
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: నేటి నుంచి రాష్ట్రంలో వర్షాలు జోరందుకోనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఇది క్రమంగా ఒడిశా, ఏపీ తీరం వైపు పయనించే సూచనలున్నట్లు తెలిపింది.
అయితే.. తుపానుగా బలపడే అవకాశాలు లేవనీ.. కేవలం అల్పపీడనం లేదా వాయుగుండంగా మాత్రమే బలపడుతుందని వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో నేడు ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment