
శ్రీకాకుళం జిల్లా లింగన్నాయడుపేటలో సంక్షేమంపై ఆరా తీస్తున్న ఎమ్మెల్యే కృష్ణదాస్
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. మంగళవారం ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లగా వారికి ప్రజల నుంచి ఆత్మీయ ఆదరణ లభించింది. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమకు అండగా నిలుస్తున్నాయని, ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నాయని ప్రజలు చెప్పారు.
వైఎస్ జగన్ పాలనలో తామంతా చాలా సంతోషంగా ఉన్నామని చెబుతున్నారు. సీఎం వైఎస్ జగన్కు తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆనందంగా తెలియజేశారు.