ఇసుకపై ఇరకాటం..! | Illegal Mining of Sand in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఇసుకపై ఇరకాటం..!

Aug 23 2024 5:33 AM | Updated on Aug 23 2024 7:32 AM

Illegal Mining of Sand in Andhra Pradesh

దోపిడీపై జనాగ్రహంతో అధికార యంత్రాంగాన్ని బలి పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహం 

జగన్‌ హయాం కంటే ఇప్పుడే రేటు ఎక్కువ అంటున్నారు.. 

విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఫీడ్‌బ్యాక్‌ వచ్చిందని వ్యాఖ్య

ఇక మిగిలిన నిల్వ 24.08 లక్షల టన్నులే

సాక్షి, అమరావతి: ఇసుక పేరుతో సాగుతున్న దోపిడీ వ్యవహారాలపై ప్రజాగ్రహం వెల్లువె­త్తుతుండటంతో ఆ తప్పంతా అధికార యంత్రాంగంపై నెట్టివేసేందుకు సీఎం చంద్రబాబు సన్నద్ధమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికా­రం­లోకి రావడమే ఆలస్యం స్టాక్‌ యార్డుల్లో ఉన్న ఇసుకలో దాదాపు 40 లక్షల టన్నులు మాయం చేసి అందినకాడికి విక్రయించి పచ్చముఠాలు సొమ్ము చేసుకుంటున్నట్లు ఇప్పటికే బహిర్గత­మైంది. పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాలకూ తరలించారు. నిత్యం తవ్వుకో తమ్ముడూ అంటూ రీచ్‌ల్లోనూ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడు­తుం­డటంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమ­వుతున్నాయి.

ఇక ఇతర మీడియాల్లోనూ దీనిపై కథనాలు వెలువడుతుండటంతో ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో స్పందించింది. వైఎస్‌ జగన్‌ సర్కారు హయాంలో కంటే ఇసుక ధర ఇప్పుడే ఎక్కువగా ఉన్నట్లు ప్రజల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ రావడంతో బుధవారం నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారు­లపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచా­రం.

ప్రధానంగా ఉత్తరాంధ్రలో విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో గతంలో కంటే ఇప్పుడే ఇసుక ధర ఎక్కువగా ఉన్నట్లు ఫీడ్‌ బ్యాక్‌ వస్తోందని ప్రస్తావించారు. స్టాక్‌ యార్డుల్లో నిల్వ ఉన్న ఇసుకను ఇష్టానుసారంగా విక్రయించినప్పుడు కళ్లు మూసుకుని బుకాయించిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు దీన్ని అధికారులపై నెట్టివేసే యత్నాలపై యంత్రాంగంలో విస్మయం వ్యక్తమ­వుతోంది. కాగా రాష్ట్రంలో 59 ఇసుక యార్డుల్లో ఇక 24.08 లక్షల టన్నులు ఇసుక మాత్రమే నిల్వ ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement