
రఘురామకృష్ణరాజును రెండోసారి వివరణ కోరినట్లు ఓం బిర్లా ఈ సందర్భంగా తెలిపారు.
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలన్న వైఎస్సార్సీపీ ఎంపీల ఫిర్యాదును పరిశీలిస్తున్నామని లోక్సభ సభాపతి ఓం బిర్లా తెలిపారు. సోమవారం మీడియా సమావేశం అనంతరం అడిగిన ఓ ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. రఘురామకృష్ణరాజును రెండోసారి వివరణ కోరినట్లు ఓం బిర్లా ఈ సందర్భంగా తెలిపారు.
(చదవండి: కుప్పంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది: ఎస్ఈసీ నీలం సాహ్ని)