వహించాలి. జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్ రూ.2,750 పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం. పెన్షన్ పెంపుదలపై వారోత్సవాలను నిర్వహిస్తున్నాం. ఈ వారోత్సవాలలో రోజూ ఏదో ఒక మండలంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలి. సాయంత్రం గడప గడపకూ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ► గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్దేశించిన విధంగా జరగాలి. ప్రతి సచివాలయ పరిధిలో కనీసం రెండు రోజులు.. రోజుకు కనీసం 6 గంటల పాటు తిరగాలి. అలా తిరగని ఎమ్మెల్యేలు.. మరోసారి ఆయా సచివాలయాలు సందర్శించాలి. ప్రతి ఇంటికి వెళ్లాలి. ప్రతి ఇంట్లో కనీసం 5 నిమిషాలు గడిపి, వారికి ప్రభుత్వం వల్ల కలిగిన ప్రయోజనాలు వివరించాలి. ఒక వేళ ఒక గ్రామంలో రెండు రోజుల్లో మొత్తం తిరగలేమనుకుంటే.. మూడు, నాలుగు రోజుల సమయం తీసుకోండి. ఎక్కడా తొందర పడకూడదు. మొక్కుబడిగా పని చేయొద్దు. ప్రభావం చూపే పనుల్లో రాజీ వద్దు ► గ్రామాల్లో అత్యధిక ప్రభావం చూపే (హై ఇంప్యాక్ట్ వర్క్) పనులనే గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించండి. ఎక్కడా స్వ ప్రయోజనాలు ఆశించకండి. ఎవరినో సంతోష పరచాలని కూడా ఆలోచించొద్దు. ఆ పనుల కోసం ప్రతి సచివాలయానికి కేటాయిస్తున్న నిధుల్లో ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. అందువల్ల మీరు పనుల ప్రాధాన్యతను గుర్తించి, అక్కడికక్కడే ప్రతిపాదనలతో అప్లోడ్ చేస్తే, వెంటనే ఆమోదం లభిస్తుంది. ► అత్యంత ప్రాధాన్యత కలిగిన 23,808 పనులకు సంబంధించి రూ.930.28 కోట్లతో ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు రాగా, వాటిలో 21,275 పనులకు అనుమతి ఇచ్చాం. ఆ పనుల విలువ రూ.828.45 కోట్లు. వాటిలో 17,905 పనులు మొదలయ్యాయి. ఈ పనుల విలువ రూ.662.14 కోట్లు. మీరంతా మళ్లీ గెలవాలి మీ మీద నాకు ప్రేమ ఎక్కువ. మీలో ఎవరినీ పోగొట్టుకోవడం నాకిష్టం లేదు. మీ అందరినీ మళ్లీ చట్టసభలో చూడాలి. అదే నా కోరిక. మనం మన బాధ్యత సక్రమంగా నెరవేర్చకపోతే, కోట్ల మంది నష్టపోతారు. మోసంతో కూడిన రాజకీయాలు.. ప్రజలను ఉపయోగించుకుని వదిలేసే రాజకీయాలు.. వెన్నుపోటు రాజకీయాలు.. అబద్ధాల రాజకీయాలు.. ప్రజల మీద, పేదవాడి మీద ప్రేమ లేని రాజకీయాలు రాజ్యమేలుతాయి. మనకు ఎన్నికలకు ఇంకా 16 నెలల సమయం ఉంది. గడప గడపకూ.. కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం? అని ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఇంట్లో కనీసం 5 నిమిషాలు గడిపి, ఆ ఇంటికి చేసిన మంచిని వివరించి, వారి ఆశీర్వాదం కోరండి. అప్పుడే వారి నుంచి మనకు సానుకూలత లభిస్తుంది. ఎన్నికల ముందు మీకు అంత సమయం ఉండదు కాబట్టి ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరితో మమేకం అవ్వండి. అదే మన గెలుపునకు బాటలు వేస్తుంది. -
మార్చి నాటికి పూర్తి స్థాయి నివేదికలు తెప్పిస్తా : సీఎం వైఎస్ జగన్
-
AP: ముందస్తు ఎన్నికలపై సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ప్రతి రెండున్నర నెలలకు ఓ సారి గడపగడపకు కార్యక్రమంపై సీఎం సమీక్ష ఉంటుందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం.. ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకు ప్రయోజనం చేకూర్చుతుందన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలకు పథకాలు చేరకపోతే అనుకున్న ఆశయం నెరవేరదు. ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి సీరియస్గానే సీఎం సమీక్షించారని పేర్కొన్నారు. ‘‘సిన్సియర్గా పనిచేయక పోతే మీకే బాగుండదు, నష్టపోతారని సీఎం చెప్పారు. ఎమ్మెల్యేలంతా ప్రతి ఇంటికీ తిరగాలని సీఎం జగన్ ఆదేశించారు. గడప గడపకు మన ప్రభుత్వంలో పర్ఫార్మెన్స్ బాగుంటే ఆటోమెటిగ్గా అభ్యర్థులుగా ఉంటారు. ఎమ్మెల్యేల పనితీరు బాగుంటే అది సర్వేల్లో ప్రతిబింబిస్తుంది. సైంటిఫిక్ మెథడ్ అనుకుని సర్వేను సీఎం జగన్ ఫాలో అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో 175 కి 175 సీట్లు గెలిచేలా సీఎం ప్లాన్ వేశారు. మైక్రో లెవెల్ ప్లానింగ్ ఎలా ఉండాలనే విషయమై సీఎం ఆదేశించారు’’ అని సజ్జల పేర్కొన్నారు. ‘‘ఏ పార్టీకైనా వారి ఎన్నికల స్ట్రాటజీలు వారికి ఉంటాయి. ప్రతి 3 నెలలకు ఓసారి ఎప్పటికప్పుడు సర్వే నివేదికలు వస్తుంటాయి. ఏ సమయంలో వచ్చిన నివేదికను ఫైనల్గా తీసుకోవాలనేది సీఎం జగన్ ఇష్టం. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశమే లేదు. దానిపై చర్చే జరగలేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యేలంతా తిరిగి గెలవాలన్నదే సీఎం జగన్ ఆకాంక్ష. ఇచ్చిన అవకాశాన్ని ఎవరూ చేజార్చు కోవద్దని సీఎం జగన్ స్పష్టం చేశారు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. చదవండి: సీఎం జగన్ సమీక్ష.. మాజీ మంత్రి కన్నబాబు ఏమన్నారంటే? -
ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని సీఎం చెప్పారు : కురసాల కన్నబాబు
-
చంద్రబాబు ముందస్తు ఆశలు నెరవేరే అవకాశం లేదు : సజ్జల
-
సీఎం జగన్ సమీక్ష.. మాజీ మంత్రి కన్నబాబు ఏమన్నారంటే?
సాక్షి, తాడేపల్లి: Gadapa Gadapaki Mana Prabhutvam: గడప గడపకు మన ప్రభుత్వంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ, ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని సీఎం చెప్పారని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ప్రజలకు వివరించాలని, సచివాలయం పరిధిలో ముగ్గురు కన్వీనర్ల నియామకం త్వరగా పూర్తి చేయాలని సీఎం సూచించారని కన్నబాబు అన్నారు. ‘‘గృహ సారధుల నియామకం కూడా జరగాలి. దాని వ్యవస్థీకృతం చేయాలని సీఎం చెప్పారు. గడప గడపకు కార్యక్రమంపై నిర్లక్ష్యం వద్దని సీఎం చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు తక్కువ రోజులు గడప గడప చేశారు. మార్చి నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. వచ్చే మార్చిలో వర్క్షాప్ ఉంటుందని చెప్పారు. ఈలోగా వెనుకబడిన వారి పనితీరు మార్చుకోవాలని సూచించారు.’’ అని కన్నబాబు పేర్కొన్నారు. చదవండి: మద్యం బ్రాండ్లు..అసలు నిజాలు.. రాష్ట్రానికి లిక్కర్ కింగ్ చంద్రబాబే..! -
ప్రతిష్ఠాత్మక కార్యక్రమం.. ఎవరూ అలక్ష్యం చేయొద్దు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక చేపట్టిన సంక్షేమాభివృద్ధి పథకాల వల్ల జరిగిన మేలును ప్రజలకు వివరించి.. ఆశీస్సులు కోరేందుకు చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ వర్క్షాప్కు ఎమ్మెల్యేలు, వైఎస్సార్సీపీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులు, రీజినల్ కో–ఆర్డినేటర్లు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మార్చి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. 32 మంది ఎమ్మెల్యేలు తక్కువ రోజులు పాల్గొన్నారని, రానున్న రోజుల్లో వారు మరింతగా ప్రజల్లోకి వెళ్లాలని సీఎం సూచించారు. ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ఎవరూ అలక్ష్యం చేయొద్దు. మార్చి నాటికి పూర్తిస్థాయి నివేదికలు తెప్పిస్తానని సీఎం అన్నారు. సీఎం జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..: సచివాలయాల పరిధిలో పార్టీ కన్వీనర్లుగా సమర్థులైన వారే ఉంటారు: నాయకత్వం వహించే సామర్థ్యం ఉన్న కార్యకర్తలను సచివాలయ కన్వీనర్లుగా నియమించడం జరుగుతుంది. ఆ తర్వాత గృహ సారథుల నియామకం జరుగుతుంది. ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు చొప్పున నియమిస్తాం. జనవరిలో ఆసరా మూడో దఫా చెల్లింపు జరగబోతున్నది. రూ.6500 కోట్లు ఇవ్వబోతున్నాం. దానికి సంబంధించి ఇంటింటా ప్రచారం చేస్తూ, వారికి లేఖలు అందిస్తాం. ఆ తర్వాత గృహ సారథుల నియామకానికి సంబంధించి మరో దఫా వెరిఫికేషన్ ఉంటుంది. ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలదే: సచివాలయాల కన్వీనర్లుగా ఎమ్మెల్యేలకు ఇష్టం వచ్చిన వారిని నియమించుకోవచ్చు. వారు సమర్థులై ఉండాలి. వారికి తప్పనిసరిగా స్మార్ట్ఫోన్ ఉండి తీరాలి. అయితే ఎక్కడా వలంటీర్లు గృహసారథులుగా ఉండకూడదు. అలాగే వారు ఆ 50 ఇళ్లకు సంబంధించిన వారై ఉండాలి. తప్పనిసరిగా పర్యటించాలి: డిసెంబర్ 21 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యేల ద్వారా ట్యాబ్ల పంపిణీ మొదలవుతుంది. పగలు ఆ కార్యక్రమం చేసి, సాయంత్రం గడప గడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలి. అలాగే 1వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ. ఇక్కడ కూడా వారం రోజుల పాటు ఎమ్మెల్యేలు ఏదో ఒక మండలంలో పర్యటించాలి. సాయంత్రం గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొనాలి. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్దేశించిన విధంగా జరగాలి. ప్రతి సచివాలయ పరిధిలో కనీసం రెండు రోజులు.. రోజుకు కనీసం 6 గంటల పాటు తిరగాలి. అలా తిరగని ఎమ్మెల్యేలు.. మరోసారి ఆయా సచివాలయాలు సందర్శించాలి. ప్రతి ఇంటికి వెళ్లాలి. ప్రతి ఇంట్లో కనిసం 5 నిమిషాలు గడిపి, వారికి ప్రభుత్వం వల్ల కలిగిన ప్రయోజనాలు వివరించాలి. ప్రతి ఇంటికి వెళ్లాలి: ఒక వేళ ఒక గ్రామంలో రెండు రోజుల్లో మొత్తం తిరగలేమనుకుంటే, మూడు, నాలుగు రోజుల టైమ్ తీసుకొండి. కానీ ప్రతి ఇంటికి వెళ్లండి. ఎక్కడా తొందరపడకూడదు. మొక్కుబడిగా పని చేయొద్దు. ఒక ఊరు తీసుకుంటే కచ్చితంగా పూర్తి చేయండి. లేకపోతే మీరు తమ ఇంటికి రాలేదని, వారు వ్యతిరేకం అయ్యే అవకాశం ఉంది. వారు మనకు ఓటేయరని తెలిసినా, మీరు పోవడం మానకండి. ఎందుకంటే వారికి ఎంత మంచి చే«శామన్నది మన దగ్గర రికార్డులు ఉన్నాయి. వాటిని చిరునవ్వుతో వివరిస్తే, వారి మనస్సు మారొచ్చు. కాబట్టి ప్రతి గ్రామానికి వెళ్లండి. ప్రతి ఇల్లు సందర్శించండి. పనుల్లో రాజీ వద్దు: అలాగే గ్రామాల్లో అత్యధిక ప్రభావం చూపే (హై ఇంప్యాక్ట్ వర్క్) పనులనే గుర్తించండి. ఎక్కడా స్వప్రయోజనాలు ఆశించకండి. ఎవరినో సంతోషపర్చాలని కూడా ఆలోచించొద్దు. ఆ పనుల కోసం ప్రతి సచివాలయానికి కేటాయిస్తున్న నిధుల్లో ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. అందువల్ల మీరు పనుల ప్రాధాన్యతను గుర్తించి, అక్కడికక్కడే ప్రతిపాదనలతో అప్లోడ్ చేస్తే, వెంటనే ఆమోదించడం జరుగుతుంది. మీరంతా మళ్లీ గెలవాలి: ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, మీ మీద నాకు ప్రేమ ఎక్కువ. మీలో ఎవ్వర్నీ పోగొట్టుకోవడం నాకిష్టం లేదు. మీ అందరినీ మళ్లీ చట్టసభలో చూడాలి. అదే నా కోరిక. మనం మన బాధ్యత సక్రమంగా నెరవేర్చకపోతే, కోట్ల మంది నష్టపోతారు. ఇవాళ రాష్ట్రంలో కులాల మధ్య కాదు.. క్లాస్ల మధ్య యుద్ధం జరుగుతోంది. పేదలు, పెత్తందార్ల మధ్య యుద్ధం జరుగుతోంది. ప్రతి పేదవాడికి ప్రతినిధి ఎవరంటే మనమే. మనం నష్టపోతే పేదవారు నష్టపోతారు. మనం పొరపాటున కూడా అధికారంలోకి రాకపోతే, రాష్ట్రంలో ఉన్న ఏ పేదవాడికి కూడా న్యాయం జరగదు. మోసంతో కూడిన రాజకీయాలు. ప్రజలను ఉపయోగించుకుని వదిలేసే రాజకీయాలు. వెన్నుపోటు రాజకీయాలు. అబద్ధాల రాజకీయాలు. ప్రజల మీద ప్రేమ లేని రాజకీయాలు. పేదవాడి మీద అస్సలు ప్రేమ లేని రాజకీయాలు. ఇవీ రాజకీయాలు. అలాంటి రాజకీయాలు వస్తాయి. కాబట్టి దయచేసి అందరూ ధ్యాస పెట్టండి. ప్రతి ఇంట్లో కనీసం రెండు, మూడు నిమిషాలు గడపండి. మీరు ఆ ఇంటికి కేటాయించే సమయం, మీకు ఎంతో మేలు చేస్తుంది. మీ నియోజకవర్గంలో ప్రతి ఇంటిని మీకు చేరువ చేస్తుంది. ఎన్నికలకు ఇంకా 16 నెలలే.. మనకు ఎన్నికలకు ఇంకా 16 నెలల టైమ్ మాత్రమే ఉంది. కాబట్టి, ప్రతి ఇంట్లో కనీసం 5 నిమిషాలు గడిపి, ఆ ఇంటికి చేసిన మంచిని వివరించి, వారి ఆశీర్వాదం కోరండి. అప్పుడే వారి నుంచి మనకు సానుభూతి లభిస్తుంది. ఎందుకంటే, ఎన్నికల ముందు మీకు అంత సమయం ఉండదు. అసలు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ఎందుకు చేస్తున్నామనేది దయచేసి ఆలోచన చేయండి. మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే, మనం ప్రజా సేవకులం. అధికారం మన చేతిలో ఉన్నప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సింది.. మనం అధికారం చలాయించడం కోసం కాదు మనం ఎమ్మెల్యేలుగా ఉండేది. మంత్రులుగా ఉండేది. నేను సీఎంగా ఉండేది. అందుకే ఎదిగేకొద్దీ ఒదగాలి. ఈ అధికారం ఉండేకొద్దీ మనం ఇంకా ఎక్కువ ఒదగాలి. అప్పుడే ప్రజల నుంచి ఇంకా స్పందన లభిస్తుంది. ఈ వాస్తవాన్ని గుర్తించకపోతే, నష్టపోతాం. అందుకే ప్రతి ఇంట్లో మనం వారితో కనీసం 5 నిమిషాలు గడిపితే, ప్రజల మద్దతు మనకు దక్కుతుంది. మనల్ని ఆదరిస్తారని సీఎం జగన్ స్పష్టం చేశారు. రూ.828 కోట్ల విలువైన పనులు: గడప గడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన అత్యంత ప్రాధాన్యత కలిగిన పనుల (హై ఇంప్యాక్ట్ వర్క్స్–హెచ్ఐడబ్ల్యూ స్)కు సంబంధించి చూస్తే.. 23,808 పనులకు సంబంధించి రూ.930.28 కోట్ల పనుల ప్రతిపాదనలు రాగా, వాటిలో 21,275 పనులకు అనుమతి ఇచ్చారు. ఆ పనుల విలువ రూ.828.45 కోట్లు. వాటిలో 17,905 పనులు మొదలు కాగా, ఆ విలువ రూ.662.14 కోట్లు. -
ఇది కదా జగనన్న పాలన..
నరసన్నపేట: అర్హత మాత్రమే ప్రామాణికంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందజేస్తోందనడానికి ఇది మరో ఉదాహరణ. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం ఉర్లాంలో టీడీపీ సీనియర్ నాయకుడు, తెలుగు రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి, సర్పంచ్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జల్లు చంద్రమౌళికి మూడున్నరేళ్లుగా ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు అందజేస్తోంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఈ విషయాలన్నీ వివరించారు. చంద్రమౌళికి రైతు భరోసా కింద రూ. 38,500, సున్నా వడ్డీ కింద రూ.1,168, వైఎస్సార్ ఆసరా కింద రూ. 11,640 ప్రయోజనం కలిగినట్లు వివరించారు. బుక్లెట్ను ఎమ్మెల్యే కృష్ణదాస్ జల్లు చంద్రమౌళికి ఇచ్చారు. ఇది కదా జగనన్న పాలన అంటే.. అని స్థానికులు చర్చించుకున్నారు. -
అవినీతికి తావు లేకుండా అభివృద్ధి
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): అవినీతి రహిత పాలన అందించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని, దీనిపై టీడీపీ నేతలు అవాకులు చెవాకులు పేలడం సరికాదని రాష్ట్ర రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. దళారుల ప్రమేయం లేకుండా, పైసా లంచం ఇవ్వకుండా, పారదర్శకంగా.. అర్హతే ప్రామాణికంగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం నగరంలోని పీఎన్కాలనీలో మంగళవారం ఆయన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనాలతో మాట్లాడితేనే ప్రభుత్వ పనితీరుపై వారి సంతృప్తి స్థాయి తెలుస్తుందని చెప్పారు. వ్యవస్థ దానంతటదే పని చేసుకునే పద్ధతి రావాలని, అభివృద్ధి చెందిన దేశాల్లో అలాగే జరుగుతుందన్నారు. మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా ప్రజలకు పథకాలు అందించాలని అప్పట్లో ప్రధానిగా రాజీవ్ గాంధీ చెప్పారన్నారు. మధ్యవర్తుల కారణంగానే అప్పట్లో 90 శాతం స్కీమ్లు అర్హులకు చేరేవి కావన్నారు. కానీ రాష్ట్రంలో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని, వ్యవస్థను మార్పు చేస్తూ వివిధ పథకాల కింద లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా ప్రజలకు నేరుగా అందించామని స్పష్టం చేశారు. ఇది మార్పు కాదా? అని ప్రశ్నించారు. విద్యా రంగంలో సంస్కరణల ద్వారా మంచి మార్పులు తీసుకొచ్చామన్నారు. నిన్నా మొన్నటి వరకు రాష్ట్రం అక్షరాస్యతలో దేశంలో 22వ స్థానంలో ఉండేదని, తాజా సంస్కరణల వల్ల ఆ పరిస్థితిలో బాగా మార్పు వస్తోందన్నారు. అయితే సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కొంత వ్యతిరేకత ఉండటం సహజమని చెప్పారు. ప్రజలు వాటిని అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం పడుతుందన్నారు. ఇది అర్థం కాని వారే ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని వివరించారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. వైఎస్సార్సీపీ హయాంలోనే జిల్లా అభివృద్ధి ► బుడగట్ల పాలెంలో ఫిషింగ్ హార్బర్, రూ.3 వేల కోట్లతో భావనపాడు పోర్టు నిర్మించనున్నాం. గొట్టా బ్యారేజ్ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఉద్దానంలో రూ.700 కోట్లతో మంచినీటి ప్రాజెక్టు, పలాసలో కిడ్నీ రోగుల కోసం రూ.50 కోట్లతో డయాలసిస్ సెంటర్, ఆస్పత్రి నిర్మాణం జరుగుతోంది. ► జిల్లాల పునర్విభజన పూర్తయింది. రిమ్స్ను 900 పడకలతో తీర్చిదిద్దాం. ఇదంతా అభివృద్ధి కాదా? ఇది టీడీపీ నేతలకు కనిపించడం లేదా? మరో తెలంగాణ కాకూడదు.. ► రాష్ట్ర విభజన తర్వాత శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను చంద్రబాబు పట్టించుకోకుండా, నారాయణ కమిటీ సిఫార్సులను అమలు చేయడం దారుణం. చంద్రబాబు, ఆయన సామాజిక వర్గం వారి స్వార్థానికి రాష్ట్రంలో ప్రజలందరినీ బలి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మరో తెలంగాణ కాకూడదు. ఈ దృష్ట్యా పాలన రాజధాని విశాఖే అన్న నినాదం వినిపించేందుకు ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉత్తరాంధ్ర ప్రజల వెనుకబాటుతనాన్ని గుర్తించిన నాయకుడు సీఎం జగన్మోహన్రెడ్డి. ► వైజాగ్.. రాష్ట్రం మధ్యలో లేదని కొంత మంది చెప్పడం హాస్యాస్పదం. దేశంలో తమిళనాడు, మహారాష్ట్రల్లో చెన్నై, ముంబై ఎక్కడ ఉన్నాయో గమనించాలి. పాలన రాజధానిగా అందరినీ ఆదరించే గుణం వైజాగ్ సొంతం. న్యాయ రాజధానిగా కర్నూలు, లెజిస్లేటివ్ రాజధానిగా అమరావతి ఉంటుంది. దేశంలో సుమారు 8 రాష్ట్రాల్లో ఈ విధంగా రాజధానులు ఉన్నాయి. -
ఊరూరా అదే జోరు
సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. అన్ని జిల్లాల్లో గురువారం ఈ కార్యక్రమం వేడుకగా సాగింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ఏమైనా సమస్యలు తమ దృష్టికి వస్తే అక్కడికక్కడే పరిష్కరించారు. తమ సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్ జగన్కు తమ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ప్రజాప్రతినిధులను ప్రజలు దీవిస్తున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను నెరువేరుస్తున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించారు. -
వాడవాడలా వేడుకగా
సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. అన్ని జిల్లాల్లో సోమవారం ఈ కార్యక్రమం సాగింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఏమైనా సమస్యలు తమ దృష్టికి వచ్చిన వెంటనే అక్కడికక్కడే వాటిని పరిష్కరించారు. తమ సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్కి తమ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ప్రజాప్రతినిధులను ప్రజలు దీవిస్తున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను తప్పకుండా నెరువేరుస్తున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలకు చెప్పారు.