నాడు వద్దన్నారు..నేడు వారే దిక్కయ్యారు | Volunteers serving flood victims in many areas | Sakshi
Sakshi News home page

నాడు వద్దన్నారు..నేడు వారే దిక్కయ్యారు

Published Thu, Sep 5 2024 4:58 AM | Last Updated on Thu, Sep 5 2024 4:58 AM

Volunteers serving flood victims in many areas

సహాయక చర్యలకు వలంటీర్లను పిలవాలని మునిసిపల్‌ కమిషనర్‌ ఆదేశం

పలు ప్రాంతాల్లో వరద బాధితులకు సేవలందిస్తోన్న వలంటీర్లు

సాక్షి, అమరావతి/వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ): ‘వలంటీర్లు ఏమి చేస్తారు, సంచులు మోసే పనులే కదా..అంతకుమించి వారు చేసే పనులు ఏమిటి?’ అంటూ చంద్రబాబు నాడు వలంటీర్లను ఎద్దేవా చేశారు. అయితే వరద బీభత్సానికి పాలకులకు దిమ్మతిరిగి వరద బాధి­తులకు పూర్తి స్థాయిలో సేవలు అందించడానికి వలంటీర్లే అవసరమవుతారని ఇప్పుడు గుర్తించారు. సచివాలయం, వలంటీర్‌ వ్యవస్థల పేరు కూడా ఎత్తడానికి ఇష్ట­పడని చంద్రబాబుకు వారి విలువలు, సేవలు ఇప్పుడు తెలిసివ­చ్చాయి. 

విజ­య­వాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితు­లకు సాయమందించడంలో అధికా­రులు పూర్తిగా విఫల­మ­య్యారు. ఆహారం భారీగా ఉన్నా పంపిణీ వ్యవస్థ సరిగా లేక గందరగోళ పరిస్థితులు తలెత్తుతుండటంతో అధికా­రులు వల­­ంటీర్‌ల ద్వారానే బాధితులకు సాయ­మందించగలమని సీఎంకు చెప్పారు. దీంతో వెంటనే సీఎం ఆదే­శాలతో అధికారులు వలంటీర్లకు కబురు చేస్తు­న్నారు. 

బుధవారం నుంచి సచివాల­యాల సిబ్బంది, వలంటీర్లు ఎక్కడికక్కడ సహా­యక కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది.  నేటి నుంచి పూర్తి స్థాయి­లో వలంటీర్లు సేవలు అందించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.  

గతంలో వరదలొస్తే వలంటీర్లతోనే బాధితులకు భోజనం ఏర్పాట్లు
గోదావరి వరద ముంపులో ఉన్న వందలాది మంది బాధితుల వద్దకు పీకల్లోతు నీళ్లలో వెళ్లి వలంటీర్లు తక్షణ సాయాన్ని అందించి వెలకట్ట లేని సేవలతో ప్రశంసలు అందుకున్నారు. 2020, 2022ల్లో గోదావరికి వరదలు వచ్చిన సమయంలో..వరదలు వస్తాయన్న ముందస్తు సమాచారంతో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ ముందుగానే వల­ంటీర్లను అప్రమత్తం చేసి బా«ధితులను ఆదుకు­న్నారు. అధికారులు కూడా వెళ్లడానికి సాహ­సించని లోతట్టు లంక గ్రామాలకు ప్రాణాలకు తెగించి ప్రభుత్వం సమకూర్చిన సహాయ సామగ్రి, నిత్యావసరాలను బాధితులకు వలంటీర్ల కొద్ది గంటల్లోనే అందించారు. 

గతంలో వరదల సమ­యంలో గోదావరి ఏటిగట్లకు గండ్లు పడి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించిన సందర్భాలు కోకొల్ల­లుగా ఉండగా, 20219–23 మధ్య వరదల సమ­యంలో ప్రతి అర కిలో మీటర్‌ ఏటిగట్టు పర్య­వేక్షణ బాధ్యత ఒక వలంటీర్‌కు అప్పగించడంతో వారు ప్రజలను అప్రమత్తం చేస్తూ వచ్చారు. అప్పట్లో ఏటిగట్లకు ఊలలు పడినా, గట్లు కుంగిపోయినా, గండ్లు పడిన విషయం ఉన్నతాధికా­రులకు చేరేసరికి జరగాల్సిన నష్టం జరిగిపో­యే­ది. వలంటీర్లు వరద సేవల్లో పాల్గొన్న­ప్పుడు, వర­దల్లో చిక్కుకున్న బాధితు­లను గుర్తించడం దగ్గర నుంచి పునరావాస కేంద్రాలకు తరలింపు, భోజనాలు, నిత్యావసరాల పంపిణీలో ప్రాణా­లకు తెగించి సేవలందించారు. 

మధ్యాహ్నం 12 గంటలు దాట­కుండానే బాధితులకు భోజనం ప్యాకెట్లు, మంచినీళ్లు అందించారు. 2020, 2022 జూలై, ఆగస్ట్‌ల్లో సంభవించిన వరదల్లో మామిడి­కు­దురు మండలం పెదపట్నం గ్రామంలోనైనా, బి.దొడ్డవరం, అప్పనపల్లి బాడవ గ్రామాల్లో మో­కా­లి­కి­పైగా నీటిలో వలంటీర్లు నడచి భు­జాలపై ఆహార పొట్లాలు తీసుకువెళ్లి ఊరందరికీ ఆహా­రం, తాగునీటి ప్యాకెట్లు అందజేశారు. నాటి వర­దల్లో జగన్‌ ప్రభు­త్వం ఉచితంగా నిత్యావస­రాలు, కూరగా­యలను ఏటిగట్లకు చేర్చితే, ఏటిగట్టు నుంచి ఏ గ్రామానికి ఆ గ్రామ వలంటీర్‌ బాధ్యతగా తీసుకుని పడవలో తీసుకువెళ్లి అందించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement