‘వచ్చే ఎన్నికల్లో ఘనవిజయం దిశగా వైఎస్సార్‌సీపీ పరుగులు’ | MP Vijaya Sai Reddy Key Comments On YSRCP Victory In Next Election | Sakshi
Sakshi News home page

‘వచ్చే ఎన్నికల్లో ఘనవిజయం దిశగా వైఎస్సార్‌సీపీ పరుగులు’

Published Thu, Jun 1 2023 10:17 AM | Last Updated on Thu, Jun 1 2023 10:17 AM

MP Vijaya Sai Reddy Key Comments On YSRCP Victory In Next Election - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ప్రకృతి వైపరీత్యాలు, అవాంతరాలు, కష్టా­లు ఎదురైనా మొక్క­వోని ధైర్యంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమా­ల­ను నిరాటంకంగా కొనసాగిస్తు­న్నా­రని, జన­రంజక పాలన సాగిస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయ­సాయిరెడ్డి పేర్కొన్నారు. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించడానికి వైఎస్సార్‌సీపీ ముందుకు సాగుతోందని ఆయన బుధ­వా­రం తాడేపల్లిలో విడుదల చేసిన ఒక ప్రకట­న­లో తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికల్లో కేవలం పనితీరుతో ప్రజల మన­సుల్ని గెల్చుకునే మొ­దటి రాజకీయ­పక్షంగా వైఎస్సార్‌సీపీ కొత్త చరిత్రకు శ్రీకా­రం చుట్టబోతోందని తెలిపా­రు.

ఆ ప్రక­టనలో ఆయన ఏమన్నారంటే.. 
సీఎం వైఎస్‌ జగన్‌ రైతులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఎన్నో విధాలుగా ఆదుకుంటున్నారు. రాజ్యసభకు నలుగు­రు బీసీలను పంపించారు. ఇంకా 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎమ్మెల్సీ పదవు­లిచ్చారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ పదవులు కూడా ఇచ్చారు. గతంలో పాలకులు పేదలను ఓటర్లుగానే చూశా­రు. అదే సీఎం జగన్‌  పాలనలో సచివా­లయ, వలంటీరు వ్యవస్థలతో ప్రజలకు ఊళ్లోను, ఇళ్లవద్దే పథకాలు అందుతు­న్నాయి.

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన  ప్రతి హామీని నిలబెట్టుకుని ప్రజల్లో పూర్తి విశ్వాసం కలిగించిన నేత జగన్‌. తన పాలనతో అందరి కుటుంబాల్లో వెలు­గు­లు నింపుతున్నారు. ఈ నాలుగేళ్లలో డీబీ­టీ ద్వారా రూ.2.11 లక్షల కోట్లు.. పైసా లంచం లేకుండా పారదర్శకంగా లబ్ధి­దా­రుల ఖాతాల్లో జమచేశారు. 31 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వడంతో పాటు దాదాపు 22 లక్షల ఇళ్లు కట్టించి ఇస్తున్నారు. 

ఇది కూడా చదవండి: కేంద్ర చట్టం పాటించం.. రాష్ట్ర చట్టం వర్తించదు.. రామోజీ తీరు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement