volunteers
-
ఓ మంత్రిగారు.. చించినాడ పూతరేకులు..
సాక్షి, భీమవరం : ‘చంద్రబాబునాయుడుగారు, పవన్కళ్యాణ్గారు చెప్పారమ్మా.. మీ వలంటీరు జాబ్కు రూ.5 వేలు ఏ మూలకి సరిపోతాయి? ఖర్చులు బోలెడు పెరిగిపోయాయి కదా? మన ప్రభుత్వంలో వలంటీరు వ్యవస్థను కొనసాగిస్తాం. మీకు రూ.10 వేలు జీతం ఇస్తాం. రేపొద్దున్న మన ప్రభుత్వంలో అన్నయ్య ఇదిగో 10 వేలు అందుకున్నానని ఆనందంగా మన చించినాడ పూతరేకుల ప్యాకెట్ పట్టుకుని రావాలి’.. అంటూ పాలకొల్లు నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేగా నిమ్మల రామానాయుడు(Nimmala Rama Naidu)ఎక్కడ వలంటీరు కనిపించినా ఈ హామీ ఇచ్చేవారు.రూ.10 వేలు తీసుకున్నాక ఆనందంగా చించినాడ పూతరేకుల ప్యాకెట్ కానుకగా ఇవ్వాలని చెప్పి ఆకట్టుకునే ప్రయత్నం చేసేవారు. అప్పట్లో ఆయన పాలకొల్లు కళాకారులనే మించిపోయారు. ఇంటింటికీ వెళ్లి అమ్మ, అక్క, చెల్లి, బావ, తమ్ముడు.. అని అందరితో వరసలు కలుపుతూ సూపర్ సిక్స్లో ఎవరెవరికి ఎంత నగదు వస్తుందో తనదైన శైలిలో వివరించేవారు. ఆనక ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టులు చేయించుకునే వారు. ఇప్పుడదే ఆయన్ను వెంటాడుతోంది.పాలన పగ్గాలు చేపట్టి ఎనిమిది నెలలు కావస్తోంది. ఆర్థిక పరిస్థితి చూస్తుంటే హామీల అమలు సాధ్యంకాదంటూ సీఎం చంద్రబాబు చేతులెత్తేయ్యడంతో సూపర్సిక్స్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రజలు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్, నిమ్మల ప్రసంగాలు, వాటి అమలుకు ఇప్పుడు చేతులెత్తేసిన దృశ్యాలతో రీల్స్ ద్వారా ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. మంత్రి నిమ్మలకు రీల్స్ సెగ.. ఇక పాలకొల్లులోని ఒక ఇంటి వద్ద ఉన్న చిన్నపిల్లలను చూపిస్తూ నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అంటూ నాడు నిమ్మల రామానాయుడు చెప్పిన వీడియో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. తలి్లకి వందనం ఇప్పట్లో రాదని తెలిసి ఆ వీడియోకు గోదావరి వెటకారం, యాసను జోడించి మరీ నెటిజన్లు రీల్స్ చేసి మంత్రి నిమ్మలకు వ్యతిరేకంగా పోస్టు చేస్తున్నారు. కొందరైతే తమ సెల్ఫోన్లకు ఈ ఆడియోను రింగ్టోన్లుగా పెట్టేసుకున్నారు.ఇలా గత రెండ్రోజులుగా నిమ్మల హామీకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండవుతున్నాయి. అలాగే, మన ప్రభుత్వంలో మీకు రూ.10 వేలు వేతనం వచ్చిన ఆనందంతో కానుకగా తనకు చించినాడ పూతరేకులు తీసుకొచ్చి ఇవ్వాలంటూ వలంటీర్లతో చెప్పిన వీడియోలను జతచేసి సోషల్ మీడియాలో వేల సంఖ్యలో షేర్ అవుతున్నాయి. వలంటీర్లను కొందరు కూటమి నేతలు వంచించిన తీరును ఎండగడుతుండగా, మరికొందరు వాటికి మద్దతుగా కామెంట్లు పెడుతూ నిరసన తెలుపుతున్నారు. పూతరేకులు దొరక్క కలవలేకపోయారంటూ వంటి పోస్టులతో ఆడుకుంటున్నారు. అధికారం కోసం హామీలిచ్చేయ్యడం, గద్దెనెక్కాక వాటిని విస్మరించడం పూర్వపు రోజులని.. ఇప్పుడు సోషల్ మీడియా నుంచి తప్పించుకోలేరంటూ సెటైర్లు వేస్తున్నారు. -
వలంటీర్ల కోసం సమిధనవుతా..
సాక్షిప్రతినిధి, విజయవాడ: ‘కష్టాల్లో ఉన్న వలంటీర్ వ్యవస్థను కాపాడుకుందాం.. కరోనా సమయంలో వారు చేసిన సేవలను గుర్తిద్దాం. మనలోని మానవత్వాన్ని చాటుకుందాం’ అంటూ ఓ యువకుడు బ్యానర్ను ప్రదర్శిస్తూ విజయవాడలోని అంబేడ్కర్ స్మృతివనం దగ్గర సోమవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. వలంటీర్లపై టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత ధోరణిని నిరసిస్తూ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్ననికి చెందిన నక్కా వాసు ఒంటిపై పెట్రోల్ పోసుకుని లైటర్తో నిప్పు అంటించుకుంటుండగా.. అక్కడే విధుల్లో ఉన్న సూర్యారావుపేట సీఐ అబ్దుల్ అలీషేక్ అడ్డుకున్నారు.ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న వాసు అనంతరం సూర్యారావుపేట స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా విధుల్లోకి తీసుకోవాలని వలంటీర్లు చేస్తున్న ఆందోళన తనను కలిచి వేసిందన్నాడు. కరోనా సమయంలో సొంత వాళ్లే దగ్గరకు రాని దుర్భర పరిస్థితుల్లో వలంటీర్లు ప్రజలకు మర్చిపోలేని సేవలందించారని గుర్తుచేశాడు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు నేడు పింఛన్ కోసం పడరాని పాట్లు పడుతున్నారని, వలంటీర్లు ఉన్నప్పుడు హాయిగా ఇళ్ల వద్దే పింఛన్లు తీసుకున్నారని చెప్పారు.అప్పటి నుంచే వలంటీర్ వ్యవస్థకు అభిమానిగా మారానని, అంతటి సేవ చేసిన వలంటీర్లను ప్రస్తుత ప్రభుత్వం విధుల్లోకి తీసుకోకుండా వేధిస్తుండటంపై మనస్తాపానికి లోనై ఆత్మహత్య చేసుకునేందుకు యత్నంచినట్టు చెప్పాడు. వాసు కొన్నేళ్లుగా తండ్రితో కలిసి ఉండవల్లి సమీపంలోని పోలకంపాడులో ఉంటున్నాడు. కుంచనపల్లిలో నాటు కోళ్ల ఫాంను నడుపుతూ విజయవాడ, గుంటూరు, మంగళగిరి ప్రాంతాల్లోని చికెన్ షాపులకు సరఫరా చేస్తుంటాడు. వాసు తండ్రి ఫైర్ స్టేషన్లో పని చేస్తుంటాడు. వాసుకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. వలంటీర్ వ్యవస్థ రావాలని బలంగా కోరుకుంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. -
బాబు, పవన్ ను ఏకిపారేసిన వాలంటీర్లు
-
చంద్రబాబు ప్రభుత్వ తీరుపై వాలంటీర్ల మండిపాటు
-
‘చలో విజయవాడ’పై ఉక్కుపాదం.. వాలంటీర్ల గృహ నిర్బంధం
సాక్షి, విజయవాడ: వాలంటీర్ల ‘చలో విజయవాడ’(Chalo Vijayawada) కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల(Volunteers)ను హౌస్ అరెస్ట్ చేశారు. కేబినెట్లో వాలంటీర్ల అంశంపై ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సెక్రటేరియట్కు వెళ్లి సీఎంను కలుస్తామన్న వాలంటీర్లపై ప్రభుత్వం నిర్బంధం విధించింది. విజయవాడలోని దాసరి భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.చలో విజయవాడను అడ్డుకోవడంపై వాలంటీర్లు మండిపడ్డారు. గత ఎనిమిది నెలల నుంచి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాం. వాలంటీర్లకు ఉద్యోగం కల్పించడంతో పాటు బకాయి పడ్డ ఎనిమిది నెలల వేతనం ఇవ్వాలి. పోలీసులతో అడ్డుకున్నంత మాత్రాన మా పోరాటం ఆగదు’’ అని గ్రామ వార్డు వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ హుమాయున్ బాషా అన్నారు.‘‘ఈ ప్రభుత్వాన్ని కుప్పకూల్చే వరకూ వదిలిపెట్టం. చంద్రబాబు అబద్ధాల ముఖ్యమంత్రిగా పేరు సంపాదించుకున్నాడు. మమ్మల్ని మోసం చేసిన ఈ ప్రభుత్వం ఎప్పుడుపోతుందోనని వాలంటీర్లు ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాట తప్పి మహిళలను మోసం చేశారు. పుట్టని బిడ్డకు పేరెలా పెడతామని మంత్రి డోలా బాలవీరాంజనేయులు మాట్లాడటం సిగ్గుచేటు’’ అని షేక్ హుమాయున్ బాషా మండిపడ్డారు.వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి: చంద్రశేఖర్రెడ్డి 2.50 లక్షల మంది వాలంటీర్లను చంద్రబాబు మోసం చేశారని ఏపీఎన్జీవో అసోసియేషన్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి మండిపడ్డారు. చలో విజయవాడ పేరుతో నిరసనకి పిలుపు ఇస్తే వారిని హౌస్ అరెస్టులు చేస్తున్నారు. వాలంటీర్లను అరెస్టు చేయటం హేయమైన చర్య. ఎన్నికలకు ముందు వాలంటీర్లకు పది వేల జీతం ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. పవన్ కల్యాణ్, లోకేష్ కూడా వాలంటీర్లకు హామీలు ఇచ్చి ఇప్పుడు ఎగ్గొట్టారు’’ అని ఆయన ధ్వజమెత్తారు.‘‘పది వేలకు జీతం పెంచకపోగా గత ఏడు నెలలుగా జీతాలు కూడా ఇవ్వటం లేదు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు అమలు చేయాలి. ఇప్పుడేమో అసలు వాలంటీర్ల వ్యవస్థే ప్రభుత్వంలో లేదంటూ హేళన చేస్తున్నారు. వాలంటీర్లకు సంబంధించిన జీవో లేకపోతే ఈ ప్రభుత్వం తొలిరోజుల్లో వారిని ఎలా వాడుకుంది?. పంచాయతీరాజ్ శాఖ ద్వారా వాలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి’’ అని చంద్రశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ‘నాది రాజకీయ పాలన..’ చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్ర దుమారం -
వాలంటీర్లకు పదివేలు ఇస్తానని చంద్రబాబు మోసం చేశారు: పెద్దిరెడ్డి
-
వలంటీర్లను కొనసాగించలేం
సాక్షి, విశాఖపట్నం: వలంటీర్ల వ్యవస్థను కొనసాగించలేమని, వారిని విధుల్లోకి తీసుకుంటే న్యాయ పరమైన సమస్యలు తలెత్తుతాయని ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. వలంటీర్లపై స్పష్టమైన విధానంతో ఉన్నామని చెప్పారు. పుట్టని బిడ్డకు పేరెలా పెడతామని తమ మంత్రి ఇప్పటికే స్పష్టం చేశారని వ్యాఖ్యానించారు. ‘వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం. అంతేకాకుండా మీ గౌరవ వేతనాన్ని నెలకు రూ.5 వేల నుంచి రెట్టింపు చేసి రూ.10 వేలు ఇస్తాం’ అని ఎన్నికల ముందు ఎంతో నమ్మకంగా ఊరూరా బహిరంగ సభల్లో పదే పదే చెప్పిన చంద్రబాబు, లోకేశ్.. కూటమి పార్టీల నేతలు అధికారంలోకి రాగానే నిస్సిగ్గుగా ఇలా మాట మార్చడం విస్తుగొలుపుతోంది.మంత్రి లోకేశ్ తీరు ఏరు దాటాక తెప్పను తగలేసిన వైనాన్ని గుర్తుకు తెస్తోంది. ప్రజల ఇళ్ల వద్దకే సేవలు అందించడానికి విప్లవాత్మకంగా తీసుకొచ్చిన వలంటీర్ వ్యవస్థపై గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్పష్టమైన వైఖరితో ముందుకు సాగడం అందరికీ తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి పార్టీల నేతలు ఎన్నికల కమిషన్ను అడ్డుపెట్టుకుని వలంటీర్ల సేవలను ఆపించినా, గత ప్రభుత్వం వారికి ఏప్రిల్, మే నెల జీతాలు అందజేసింది. జూన్ 1న వారు వేతనం అందుకున్నారు. ఆ సమయంలో అప్పటి సీఎం వైఎస్ జగన్.. కూటమి నేతల వైఖరిని ఎండగడుతూ.. ‘తాత్కాలికంగా వాళ్లు మీ సేవలను ఆపించారు. అయినా ఏప్రిల్, మే నెలల జీతాలిచ్చాం. ఎన్నికలవ్వగానే తిరిగి మీరు మీ విధి నిర్వహణలో ఉంటారు.’ అని స్పష్టం చేయడం విదితమే.హెడ్ ఆఫ్ ఆకౌంట్ల వివరాలే అందుకు నిదర్శనం. వలంటీర్ల సేవలను ప్రశంసిస్తూ ఏటా వారిని మూడు రకాల అవార్డులతో సత్కరించడం కూడా తెలిసిందే. ఇలాంటి వలంటీర్ల వ్యవస్థపై కూటమి నేతలు ఆది నుంచీ విషం చిమ్ముతూనే ఉన్నారు. ఓ దశలో వారిపై కిడ్నాపర్లుగా, సంఘ విద్రోహ శక్తులుగా, ఉమెన్ ట్రాఫికర్స్గా కూడా నిందలేశారు. తీరా ఎన్నికలు సమీపించగానే.. వారిని బుట్టలో వేసుకుని ఓట్లు వేయించుకోవడానికి నెలకు రూ.10 వేలు ఇస్తామని డప్పు కొట్టారు.కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడు నెలలు గడుస్తున్నా, వలంటీర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. ఈ విషయాన్ని ప్రశ్నిస్తూ వారు కొద్ది రోజులుగా ఆందోళన బాట పట్టారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్ల పరిశీలనకు గాను ఆదివారం విశాఖ వచ్చిన మంత్రి లోకేశ్.. వలంటీర్లపై తన కపట వైఖరిని వెల్లడించడం చూసి సర్వత్రా విస్మయం వ్యక్తమైంది. వారిని ఇక కొనసాగించే ప్రసక్తే లేదన్నట్లు చెప్పడం పట్ల వలంటీర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీతాలకే డబ్బుల్లేవు.. ‘ప్రతినెలా రూ.4 వేల కోట్ల ఆర్థిక లోటుతో రాష్ట్ర బడ్జెట్ నడుస్తోంది. జీతాలు ఇవ్వడానికి సైతం ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది. కేంద్రం సహకారంతో నెట్టుకొస్తున్నాం’ అని లోకేశ్ అన్నారు. గంజాయి నిర్మూలనకు రెండేళ్ల సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. వాల్తేరు డివిజన్ను రెండు రాష్ట్రాలు చూసుకుంటాయని, మిలీనియం టవర్లో టీసీఎస్ సెంటర్ రావడానికి మరో రెండు, మూడేళ్లు పడుతుందన్నారు. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ, చెన్నై–విశాఖ ఇండ్రస్టియల్ కారిడార్లో క్రిస్ సిటీనోడ్, పలు జాతీయ రహదారుల నిర్మాణంతో పాటు రైల్వే జోన్కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారన్నారు. -
వాలంటీర్లను విధుల్లోకి తీసుకోమని పరోక్షంగా స్పష్టం చేసిన లోకేష్
-
వాలంటీర్లను తీసుకుంటే లీగల్ సమస్యలు: నారా లోకేష్
సాక్షి, అమరావతి: కూటమి నేతలు మాటల మార్చారు. వాలంటీర్ల విషయంలో కూటమి నేతలు యూటర్న్ తీసుకున్నారు. ఎన్నికలకు ముందు ఒకలా.. ప్రభుత్వంలో మరోలా మాట్లాడుతూ.. వాలంటీర్ల(volunteers)ను తీసుకుంటే లీగల్ సమస్యలు వస్తాయని బూకాయిస్తున్నారు. దీంతో, వాలంటీర్లకు నిరాశే ఎదురుకానుంది.వాలంటరీ వ్యవస్థకు కూటమి ప్రభుత్వం మొండిచేయి ఇచ్చింది. వారిని విధుల్లోకి తీసుకోమని మంత్రి నారా లోకేష్(Nara Lokesh) పరోక్షంగా స్పష్టం చేశారు. పుట్టని బిడ్డకు పేరు ఎలా పెడతారని తమ మంత్రి చెప్పారని ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో వాలంటీర్లను తీసుకుంటే లీగల్ సమస్యలు వస్తాయని చెప్పుకొచ్చారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) మాత్రం ఎన్నికలకు ముందు వాలంటరీ వ్యవస్థ కొనసాగుతుందన్నారు. అలాగే, వాలంటీర్లకు రూ.10వేలు జీతం ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. కానీ, అధికారంలోకి వచ్చాక కూటమి నేతలు మాట మార్చడం గమనార్హం.ఇదిలా ఉండగా.. రాష్ట్రవ్యాపంగా వాలంటీర్లు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. తమను విధుల్లోకి తీసుకోవాలని నిరసనల్లో పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు కూటమి నేతలు హామీ ఇచ్చిన విధంగా తమకు రూ.10వేల జీతం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నిరసనల్లో భాగంగా విజయవాడలో వాలంటీర్లు వినూత్నంగా వెనక్కి నడుస్తూ ఆందోళనలు చేపట్టారు. ఇది యూటర్న్ ప్రభుత్వం అనే ప్రయత్నం భాగంగా తాము ఇలా వెనక్కి నడిచినట్టు తెలిపారు. -
ఊపందుకుంటున్న వలంటీర్ల ఆందోళనలు
సాక్షి,అమరావతి/సత్యనారాయణపురం(విజయవా డ సెంట్రల్)/కర్నూలు (సెంట్రల్): ఎన్నికల ముందు ఉగాది పండుగ రోజున చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మి మోసపోయిన వలంటీర్ల ఆందోళనలు మరింతగా ఊపందుకున్నాయి. వరుసగా గురు, శుక్ర, శనివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మరోవిడత ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 2న గ్రామ, వార్డు సచివాలయం అడ్మిన్లకు వినతిపత్రాలు ఇవ్వగా.. 3న జిల్లా కేంద్రాల్లో న్యాయం చేయాలని కోరుతూ వలంటీర్లు మోకాళ్ల మీద కూర్చుని భిక్షాటన చేశారు.ఇక శనివారం (4న) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వలంటీర్లూ వెనుకకు నడుస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వలంటీర్లకు న్యాయంచేస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక యూటర్న్ తీసుకోవడాన్ని నిరసిస్తూ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ బ్యాక్వాక్ చేస్తున్నారన్న దానిని గుర్తుచేస్తూ తమ ఆందోళన నిర్వహించారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్లను కొనసాగించడంతో పాటు వలంటీర్లకు రూ.10 వేలు ఇచ్చే బాధ్యత తమది అంటూ ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వలంటీర్ల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని వలంటీర్ల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. పైగా.. జూన్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి ఇప్పటివరకు వేతనాలు చెల్లించలేదని వారంటున్నారు. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ వలంటీర్లు వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహిస్తున్నారు.ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తాం..ఈ నేపథ్యంలో శనివారం విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో వలంటీర్లు ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ వెనక్కి నడిచి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పరుచూరి రాజేంద్రబాబు, లంక గోవిందరాజులు మాట్లాడుతూ.. విజయవాడ వరద ముంపు సమయంలో వలంటీర్లతో సేవలు చేయించుకుని నేడు కనీసం వారికి సచివాలయాల్లో హాజరు వేసుకునే అవకాశం కూడా కల్పించకుండా వేధిస్తున్నారని మండిపడ్డారు.వలంటీర్లకు గత ఎనిమిది నెలలుగా జీతాలు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఇచ్చిన హామీ మేరకు వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించి వారికి రూ.పది వేల గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా 2.60 లక్షల వలంటీర్లు, వారి కుటుంబ సభ్యులు అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడించి నిరసన తెలియజేస్తామని వారు హెచ్చరించారు.బాబుగారూ.. మా కడుపులు కొట్టొద్దు!ఇక కర్నూలులో కూడా వలంటీర్లు వినూత్నంగా నిరసన వ్యక్తంచేశారు. ఖాళీ ప్లేట్లు పట్టుకుని భిక్షాటన చేశారు. తమ కడుపులు కొట్టొద్దని సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ను ఈ సందర్భంగా వేడుకున్నారు. ముందుగా కలెక్టరేట్ గేటు నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా నిర్వహించారు. అనంతరం అక్కడ ధర్నా నిర్వహించి భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా వలంటీర్లు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా స్వచ్ఛంధంగా పనిచేశామని.. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమను తీసివేయడం అన్యాయమన్నారు. ఎన్నికల సమయంలో వలంటీర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. లేదంటే పెద్దఎత్తున వీధి పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమాలకు ఏఐవైఎఫ్ మద్దతిస్తోంది. -
బాబు వచ్చాడు.. జాబ్ తీశాడు.. వెనక్కి నడిచి వాలంటీర్ల నిరసన
-
ఉద్యోగ భద్రత కల్పించాలి..
సాక్షి నెట్వర్క్: తమకు ఉద్యోగ భద్రత(job security) కల్పించాలని, ఎన్నికల ముందు టీడీపీ(TDP) ఇచ్చిన హామీ మేరకు రూ.10 వేల వేతనం ఇవ్వాలని డిమాండు చేస్తూ గ్రామ, వార్డు వలంటీర్లు(Volunteers) శుక్రవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరసన దీక్షలు చేపట్టారు. తక్షణం వలంటీర్లను రెన్యువల్ చేసి, ఆరు నెలలుగా పేరుకుపోయిన వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన దీక్షలకు ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు సంఘీభావం తెలిపి మాట్లాడారు. అధికారంలోకి రాక ముందు ఒక మాట, వచ్చాక మరోమాట మాట్లాడడం చంద్రబాబుకు అలవాటేనని విమర్శించారు.అల్లూరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ ఎదుట వలంటీర్లు నిరసన దీక్షలు(Volunteers Protest) ప్రారంభించారు. వలంటీర్లను రెన్యూవల్ చేయకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం మోసంచేసిందని ఆరోపిస్తున్న టీడీపీ నాయకులు.. లిక్కర్ టెండర్లు, ఇసుక టెండర్లు ఇచ్చినట్లుగానే వలంటీర్లను కూడా రెన్యువల్ చేస్తూ ఎందుకు ఆదేశాలివ్వరని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం తమను రోడ్డునపడి అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చిందని విజయవాడలో వలంటీర్లు ఆవేదన వ్యక్తంచేశారు. తమ దుస్థితికి ప్రభుత్వమే కారణమంటూ వారు దుమ్మెత్తి పోశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వలంటీర్స్ అసోసియేషన్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం జరిగింది. కూటమి ప్రభుత్వం తమను రోడ్డున పడేసిందని, ఈ దుస్థితికి కారణం ప్రభుత్వమేనని ఆరోపించారు. మంచి ప్రభుత్వమని స్టిక్కర్లు వేసుకోవడం కాదు, వలంటీర్లకు మేలుచేసే మంచి జీఓలు తెచ్చి రాష్ట్రంలోని 2.60 లక్షల వలంటీర్ల కుటుంబాలను ఆదుకోవాలని వలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు కోరారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేల ఇళ్ల వద్దకు వెళ్లి భిక్షాటన చేస్తామని.. అలా చంద్రబాబు ఇంటికీ వెళ్తామన్నారు. ఇక విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కూడా ఈ నిరసన దీక్ష జరిగింది. -
చంద్రబాబుకు జ్ఞానాన్ని ప్రసాదించండి
అజిత్సింగ్నగర్ (విజయవాడసెంట్రల్)/కపిలేశ్వరపురం/అయినవిల్లి : ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే బుద్ధి, జ్ఞానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రసాదించాలని కోరుతూ వలంటీర్లు ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఏపీ వలంటీర్ అసోసియేషన్, ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సింగ్నగర్ కృష్ణా హోటల్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద గురువారం వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ వలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు మాట్లాడుతూ.. చంద్రబాబు 2024 ఎన్నికలకు ముందు వలంటీర్లను కొనసాగిస్తామని, వారికి నెలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని, అన్ని విధాలా న్యాయం చేసి ఆదుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇటీవల విజయవాడలో బుడమేరు వరదల సమయంలో కూడా వలంటీర్లతో సేవలు చేయించుకొని, సచివాలయాల్లో కనీసం అటెండెన్స్ వేసుకునే అవకాశాన్ని కూడా కల్పించకుండా వివక్ష చూపుతోందన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా బకాయి పడ్డ గౌరవ వేతనం చెల్లించలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులకు తగిన జ్ఞానాన్ని, బుద్ధిని ప్రసాదించి వలంటీర్లకు న్యాయం చేసేలా చూడాలని కోరుతూ ఎన్టీఆర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మమత, దమ్ము రమేష్, నరేష్, కల్యాణ్, షేక్ సైదాబీ, భాను, తేజస్విని, స్వప్న, షైనీ, రాజ్ కుమార్, సీపీఐ నాయకుడు కె.వి.భాస్కరరావు, ఏఐటీయూసీ, ఏఐవైఎఫ్ నాయకులు పాల్గొన్నారు.ఎన్నికల హామీని అమలు చేయాలి గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామంటూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేసి, తమను విధుల్లోకి తీసుకోవాలని వలంటీర్లు ప్రభుత్వాన్ని కోరారు. ఏడు నెలలుగా తమకు జీత భత్యాలు ఇవ్వడం లేదని ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపారు. కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కేదారిలంక, అయినవిల్లి మండలం వీరవల్లిపాలెంలోని పంచాయతీ కార్యాలయాల్లో ఈ మేరకు గురువారం వారు వినతిపత్రాలు అందజేశారు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తిలో వలంటీర్లు తమ సమస్యలపై సచివాలయంలో వినతిపత్రం అందజేశారు. -
ఏపీ వ్యాప్తంగా వాలంటీర్ల నిరసన
-
రేపటి నుంచి వలంటీర్ల నిరసనలు
సాక్షి, అమరావతి: కొత్త సంవత్సరంలోనైనా సీఎం చంద్రబాబు ఎన్నికల వాగ్ధానాలను అమలు చేయాలని, వలంటీర్లకు న్యాయం చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలంటూ స్టేట్ వలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. 2న జరగనున్న కేబినెట్ భేటీలో వలంటీర్లకు న్యాయం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతూ 2,3,4 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.జనవరి 2న గ్రామ, వార్డు సచివాలయం అడ్మిన్లకు వినతి పత్రాలు, 3న జిల్లా కేంద్రాల్లో మోకాళ్లమీద కూర్చుని భిక్షాటన, 4న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బ్యాక్ వాక్ చేస్తున్నారని గుర్తు చేస్తూ వలంటీర్లు బ్యాక్ టు వాక్ పేరుతో వెనుకకు నడుస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వివరించారు. -
‘ఉద్యోగ భద్రత’ హామీ నిలబెట్టుకోండి
సాక్షి,పాడేరు/హుకుంపేట/ముంచింగిపుట్టు (అల్లూరి జిల్లా): గ్రామ వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ.. రూ.10 వేల వేతనంతో ఉద్యోగ భద్రత కల్పిస్తామని కూటమి నేతలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వలంటీర్లు డిమాండ్ చేశారు. పాడేరుతో పాటు చింతూరు, జి.మాడుగుల, అరకులోయ, ముంచంగిపుట్టు, హుకుంపేట తదితర ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి రిలే దీక్షలు నిర్వహించారు. దీక్షల ముగింపు సందర్భంగా శనివారం ధర్నాలు, ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. హుకుంపేటలో వలంటీర్ల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బర్లు కొండబాబు,గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు టి.కృష్ణారావు మాట్లాడుతూ వలంటీర్ల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. జి.మాడుగులలో వలంటీర్లంతా రోడ్డుపై భిక్షాటన చేశారు. కూటమి ప్రభుత్వం మొండి వైఖరిని వీడి తమకు న్యాయం చేయని పక్షంలో తమ ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
ఆందోళనలతో దద్దరిల్లుతున్న ఏపీ..
-
Andhra Pradesh: ఆందోళనలతో అట్టుడికిన రాష్ట్రం
సాక్షి, నెట్వర్క్: కూటమి సర్కారు తీరుపై రాష్ట్రం నలుచెరుగులా అసహనం కట్టలు తెంచుకుంది. గిరిజన గురుకులాల టీచర్లు సీఎం చంద్రబాబు ఇంటి ఎదుట బైఠాయించారు.. విధుల్లోకి తీసుకోవాలంటూ వలంటీర్లు ధర్నాలు చేపట్టారు.. సమ్మె సైరన్ మోగించిన 108 ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు.. సమస్యలు పరిష్కరించాలంటూ పిడికిలి బిగించి ఆశా వర్కర్లు భారీ ధర్నాకు దిగారు.. ఆకలి కేకలతో అలమటిస్తున్న ఆయాలు పెండింగ్ జీతాల కోసం పొలికేక పెట్టారు.. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సోమవారం ఎక్కడికక్కడ రోడ్లెక్కితే.. ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు.. పారిశుధ్య కార్మీకులు.. వీవోఏలు.. మధ్యాహ్న భోజన కార్మీకులు.. పాఠశాల ఆయాలు.. సీహెచ్సీ వైద్యులు.. వెలుగు యానిమేటర్లు వివిధ రూపాల్లో ఆందోళనలు.. నిరసనలు చేపట్టారు. మొత్తంగా వీరందరి ఆందోళనలతో రాష్ట్రం అట్టుడికింది. 108 ఉద్యోగుల భారీ ధర్నా సకాలంలో జీతాలు చెల్లించడంతోపాటు 104, 108 వ్యవస్థలను ప్రభుత్వమే నిర్వహించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. విజయవాడ ధర్నా చౌక్లో 108 అంబులెన్స్ ఉద్యోగులు సోమవారం మహాధర్నా చేపట్టారు. ఏపీ 108 సేవల కాంట్రాక్టు ఉద్యోగుల యూనియన్ గౌరవాధ్యక్షులు ఏవీ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 25 నుంచి సమ్మె చేపడతామని నోటీసిచ్చినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చల పేరిట ఈనెల 22న వైద్యశాఖ ఉన్నతాధికారులు బెదిరింపు ధోరణిలో మాట్లాడారన్నారు. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలోనూ 108 ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, తమను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. కలెక్టరేట్ల వద్ద వలంటీర్ల నిరసన ఏపీ గ్రామ, వార్డు వలంటీర్లు సోమవారం గుంటూరు, నెల్లూరు, కర్నూలు, అన్నమయ్య జిల్లా రాయచోటి, పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టరేట్లు, రాజంపేట సబ్ కలెక్టరేట్ వద్ద, విజయవాడ ధర్నా చౌక్లో భారీ ధర్నాలు, ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వలంటీర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. విజయవాడ అలంకార్ సెంటర్లోని ధర్నాచౌక్లో అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఇందులో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు తలకిందులుగా నిలబడి నిరసన తెలియజేశారు. గుంటూరు, నెల్లూరు, కర్నూలు కలెక్టరేట్ల వద్ద సంఘ నేతలు మాట్లాడుతూ తమను ఉద్యోగాల్లోకి తీసుకొని, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఔట్సోర్సింగ్ అధ్యాపకుల ధర్నా రాష్ట్రంలోని గిరిజన గురుకులాల్లోని ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు తమను మెగా డీఎస్సీ నుంచి మినహాయించాలని, ఔట్సోర్సింగ్ నుంచి కాంట్రాక్ట్ విధానంలోకి మార్చాలని, 2022 పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్లో సోమవారం భారీ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లాలోనూ కలెక్టరేట్ వద్ద ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు ధర్నా చేపట్టారు. దద్దరిల్లిన విశాఖ కలెక్టరేట్చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ.. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ చేసిన ధర్నాలతో విశాఖపట్నం కలెక్టరేట్ సోమవారం దద్దరిల్లింది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మీకులు, సామాజిక కార్యకర్తలుగా వ్యవహరిస్తున్న వీవోఏలతో పాటు మధ్యాహ్న భోజన పథకం కార్మీకులకు 5 నెలల వేతన బకాయిలు చెల్లించాలంటూ భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లులు చెల్లించాలంటూ నినాదాలు చేసి కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ⇒ విశాఖ సెవెన్హిల్స్ ఆస్పత్రిలో 30 మంది హౌస్కీపింగ్ కార్మీకులను తొలగించడాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ⇒ ఇసుక విధానం ఎంతోమంది జీవితాల్ని రోడ్డున పడేసిందంటూ క్వారీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కలెక్టరేట్ ఎదుట భారీఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టింది. అసోసియేషన్ కార్యదర్శి కర్రి రమణ ఆధ్వర్యంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్కు వినతిపత్రం అందించారు. ఇసుక రీచుల్లో దళారులు దోచేస్తున్నారనీ.. టన్నుకు అదనంగా రూ. 300 వరకూ వసూలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయాల ఆందోళనచిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఆయాలకు 5 నెలలుగా జీతాలు మంజూరు చేయలేదని సోమవారం ఆయాలు చిత్తూరు కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఆయాలకు చీపురుకట్టలు, ఫినాయిల్, గ్లౌజు, సోపులు ప్రభుత్వమే ఇవ్వాలన్నారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట పెండింగ్ జీతాలు ఇవ్వాలని పాఠశాలలో పని చేసే ఆయాలు ధర్నాకు దిగారు. పంటకు పరిహారం ఇవ్వాలని ధర్నావిజయనగరం జిల్లాలో కోత దశలో ఉన్న వరి పంటను కత్తెర, కొమ్ము పురుగు ఆశించి కంకులన్నీ రాలిపోతున్నాయని, పరిహారం అందజేయాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సభ్యులు సోమవారం ధర్నా చేశారు. సమగ్ర కులగణన చేపట్టాలిసమగ్ర కులగణన చేపట్టాలని బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు కల్లూరి నాగరాజు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా చేపట్టారు. ఇదే విషయంపై రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కమిటీ నాయకులు అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్కు వినతిపత్రం అందించారు. తక్షణం బ్లాస్టింగ్లు ఆపండి.. అపరిమిత బ్లాస్టింగ్లతో మార్టూరు బీటలు వారుతోందని, సర్వే నంబర్ 1 కొండపై ఖనిజాన్ని దోచేస్తూ ప్రజలను కాలుష్యంలోకి నెట్టేస్తున్న క్వారీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అనకాపల్లి మండలం మార్టూరు గ్రామస్తులు డిమాండ్ చేశారు. కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టి.. కిడ్నీ బాధితులుగా మారుతున్న ప్రజలను కాపాడాలంటూ కలెక్టరేట్లో ఫిర్యాదు ఇచ్చారు.చంద్రబాబు ఇంటి వద్ద ధర్నావిద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ను కలిసేందుకు గిరిజన సంక్షేమ గురుకులాల ఔట్సోర్సింగ్ టీచర్ల ప్రయత్నానికి పోలీసులు సోమవారం అడ్డుతగిలారు. మెగా డీఎస్సీతో తమకు అన్యాయం జరుగుతోందని, కనీసం తమను కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్(సీఆర్టీ)గా మార్చాలనే డిమాండ్పై 1,656 మంది ఔట్సోర్సింగ్ టీచర్లు ఈ నెల 16 నుంచి సమ్మెబాట పట్టిన సంగతి తెలిసిందే. ఉండవల్లిలో సీఎం చంద్రబాబు నివాసం వద్ద ధర్నా చేస్తున్న గిరిజన సంక్షేమ గురుకులాల ఔట్సోర్సింగ్ టీచర్లు అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఉండవల్లిలోని ప్రజాదర్బార్ వేదిక వద్ద లోకేశ్ను కలిసేందుకు ఔట్సోర్సింగ్ టీచర్లు తరలివచ్చారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. లోకేశ్ను కలిసి వినతిపత్రం అందిస్తామని టీచర్లు ఎంత మొరపెట్టుకున్నప్పటికీ పోలీసులు అనుమతించలేదు. పోలీసులు, టీచర్ల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. దీంతో సీఎం ఇంటి వద్దే టీచర్లు బైఠాయించారు. పరిస్థితి అదుపుతప్పేలా ఉండటంతో గిరిజన గురుకుల విద్యా సంస్థ కార్యదర్శి సదా భార్గవి వచ్చి వారితో చర్చలు జరిపారు. ప్రభుత్వం దృష్టికి మీ విషయాన్ని తీసుకెళ్తామని, విధుల్లో చేరాలని కోరారు. ఇప్పటికే ఒకసారి ఆందోళన చేశామని, తమ డిమాండ్ను పరిష్కరిస్తామని మంత్రి సంధ్యారాణి హామీ ఇచ్చి ఇంత వరకు పరిష్కరించలేదని టీచర్లు మండిపడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు సమ్మె విరమించేదిలేదని స్పష్టం చేశారు. దీంతో సదాభార్గవి ఈ విషయాన్ని ఉన్నతాధికారుల ధృష్టికి తీసుకెళ్లారు. అనంతరం లోకేశ్ సమావేశంలో బిజీగా ఉన్నారంటూ లోకేశ్ ఓఎస్డీ వరప్రసాద్ ఔట్సోర్సింగ్ టీచర్లతో మాట్లాడారు. తమను కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్లుగా పరిగణించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని మంత్రి లోకేశ్ దృష్టికి తీసుకెళ్లి మూడు రోజుల్లో ఏ విషయాన్ని చెబుతామని వరప్రసాద్ చెప్పడంతో ఔట్సోర్సింగ్ టీచర్లు ధర్నాను విరమించి వెనుదిరిగారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించే వరకు సమ్మె విరమించేది లేదని గిరిజన గురుకులాల ఔట్సోర్సింగ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మీనాయక్ తేల్చిచెప్పారు. 15 ఏళ్లకుపైగా గురుకులాల్లో కేవలం రూ.10,500 నుంచి రూ.18,000 చాలీచాలని జీతాలతో సేవలు అందిస్తున్న తమకు డీఎస్సీ కారణంగా అన్యాయం జరుగుతోందన్నారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించేవరకు సమ్మె కొనసాగిస్తామని చెప్పారు. పిడికిలి బిగించిన ఆశా వర్కర్లు.. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో ఆశాలు భారీ ధర్నా నిర్వహించారు. తమను ప్రభుత్వం కార్మీకులుగా గుర్తించాలని, పదవీ విరమణ ప్రయోజనాలను అందించాలని డిమాండ్ చేశారు. అలాగే రిటైర్మెంట్ వయసును పెంచాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, సహజ మరణానికి రూ. 2లక్షలు, ప్రమాదవశాత్తు చనిపోతే రూ. 6 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పీహెచ్సీ వైద్యుల ధర్నా విజయవాడ ధర్నా చౌక్లో పీహెచ్సీల్లో పనిచేస్తున్న వైద్యులు ధర్నా చేశారు. పీజీ కోటా తగ్గింపుపై ఆందోళన చేపట్టారు. బుడమేరు వరదల వల్ల నష్టపోయిన తమకు పరిహారం అందించాలని కోరుతూ బాధితులు ధర్నా చేపట్టారు. భవన నిర్మాణ కార్మికుల ఆందోళన ప్రభుత్వం ఉచిత ఇసుక అందించాలని కోరుతూ భవన నిర్మాణ కార్మికులు విజయవాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. పనులు లేక అల్లాడుతున్న 40లక్షల మంది కార్మీకులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఏపీ వెలుగు యానిమేటర్ల ధర్నా విజయవాడలో కలెక్టరేట్ వద్ద ఏపీ వెలుగు యానిమేటర్లు ధర్నా నిర్వహించారు. రాజకీయ కక్షలతో తొలగించిన వీఓఏలను విధుల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీలు రద్దు చేయాల్సిందే విద్యుత్ సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలని సీపీఎం నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు సిర్ల ప్రసాద్ శ్రీకాకుళం జిల్లా హిరమండలం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు. నిత్యావసర వస్తువుల ధరలతో బెంబెలేత్తిపోతున్న సామాన్యులపై విద్యుత్ చార్జీల పేరుతో మరింత భారం మోపడం సరికాదన్నారు. విజయవాడలోనూ విద్యుత్ ట్రూఅప్ చార్జీల పేరుతో వినియోగదారులపై భారాలు మోపడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. -
విజయవాడ ధర్నా చౌక్ వద్ద వాలంటీర్ల ధర్నా
-
పెద్దలే పిల్లలై..!
ఆటలు, పాటలు.. అంటే మనకు పిల్లలే గుర్తొస్తారు. కానీ వృద్ధులు కూడా తమ బాల్యం నాటి రోజులు గుర్తు చేసుకుని ఆడిపాడితే ఎలా ఉంటుంది. అచ్చు అదే ఆలోచన చేసింది వీ ది వలంటీర్స్ అనే స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థ ఆధ్వర్యంలో వృద్ధుల కోసం ఆదివారం బౌరంపేటలోని ఓ పాఠశాలలో ‘పెద్దల జాతర’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో 30 వృద్ధాశ్రమాల నుంచి దాదాపు 400 మంది వృద్ధులు పాల్గొన్నారు. ఆడుతూ, పాడుతూ, రంగురంగుల బొమ్మలు వేసి రోజంతా సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమాన్ని ఏటా జరుపుతుంటారు. అయితే తొలిసారిగా హైదరాబాద్లో నిర్వహించడం విశేషం. -
ఏపీ వ్యాప్తంగా వాలంటీర్ల నిరసనలు
-
మా ఉద్యోగాలు మాకు ఇచ్చే వరకు చంద్రబాబుని వదిలే ప్రసక్తే లేదు.. వాలంటీర్లు సీరియస్ వార్నింగ్
-
వలంటీర్లను కొనసాగించాలి
సీతమ్మధార/చిలకలూరిపేట/తిరుపతి అర్బన్: వలంటీర్ల వ్యవస్థను కొనసాగించి, రూ.10 వేల వేతనం చెల్లిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు ధర్నా నిర్వహించారు. విశాఖ జీవీఎంసీ గాం«దీపార్కులో జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు మణి మాట్లాడుతూ చంద్రబాబు చెప్పిన మాటకు పూర్తి భిన్నంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థ లేదని ప్రకటించడం విశ్వాస ఘాతుకమని దుయ్యబట్టారు. తక్షణం వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలన్నారు. ఏపీ ప్రజా గ్రామ వార్డు వలంటీర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంధం దీప్తి మాట్లాడుతూ కరోనా సమయంలో ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా అప్పటి సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు సేవలందించామని గుర్తు చేశారు. చాలామంది కరోనా రోగుల్ని ఆస్పత్రులకు తీసుకెళ్లి, మెరుగైన వైద్యం అందించామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తమ బతుకులు నడిరోడ్డు మీదికి వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. వలంటీర్లకు న్యాయం చేయకపోతే విజయవాడలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం కక్షసాధింపు తగదు ఇచ్చిన హామీ మేరకు వార్డు, గ్రామ వలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని ఏపీ వలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జంగాల చైతన్య డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి వలంటీర్లను విధుల్లోకి తీసుకొనేది లేదని చేసిన ప్రకటనకు నిరసనగా శుక్రవారం వలంటీర్లతో కలసి చిలకలూరిపేటలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఉన్న వలంటీర్లను కొనసాగిస్తూ వాళ్లకు ఉద్యోగ భద్రత కలిగిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేయడంతోపాటు ఐదు నెలల బకాయిలు చెల్లించి రూ.10 వేల గౌరవవేతనం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని, రాజకీయ ఒత్తిళ్లతో రాజీనామా చేసిన వలంటీర్లను కొనసాగేలా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కోరారు. సీఎం, డిప్యూటీ సీఎం న్యాయం చేయాలి ‘మా ఉద్యోగం మాకు ఇవ్వండి.. మాకు రాజకీయ రంగు పూయకండి..ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అదేశాలను తు.చ. తప్పకుండా పాటించడమే మా పని.. గత సర్కార్లోను ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చడంలో వారధిలాగానే పనిచేశాం’ అంటూ వలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుపతి కలెక్టరేట్ కార్యాలయం వద్ద వలంటీర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇచి్చన హామీని నిలబెట్టుకోమని గుర్తుచేస్తున్నట్లు చెప్పారు. -
గ్రామ సచివాలయ వాలంటీర్లకు స్వచ్ఛందంగా ద్రోహం చేసిన బాబు
-
చంద్రబాబు వాలంటీర్లను మోసం చేశాడు: Kannababu
-
జీతాల కోసం ఆశా వర్కర్లు రోడ్డెక్కెతున్నారు
-
వలంటీర్ వ్యవస్థకి చంద్రబాబు ప్రభుత్వం షాక్
-
కర్నూలులో రోడ్డెక్కిన వాలంటీర్లు..
-
వలంటీర్ల వ్యవస్థకు మంగళం!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలులో ఐదేళ్లపాటు ఎలాంటి అవినీతి, పక్షపాతం, పైరవీలకు తావులేకుండా సామాజిక పింఛను లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి నగదు అందజేసిన గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థకు కూటమి ప్రభుత్వం మంగళం పాడేసినట్టే. సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2024–25 బడ్జెట్ ప్రతిపాదనల్లో వలంటీర్లకు ప్రతినెలా గౌరవ వేతనాల చెల్లింపుల కోసం నిధులే కేటాయించలేదు.గ్రామ వలంటీర్ల వేతనాలకే 2022–23 ఆరి్థక ఏడాదిలో రూ.1,183.80 కోట్లు, 2023–24 ఆర్థిక ఏడాదిలో రూ.1,201.79 కోట్లను అప్పటి వైఎస్ జగన్ సర్కారు బడ్జెట్లో కేటాయించి వారికి చెల్లించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో 2024–25 ఆర్థిక సంవత్సరానికి గ్రామ వలంటీర్లకు రూ.194.69 కోట్లు, వార్డు వలంటీర్లకు రూ.82.51 కోట్లు మాత్రమే కేటాయించింది. ఆ మొత్తం కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్లో పొందుపర్చి ఏప్రిల్, మే నెలల్లో వలంటీర్లకు చెల్లించిన గౌరవ వేతనాల నిమిత్తమే ప్రస్తుత బడ్జెట్లో కేటాయింపుల కింద చూపించారు.ఆ రెండు నెలల కోసం వ్యయం చేసిన మొత్తం తప్ప.. తదనంతర 10 నెలల నిమిత్తం బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. వలంటీర్లకు ఇప్పటికే ప్రభుత్వం 5 నెలల వేతనాలు బకాయి పడింది. ఆ మొత్తంతోపాటు వచ్చే 5 నెలల వేతనాలు చెల్లించేందుకు బడ్జెట్లో ఎలాంటి ప్రతిపాదన చేయలేదు. పట్టణాల్లో వార్డు వలంటీర్ల పరిస్థితీ అంతే..పట్టణ ప్రాంతాల్లోని సచివాలయాల పరిధిలో పనిచేస్తున్న వార్డు వలంటీర్ల వేతనాలకు సైతం ఎలాంటి కేటాయింపులు చేయలేదు. 2022–23 ఆర్థిక ఏడాదిలో వార్డు వలంటీర్ల కోసం రూ.409.12 కోట్లు, 2023–24 ఆరి్థక ఏడాదిలో రూ.412.37 కోట్లను ప్రతిపాదించిన వైఎస్ జగన్ సర్కారు వారికి చెల్లింపులు చేసింది. తాజాగా కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపాదనల్లో వార్డు వలంటీర్ల కోసం 2024–25 ఆర్థిక సంవత్సరానికి కేవలం రూ.82.51 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే ఇప్పటికే వార్డు వలంటీర్లకు చెల్లించిన ఏప్రిల్, మే నెలల వేతనాలకు ఖర్చు చేసిన మొత్తం తప్ప.. 5 నెలల పెండింగ్ వేతనాలు, వచ్చే 5 నెలల్లో చెల్లించాల్సిన వేతనాలకు పైసా కూడా కేటాయించలేదు. -
వలంటీర్ల కొనసాగింపుపై పిల్లిమొగ్గలు
ఇలా మోసం.. ‘వలంటీర్లను కొనసాగించడానికైనా.. రద్దు చేయడానికైనా అసలు వాళ్లు జీవోలోనే ఎక్కడా లేరు. గత వైఎస్సార్సీïపీ ప్రభుత్వమే వలంటీర్లను చాలా అన్యాయంగా మోసం చేసింది’ బుధవారం ఉపముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన పంచాయతీరాజ్ చాంబర్ ప్రతినిధుల సమావేశంలో పవన్కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలివి.ఇదీ వాస్తవం.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన రెండు నెలల్లోపే 2019 జూన్ 22, 23 తేదీల్లో జీవో–104, జీవో–201 ద్వారా అధికారికంగా ఏర్పడిన గ్రామ/వార్డు వలంటీర్ల వ్యవస్థ కూటమి ప్రభుత్వంలోనూ నేటికీ కొనసాగుతూనే ఉంది. దీనికి విజయవాడ వరద బాధితులకు సాయమందించేందుకు కూటమి ప్రభుత్వం అధికారికంగా వినియోగించుకుంది. వరద బాధితుల గుర్తింపు (ఎన్యుమరేషన్ ప్రక్రియ)లో వలంటీర్లను వినియోగించుకునేందుకు 2024 సెప్టెంబర్ 7న రెవెన్యూ శాఖ (డిజిస్టార్ మేనేజ్మెంట్) స్పెషల్ సీఎస్ జారీ చేసిన మెమో నంబర్–2544493తో పాటు 2024 సెపె్టంబర్ 9న ఎన్జీఆర్ జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులు సైతం సాక్ష్యాలుసాక్షి, అమరావతి: అసెంబ్లీ ఎన్నికలకు ముందు వలంటీర్లకు ఇచి్చన హామీని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం ఆ నెపాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వంపై నెట్టేసి తప్పించుకునేందుకు కొత్త డ్రామాలు మొదలు పెట్టింది. ఏపీలో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ఈ ఏడాది జూన్ 12న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ.. వలంటీర్లు అనేవారే ప్రభుత్వం అధికారికంగా జారీ చేసిన జీవోల్లో ఎక్కడా లేరన్నట్టు.. గత ప్రభుత్వ హయాంలోనే వారు ఉద్యోగాల్లో లేరన్నట్టు ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ మాట్లాడిన మాటలను వలంటీర్ల సంఘాలు, అధికార, రాజకీయ వర్గాలు తప్పుపడుతున్నాయి. అవసరమొచి్చనప్పుడు అలా.. విజయవాడ వరదల్లో సహాయక చర్యల సందర్భంగా కూటమి ప్రభుత్వానికి వలంటీర్ల సేవలు గుర్తొచ్చాయి. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో పాటు వలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లకు జీతాలు చెల్లింపులు నిలిచిపోయాయి. వలంటీర్లను పింఛన్ల పంపిణీ సహా అన్నిరకాల ప్రభుత్వ విధుల నుంచి దూరంగా పెట్టంది. జూలై, ఆగస్ట్, సెపె్టంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో 1వ తేదీన వలంటీర్లకు చెల్లించాల్సిన గౌరవ వేతనాలనూ చెల్లించలేదు.విజయవాడ వరద సమయంలో వరద సహాయక కార్యక్రమాలతోపాటు వరద నష్టాల అంచనాల తయారీలో వలంటీర్ల సేవలను ప్రభుత్వం వినియోగించుకుంది. సీఎం ఆదేశాల మేరకు విజయవాడ ప్రాంత వలంటీర్లు వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా నగర పరిధిలోని వార్డు సచివాలయాల అడ్మిన్ సెక్రటరీల వద్ద రిపోర్టు చేయాలని 2024 సెపె్టంబర్ 2న గ్రామ వార్డు సచివాలయాల అధికారులు టెలీకాన్ఫరెన్స్ ద్వారా మౌఖిక ఆదేశాలు జారీ చేయగా.. వరద అంచనాల తయారీకి సచివాలయాల వారీగా ఏర్పాటు చేసిన అధికారుల బృందాల్లో వలంటీర్లను సభ్యులుగా చేరుస్తూ 2024 సెపె్టంబర్ 7న రెవెన్యూ స్పెషల్ సీఎస్ జారీ చేసిన మెమోతో పాటు 2024 సెపె్టంబర్ 9న ఎన్జీఆర్ జిల్లా కలెక్టర్ లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేశారు. నిమ్మకు నీరెత్తినట్టి వ్యవహరిస్తున్న ప్రభుత్వం ఐదేళ్ల పాటు ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ఎలాంటి వివక్ష, రాజకీయ పక్షపాతం, పైరవీలు, అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల గడప వద్దకు చేర్చడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషించారు. తమకు వేతనాలు చెల్లించాలని కోరుతూ 20 వారాలుగా వలంటీర్లు రోడ్డెక్కి నిరసనలు కొనసాగిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కొనసాగిస్తున్నా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు, నిరసన ర్యాలీలు, రిలే నిరాహారదీక్షలు చేపట్టి వినతిపత్రాలు అందజేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఎన్నికల ముందు చంద్రబాబు హామీ మేరకు వలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు, పెండింగ్ బకాయిల చెల్లింపులపై నెలల తరబడి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తూ.. ఇప్పుడు తమ వైఫల్యాలను గత ప్రభుత్వంపై నెట్టేసే చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. -
నేడు వలంటీర్ల ఆవేదన సదస్సు
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుతోపాటు గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచాలని కోరుతూ ఏఐవైఎఫ్ అనుబంధ ఏపీ రాష్ట్ర వలంటీర్ల అసోసియేషన్ ఆధ్వర్యాన శనివారం విజయవాడలో వలంటీర్ల ఆవేదన సదస్సు నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరుచూరి రాజేంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.66 లక్షల మంది వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఐదు నెలల పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలన్న అంశంపై సదస్సులో చర్చించనున్నట్టు పేర్కొన్నారు. -
వలంటీర్లపై బాబు కూటమి కుట్ర
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వలంటీర్ వ్యవస్థ లేకుండా చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వలంటీర్లను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేయకుండా తప్పించుకునేందుకే కూటమి నేతలు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వలంటీర్లకు సంబంధించి ఎలాంటి వ్యవస్థ లేదని, గత ప్రభుత్వం వారిని మోసం చేసిందని, దాని వల్ల నిర్ణయం తీసుకోలేకపోతున్నామని డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ చెప్పడమూ ఈ కుట్రలో భాగమేనన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను పూర్తి పారదర్శకంగా ఇంటి గడప వద్దే అందించడం కోసం 50 ఇళ్లకు ఒక వలంటీర్ నియామకానికి ప్రత్యేక శాఖనే ఏర్పాటు చేసిందని తెలిపారు. ఆ శాఖ బాధ్యతను ఒక మంత్రికి అప్పగించిందని వెల్లడించారు. ఇప్పుడు కూడా మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామికి ఆ శాఖను కేటాయించారన్న విషయం తెలుసుకోవాలన్నారు.వలంటీర్ల నియామకంపైనా వైఎస్ జగన్ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, పవన్ ఆ జీవోలు తెప్పించుకుని చూడాలని చెప్పారు. అంత పక్కాగా వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తే, దానిపై పవన్ వెటకారంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వలంటీర్ల వ్యవస్థపై టీడీపీకి, జనసేన పార్టీకి సదభిప్రాయం లేదనడానికి గతంలో చంద్రబాబు, పవన్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమన్నారు. ప్రజలకు వలంటీర్లు అందించిన సేవలు ఎనలేనివని, కోవిడ్ బాధితులను వారి కుటుంబ సభ్యులే పట్టించుకోకపోతే వీరు ప్రాణా లకు తెగించి సేవలందించారని, అలాంటి వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పవన్ క్షమాపణలు చెప్పాలని అన్నారు. ఎన్నికల్లో వలంటీర్లకు కూటమి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, వారిన తిరిగి విధుల్లోకి తీసుకొని, గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. వలంటీర్లకు ఏ హామీ ఇవ్వలేదని కూటమి నేతలు అనుకొంటే.. తిరుమల శ్రీవారి ఎదుట ప్రమాణం చేయాలని సుధాకర్బాబు సవాల్ చేశారు.నేడు వలంటీర్ల ఆవేదన సదస్సు సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచి్చన హామీ మేరకు వలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుతోపాటు గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచాలని కోరుతూ ఏఐవైఎఫ్ అనుబంధ ఏపీ రాష్ట్ర వలంటీర్ల అసోసియేషన్ ఆధ్వర్యాన శనివారం విజయవాడలో వలంటీర్ల ఆవేదన సదస్సు నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పరుచూరి రాజేంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.66 లక్షల మంది వలంటీర్లకు ఉద్యోగ భద్రత కలి్పంచాలని, ఐదు నెలల పెండింగ్ బకాయిలను తక్షణమే చెల్లించాలన్న అంశంపై సదస్సులో చర్చించనున్నట్టు పేర్కొన్నారు. -
పరిసరాలపై విశ్వాసం
సాక్షి, సిటీబ్యూరో: ప్లాస్టిక్ సంచులు, ఇతర వ్యర్థాలను కాల్వలు, చెరువు కట్టలు, రహదారికి ఇరువైపులా ఎక్కడపడితే అక్కడ పడేస్తుండటం గమనిస్తాం. ఆయా ప్రాంతాలను శుభ్రం చేయాలంటే పురపాలక సిబ్బంది రావాలని అనుకుంటాం. ఆలస్యమైతే ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తాం.. అలా కాకుండా మనమే శుభ్రం చేద్దామని కంకణం కట్టుకున్నవారెంతమంది ఉంటారు? అలాంటి వారు నగరంలో చాలా అరుదనే చెప్పాలి.కొందరు యువత మాత్రం చెరువుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, మద్యం సీసాలు, ఇతర వ్యర్థాలను తొలగించే కార్యక్రమానికి నడుం బిగించారు. 2021 నుంచి నగరంలో సరూర్నగర్ చెరువు, అమీన్పూర్ చెరువు, నల్లగండ్ల చెరువు, గాంధీ చెరువు, పీరంచెరువు, ఖాజాగూడ చెరువు, తదితర ప్రాంతాల వద్ద కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రతి సెలవు రోజునా చెరువు కట్ట, పరిసర ప్రాంతాలను శుభ్రం చేయాలన్నది వారి లక్ష్యం. ఫలితంగా పర్యావరణ పరిరక్షణ, ఇతర వ్యక్తుల్లో క్లీనింగ్ పట్ల స్పృహ కల్పించడం, ఎన్నో రకాల పక్షులను ఆదుకున్నట్లవుతుందని భావిస్తున్నారు. ఐదుగురు స్నేహితులతో ప్రారంభమైన విశ్వ సస్టైనబుల్ ఫౌండేషన్ ప్రస్తుతం సుమారు 500 మందికిపైగా వలంటీర్లను జత చేసుకుంది.బృందాలుగా ఏర్పడి...వీరంతా బృందాలుగా ఏర్పడి చెరువులను దత్తత తీసుకుంటున్నారు. వారాంతంలో వారికి కేటాయించిన చెరువుల దగ్గర ప్రజలు వేసే చెత్త, ప్లాస్టిక్ సంచులు, తాగుబోతులు విసిరేసిన గాజు సీసాలు వంటి వ్యర్థాలను ఏరిపారేస్తున్నారు. సంచుల్లో ప్యాక్ చేసి జీహెచ్ఎంసీకి తరలిస్తున్నారు. దేశంలోనే మొదటి బయోడైవర్సిటీ చెరువుగా గుర్తింపు పొందిన అమీన్పూర్ చెరువుతో పాటు నగరంలో పలు చెరువులకు వలస పక్షలు వస్తున్నాయి.ఈ సీజన్లో వాటి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలా వలస వచ్చిన పక్షలు ఇక్కడ ప్లాస్టిక్ భూతానికి బలైపోతున్నాయి. ఆహారంగా చేపలు, ఇతర కీటకాలను వేటాడే సమయంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తింటున్నాయి. ఈ క్రమంలో వాటికి ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలి. ప్రకృతి సిద్ధంగా ఉన్న చెరువులను ఆహ్లాదకరంగా మార్చాలనే పట్టుదలతో ఒక్కో చెరువునూ ఒక్కో బృందం పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం నగరంలో ఏడు బృందాలు పనిచేస్తున్నాయి. -
చిక్కిపోతున్న పింఛన్లు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : రాష్ట్రంలో పింఛన్ల సంఖ్య నెలనెలకూ చిక్కిపోతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కేవలం ఐదు నెలల్లోనే ఏకంగా 1,35,690 మందికి పింఛన్ ఆపేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు.. ఈ ఏడాది మేలో 65,49,864 మందికి పింఛన్ల పంపిణీ జరగ్గా, తాజాగా నవంబర్ 1న (శుక్రవారం) 64,14,174 మందికి మాత్రమే పింఛన్ పంపిణీ చేసేందుకు డబ్బు విడుదల చేశారు. గత ఐదు నెలల్లో కొత్తగా ఒక్కరికి కూడా ప్రభుత్వం సామాజిక పింఛన్లు మంజూరు చేయలేదు. పైగా ఏళ్ల తరబడి ప్రతి నెలా పింఛను తీసుకుంటున్న వారికి కోతలు పెట్టేందుకు ఎక్కడలేని ఉత్సాహం కనబరుస్తోంది. ఇక అక్టోబర్లో జరిగిన పంపిణీకి, ప్రస్తుత నెలలో జరుగుతున్న పంపిణీ మధ్య నెల రోజుల వ్యవధిలోనే పింఛన్ల సంఖ్య 24,710కి తగ్గిపోయాయి. సాధారణంగా లబ్ధిదారుల్లో మరణాలు ఎంత ఎక్కువగా ఉన్నాయనుకున్నా, ప్రతినెలా 10–15 వేలకు మించవని గణాంకాలు చెబుతున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అధికారులు ఎడాపెడా పింఛన్ల తొలగింపు కార్యక్రమాలు చేపడుతున్నారు. పంపిణీలో ఆధిపత్యం కోసం గొడవలురాష్ట్రంలో ఏళ్ల తరబడి ప్రతి నెలా అవ్వాతాతలకు అందజేసే పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా రాజకీయ రంగు పులిమింది. ఈ పంపిణీ పూర్తిగా తమ కనుసన్నల్లోనే జరగాలని టీడీపీ నాయకులు రాష్ట్రంలో అత్యధిక చోట్ల స్థానికంగా పింఛన్లను పంపిణీ చేసే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని హెచ్చరిస్తూ, పంపిణీ చేసే ఉద్యోగుల వెంట లబ్ధిదారులకు ఇంటింటికీ వెళ్లి పెత్తనం చెలాయిస్తున్నారు. కూటమిలోని టీడీపీ–జనసేన–బీజేపీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. నవంబరు 1 (శుక్రవారం) పింఛన్ల పంపిణీ జరగాల్సి ఉండగా, ఒకరోజు ముందు గురువారం దెందులూరు నియోజకవర్గంలోని పైడిచింతలపాడులో టీడీపీ–జనసేన నాయకులు ఎవరికి వారు కొన్ని ప్రత్యేకించిన ఏరియాల్లో పింఛను పంపిణీ తమ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జరగాలంటూ పట్టుబట్టి, ఘర్షణలు పడటం గమనార్హం. సిబ్బందికి షోకాజ్ నోటీసులువలంటీర్లు లేకుండానే పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పుకునేందుకు కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు చుక్కలు చూపిస్తోంది. ఉదయం 6.15 వరకు పింఛన్ల పంపిణీ ప్రారంభించలేదంటూ ఒక్క మచిలీపట్నం పరిధిలోనే 70 మంది వార్డు సచివాలయాల ఉద్యోగులకు నగర కార్పొరేషన్ షోకాజ్ నోటీసు జారీ చేసినట్టు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారు. అనంతపురం జిల్లా గుత్తి మండలంలో 14 మందికి, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్య పేట మండలంలో 28 మందికి, పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరంలో 15 మందికి, బాపట్ల జిల్లా అద్దంకిలో ఆరుగురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ అయినట్టు తెలిపారు. ఇవి కేవలం తమకు అందిన సమాచారం మేరకు మాత్రమేనని, ఇంకా పలు ప్రాంతాల్లో ఇలాంటి వేధింపులు కొనసాగుతున్నాయని వాపోయారు. ఒక్క జూలై నెలలోనే దాదాపు 4 వేల మంది గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారని.. ఇలా ప్రతి నెలా జారీ చేస్తున్నారని ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. ఇదిలా ఉండగా, బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం అల్లూరు గ్రామానికి చెందిన నత్తల వజ్రమ్మ (62) కావలిలో తన కూతురు శిరీష (33)వద్దకు వెళ్లింది. 1వ తేదీ పింఛను తీసుకునేందుకు కూతురితో కలిసి వస్తూ.. కావలిలో రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో తల్లీ కూతుళ్లు ఇద్దరూ మృతి చెందారు. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే కుప్పంలో కుప్పం–3 సచివాలయం వద్దకు వృద్ధులను పిలిపించి పింఛన్లు పంపిణీ చేశారు. వరదయ్యపాళెం మండలం ఎంపీడీవో కార్యాలయంలో అటెండర్గా పని చేస్తున్న అనిత.. చిన్నపాండూరు సచివాలయ పరిధిలోని యానాదివెట్టు, రాచర్ల గ్రామాల్లో ఫించన్లు పంపిణీ చేశారు. సమస్యల నడుమ పంపిణీనవంబరు 1వ తేదీ (శుక్రవారం) సాయంత్రం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 60.76 లక్షల మందికి పింఛన్ల పంపిణీ జరిగినట్టు సెర్ప్ అధికారులు వెల్లడించారు. అయితే పంపిణీలో రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల ఉద్యోగులు సర్వర్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంపిణీ సమయంలో లబ్ధిదారులకు డబ్బులు అందజేసిన అనంతరం ఆయా లబ్ధిదారుల నుంచి వేలి ముద్రలు ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియలో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్య సర్వర్ పనిచేయక పోవడంతో దాదాపు రెండు గంటల పాటు పంపిణీ నిలిచిపోయింది. మరోవైపు.. వేలిముద్ర నమోదుకు ఉపయోగించే స్కానర్లకు సంబంధించి సాఫ్ట్వేర్ అప్డేట్కు ప్రభుత్వం డబ్బులు చెల్లించని కారణంగా అవి పని చేయలేదు. అప్పటికప్పుడు వాటి స్థానంలో వేరే స్కానర్లు మార్చాల్సి వచ్చింది. దీంతో పలు ప్రాంతాల్లో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెట్ల కింద, సచివాలయాల్లో పడిగాపులు కాయాల్సి వచ్చింది. ప్రాణం మీదకు తెచ్చిన పింఛన్కాశీబుగ్గ: పింఛను పంపిణీ ఓ వృద్ధురాలి ప్రాణం మీదకు తెచ్చింది. శ్రీకాకుళం జిల్లా, పలాసలోని, వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామంలో బైనపల్లి దానమ్మ వితంతువు పింఛన్ కోసం మండుటెండలో నిరీక్షించింది. ఉదయం ఏడు గంటల లోపల నామమాత్రంగా పనిచేసిన సర్వర్ ఒక్కసారిగా ఆగిపోవడంతో పింఛన్ల పంపిణీ మళ్లీ మధ్యాహ్నానికి గానీ ప్రారంభం కాలేదు. అప్పటి వరకూ నిరీక్షించిన దానమ్మ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. గతంలో పింఛన్ ఇంటికి వచ్చి అందించేవారని, ఇప్పుడు ఎండలో పడిగాపులు కాయాల్సి వస్తోందని పింఛనుదారులు వాపోతున్నారు. -
సోమవారం... వలంటీర్ల నిరసన వారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సోమవారం వలంటీర్ల నిరసన వారంగా మారిపోయింది. గత ఐదేళ్లు ఎలాంటి వివక్ష, రాజకీయ పక్షపాతం, పైరవీలు, అవినీతికి తావులేకుండా ప్రభుత్వ సేవలను ప్రజల గడప వద్దకే చేర్చడంలో కీలకపాత్ర పోషించిన లక్షలాది మంది గ్రామ, వార్డు సచివాలయాల వలంటీర్లు గత 16 వారాలుగా రోడ్డెక్కి తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతోపాటు పెండింగ్లో పెట్టిన గౌరవ వేతనాలు చెల్లించాలని కోరుతూ ప్రతి సోమవారం అన్ని జిల్లాల్లో నిరసన ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తూ కలెక్టర్లు, సంబంధిత అధికారులకు వినతిపత్రాలు అందజేస్తున్నారు.ఇందులో భాగంగా ఈ వారం కూడా రాష్ట్రంలోని పలు మండలాల్లో వలంటీర్లు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మండల స్థాయి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. ముఖ్యంగా విజయనగరం కలెక్టరేట్ ముందు వలంటీర్లు భారీ ధర్నా నిర్వహించారు. అనంతరం తమ డిమాండ్లు నెరవేర్చాలని కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలని వలంటీర్లు డిమాండ్ చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు నెలల గౌరవ వేతనాలు చెల్లించాలని నినదించారు. ఐదు నెలలుగా తేల్చని కూటమి సర్కారుఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, గౌరవ వేతనాన్ని రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కానీ ఈ ఏడాది జూన్లో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఎన్నికల ముందు వరకు వలంటీర్లు నిర్వహిస్తున్న పింఛన్ల పంపిణీ సహా అన్ని విధుల నుంచి పూర్తిగా పక్కన పెట్టారు. జూలై, ఆగస్టు,సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన గౌరవ వేతనాలను ఒక్కరికి కూడా చెల్లించలేదని వలంటీర్ల సంఘ ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికైనా వలంటీర్లకు ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలుచేయాలని వారు కోరారు. -
సీఎం చెప్పినా స్పందన లేదు!
సాక్షి, సిటీబ్యూరో: సాధారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వాళ్లు ఎలాంటి ఆదేశాల జారీ చేసినా.. క్షణాల్లో అమలులోకి వస్తాయి. సుదీర్ఘమైన కసరత్తు అవసరమైతే ఆ చర్యలు మొదలువతాయి. అవసరమైతే కమిటీలు, కమీషన్లు ఏర్పాటవుతాయి. అధికారులంతా ఆఘమేఘాల మీద ఉరుకులుపరుగులు పెడతారు. అయితే సీఎం ఎ.రేవంత్రెడ్డి ‘ట్రాఫిక్–ట్రాన్స్జెండర్ల సేవలు’ విషయంలో గత నెల 13న కీలక ప్రకటన చేశారు. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఉన్నతమైన ఆలోచన చేసిన ముఖ్యమంత్రి.. ట్రాన్స్జెండర్స్ వల్ల సామాన్యులకు ఎదురవుతున్న సమస్యల తొలగింపుతో పాటు వారికి గౌరవప్రదమైన జీవితం అందించడం కోసం ట్రాఫిక్ వాలంటీర్లుగా నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయించారు. హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతల్లో వారికీ భాగస్వామ్యం కల్పించాలని యోచించారు. ట్రాఫిక్ ఇక్కట్లు తప్పించడం కోసం పోలీసులు, హోంగార్డ్స్ తరహాలోనే ట్రా¯Œన్స్జెండర్లనూ వినియోగించాలని అధికారులకు ఆదేశించారు. ట్రాన్స్జెండర్లకు ఉద్యోగావకాశాలు తగ్గాయని, ఇలా చేస్తూ ప్రతి నెలా నిరీ్ణత మొత్తం అందిస్తే వారికి కొంత ఉపాధి కల్పింనట్లవుతుందని భావించారు. ప్రత్యేక శిక్షణ, యూనిఫామ్ ఉండాలంటూ... ఈ ప్రతిపాదనల్ని అమలులో పెట్టడానికి తక్షణం చర్యలు తీసుకోవాలంటూ గత నెల 13న అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్పాత్లతో పాటు ఇతర అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా సీఎం ఈ విషయం స్పష్టం చేశారు. ట్రాఫిక్ వాలంటీర్ల నియామకం కోసం ఆసక్తి ఉన్న ట్రాన్స్జెండర్ల వివరాలు సేకరించాలని, వారం నుంచి పది రోజుల పాటు అవసరమైన శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈ వాలంటీర్లకు ప్రత్యేక యూనిఫామ్ కూడా అందించాలన్న ముఖ్యమంత్రి కొన్ని నమూనాలను పరిశీలించారు. సిబ్బంది కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ట్రాఫిక్ విభాగానికి ఈ ప్రయోగం సక్సెస్ అయితే పెద్ద ఉపశమనమే లభిస్తుంది. ఇప్పటికే ఆ రెండు నగరాల్లో అమలు... ట్రాఫిక్ విధుల్లో ట్రాన్స్జెండర్ల సేవలు వినియోగం అనేది దేశంలో సరికొత్త విధానమేమీ కాదు. తమిళనాడు రాజధాని చెన్నై ట్రాఫిక్ పోలీసులు 2013లోనే ఈ తరహా ప్రయోగం చేశారు. వన్ ఇండియా రోడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ సహాయంతో పది మంది ట్రాన్స్జెండర్లకు శిక్షణ ఇచ్చి ట్రాఫిక్ వాలంటీర్లుగా మార్చారు. వారికి నెలకు రూ.9 వేల పారితోషకం అందించారు. 2018లో కర్ణాటకలోని టుమ్కూరు పోలీసులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రద్దీ వేళల్లో ట్రాఫిక్ నియంత్రణతో పాటు రహదారి నిబంధనలు, రోడ్డు భద్రతా అంశాలపై అవగాహన కల్పించడానికి ట్రాన్స్జెండర్లతో ఓ బృందాన్ని వేర్పాటు చేశారు. వాలంటీర్ల మాదిరిగా వీరికీ పారితోíÙకం అందిస్తూ రహదారులపై సేవలు వినియోగించుకున్నారు. కొచి్చన్ మెట్రో రైల్తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ట్రాన్స్జెండర్లను వాలంటీర్లుగా వినియోగించిన సందర్భాలు ఉన్నాయి. ఒక్క అడుగూ వేయని అధికారులు...ట్రాన్స్జెండర్ల సేవలు వినియోగం విషయంలో ముఖ్యమంత్రి ఆదేశాలను అమలులో పెట్టే దిశలో అధికారులు కనీసం ఒక్క అడుగు కూడా వేయలేదు. దేశంలో ప్రస్తుతం ఎక్కడెక్కడ అమలులో ఉంది? ఫలితాలు ఏంటి? ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయి? తదితరాలు అధ్యయనం పైనా దృష్టి పెట్టలేదు. వీరి ఎంపికకు సంబంధించి ట్రాఫిక్ విభాగాలు, ట్రాన్స్జెండర్ల సంఘాలతోనూ సంప్రదింపులు జరపలేదు. ముఖ్యమంత్రి జారీ చేసిన ఆదేశాలకు సంబంధించిన ఆచరణ విధివిధానాలను ఏ అధికారీ సమీక్షించలేదు. కనీసం ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) సైతం ఈ కోణంలో చర్యలు తీసుకోకపోవడంతో క్షేత్రస్థాయి అధికారులు అసలు పట్టించుకోవట్లేదు. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్న ఆమ్రపాలి ఆంధ్రాకు వెళ్లిపోవడం, ప్రస్తుతం బల్దియాకు ఇన్చార్జ్ కమిషనర్ ఉండటంతో ‘ట్రాఫిక్ వాలంటీర్ల’ ప్రతిపాదన పట్టాలెక్కే పరిస్థితి కనిపించట్లేదు. -
సంచలనాల వ్యవస్థకు ఐదేళ్లు
సాక్షి, అమరావతి: బాపూజీ మహాత్మా గాంధీ కలలుగన్న అసలైన గ్రామ స్వరాజ్యానికి నిలువటద్దంగా.. కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా రాష్ట్రంలో సేవలందించే గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటై ఐదేళ్లు పూర్తయ్యాయి. స్వాతంత్య్రం వచ్చాక 77 ఏళ్ల పాటు రూ.లక్షల కోట్లు వెచ్చి0చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే అనేక పథకాలను క్షేత్ర స్థాయిలో అమలు చేసే పటిష్ట వ్యవస్థ లేనందున లక్ష్య సాధన అంతంత మాత్రంగానే ఉండింది. ఈ పరిస్థితుల్లో మన రాష్ట్రంలో 2019 అక్టోబరు 2వ తేదీన అప్పటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2019కి ముందు రాష్టంలో దాదాపు 3 వేల గ్రామ పంచాయతీలకు కనీసం ఆఫీసు భవనాలు లేవని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో చాలా పెద్ద గ్రామాల్లో సైతం శిథిలావస్థకు చేరిన పంచాయతీ ఆఫీసు తప్ప మరో ప్రభుత్వ ఆఫీసు లేని దుస్థితి.నాలుగైదు గ్రామ పంచాయతీలకు కలిపి ఒక్కరే ఉండే పంచాయతీ కార్యదర్శి.. ఆ పంచాయతీ ఆఫీసుకు ఎప్పుడొస్తారో.. ఆ ఆఫీసును ఎప్పుడు తెరుస్తారో ఆ గ్రామ ప్రజలకే తెలియని పరిస్థితి. అలాంటిది వైఎస్ జగన్ ప్రభుత్వం.. 15,004 గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు అనంతరం కొత్తగా 1.34 లక్షల శ్వాశత ప్రభుత్వ ఉద్యోగాలను అప్పటికప్పుడే మంజూరు చేసింది. కేవలం నాలుగు నెలల కాలంలో వాటి భర్తీ ప్రక్రియను పూర్తి చేసింది. ఈ ఉద్యోగాల కోసం 21.69 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకొని, 19,50,630 మంది రాత పరీక్షలకు హాజరయ్యారు. ఇది దేశంలోనే ఒక రికార్డు. ఫలితంగా ప్రతి గ్రామంలో 8–10 మంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు అందుబాటులోకి వచ్చారు. సచివాలయాలకు అనుబంధంగా పని చేసేందుకు గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు.. పట్టణాలు, నగరాల్లో ప్రతి 75–100 ఇళ్లకు ఒకరు చొప్పున 2.66 లక్షల మంది వలంటీర్లను నియమించింది. మరో వైపు జిల్లాల సంఖ్యను 13 నుంచి 26కు.. రెవిన్యూ డివిజన్లను 52 నుంచి 77కు పెంచింది. అధునాతన వసతులు.. పారదర్శక సేవలు » గతంలో పంచాయతీ ఆఫీసులు ఇరుకు భవనాల్లో కొనసాగితే.. గత ప్రభుత్వం ప్రతి చోటా ఒక్కోదానికి రూ.43.60 లక్షలు ఖర్చు పెట్టి 2,623 చదరపు అడుగుల విశాలమైన రెండంతస్తుల సచివాలయం భవనాలను నిరి్మంచింది. మొత్తం రూ.4,750 కోట్ల ఖర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా 10,893 గ్రామ సచివాలయాలను మంజూరు చేయగా, అత్యధిక చోట్ల భవన నిర్మాణాలు పూర్తయ్యాయి. » ఒక్కో సచివాలయంలో రెండేసి కంప్యూటర్లను యూపీఎస్ సహా అందించింది. ఇలా రాష్ట్రంలోని సచివాలయాలకు 30,004 కంప్యూటర్లు, 15,002 యూపీఎస్లు, 15,002 ప్రింటర్లతో పాటు 3 వేల ఆధార్ కిట్లు, 2,86,646 ఫింగర్ ప్రింట్ స్కానర్లు పంపిణీ చేసింది. వలంటీర్లతో పాటు ఇతర సచివాలయ సిబ్బందికి విధులను వేగంగా నిర్వహించడం కోసం, టెక్నాలజీని ఉపయోగించడం కోసం 2,91,590 స్మార్ట్ ఫోన్లను సిమ్ కార్డులతో ఇచ్చింది.ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ తీరు » వలంటీర్లకు నిలువెత్తు మోసం చేసిన కూటమి ప్రభుత్వం» ఎన్నికల ముందు వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచుతామని హామీ.. ఆచరణలో గత నాలుగు నెలలుగా వలంటీర్లకు జీతాలు చెల్లించని ప్రభుత్వం.» లబ్ధిదారుల ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీకి తూట్లు. వలంటీర్లకు కాకుండా సచివాలయాల సిబ్బందికి ఆ బాధ్యత అప్పగింత. దీంతో చాలా చోట్ల సచివాలయాల వద్దకే లబ్ధిదారులను పిలిపించుకొని పింఛన్ల పంపిణీ. » ప్రభుత్వ ఆఫీసుల్లో పనులకోసం మళ్లీ మండలాలు, పట్టణాల్లో ఉండే ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరిగే పరిస్థితి.» బుడమేరు (విజయవాడ)వరదలో గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థను సరిగా ఉపయోగించుకోని ప్రభుత్వం. ఫలితంగా ప్రభుత్వ సాయం కోసం జిల్లా కలెక్టరేట్ చూట్టు తిరుగుతున్న బాధితులు.» ప్రస్తుతం ఎక్కువగా కరెంటు బిల్లుల చెల్లింపుల వినతుల పరిష్కారానికి పరిమితం. » నాలుగు నెలలుగా వలంటీర్లకు ఎలాంటి విధులు అప్పగించని వైనం.. మూడు నెలలుగా అందని గౌరవ వేతనం. » గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు సీఎం చంద్రబాబు స్టిక్కర్లను ఇంటింటికీ అంటించే పని అప్పగింత.మొత్తం గ్రామ, వార్డు సచివాలయాలు : 15,004» వీటిలో జగన్ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు 1.34లక్షలు» గ్రామ, వార్డు వలంటీర్లు 2.66 లక్షలు» గత ఐదేళ్లలో అందించిన సేవలు 11.48కోట్లు» కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయాల భవనాలు :10,893సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ ద్వారా అందిన సేవలు» రాష్ట్రంలో గత ఐదేళ్లలో ఏకంగా 11.48 కోట్ల ప్రజా వినతుల పరిష్కారం. » 545 వరకు రాష్ట్ర ప్రభుత్వ సేవలతో పాటు పాస్పోర్టు బుకింగ్ తదితర కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల సర్విసులు » అత్యధికంగా కుల, ఆదాయ ధ్రువీకరణ ప్రతాలు, వ్యవసాయ భూముల అడంగులు, 1బీ వంటి కీలక వినతుల పరిష్కారం. » వివిధ సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో రూ.2.73 లక్షల కోట్లు, నాన్ డీబీటీ ద్వారా మరో రూ.1.84 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో నేరుగా జమ. » కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పథకాల వర్తింపు.» పారదర్శకత కోసం ప్రతి పథకం అమలు సమయంలో సోషల్ ఆడిట్.. సచివాలయాల వద్ద అర్హుల జాబితా ప్రదర్శన. » ఏదైనా కారణంగా పథకం లబ్ధి అందని వారి కోసం ప్రతి ఆరు నెలలకొకసారి మళ్లీ అవకాశం కలి్పంచడం. » ప్రతి నెలా ఠంఛన్గా ఒకటో తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ » గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందుబాటులోకి భూముల రిజిస్ట్రేషన్ వంటి సేవలు » ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్లో ఉన్న వినతుల పరిష్కారం.. కుల, ఆదాయ, వివిధ ధృవీకరణ ప్రతాల మంజూరుకు ప్రత్యేకంగా జగనన్న సురక్షా క్యాంపుల ఏర్పాటు. » ప్రతి నెలా ఆధార్ క్యాంపులు ఏర్పాటు » కోవిడ్ సమయంలో వలంటీర్లు–సచివాలయాల సిబ్బంది ద్వారా వేగంగా రోగుల గుర్తింపు, తక్షణమే వైద్య సేవలు అందించేలా చర్యలు. తద్వారా మృతుల సంఖ్య కట్టడి. దాదాపు 30 దఫాలుగా ఫీవర్ సర్వే. » ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) సాధించేందుకు యునిసెఫ్తో కలిసి ఉమ్మడి కార్యాచరణ. » గ్రామ, వార్డు సచివాలయాల పరిశీలకు కేంద్రం, వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యేక బృందాలు.. వాటి నుంచి ప్రశంసలు -
రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల నిరసన
-
ఉద్యోగ భద్రత కల్పించాలి
సాక్షి, అమరావతి/పాడేరు: ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు రూ.10 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ వివిధ జిల్లా కేంద్రాల్లో వలంటీర్లు సోమవారం నిరసన ర్యాలీలు నిర్వహించారు. పెండింగ్ బకాయిలతో సహా వలంటీర్ల గౌరవ వేతనాలు అక్టోబరు 25లోగా చెల్లించకుంటే నిరసన దీక్షలు చేపడతామని.. రాబోయే కేబినెట్ సమావేశంలోగా తమకు న్యాయం చేయకుంటే ‘చలో సీఎం క్యాంపు కార్యాలయం’ చేపట్టనున్నట్లు వలంటీర్ల సంఘాలు హెచ్చరించాయి. ఇక వీరి ఆందోళనలకు సీపీఐ అనుబంధ ఏఐవైఎఫ్ ప్రతినిధులు తమ సంఘీభావం ప్రకటించారు. ఇదిలా ఉంటే.. అల్లూరు సీతారామరాజు జిల్లాలో 11 మండలాలకు సంబంధించిన దాదాపు రెండువేల మంది వలంటీర్లు పాడేరులో సుమారు మూడు కిలోమీటర్ల మేర భారీ ప్రదర్శన నిర్వహించారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో పలువురు వలంటీర్లు చంటి పిల్లలతో పాల్గొన్నారు. అనంతరం గంటసేపు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ వలంటీర్లతో మాట్లాడి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అనంతరం వలంటీర్లు ఆయనకు వినతిపత్రాన్ని ఇచ్చారు. అలాగే, కర్నూలు కలెక్టరేట్ ఎదుట కూడా వలంటీర్లు భారీఎత్తున ఆందోళన నిర్వహించి, ర్యాలీ నిర్వహించారు. ఇక ఈ ఏడాది జూన్లో రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం వీరికి గౌరవ వేతనాలు చెల్లించలేదు. -
ఏం చేశారని 100 రోజుల సంబరాలు.. బాబు పై వాలంటీర్లు ఫైర్
-
కదం తొక్కిన వలంటీర్లు
సాక్షి, అమరావతి/సీతమ్మధార : రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లకు గత మూడు నెలలుగా ప్రభుత్వం ఇవ్వాల్సిన పెండింగ్ వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ మరో విడత సోమవారం అన్ని జిల్లాల్లో వలంటీర్లు ఆందోళనలు నిర్వహించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో జరిగే ప్రజా సమస్యల వేదికలో వలంటీర్ల ప్రతినిధి బృందాలు ఆయా జిల్లాల కలెకర్లను కలిసి ఈ మేరకు వినతిపత్రాలను అందజేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని హామీ ఇవ్వడంతో పాటు వలంటీర్ల గౌరవ వేతనం రెట్టింపు చేసి రూ.10 వేలకు పెంచుతామని ప్రకటించారని ఈ సందర్భంగా వలంటీర్ల సంఘాల నేతలు గుర్తించారు. కూటమి ప్రభుత్వం వలంటీర్ల విషయంలో స్పష్టమైన నిర్ణయం వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ నెల 26 నుంచి 2 వరకు వలంటీర్లు శాంతియుత నిరసనలకు సీపీఐ అనుబంధ ఏఐవైఫ్ పిలుపునిచ్చింది. వలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోండివలంటీర్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీ ప్రజా వార్డు వలంటీర్ అసోసియేషన్ ఆధ్వరం్యలో వలంటీర్లు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గంధం దీప్తి మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబు వలంటీర్లను విధుల్లోకి తీసుకుంటామని, ప్రతి నెల రూ.10 వేలు వేతనం ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసిన వలంటీర్లను తిరిగి కొనసాగించాలన్నారు. వలంటీర్ల ధర్నాకు సీఐటీయూ సంఘీభావం ప్రకటించింది. ధర్నాలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకటసుబ్బయ్య, భవానీప్రసాద్, కోడూరి రాము, పెంచలయ్య, బాలకృష్ణప్రసాద్, కోడూరు లక్ష్మణ్, ఆంజనేయులు, అజార్, రాజు, పార్వతి, గుణసాయి, కె.రాజు, సంధ్య, శృతి, గాయత్రి, నాగపుష్ప, భారతి, సీఐటీయూ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వీ కుమార్, సీఐటీయూ జిల్లా నాయకులు ఎస్.జ్యోతీశ్వరరావు, కె.కుమారమంగళం, జి.అప్పలరాజు తదితరులున్నారు. -
ఏమీ లేదనిపింఛెన్..
కాకినాడ సిటీ: తమను గెలిపిస్తే 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వృద్ధాప్య పింఛన్లు ఇస్తామని ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్ల ఊసే ఎత్తడం లేదు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా పింఛన్ మొత్తాన్ని రూ. 4 వేలకు పెంచుతామని చంద్రబాబు చెప్పారు. అలాగే 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ వృద్ధాప్య పింఛన్ కింద రూ. 4 వేలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.ప్రతి ఎన్నికల సభలోనూ దీనిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 96 రోజులు గడుస్తున్నా, కొత్త పింఛన్ల ఊసే లేకుండా పోయింది. కాకినాడ జిల్లాలో 50 ఏళ్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లింలు దాదాపు 2.50 లక్షల మంది ఉంటారు. ఇందులో కనీసం 1.70 లక్షల మంది అర్హులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నారు. వీరందరూ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి ఇప్పట్లో కొత్త పింఛన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదు. ప్రస్తుత లబ్ధిదారుల్లో అనర్హులు ఉన్నారని, వారిని తీసేసిన తర్వాతే ఆ స్థానంలోనే ఇస్తారనే ప్రచారం చేస్తున్నారు.అర్జీలు.. బుట్టదాఖలుకొత్త పింఛన్ల కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాలు, ఎంపీడీఓ, డీఆర్డీఏ కార్యాలయాల చుట్టూ 50 ఏళ్లు నిండిన లబ్ధిదారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్త పింఛన్లపై తమకు మార్గదర్శకాలు రాలేదని అధికారులు వారిని వెనక్కి పంపుతున్నారు. దీంతో ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన మాటలను నమ్మి మోసపోయామని అవ్వాతాతలు అంటున్నారు. అధికారం చేపట్టి 96 రోజులైనా 50 ఏళ్లకే పింఛన్ లేదు, సూపర్–6 హామీలు లేవు. వెరసి 2024–25లో హామీల అమలు లేనట్లేనని సంకేతాల ఇస్తున్నారు.వలంటీర్ వ్యవస్థకు మంగళంగత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పారదర్శకంగా పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వేతనాలను రూ. 10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన తర్వాత వలంటీర్ వ్యవస్థ ఊసే లేకుండా పోయింది. జూలై, ఆగస్టు నెలల పింఛన్ల పంపిణీ అబాసుపాలైంది. గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలనే ఆదేశాలు ఉండగా, ఇది అమలు కావడం లేదు. 30 శాతం వరకూ మాత్రమే ఇంటి దగ్గర పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన 70 శాతం ప్రధాన కూడళ్లు, ఆలయాలు, అంగన్వాడీ సెంటర్లు, రచ్చబండ, సచివాలయాల్లో అందజేస్తున్నారు.3,112 పింఛన్ల కోతకూటమి ప్రభుత్వం వచ్చాక నెల నెలా పింఛన్లలో కోత పడుతోంది. కాకినాడ జిల్లాలో ఈ ఏడాది జూన్తో పోలిస్తే సెప్టెంబర్ పింఛన్లలో 3,112 కోత కోశారు. పింఛన్లను అడ్డుగోలుగా కోస్తుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ఏడాది జూన్లో జిల్లాలో 2,79,805 పింఛన్లు ఉండగా, సెప్టెంబర్లో 2,76,683కి తగ్గించారు. కేవలం రెండు నెలల వ్యవధిలోనే 3,112 పింఛన్లను తొలగించిన వారి స్థానంలో కొత్త లబ్ధిదారులను కూడా ఎంపిక చేయలేదు.వైఎస్సార్ సీపీ హయాంలో ఇలా..వైఎస్సార్ సీపీ హయాంలో ఏడాదికి రెండు సార్లు కొత్త పింఛన్లను మంజూరు చేసేవారు. ఏటా జనవరి, జూలై నెలల్లో అర్హులందరికీ అందించేవారు. రాజకీయాలకు అతీతంగా, అర్హతనే ప్రామాణికంగా ఇచ్చేవారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు తీసుకుంటే చాలు ఆటోమేటిక్గా పింఛన్ మంజూరయ్యేది. వైఎస్సార్ సీపీ ఐదేళ్ల పాలనలో కొత్త పింఛన్లు జిల్లాలో 64 వేలకు పైగా ఇచ్చారు. 2014 నుంచి 2019 వరకూ ఉన్న అప్పటి టీడీపీ పాలనలో కొత్త పింఛన్ పొందాలంటే చాలా కష్టమయ్యేది. జన్మభూమి కమిటీలను ముడుపులతో ప్రసన్నం చేసుకుంటేనే పింఛన్ ఇచ్చేవారు. వచ్చే జనవరి నుంచి మళ్లీ జన్మభూమి–2 కార్యక్రమం చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. జన్మభూమితో పాటే జన్మభూమి కమిటీలు కూడా రాబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తే ముడుపులు ఇచ్చిన వారికే అందలం అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణలో కొత్త ప్రయోగానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రించేందుకు ట్రాన్స్జెండర్లను వలంటీర్లుగా నియమించుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ పోలీస్ విభాగంతో పాటు హోంగార్డ్స్ ప్రస్తుతం ఈ విధులు నిర్వహిస్తున్నారు. హోంగార్డ్స్ తరహాలోనే ట్రాన్స్జెండర్లకు ఈ విధులు అప్పగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆర్థిక భరోసా.. సమాజంలో గౌరవం వలంటీర్లుగా పనిచేసే ట్రాన్స్జెండర్లకు ప్రతినెలా కొంత స్టైఫండ్ ఇవ్వాలని, దీంతో వారికి ఆర్థికంగా భరోసా కలి్పంచడంతో పాటు సమాజంలో గౌరవస్థానం కల్పించవచ్చునని సీఎం పేర్కొన్నారు. ఆసక్తిగా ఉన్న ట్రాన్స్జెండర్ల వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వారం, పది రోజులపాటు వారికి అవసరమైన ప్రత్యేక శిక్షణను కూడా అందించాలని, విధుల్లో ఉండే ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక యూనిఫామ్ కూడా ఉండాలని అధికారులకు సూచించారు.శుక్రవారం సచివాలయంలో జీహెచ్ఎంసీ పరిధిలోని రోడ్లు, ఫుట్పాత్లు, ఇతర అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై సమీక్షా సమావేశం సందర్భంగా సీఎం ఈ విషయం వెల్లడించారు. సీఎం నిర్ణయంతో ఈ కార్యక్రమం విజయవంతమైతే దేశంలో ఇతర నగరాలు కూడా దీనిని ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం.. అడిషనల్ కమిషనర్లందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. పారిశుద్ధ్యం, ఘనవ్యర్థాల నిర్వహణ మెరుగుపడాలని చెప్పారు. -
సమస్యల్ని పంచుకుంటున్నాం..అవగాహన పెంచుకుంటున్నాం..
‘క్షణంలో వెయ్యోవంతు కాలంలో జీవితం పట్ల దృక్పథం మారిస్తే చాలు ఓ జీవితాన్ని నిలబెట్టగలుగుతాం’అంటున్నారు వన్లైఫ్ వలంటీర్లు. మానసిక ఒత్తిడి, ఇతరత్రా సమస్యలతో ఆత్మహత్య లాంటి ఆలోచనల నుంచి విముక్తి కల్పించడానికి జాతీయస్థాయిలో 24/7 సేవలు అందిస్తోది వన్లైఫ్ సంస్థ. దీని ఆధ్వర్యంలో గత కొంత కాలంగా పనిచేస్తున్న హైదరాబాద్కు చెందిన వలంటీర్లు సాక్షితో తమ అనుభవాలు పంచుకున్నారు. –సాక్షి, హైదరాబాద్ఫోన్ కాల్స్ ద్వారా మమ్మల్ని సంప్రదించిన వారికి సంబంధించిన సమస్యల విషయంలో మేం పూర్తిగా గోప్యత పాటిస్తాం. కాల్స్ కోసం 24/7 అందుబాటులో ఉంటాం అంటున్న వలంటీర్లు చెప్పిన విశేషాలు వారి మాటల్లోనే...ఒత్తిడిని చిత్తు చేస్తూ..ట్రిపుల్ ఐటీ పూర్తి చేశా..చదువుకునే సమయం నుంచీ ఒత్తిడి బాగా ఉండేది. అయితే లోకువగా చూస్తారేమోనని ఎవరికీ చెప్పలేకపోయేవాడ్ని. అదే సమయంలో వన్లైఫ్ సంస్థ గురించి తెలిసింది..వీరిని అప్రోచ్ అయ్యి నా ఒత్తిడి పోగొట్టుకోగలిగాను. మరెంతో మందికి పరిష్కారంగా మారాలని వన్లైఫ్లో వలంటీర్గా జాయినయ్యా. మూడేళ్ల నుంచి ప్రతీ శనివారం 4గంటల పాటు వలంటీర్గా ఇంటి నుంచే చేస్తున్నా. తొలుత చాలా నెగిటివిటీ వస్తుంటుంది జాగ్రత్త అని ఫ్యామిలీ మెంబర్స్ హెచ్చరించారు. అయితే ట్రైనింగ్ తీసుకోవడం వల్ల నాకేమీ సమస్య అనిపించలేదు. స్టూడెంట్స్ పరీక్షల టైమ్లో ఎక్కువ కాల్స్ రిసీవ్ చేసుకున్నా. అది నేను అనుభవించి వచ్చాను కాబట్టి బాగా కనెక్ట్ అయ్యాను. లవ్ ప్రాబ్లెమ్స్తో కూడా వస్తున్నాయి.. ఇతరుల సమస్యలు వినడం వల్ల మన సమస్యలు చిన్నగా అనిపిస్తూంటాయి. అలా ఈ పని నాకు వ్యక్తిగత జీవితంలో సమస్యల పరిష్కారానికి కూడా చాలా హెల్ప్ అయింది. –సూర్య, మాదాపూర్నాలో ఉన్న ఖాళీని భర్తీ చేసుకుంటూ...రిటైర్మెంట్ తర్వాత కొంత ఎంప్టీనెస్ అనిపించి ఈ సేవలోకి వచ్చాను. నాకు విభిన్న భాషల్లో పట్టు ఉండడం వల్ల దేశవ్యాప్తంగా కాల్స్ వస్తుంటాయి. రిలేషన్ షిప్స్కు సంబంధించినవే ఎక్కువగా వస్తున్నాయి. ‘నేను అమ్మాయిని కాను నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు... నాది అబ్బాయి మనస్తత్వం అని చెప్పలేకపోతు న్నా’అంటూ ఓ అమ్మాయి చేసిన కాల్, అలాగే ఓ అమ్మాయి తనను ప్రేమ పేరుతో డబ్బులు ఖర్చుపెట్టించి వదిలేసిందని, నేనెంతో తెలివిగల వాడ్ని అనుకునేవాడ్ని ఎలా ఇలా మోసపోయానో’అంటూ మరో అబ్బాయి కాల్... ఇలాంటివి కొన్ని గుర్తుండిపోయే సమస్యలు వస్తుంటాయి. వారితో మాట్లాడడం ద్వారా వారిలో కొత్త ఆలోచనలు వచ్చేలా చేయడమే ముఖ్యం తప్ప సలహాలు, సూచనలు ఇవ్వడం చేయం. –రుక్మిణి, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్అవగాహన పెంచుతున్న సమస్యలు...హైటెక్ సిటీలో ఐటీ ఉద్యోగినిగా చేస్తున్నా. ఏడాది నుంచి వన్లైఫ్లో వలంటీర్గా రాత్రి 9 నుంచి 11 గంటల సమయంలో కాల్స్ అటెండ్ అవుతుంటా. ఇష్టం వచ్చినట్టు లోన్స్ తీసుకున్నాం కట్టలేకపోతున్నాం లాంటి సమస్యల నుంచివిడాకుల తర్వాత లోన్లీనెస్ ఫేస్ చేయలేకపోతున్నాం దాకా ఎన్నో రకాల సమస్యలతో కాల్స్ వస్తున్నాయి. నాకు అర్థం అయిందేమిటంటే...ప్రాబ్లెమ్ని ఇతరులతో షేర్ చేసుకుంటే మమ్మల్ని ఎలా జడ్జ్ చేస్తారో అని భయంతో చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. ఈ వలంటరీ విధుల వల్ల అనేక రకాల సమస్యలపై యుక్త వయసులోనే అవగాహన కలుగుతోంది.–అనూష, బోయినపల్లిజీవితం మీద ఆశ చిగురించేలా చేయొచ్చు విద్యార్థుల్లో అధిక గ్రేడ్స్కు సంబంధించిన ఒత్తిడి అంచనాలు, ఇతరులతో పోల్చడం, ర్యాగింగ్. మిగిలిన వారిలో అనుబంధాలు, అంచనాలు, తీర్చలేని డిమాండ్లు, సందేహాలు పరస్పరం నిందించుకోవడం తగాదాలు, వాదనలు, కోపం, ఆందోళన,.ఆర్థిక సంక్షోభాలు, వంటివి ప్రతికూలతకు దారి తీసిన ఫలితంగానే ఆత్మహత్యకు ఆలోచనలు చేస్తారు. అలాంటివారిలో జీవితం పట్ల ఆసక్తి పెంచే ఆలోచనల్ని ప్రోత్సహించడం, సానుకూలతను అందించడం, జీవితం అప్పుడే అయిపోలేదని నొక్కిచెప్పడం తమ కోసం మేం ఒక స్టాండ్ తీసుకోవడానికి ప్రోత్సహించడం చేస్తాం. ఒక్కో కాల్ అత్యధికంగా 45 నిమిషాల పాటు వింటాం. మా దగ్గర సీనియర్ కౌన్సెలర్లు ప్రొఫెషనల్ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ ఉన్నారు. కాలర్స్ మాటల్ని బట్టి ప్రమాదస్థాయిని అర్థం చేసుకొని, వెంటనే జోక్యం చేసుకొని, 3 నుంచి 4 ఫాలో అప్లు, కౌన్సెలింగ్ సెషన్స్ కొనసాగిస్తాం. పదేళ్లుగా మా వన్లైఫ్ ద్వారా ఏడాదికి 30 మంది వరకూ ఆత్మహత్య ఆలోచనల నుంచి దారి మళ్లించామని చెప్పగలను. మరింత మందిని వలంటీర్లుగా చేరమని ఆహ్వానిస్తున్నాం. ఈ వలంటీర్ వర్క్ మన ద్వారా మరికొందరికి జీవితం మీద ఆశ చిగురించేలా చేయడంతో పాటు మన జీవితంలోనూ ఎన్నో మంచి మార్పులకు దోహదం చేస్తుందని రచ్చితంగా చెప్పగలను. –రెబెకామరియా, వన్లైఫ్ నిర్వాహకులుఆలోచనల నుంచి డైవర్ట్ చేస్తే ఆత్మహత్యలు తగ్గిపోతాయి...వన్లైఫ్లో చేరాక మూమెంటరీ థింకింగ్ గురించి అర్థమైంది. ఫోన్ చేసినప్పుడు వారిని కాసేపు డైవర్ట్ చేస్తే చాలు. చాలా వరకూ ఆత్మహత్య ఆలోచనలు సమసిపోతాయి. కొన్ని విషయాలు షేర్ చేసుకోవడం వల్లనే చాలా వరకూ భారం తగ్గుతుంది. జీవితం చాలా గొప్పదనే విషయం తెలిసేలా చేస్తా తప్ప సలహాలు, సూచనలు ఇవ్వను. తొలుత ఫ్రీగా మాట్లాడలేరు కానీ కాసేపు గడిచాక చాలా ఫ్రీగా మాట్లాడతారు. ఎవరికీ చెప్పలేని తీవ్రమైన ర్యాగింగ్ సంఘటనల నుంచి, భార్య వెళ్లిపోయింది పిల్లలు లేరు దాకా ఎన్నో.. నేను 15 ఏళ్ల పాటు ప్రొఫెసర్గా పనిచేశాను కాబట్టి నాకు ఈ పని కొంచెం సులభంగా మారింది. చేసేవారిలో 90 శాతం మంది కేవలం బాధలను చెప్పుకోవడం కోసమే చేస్తారు. మాట్లాడుతుండగానే వారి స్కిల్స్ గుర్తించి వాటిని వారికి గుర్తు చేస్తా. –వెంకటరమణి -
నాడు వద్దన్నారు..నేడు వారే దిక్కయ్యారు
సాక్షి, అమరావతి/వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): ‘వలంటీర్లు ఏమి చేస్తారు, సంచులు మోసే పనులే కదా..అంతకుమించి వారు చేసే పనులు ఏమిటి?’ అంటూ చంద్రబాబు నాడు వలంటీర్లను ఎద్దేవా చేశారు. అయితే వరద బీభత్సానికి పాలకులకు దిమ్మతిరిగి వరద బాధితులకు పూర్తి స్థాయిలో సేవలు అందించడానికి వలంటీర్లే అవసరమవుతారని ఇప్పుడు గుర్తించారు. సచివాలయం, వలంటీర్ వ్యవస్థల పేరు కూడా ఎత్తడానికి ఇష్టపడని చంద్రబాబుకు వారి విలువలు, సేవలు ఇప్పుడు తెలిసివచ్చాయి. విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు సాయమందించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ఆహారం భారీగా ఉన్నా పంపిణీ వ్యవస్థ సరిగా లేక గందరగోళ పరిస్థితులు తలెత్తుతుండటంతో అధికారులు వలంటీర్ల ద్వారానే బాధితులకు సాయమందించగలమని సీఎంకు చెప్పారు. దీంతో వెంటనే సీఎం ఆదేశాలతో అధికారులు వలంటీర్లకు కబురు చేస్తున్నారు. బుధవారం నుంచి సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు ఎక్కడికక్కడ సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రభుత్వం ఆదేశించింది. నేటి నుంచి పూర్తి స్థాయిలో వలంటీర్లు సేవలు అందించే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. గతంలో వరదలొస్తే వలంటీర్లతోనే బాధితులకు భోజనం ఏర్పాట్లుగోదావరి వరద ముంపులో ఉన్న వందలాది మంది బాధితుల వద్దకు పీకల్లోతు నీళ్లలో వెళ్లి వలంటీర్లు తక్షణ సాయాన్ని అందించి వెలకట్ట లేని సేవలతో ప్రశంసలు అందుకున్నారు. 2020, 2022ల్లో గోదావరికి వరదలు వచ్చిన సమయంలో..వరదలు వస్తాయన్న ముందస్తు సమాచారంతో అప్పటి సీఎం వైఎస్ జగన్ ముందుగానే వలంటీర్లను అప్రమత్తం చేసి బా«ధితులను ఆదుకున్నారు. అధికారులు కూడా వెళ్లడానికి సాహసించని లోతట్టు లంక గ్రామాలకు ప్రాణాలకు తెగించి ప్రభుత్వం సమకూర్చిన సహాయ సామగ్రి, నిత్యావసరాలను బాధితులకు వలంటీర్ల కొద్ది గంటల్లోనే అందించారు. గతంలో వరదల సమయంలో గోదావరి ఏటిగట్లకు గండ్లు పడి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించిన సందర్భాలు కోకొల్లలుగా ఉండగా, 20219–23 మధ్య వరదల సమయంలో ప్రతి అర కిలో మీటర్ ఏటిగట్టు పర్యవేక్షణ బాధ్యత ఒక వలంటీర్కు అప్పగించడంతో వారు ప్రజలను అప్రమత్తం చేస్తూ వచ్చారు. అప్పట్లో ఏటిగట్లకు ఊలలు పడినా, గట్లు కుంగిపోయినా, గండ్లు పడిన విషయం ఉన్నతాధికారులకు చేరేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయేది. వలంటీర్లు వరద సేవల్లో పాల్గొన్నప్పుడు, వరదల్లో చిక్కుకున్న బాధితులను గుర్తించడం దగ్గర నుంచి పునరావాస కేంద్రాలకు తరలింపు, భోజనాలు, నిత్యావసరాల పంపిణీలో ప్రాణాలకు తెగించి సేవలందించారు. మధ్యాహ్నం 12 గంటలు దాటకుండానే బాధితులకు భోజనం ప్యాకెట్లు, మంచినీళ్లు అందించారు. 2020, 2022 జూలై, ఆగస్ట్ల్లో సంభవించిన వరదల్లో మామిడికుదురు మండలం పెదపట్నం గ్రామంలోనైనా, బి.దొడ్డవరం, అప్పనపల్లి బాడవ గ్రామాల్లో మోకాలికిపైగా నీటిలో వలంటీర్లు నడచి భుజాలపై ఆహార పొట్లాలు తీసుకువెళ్లి ఊరందరికీ ఆహారం, తాగునీటి ప్యాకెట్లు అందజేశారు. నాటి వరదల్లో జగన్ ప్రభుత్వం ఉచితంగా నిత్యావసరాలు, కూరగాయలను ఏటిగట్లకు చేర్చితే, ఏటిగట్టు నుంచి ఏ గ్రామానికి ఆ గ్రామ వలంటీర్ బాధ్యతగా తీసుకుని పడవలో తీసుకువెళ్లి అందించారు. -
AP: వలంటీరన్నా గుర్తొస్తున్నావ్!
ప్రస్తుతం భారీ వర్షాలకుతోడు వరదలతో పలు జిల్లాల్లో ప్రజలు అల్లాడుతున్నారు. ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తే యడంతో ఆదుకునేవారు లేక విలవిల్లాడుతున్నారు. ఇళ్లను వరదనీరు చుట్టుముట్టడంతో బయటకు వచ్చే దారిలేక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తాగడానికి గుక్కెడు తాగునీరు లేక.. ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం వాడుకుని ఉంటే ఈ దుస్థితి దాపురించేది కాదని బాధితులు మండిపడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో వరదలు సంభవించినప్పుడు ప్రభావిత ప్రాంతాల్లో వలంటీర్లు స్వయంగా భుజం లోతు నీళ్లలోనూ బాధితుల ఇళ్లకు వెళ్లి వారి క్షేమ సమాచారాలు ఆరా తీశారని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా బాధితులకు ఆహార పదార్థాలు, బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు అందించారని చెబుతున్నారు. నాడు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో వలంటీర్లు నిత్యం వరద పరిస్థితిని అంచనా వేయడం, నది గట్లు ఎలా ఉన్నాయో పరిశీలించి ఏదైనా సమస్య ఉంటే వెంటనే అధికారులకు తెలిపేవారని అంటున్నారు. నేడు చంద్రబాబు ప్రభుత్వం వలంటీర్లను పక్కనపెట్టడంతో తమకు కోలుకోలేని దెబ్బ తగిలిందని బాధితులు వాపోతున్నారు. నాడు: వలంటీర్ల సేవలతో ప్రజలు సురక్షితంబి.దొడ్డవరంలో ట్రాక్టరులో కూరగాయలు తీసుకువచ్చి అందిస్తోన్న వలంటీర్ కోళ్ల సురేష్ మామిడికుదురు మండలంలో నడుములోతు నీటిలో నిత్యావసరాలు అందిస్తున్న సురేష్ అప్పనపల్లి బాడవలో బాధితుల కోసం పీకల్లోతు ముంపులో నిత్యావసరాలను బుజానకెత్తుకుని వెళుతోన్న వలంటీర్ నీతిపూడి నాగరాజు నేడు: బాబు జమానాలో ప్రజలకు ఇక్కట్లు సింగ్ నగర్ ప్లై ఓవర్పైన ఆహారం కోసం ఎగబడుతున్న వరద నిర్వాసితులు సింగ్ నగర్ ప్లై ఓవర్పైన ఆహారం కోసం ఎగబడుతున్న వరద నిర్వాసితులు కుందావారి కండ్రికలో బాధితులే వాటర్ క్యాన్లు తెచ్చుకుంటున్న దృశ్యం -
వరద బీభత్సం: వాలంటీర్లు లేక ప్రజల అష్టకష్టాలు
సాక్షి,విజయవాడ: ఏపీలో వాలంటీర్లు లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వాలంటీర్ల సేవలు లేక రాష్ట్రంలో వరద బాధితులు అష్టకష్టాలు పడుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఏర్పాటుచేసిన వాలంటీర్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్వీర్యం చేసిన విషయం తెలిసిందే. తుపాన్లు, వరదల సమయంలో బాధితులకు గతంలో వాలంటీర్లు అండగా నిలిచేవారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ, గుంటూరులో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచినీళ్లు, ఆహారం, పునరావాసం లేక సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కనీసం అందుబాటులో ఉన్న వాలంటీర్లను కూడా వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం వినియోగించడం లేదు. వాలంటీర్లు ఉన్నప్పుడు తమకు సమస్యలు లేవని బాధితులు గుర్తుచేసుకుంటున్నారు. వైఎస్ జగన్ హయాంలో విపత్తుల వేల వాలంటీర్లు విస్తృతంగా సేవలందించారని చెబుతున్నారు. వాలంటీర్లపై కక్ష ప్రజలకు శిక్షగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీ ప్రభుత్వంపై వాలంటీర్ల ఆగ్రహం
-
అడక్కుండానే హామీ ఇచ్చి.. అడుక్కునేలా చేస్తున్నారు
సాక్షి, అమరావతి/కృష్ణలంక (విజయవాడ తూర్పు): అడక్కుండానే వార్డు, గ్రామ వలంటీర్లకు హామీలిచ్చిన సీఎం చంద్రబాబు.. వాటిని అమలు చేయకుండా వలంటీర్లను అడుక్కునేలా చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ వలంటీర్ల యూనియన్ మండిపడింది. ఆంధ్రప్రదేశ్ వలంటీర్ల యూనియన్ రాష్ట్రస్థాయి సదస్సు ఎంబీ భవన్లో మంగళవారం జరిగింది. వివిధ జిల్లాల నుంచి తరలివచి్చన యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. వలంటీర్లు ఎవరూ అడగకపోయినా సీఎం చంద్రబాబే వలంటీర్ల గౌరవ వేతనం రూ.10 వేలకు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ, అధికారంలోకి వచ్చాక మూడు నెలలుగా వలంటీర్లకు జీతాలు చెల్లించకుండా తమ పొట్టకొడుతున్నారని వాపోయారు. ఐదేళ్లలో అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన విధుల్లో తాము పాల్గొన్నామని పేర్కొన్నారు. ఎన్నికల ముందు అడగకుండానే హామీ ఇచ్చి.. ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు వలంటీర్లను ఏదో ఒక పార్టీ వారిగా ముద్రవేసి అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఏదో ఒక పార్టీకి చెందిన వాళ్లం కాదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతన బకాయిలు చెల్లించి, నెలవారీ వేతనాన్ని రూ.10 వేలకు పెంచాలని కోరుతూ సదస్సు తీర్మానించింది. రాజీనామా చేసిన వలంటీర్లను కూడా మానవతా దృక్పథంతో తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో వలంటీర్లకు ప్రత్యేక వెయిటేజీ ప్రకటిస్తూ, అర్హతలను బట్టి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ మరో తీర్మానం చేశారు.సీఐటీయూ మద్దతు వలంటీర్ల డిమాండ్లకు సీఐటీయూ మద్దతు తెలిపింది. వలంటీర్ల సమస్యల పరిష్కార సాధనలో సీఐటీయూకు అనుబంధంగా యూనియన్ను ఏర్పాటు చేసింది. సీఐటీయూ కార్యదర్శి కె.ధనలక్ష్మి మాట్లాడుతూ.. గ్రామ, వార్డు వలంటీర్లను విధుల్లో కొనసాగించి ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి వేతనాలు చెల్లించాలని, రూ.10 వేల వేతనం చెల్లిస్తామన్న హామీని అమలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా హుమయూన్ బాషా, ఉపాధ్యక్షునిగా వెంకటసుబ్బయ్య, కార్యనిర్వాహక కార్యదర్శిగా దీప్తి, కోశాధికారిగా హేమంత్ను ఎన్నుకున్నారు. సదస్సులో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శులు కె.ఉమామహేశ్వరరావు, ఆర్వీ నరసింహరావు పాల్గొన్నారు. -
వాలంటీర్లను చంద్రబాబు మోసం చేయడంపై YSRCP ఫైర్
-
బాబు తేనె పూసిన కత్తికి వాలంటీర్లు బలి: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: అధికారంలోకి వచ్చేందుకు ఎన్ని అబద్దాలు చెప్పడానికైనా వెనుకాడని వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మరోసారి నిరూపితమైంది. అధికారం కోసం అలవి కాని హామీలు ఇచ్చి ఇప్పుడు తీర్చలేక ప్రజలను మోసం చేస్తున్నాడు. మరోవైపు.. ఎన్నికలకు ముందు వాలంటీర్లపై కపట ప్రేమ చూపించి అధికారంలోకి వచ్చాక.. వారిని నట్టేట ముంచేశాడు. దీంతో వారంతా దిక్కులేని స్థితిలో రోడ్డున పడ్డారని వాలంటీర్ల కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. కాగా, వాలంటీర్లకు జరిగిన అన్యాయంపై వైఎస్సార్సీపీ స్పందించింది. తాజాగా వైఎస్సార్సీపీ ఎక్స్ వేదికగా.. సీఎం చంద్రబాబు మొదటి నుంచీ వాలంటీర్లపై అక్కస్సు వెళ్లగక్కుతూనే ఉన్నారు. కానీ, ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఎలక్షన్స్ ముందు కపట హామీలతో వాలంటీర్లను మభ్యపెట్టాడు. తీరా ఎన్నికల్లో గెలిచిన తర్వాత వాలంటీర్లను నట్టేట ముంచేశాడు. వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యంపై క్లారిటీ ఇస్తూ.. వారి గ్రూపులన్నింటినీ డిలీజ్ చేయాలని అధికారులను చంద్రబాబు ఆదివారం ఆదేశించారు. చంద్రబాబు తేనే పూసిన కత్తికి బలైపోయి లక్షలాది మంది వాలంటీర్లు రోడ్డున పడ్డారు అని పేర్కొంది.ఇక, ఎన్నికల సమయంలో వాలంటీర్లపై చంద్రబాబు ఎంతో కపట ప్రేమను చూపించారు. తాము అధికారంలోకి వస్తే.. వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించి.. వారికి జీతం రెట్టింపు చేస్తామన్నారు. వాలంటీర్ల జీతం రూ.10వేలు ఇస్తానని దొంగ హామీ ఇచ్చారు. కానీ, గెలిచాక మాత్రం చేతులెత్తేశారు. వాలంటీర్ వ్యవస్థపై మొదటి నుంచి అక్కసు వెళ్లగక్కిన @ncbn.. ఎన్నికల ముందు మాత్రం కపట హామీలతో వారిని మభ్యపెట్టి.. గెలిచాక నట్టేట ముంచేశాడు. వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యంపై క్లారిటీ ఇస్తూ.. వాలంటీర్ గ్రూప్లన్నీ డిలీట్ చేయాలని అధికారులకి ఆదివారం ఆదేశాలుచంద్రబాబు తేనె పూసిన కత్తికి… pic.twitter.com/16asihjkF1— YSR Congress Party (@YSRCParty) August 5, 2024 -
వాలంటీర్ల వాట్సాప్ గ్రూపులన్నీ తొలగించాలని చంద్రబాబు సర్కార్ ఆదేశం
-
విధుల్లేకుండా.. జీతాలివ్వకుండా..
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు టీడీపీ–జనసేన–బీజేపీ నేతల మాటలకు.. అధికారంలోకి వచ్చాక వారి వైఖరికి ఎక్కడా పొంతన లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు తీవ్ర నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆయా పార్టీల నేతలు చేస్తున్న ప్రకటనలు.. ప్రభుత్వ తీరు చూస్తుంటే తమ భవిష్యత్తు అగమ్యగోచరంగా ఉందని వారు గగ్గోలు పెడుతున్నారు. ఎన్నికల ముందు కొందరు రాజీనామాలు చేయగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2 లక్షల 6వేల మంది వలంటీర్లు ఇప్పటికీ విధుల్లో కొనసాగుతున్నారు. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక వారికి జూలై ఒకటిన చెల్లించాల్సిన వేతనాలు ఇప్పటికీ అందలేదు. పైగా.. విధులూ చెప్పడంలేదు. స్థానిక ఎమ్మెల్యేల మౌఖిక ఆదేశాలతో డీడీఓలు వలంటీర్ల గౌరవ వేతన బిల్లులు పెట్టడంలేదని వలంటీర్ల సంఘాల్లో ప్రచారం జరుగుతోంది. నిజానికి.. జూన్ ఒకటిన వీరు సకాలంలో వేతనాలు అందుకోగా జూన్ 4న ఎన్నికల ఫలితాలు తర్వాత వీరి ఇక్కట్లు మొదలయ్యాయి. దీంతో జూన్ నెల గౌరవ వేతనాలు ఇప్పటివరకు వలంటీర్లకు అందలేదు. అలాగే, రేపు ఆగస్టు 1న చెల్లించాల్సిన వేతనాలకు సంబంధించిన ప్రక్రియను కూడా ఎక్కువమంది డీడీఓలు తాత్సారం చేస్తున్నారని ఈ సంఘాలు ఆరోపిస్తున్నాయి. విధులు అప్పజెప్పని సర్కారు.. మరోవైపు.. కూటమి ప్రభుత్వం అధికారికంగా వలంటీర్లకు ఎలాంటి విధులు కూడా అప్పజెప్పడంలేదని వారంటున్నారు. గత ఐదేళ్ల పాటు రాష్ట్రంలో పింఛన్ పంపిణీని వీరు ప్రతీనెలా ఠంఛనుగా ఒకటో తేదీ తెల్లవారుజామునే లబి్ధదారుల ఇళ్ల వద్దకే వెళ్లి అందించగా.. చంద్రబాబు సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత జూలై ఒకటిన వలంటీర్లతో కాకుండా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇక ఆగస్టు ఒకటిన చేపట్టే పింఛన్ల పంపిణీకీ కూడా ప్రభుత్వం వలంటీర్లను దూరంగా ఉంచబోతోంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం తమతో దోబూచులాడుతోందని... అలాగే, వలంటీర్ల వ్యవస్థ అవసరమేలేదన్నట్లుగా ఉందని వలంటీర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఐదేళ్లపాటు అన్నింటా వారే..వాస్తవానికి.. గత ఐదేళ్లలో వలంటీర్ల సేవలు కేవలం పింఛన్ల పంపిణీకే పరిమితం కాలేదు. రాష్ట్రంలో 2019–24 మధ్య ప్రభుత్వం అమలుచేసిన 33 రకాల ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్లో ఎలాంటి అవినీతికి, పైరవీలకు తావులేకుండా ఆయా పథకాల లబ్ధిని నేరుగా లబి్ధదారుల ఇంటివద్దే వలంటీర్లు అందించారు. గ్రామాల్లో ప్రభుత్వాఫీసుల్లో ఎవరికి ఏ పని ఉన్నా వలంటీర్లు వారికి దిక్సూచిగా పనిచేశారు. ప్రభుత్వం ఏ పథకం అమలుచేసినా వీరే ఇంటింటికీ వెళ్లి ఆయా పథకాల గురించి వారికి వివరించి, అర్హులను గుర్తించి, అవి వారికి అందేలా ఎంతో తోడ్పడ్డారు. కరోనా వంటి అత్యంత విపత్కర పరిస్థితుల్లో వలంటీర్ల సేవలను ఎంత చెప్పుకున్నా తక్కువే. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రతినెలా రెండు విడతల చొప్పున ఫీవర్ సర్వేను విజయవంతంగా పూర్తిచేసి కరోనా నియంత్రణలో కీలక భూమిక పోషించారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం అవన్నీ మర్చిపోయి పింఛన్ల పంపిణీ నుంచి వారిని దూరంపెట్టి ఆ కార్యక్రమానికి వారి అవసరమేలేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఆందోళన బాటలో వలంటీర్లు..ఇదిలా ఉంటే.. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇవ్వడంతో పాటు వారి గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని అరచేతిలో వైకుంఠం చూపించారు. కానీ, ఎన్నికల్లో గెలిచాక టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి నేతల్లో తమపట్ల స్పష్టమైన వ్యతిరేక భావన కనిపిస్తోందని వలంటీర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్కు ముందు పనిచేసిన వలంటీర్లు అందరినీ కొనసాగించడంతో పాటు తమకు జూన్ నెల గౌరవ వేతనం బకాయిలతో చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. నెలన్నర రోజులుగా మంత్రులు, అధికారులకు కూడా వినతిపత్రాలు అందజేసినట్లు వలంటీర్ల సంఘ ప్రతినిధులు చెప్పారు. -
ఇదేం శాడిజం.. పింఛన్ పంపిణీకి తంటాలు
విజయవాడ, సాక్షి: పింఛన్ పంపిణీకి కూటమి ప్రభుత్వం తంటాలు పడుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో నిష్ఫక్షపాతంగా పని చేసిన వలంటీర్ వ్యవస్థను పూర్తిగా కనుమరుగు చేసే ప్రయత్నాలు ఇంకా బలంగానే చేస్తోంది. ఈ క్రమంలో ఈ నెలలో కూడా పంపిణీకి సచివాలయ ఉద్యోగుల్నే రంగంలోకి దించింది... వలంటీర్లు లేకుండానే గత నెల పింఛన్లను పంపిణీ చేసింది ప్రభుత్వం. దీంతో వలంటీర్లు అవసరం ఏముంది? అనే ఆలోచనను సీఎం చంద్రబాబు ప్రభుత్వం ముందుకు తెస్తోంది. అంతేకాకుండా జగన్ తెచ్చిన వలంటీర్ వ్యవస్థను మనం కొనసాగించడం ఏంటని.. దానిని రద్దుచేయాలని కూటమి నేతలు చంద్రబాబును కోరుతున్నట్టుగా కూడా ప్రచారం చేస్తున్నారు. మోసపోయాం: వలంటీర్లువైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల పంపిణీ కోసం వైఎస్ జగన్ వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. అయితే.. తొలినాళ్లలో వలంటీర్లపై తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు నాయుడు.. ఎన్నికల ప్రచారం నాటికి స్వరం మార్చారు. తాను అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని, గౌరవ వేతనం రెట్టింపు చేసి నెలకు రూ.10వేలు చెల్లిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు ఎన్నికల టైంలో ఈసీకి ఫిర్యాదు చేయడం ద్వారా చంద్రబాబు.. వలంటీర్లను పెన్షన్ పంపిణీకి దూరం చేసి లబ్ధిదారులకు నరకం చూపించారు. ఈ క్రమంలో కొందరు చనిపోయారు కూడా. ఏపీలో ఎన్నికల ముందు రెండు నెలలు.. ఎన్నికల తర్వాత రెండు నెలలు.. వలంటీర్లు ఖాళీగా ఉన్నారు. చంద్రబాబు పెంచి ఇస్తామన్న గౌరవవేతనం మాట దేవుడెరుగు.. వాళ్లకు రెగ్యులర్గా వచ్చే గౌరవ వేతనాలు కూడా అందలేదు. ఇక ఆగస్టులో వారికి వేతనాలు ఇస్తారో? లేదో? తెలియని పరిస్థితి నెలకొంది. ఎన్నికలు జరిగి రెండు నెలలు పూర్తయినా ఎలాంటి విధులు అప్పగించకపోవడం, వేతనాలు లేకపోవడంతో వలంటీర్లు ఆందోళన చెందుతున్నారు. తమను కొనసాగిస్తారో.. తొలగిస్తారో అనే అనుమానాల మధ్యే వలంటీర్లు కలెక్టరేట్లు చుట్టూ తిరుగుతూ వినతి పత్రాలు ఇస్తూ వస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు కూడా!చంద్రబాబు శాడిజానికి వలంటీర్లు మాత్రమే కాదు.. సచివాలయ ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఒకటో తేదీ తెల్లవారుజాము నుంచే పింఛన్ పంపిణీ చేయాలని, ఒకవేళ గ్రామాల్లో నివాసం లేని వాళ్లు ఇవాళ అర్ధరాత్రిలోపే సచివాలయంలో బస చేయాలని జిల్లా కలెక్టర్, ఎంపీడీవోలకు మౌలిక ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. దీంతో అధికారుల ఉత్తర్వులతో సచివాలయ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యధిక శాతం మహిళా ఉద్యోగులే ఉండగా.. రాత్రిపూట సచివాలయంలో ఏ విధంగా బస చేస్తామని ప్రశ్నిస్తున్నారు. పోనీ పెన్షన్ పంపిణీ అయినా వాళ్ల చేత సక్రమంగా చేయించారా? అంటే అదీ లేదు. టీడీపీ నేతల జోక్యంతో అది కాస్త రాజకీయ కార్యక్రమంగా నడిచింది. మరోవైపు సర్వర్లో ఇబ్బందులతో ఇటు సచివాలయ ఉద్యోగులు.. అటు ఫించన్దారులు నానా ఇబ్బందులు పడ్డారు. -
volunteers: మాకు న్యాయం చేయండి
సాక్షి, అమరావతి/మహారాణిపేట(విశాఖ): వలంటీర్లకు జూన్ నెల గౌరవ వేతన బకాయిలను వెంటనే చెల్లించడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వలంటీర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు వలంటీర్ల ప్రతినిధులు జిల్లా కలెకరేట్లతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికల్లో వినతిపత్రాలు సమర్పించారు. ఆయా వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారి గౌరవ వేతనాన్ని రూ. 5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల ముందు చంద్రబాబు బహిరంగ సభలలో చెప్పడంతో పాటు మేనిఫెస్టోలో హామీ ఇచి్చన విషయం తెలిసిందే. అయితే, ప్రతి నెలా ఇచ్చే సామాజిక పింఛన్లను.. 2019 ఆగస్టులో వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుంచి వారే క్షేత్రస్థాయిలో సమర్థంగా పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం మొదటిసారి ఇచి్చన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వలంటీర్లను దూరంగా పెట్టి, గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా నిర్వహించారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి మొదలయ్యే పింఛన్ల పంపిణీ కూడా వలంటీర్లతో సంబంధం లేకుండా సచివాలయాల ఉద్యోగుల ద్వారా పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా లక్షన్నర మంది వలంటీర్లు విధుల్లో కొనసాగుతుండగా, వారిలో దాదాపు 75 శాతం మందికి జూన్ నెల గౌరవ వేతనం ఇప్పటి వరకూ కూడా అందలేదని వలంటీర్ల సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.#APVolunteers ఉద్యోగాల భద్రత, పెండింగ్లో ఉన్న వేతనములు విడుదల చేయాలి. రాజీనామా చేసిన వారిని తిరిగి కొనసాగించాలి, మాకు న్యాయం చేయాలని... అందరూ వాలంటీర్లు *సోమవారం(జూలై 29) కర్నూలు కలెక్టరేట్ లో* జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు. #GVWV pic.twitter.com/NH5Jt9ASy0— 𝚅𝙾𝙻𝚄𝙽𝚃𝙴𝙴𝚁 𝙲𝙾𝙽𝙽𝙴𝙲𝚃𝙸𝙾𝙽 (@news_volunteer) July 29, 2024రూ. 10 వేలు వేతనం ఇవ్వాలి కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం నెలకు రూ. 10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వలంటీర్లు సోమవారం విశాఖ కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆం«ధ్రప్రదేశ్ వలంటీర్లు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జగదీష్, కార్యదర్శి సంపత్ మాట్లాడుతూ.. ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని తక్షణమే అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న వేతన బకాయిలు వెంటనే ఇవ్వాలని కోరారు.#APVolunteers ఉద్యోగాల భద్రత, పెండింగ్లో ఉన్న వేతనములు విడుదల చేయాలి. రాజీనామా చేసిన వారిని తిరిగి కొనసాగించాలి, మాకు న్యాయం చేయాలని.*సోమవారం(జూలై 29) విజయనగరం కలెక్టరేట్ లో* జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ గారికి మరియు MLA గారికి వినతిపత్రం సమర్పించారు. #GVWV pic.twitter.com/hmmBZ2bu1D— 𝚅𝙾𝙻𝚄𝙽𝚃𝙴𝙴𝚁 𝙲𝙾𝙽𝙽𝙴𝙲𝚃𝙸𝙾𝙽 (@news_volunteer) July 29, 2024 #APVolunteers ఉద్యోగాల భద్రత, పెండింగ్లో ఉన్న వేతనములు విడుదల చేయాలి. రాజీనామా చేసిన వారిని తిరిగి కొనసాగించాలి, మాకు న్యాయం చేయాలని... అందరూ వాలంటీర్లు సోమవారం(జూలై 29) గుంటూరు కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించారు. #GVWV pic.twitter.com/AgWIHFBtaG— 𝚅𝙾𝙻𝚄𝙽𝚃𝙴𝙴𝚁 𝙲𝙾𝙽𝙽𝙴𝙲𝚃𝙸𝙾𝙽 (@news_volunteer) July 29, 2024 #APVolunteers ఉద్యోగాల భద్రత, పెండింగ్లో ఉన్న వేతనములు విడుదల చేయాలి. రాజీనామా చేసిన వారిని తిరిగి కొనసాగించాలి, మాకు న్యాయం చేయాలని.*సోమవారం(జూలై 29) విజయనగరం కలెక్టరేట్ లో* జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ గారికి మరియు MLA గారికి వినతిపత్రం సమర్పించారు. #GVWV pic.twitter.com/hmmBZ2bu1D— 𝚅𝙾𝙻𝚄𝙽𝚃𝙴𝙴𝚁 𝙲𝙾𝙽𝙽𝙴𝙲𝚃𝙸𝙾𝙽 (@news_volunteer) July 29, 2024VIDEO and Photo Credits: 𝚅𝙾𝙻𝚄𝙽𝚃𝙴𝙴𝚁 𝙲𝙾𝙽𝙽𝙴𝙲𝚃𝙸𝙾𝙽వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయండి సాక్షి, అమరావతి: టీడీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన వైవీబీ రాజేంద్రప్రసాద్ అధ్యక్షుడిగా పనిచేస్తున్న ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ సోమవారం గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. చాంబర్ రాష్ట్ర కమిటీ సోమవారం విజయవాడలో సమావేశమై ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ,ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్, కౌన్సిలర్, కార్పొరేటర్, చైర్మన్, మేయర్ల ఒక నెల గౌరవ వేతనాన్ని అమరావతి అభివృద్ధికి విరాళంగా ఇవ్వాలని తీర్మానించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ను కలిసి తమ సంఘం 16 డిమాండ్ల వినతిపత్రం ఇచ్చి, చర్చించి ఆయా డిమాండ్లను పరిష్కరించ వలసిందిగా కోరాలని తీర్మానించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఏడాదిలో ఒకరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి అవకాశం కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరో తీర్మానం చేశారు. -
వలంటీర్లపై ముందడుగా, వెనకడుగా?
సాక్షి, అమరావతి: ఐదేళ్ల కిత్రం రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన వలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం కొనసాగించే అలోచనలో ఉందా లేదా అన్న అంశంపై మంగళవారం శాసన సభ సమావేశాల ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో చర్చ జరగనుంది. మంగళవారం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ముందుగా నిర్ణయించిన పది ప్రశ్నల్లో ఈ అంశం మూడోది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, బి. విరూపాక్షి లేవనెత్తిన ఈ ప్రశ్నకు సాంఘిక సంక్షేమ శాఖ, గ్రామ, వార్డు సచివాలయాల శాఖల మంత్రి డోలా బాల వీరాంజనేయులు సమాధానం చెప్పనున్నారు. ఈ సందర్బంగా సభలో జరిగే చర్చలో వలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వ ఆలోచనలు, సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ప్రకారం వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారా.. వారి గౌరవ వేతనం పెంపు హామీని నిలబెట్టుకుంటారా అన్న విషయాలపై చాలా వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.త్రిశంకుస్వర్గంలో వలంటీర్ల వ్యవస్థప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడానికి, వారికి అన్ని విధాలా సహకరించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 ఆగస్టులో వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థపై అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా విరుచుకుపడేవారు. దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి మాట మార్చేశారు. వలంటీర్లను కొనసాగిస్తామని, గౌరవ వేతనాన్ని రూ. 10 వేలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఊసే ఎత్తడంలేదు. పైగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి జులై ఒకటి నుంచి చేపట్టిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వలంటీర్లను తప్పించారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా పింఛన్లు పంపిణీ చేశారు. వలంటీర్లు ప్రతి నెలా కీలకంగా నిర్వహించే విధుల్లో పింఛన్ల పంపిణీ ప్రధానమైనది. అటువంటి కార్యక్రమానికే దూరంగా పెట్టడంతో వలంటీర్ల వ్యవస్థపై రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలు ఏమిటన్న విషయంపై అధికార, రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తుందా లేదంటే ఇంకేమైనా తీవ్రమైన నిర్ణయం తీసుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవే అనుమానాలతో రాష్ట్రంలో పలుచోట్ల వలంటీర్లు ఆందోళనలు చేస్తున్నారు. సోమవారం విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ కార్యాలయం వద్ద ప్రస్తుతం అధికారికంగా విధుల్లో కొనసాగుతున్న పలువురు వలంటీర్లు నిరసన తెలియజేశారు. వలంటీర్ల వ్యవస్థను కొనసాగించాలని, ఎన్నికల ముందు చెప్పిన ప్రకారం గౌరవ వేతనం రూ. 10 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. -
ఏపీ హైకోర్టులో కొడాలి నానికి ఊరట
సాక్షి, గుంటూరు: మాజీ మంత్రి కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. రాష్ట్రంలో వలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నమోదు చేసిన కేసుపై 41ఏ ప్రోసీజర్ పాటించాలని కోర్డు ఆదేశించింది. అనంతరం, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.కాగా, మాజీ మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట లభించింది. వలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదుపై నమోదు చేసిన కేసులో కొడాలి నాని ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈనేపథ్యంలో విచారణలో భాగంగా 41ఏ ప్రొసీజర్ను పోలీసులు పాటించాలని కోర్టు ఆదేశించింది. అలాగే, విచారణలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించాలని హైకోర్టు పోలీసులను ఆదేశాలు జారీ చేసింది. అనంతరం, తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.ఇదిలా ఉండగా.. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతల ప్రోత్బలంతో కొందరు వలంటీర్లు వైఎస్సార్సీపీ నేతలపై ఫిర్యాదు చేశారు. దీంతో, వారికి వత్తాసు పలుకుతూ పోలీసులు కూడా అక్రమంగా కేసులు నమోదు చేశారు. -
వలంటీర్ల ఆందోళన బాట.. పోలీసుల అత్యుత్సాహం
ఎన్టీఆర్, సాక్షి: పింఛన్ల పంపిణీని సచివాలయ ఉద్యోగులతో చేయించడంతో వలంటీర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో తమకు జీతాలు పెంచుతామని చెప్పిన కూటమి నేతలు.. తీరా అధికారంలో వచ్చాక విధులకు తమను దూరం చేయడాన్ని ప్రతికూల సంకేతంగా భావిస్తున్నారు. వలంటీర్ వ్యవస్థకు భద్రత కల్పించాలని కోరుతూ ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. వలంటీర్లు చలో విజయవాడకు పిలుపు ఇచ్చారంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో విజయవాడలో హైఅలర్ట్ నెలకొంది. కలెక్టరేట్ వద్ద పోలీస్ సిబ్బంది భారీగా మోహరించారు. నగర వ్యాప్తంగా పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వలంటీర్లను అదుపులోకి తీసుకునేందుకు బస్టాండ్, రైల్వే స్టేషన్లలో పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రతీ ఒక్కరినీ చెక్ చేయడంతో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. కేవలం వాట్సాప్ గ్రూపుల్లో జరిగిన ప్రచారంతో ఇంత హడావిడి చేయడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ర్యాలీ, ప్రదర్శనలకు వలంటీర్లు తమను ఎలాంటి అనుమతి కోరలేదని విజయవాడ పోలీసులు చెబుతున్నారు. శాంతి భద్రతల కట్టడి సెక్షన్లు అమలులో ఉన్నాయని వారు చెబుతున్నారు. మరోవైపు వలంటీర్ సేవల్ని ఎలా ఉపయోగించుకుంటారు?.. వాళ్ల ఉద్యోగ భద్రతపై ఇప్పటిదాకా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోవడం గమనార్హం. -
పింఛన్ల పంపిణీ.. పవన్ కళ్యాణ్కు పరాభవం
పిఠాపురం: వలంటీర్లు లేకపోతే అసలు పింఛన్ల పంపిణీ అసాధ్యమన్నారని, కానీ వారి అవసరం లేకుండా పింఛన్లు పంపిణీ చేసి చూపించామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచి్చన హామీ ప్రకారం ఒకటో తేదీన వలంటీర్లు లేకుండానే సచివాలయాలు, వివిధ శాఖల సిబ్బందితో పింఛన్లు పంపిణీ చేస్తున్నారన్నారు.గతంలో పింఛన్ల పంపిణీలో కొందరు వలంటీర్లు లబ్ధిదారుల వద్ద రూ.100కు తక్కువ కాకుండా తీసుకునేవారని తనకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రభుత్వ సిబ్బందితోనే పింఛన్లు పంపిణీ చేయడం వల్ల పారదర్శకత పెరుగుతుందని అన్నారు. లబ్ధిదారుల వద్ద డబ్బు అడిగేందుకు అవకాశం కూడా ఉండదని, ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి బాధ్యత తీసుకుంటారని చెప్పారు. వలంటీర్లు లేకుండానే వ్యవస్థలతో పని చేయిస్తే ఎలా ఉంటుందో దీని ద్వారా చేసి చూపించామన్నారు.వంద శాతం గ్రామాలకు పూర్తి స్థాయి రక్షిత మంచినీరు అందించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేయడం, ప్రతి ఇంటికీ లోటు లేకుండా స్వచ్ఛమైన నీరు అందించి, ప్రజలందరి ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలనేదే తన లక్ష్యమని చెప్పారు. రక్షిత మంచి నీరు, ఉపాధి, సాగునీటి కాలువల పూడికతీత వంటివి చేసి, ప్రజలకు దగ్గర కావాలనేది తన ఆకాంక్ష అన్నారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ దేశంలోనే అత్యుత్తమంగా ఉండాలనేది తన ప్రయత్నమన్నారు. రాష్ట్రంలో ఏ పరిశ్రమ నుంచి ఎంత కాలుష్యం విడుదలవుతోందనే ఆడిట్ లెక్కలు తీయిస్తున్నామని చెప్పారు. పరిశ్రమల నిర్వాహకులే కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, కలెక్టర్ షాన్మోహన్, ఎస్పీ సతీష్కుమార్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పాల్గొన్నారు.పవన్ కళ్యాణ్కు పరాభవం భీమవరం: పింఛన్ల పంపిణీ కరపత్రంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రాన్ని ముద్రించకపోవడం ఆయన్ని పరాభవించడమేనని జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ సహకారంతో అధికారంలోకి వచి్చన చంద్రబాబు పింఛన్ల కరపత్రంపై కేవలం తన చిత్రాన్ని మాత్రమే ముద్రించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. కరపత్రంపై పవన్ ఫొటో ముద్రించకుండా దారుణంగా అవమానించారని వ్యాఖ్యానిస్తున్నారు. కేవలం తాను మాత్రమే ప్రచారం పొందాలన్న యావ చంద్రబాబుకు ఇంకా పోలేదని జనసేన కార్యకర్తలు, నాయకులు విమర్శిస్తున్నారు. అంతేకాదు.. ఎన్టీఆర్ పేరుతో పంపిణీ చేస్తున్న పింఛన్ల కరపత్రంపై ఎన్టీఆర్ చిత్రాన్ని కూడా వేయకపోవడం గమనార్హం. దీనిపై ఎనీ్టఆర్ అభిమానులు కూడా మండిపడుతున్నారు. -
వాలంటీర్లు వేస్ట్.. తేల్చి చెప్పిన టీడీపీ నేత
-
వాలంటీర్లు వద్దట!.. జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కాకినాడ జిల్లా: వాలంటీర్లపై తమ అసలు రంగును టీడీపీ నేతలు బయటపెడుతున్నారు. వాలంటీర్ల సేవలు అవసరం లేదని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తేల్చి చెప్పేశారు. వాలంటీర్లు వద్దని టీడీపీ లేజిస్లేటివ్ సమావేశంలో చెబుతా.. అసెంబ్లీ సమావేశాల్లో ఒత్తిడి చేస్తానంటూ ఆయన వ్యాఖ్యానించారు. వాలంటీర్ల కంటే పారిశుధ్య కార్మికులకు రూ.10 వేలు ఇచ్చి నియమించుకోవాలన్న జ్యోతుల నెహ్రూ.. సచివాలయ ఉద్యోగులకు కాపలా కుక్కల్లా ఏన్డీఏ కార్యకర్తలు ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.కాగా, ఐదేళ్ల క్రితం ఏర్పాటైన విప్లవాత్మక వలంటీర్ వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం త్రిశంకు స్వర్గంలో పెట్టేసింది. 2019 ఆగస్టులో గత ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టగా వీరు నిర్వహించే విధుల్లో ప్రతి నెలా టంఛన్గా పింఛన్ల పంపిణీ అత్యంత కీలకం. అయితే జూలైలో పింఛన్ల పంపిణీని వలంటీర్ల ద్వారా కాకుండా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా నిర్వహించాలని మంత్రివర్గ తొలి సమావేశంలో నిర్ణయించిన నేపథ్యంలో వలంటీర్ల వ్యవస్థపై అటు అధికార వర్గాలు ఇటు రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతో పాటు వారి గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికలకు ముందు చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. టీడీపీ–జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోనూ దీన్ని పొందుపరిచారు. అయితే ఇప్పుడు వలంటీర్లు ప్రధానంగా నిర్వహించే విధుల నుంచి వారిని దూరంగా ఉంచడం, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పింఛన్ల పంపిణీకి సన్నద్ధం కావడంతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చర్చనీయాంశంగా మారింది. -
చంద్రబాబు కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు
-
వలంటీర్లకు విధులేవి?
సాక్షి, అమరావతి: ఐదేళ్ల క్రితం ఏర్పాటైన విప్లవాత్మక వలంటీర్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం త్రిశంకు æస్వర్గంలో పెట్టేసింది. 2019 ఆగస్టులో గత ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టగా వీరు నిర్వహించే విధుల్లో ప్రతి నెలా టంఛన్గా పింఛన్ల పంపిణీ అత్యంత కీలకం. అయితే జూలైలో పింఛన్ల పంపిణీని వలంటీర్ల ద్వారా కాకుండా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా నిర్వహించాలని సోమవారం మంత్రివర్గ తొలి సమావేశంలో నిర్ణయించిన నేపథ్యంలో వలంటీర్ల వ్యవస్థపై అటు అధికార వర్గాలు ఇటు రాజకీయ వర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగించడంతో పాటు వారి గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికలకు ముందు చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. టీడీపీ–జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలోనూ దీన్ని పొందుపరిచారు. అయితే ఇప్పుడు వలంటీర్లు ప్రధానంగా నిర్వహించే విధుల నుంచి వారిని దూరంగా ఉంచడం, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పింఛన్ల పంపిణీకి సన్నద్ధం కావడంతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చర్చనీయాంశంగా మారింది. లక్షన్నర మంది విధుల్లోనే..రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి 50 ఇళ్లకు, పట్టణ ప్రాంతాల్లో 75–100 ఇళ్లకు ఒకరు చొప్పున గతంలో 2.65 లక్షల మంది వలంటీర్లు విధులు నిర్వర్తించారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత మినహా ఐదేళ్ల పాటు వలంటీర్ల సేవలు కొనసాగాయి. అనంతర పరిణామాల నేపథ్యంలో పలువురు రాజీనామాలు చేయగా ప్రస్తుతం లక్షన్నర మందికి పైగా విధుల్లో కొనసాగుతున్నారు. అయితే పింఛన్ల పంపిణీతో పాటు ఇతర సాధారణ విధులు కూడా అప్పగించకుండా వారిని దూరంగా ఉంచడం ప్రశ్నార్థకంగా మారింది.ఆగస్టు 14 ఆఖరి గడువు..సాధారణంగా ప్రభుత్వ విభాగాల్లో నెలవారీ గౌరవ వేతనంతో పనిచేసే వారిని కొనసాగించేందుకు నిర్దిష్ట సమయంలోగా ఎప్పటికప్పుడు అనుమతులు మంజూరు చేస్తారు. 2019 ఆగస్టులో ఏర్పాటైన వలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు గడువు ఈ ఏడాది ఆగస్టు 14వ తేదీతో ముగియనుంది. అనంతరం ఈ వ్యవస్థను కొనసాగించాలంటే ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుంది. వలంటీర్లకు బాబు వెన్నుపోటు! వలంటీర్లకు చంద్రబాబు తనదైన శైలిలో వెన్నుపోటు పొడిచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ‘వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ.. వారికి నెలకు రూ.10 వేలు జీతం ఇస్తానని ఎన్నికల సమయంలో బాబు హామీ ఇచ్చారు. అయితే జూలై 1న వలంటీర్లతో కాకుండా, సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేయాలని తాజాగా కేబినెట్లో నిర్ణయించారు. అంటే వలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడే దిశగా నిర్ణయం తీసుకున్నారు’ అని సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విటర్)లో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది. -
వాలంటీర్లకు షాకిచ్చిన ఏపీ కేబినెట్..
-
వాలంటీర్లకి చంద్రబాబు మార్క్ వెన్నుపోటు.. వైఎస్సార్సీపీ
సాక్షి, విజయవాడ: వాలంటీర్లపై చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం పెడుతూ.. సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ల పంపిణీ చేయించాలని నిర్ణయించింది. 1వ తేదీన సచివాలయ ఉద్యోగుల చేత పెన్షన్ డోర్ డెలివరీ చేయనుంది. అన్ని రకాల పెన్షన్లు సచివాలయ ఉద్యోగులతోనే పంపిణీ చేయనున్నామని.. వాలంటీర్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి పార్థసారథి తెలిపారు.చంద్రబాబు ప్రభుత్వం తీరుపై వైఎస్సార్సీపీ మండిపడుతోంది. ‘‘జులై 1న సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తూ.. రూ.10 వేలు జీతం ఇస్తానని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థకి మంగళం పాడే దిశగా చంద్రబాబు సర్కార్ నిర్ణయాలు తీసుకుంటుంది’’ అని వైఎస్సార్సీపీ ట్వీట్ చేసింది.వాలంటీర్లకి చంద్రబాబు మార్క్ వెన్నుపోటు!జులై 1న సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయంవాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తూ.. రూ.10 వేలు జీతం ఇస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన బాబు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థకి మంగళం పాడే దిశగా నిర్ణయాలు— YSR Congress Party (@YSRCParty) June 24, 2024 కాగా, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజా సేవ కంటే కక్షసాధింపునకే ప్రాధాన్యం ఇస్తోంది. వెలకట్టలేని అభిమానంతో గత ప్రభుత్వంలో జగనన్న సైన్యంలా వలంటీర్లు పని చేసిన సంగతి తెలిసిందే. వాలంటీర్లుగా పనిచేసి వారిని లక్ష్యంగా చేసుకుని రాజకీయ క్రీడకు తెరతీసింది చంద్రబాబు సర్కార్. వలంటీర్ల వ్యవస్థనే నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడుతున్నట్లు అర్థమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులైన ప్రతి ఒక్కరికీ అందేలా, ఇంటింటికి వెళ్లి అందించడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషించారు. -
వలంటీర్ల వ్యవస్థపై నేడు స్పష్టత!
సాక్షి, అమరావతి: ఐదేళ్ల కిందట రాష్ట్రంలో కొత్తగా అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం యథావిధిగా పూర్తిస్థాయిలో అమలు చేస్తుందా లేక మార్పులు చేస్తుందా అన్నదానిపై సోమవారం కొంత స్పష్టత వస్తుందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. మొన్నటి ఎన్నికల్లో గెలుపొందిన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వలంటీర్ల వ్యవస్థపై చర్చించే అవకాశం ఉందని, ఈ వ్యవస్థపై ప్రభుత్వ ఆలోచనలు ఏమిటన్నది తెలుస్తుందని చెబుతున్నాయి.చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ.. గత ఐదేళ్లలో కొత్తగా ఏర్పడిన ఈ వ్యవస్థకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయనతోపాటు మంత్రివర్గ సభ్యులందరికీ కూలంకషంగా వివరించేందుకు గ్రామ, వార్డు సచివాలయాలశాఖ ఉన్నతాధికారులు వివిధ రకాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు (పీపీటీలు) సిద్ధం చేశారు. మంత్రివర్గ సమావేశానికి ముందే సోమవారం సంబంధిత మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ఆ శాఖ అధికారులతో వేరుగా సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో ప్రతి 50 ఇళ్లకు ఒకరు, పట్టణ ప్రాంతాల్లో 75–100 ఇళ్లకు ఒకరు చొప్పున మొత్తం 2.65 లక్షలమంది వలంటీర్లతో 2019 ఆగస్టు 15న గ్రామ, వార్డు వలంటీర్ల వ్యవస్థ ఏర్పడిన విషయం తెలిసిందే. అదే ఏడాది 2019 ఆక్టోబరు 2న గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను కూడా అప్పటి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు ఏకంగా 1.34 లక్షల కొత్త శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను మంజూరు చేసి అప్పటికప్పుడే భర్తీ చేసింది.ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల మంది శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తున్నారు. అయితే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు అనుబంధంగా గౌరవ వేతనంతో పనిచేసే 2.65 లక్షల మంది వలంటీర్లపై మొన్నటి ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం అనేక ఆంక్షలు విధించడంతో పాటు ఇతర కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వలంటీర్లు రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం దాదాపు లక్షన్నరమంది వలంటీర్లు మాత్రమే పనిచేస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. -
వలంటీర్లతో రాజకీయ కుట్రలు
నెల్లూరు సిటీ: అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రజా సేవ కంటే ప్రతీకారేచ్ఛకు ప్రాధాన్యం ఇస్తోంది. వెలకట్టలేని అభిమానంతో గత ప్రభుత్వంలో జగనన్న సైన్యంలా వలంటీర్లు పని చేశారు. పిచ్చుకలపై బ్రహ్మాస్త్రంలా వలంటీర్లుగా పనిచేసి వారిని లక్ష్యంగా చేసుకుని రాజకీయ క్రీడకు తెరతీశారు. వలంటీర్లు అందరూ సామాన్యులే. ఇటువంటి వారిని భయపెట్టి వలంటీర్ల వ్యవస్థనే నిర్వీర్యం చేసే కుట్రలకు పాల్పడుతున్నట్లు అర్థమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారులైన ప్రతి ఒక్కరికీ అందేలా, ఇంటింటికి వెళ్లి అందించడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషించారు. నెల్లూరునగరంలోని రూరల్ నియోజకవర్గ పరిధిలో 26 డివిజన్లలో మొత్తం 1,148 మంది వలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ముందు టీడీపీ నాయకులు ఈసీని అడ్డు పెట్టుకుని పింఛన్లు పంపిణీని వలంటీర్ల ద్వారా చేయనీయకుండా అడ్డుకున్నారు. ప్రజలకు సేవ చేయలేని విధుల్లో తాము కొనసాగలేమని దాదాపు 442 మంది వలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు. తమకు ఇంతటి గౌరవాన్ని కల్పించిన జగనన్నకు మద్దతుగా వలంటీర్లందరూ ఆదాల ప్రభాకర్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. అయితే అప్పట్లో కొందరు వలంటీర్లకు తాయిళాలు ఎరవేసి టీడీపీలో చేర్చుకున్నారు. ఆ రోజు పార్టీలో చేరిని వారిని లక్ష్యంగా చేసుకుని వారి వేళ్లతో వారి కళ్లు పొడుకునే విధంగా టీడీపీ నాయకులు కుట్ర రాజకీయాలు చేస్తున్నారు.అధికారం రావడంతో...టీడీపీ అధికారంలోకి రావడంతో ఎన్నికల ముందు స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి వైఎస్సార్సీపీలో చేరిన వలంటీర్లను అడ్డం పెట్టుకుని అప్పట్లో వైఎస్సార్సీపీ నేతలు తమను బెదిరించి రాజీనామా చేయించారంటూ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయిస్తున్న వైనం చూస్తుంటే టీడీపీ నీచ రాజకీయాలు, కుట్రలు ఏ స్థాయికి వెళ్లాయో అర్థమవుతోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం 41 డివిజన్, ఆదివారం 21వ డివిజన్ వైఎస్సార్సీపీ నాయకులపై ఫిర్యాదులు చేయించారు.మాజీ వలంటీర్ల ఫిర్యాదునెల్లూరు(క్రైమ్): గతంలో వైఎస్సార్సీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు మాజీ వలంటీర్లు ఆదివారం వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గడిచిన రెండు రోజులుగా పలు పోలీసుస్టేషన్లలో వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న కార్పొరేటర్లు, నేతలపై వలంటీర్లు వరుస పెట్టి ఫిర్యాదులు చేయడం వెనుక ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది. అధికార పార్టీ నేతలు ఓ పథకం ప్రకారమే వైస్సార్సీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.గత ప్రభుత్వంలో జగనన్న సేవకులుగా పనిచేసిన వలంటీర్లను అడ్డం పెట్టుకుని టీడీపీ రాజకీయ కుట్రలకు, వేధింపులకు తెర తీసింది. ఎన్నికలకు ముందు వలంటీర్లపై టీడీపీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి విధులకు దూరం చేసింది. దీంతో టీడీపీ కుట్రలను నిరసిస్తూ వలంటీర్లు కొందరు తమ పదవులకు స్వచ్ఛందంగా రాజీనామా చేసి తమ ఆరాధ్య నేత వైఎస్ జగన్ సైన్యంగా ఎన్నికల విధుల్లో కీలకంగా పాల్గొన్నారు. ఇదే టీడీపీకి రుచించలేదు. అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇప్పుడు వారిని భయపెట్టి, ప్రలోభపెట్టి వైఎస్సార్సీపీ నేతలపై పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేయిస్తుండడంపై చర్చనీయాంశంగా మారింది. -
వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర
-
ఈ దొంగల్ని నమ్మొద్దు
చిత్తూరు రూరల్(కాణిపాకం): కొత్త వలంటీర్ల పేరుతో తెలుగుదేశం పార్టీ సరికొత్త మోసానికి తెరతీసింది. ఇటీవల రాజీనామా చేసిన వలంటీర్ల స్థానంలో తమ పార్టీకి చెందిన కొందరు యువకులను గ్రామాల్లోని పేదల ఇళ్లకు పంపిస్తోంది. వారి ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోంది. చిత్తూరు రూరల్ మండలంలో ఈ నయా మోసం వెలుగులోకి వచ్చింది. ఇటీవల చిత్తూరు మండలంలో చాలామంది వలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. దీనిని ఆసరాగా చేసుకుని స్థానిక టీడీపీ నేతలు కొందరు యువకులను ఎంపిక చేసి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వలంటీర్లుగా మిమ్మల్నే నియమిస్తామని నమ్మబలికారు. వారికి వలంటీర్లు ఎలాంటి సేవలు అందిస్తారనే విషయంపై శిక్షణ ఇచ్చారు. అనంతరం 50 ఇళ్లకు ఒకరిని చొప్పున పంపించారు. ఇక వారు పేదల ఇళ్లకు వెళ్లి ‘తాము కొత్త వలంటీర్లం. ఇక వచ్చేది టీడీపీ. కాబట్టి టీడీపీకి ఓటు వేయండి. లేకపోతే ఏ పథకం రాదు..’ అని బెదిరిస్తున్నారు. టీడీపీ కరపత్రాలు చూపిస్తూ పింఛన్లు, ఇంటి స్థలం.. అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పేదల అవసరాలను గుర్తించి ఆర్థికంగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. టీడీపీ ఆడుతున్న ఈ కొత్త వలంటీర్ల డ్రామాపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ ఎటువంటి మోసాలకైనా పాల్పడుతుందనేందుకు కొత్త వలంటీర్ల డ్రామా ఒకటని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి దొంగలను నమ్మరాదన్న భావనను వారు వెలిబుచ్చారు. దీనిపై కొందరు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
వైఎస్ జగన్... ఆ పేరే ఓ స్ఫూర్తి...
సాక్షి, అమరావతి: ‘పేదలు ఎదగాలంటే ప్రభుత్వ సాయం కావాలి. అందుకు సంక్షేమ పథకాలు చాలా వరకూ తోడ్పడతాయి. ఒక వైపు సంక్షేమం... మరోవైపు అభివృద్ధి ఏపీలో సమపాళ్లలో జరుగుతోంది. అందుకు కారకుడైన జగన్ అంటే అందుకే నాకు ప్రత్యేకమైన అభిమానం’ అంటున్నారు సినీ నటుడు రాజా రవీంద్ర. వ్యక్తిగతంగా తనకే కాదు చాలా మందికి ఆయన ఇన్స్పిరేషన్ అంటూ కొనియాడారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలన పట్ల తన అభిప్రాయాల్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..పేదలు ఎదగాలంటే...ప్రభుత్వ ఆసరా కావాలి.. పేదలు, దిగువ మధ్య తరగతి వర్గాలు ఎదగాలంటే మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతికి చేరాలంటే అది వారి కాయకష్టం మీద అయ్యేపని కాదు. కాబట్టి తప్పకుండా సంక్షేమ పథకాలు అవసరమవుతాయి. ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పలు రూపాల్లో ఆసరా అందిస్తోంది.అన్నివర్గాల జీవన ప్రమాణాలు మెరుగవ్వాలంటే వారికి ప్రభుత్వం తప్పనిసరిగా అందివ్వాల్సింది విద్య, వైద్యం. ఈ విషయంలో చాలా మార్పులు జరిగాయి.దళారీలు లేకుండా చేరుతున్న లబ్ధి సంక్షేమ పథకాల అమలు విషయంలో గ్రామ వలంటీర్ల విధానం చాలా మంచి కాన్సెప్్ట. వీరి వల్ల మధ్యలో ఎవరికీ ఎటువంటి లంచాలు, పైరవీలతో తావు లేకుండా పేదలకు పథకాలు అందుతున్నాయి. ఈ వ్యవస్థ ఎంత గొప్పదో... ప్రయోజనాలు పొందుతున్నవారికి బాగా అర్థమవుతుంది. ఈ సంక్షేమ పథకాలన్నీ ఎటువంటి ఆటంకం లేకుండా అమలు చేయడం గొప్ప విషయం. అధికారంలోకి రావడం కోసం పొత్తుల కన్నా ఒంటరిపోరుకే జగన్ సై అంటారు. ఆయన చాలా మందికి ఇన్స్పిరేషన్. ఆయన మీద అభిమానం చెక్కు చెదరలేదు. ఈ ఎన్నికల్లో జగన్ విజయం తథ్యం. ఖరీదైన వైద్యానికీ సర్కారు సాయం ప్రస్తుతం రోగాలు వస్తే దానికి వైద్యం ఎంత ఖరీదైపోయిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏ రోగం వచ్చిన లక్షలకు లక్షలు మంచినీళ్లలా ఖర్చుచేయాల్సి వస్తోంది. ఒక కిడ్నీ పాడైనా చికిత్సకు రూ.20 లక్షలపైనే ఖర్చవుతోంది. ఈ పరిస్థితుల్లో అనుకోని వ్యాధి వస్తే ఎగువ మధ్యతరగతి కుటుంబాలు ఎలా తట్టుకోగలవు? ఇక నిరుపేదల సంగతైతే వేరే చెప్పనక్కర లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ పథకం వారిని ఎంతగానో ఆదుకుంటోంది. ఇప్పుడు వైద్య పరిమితిని రూ.25లక్షలకు పెంచారు. ఇది నిజంగా ఎక్స్ట్రార్డినరీ స్టెప్. విద్యతోనే విజయం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నాడు నేడు పేరిట ప్రభుత్వ పాఠశాలల్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. కొన్ని తరగతుల విద్యార్థులకు ట్యాబ్స్ అందిస్తున్నారు. అంతటితో ఊరుకోకుండా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఇంగ్లిష్ మీడియం కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇది ఒక సమగ్ర విద్యావికాస మార్గంగా చెప్పాలి. వీటన్నింటివల్లా పాఠశాలల్లో చదివే వారిలో కనీసం 10శాతం మంది వృద్ధిలోకి వచ్చే అవకాశం కచి్చతంగా ఉంటుంది. అలా వచ్చిన వారు రూ.లక్షల్లో జీతాలు తెచ్చుకోగలుగుతారు. అప్పుడు తప్పకుండా పేదల జీవన ప్రమాణాల స్థాయి మారిపోతుంది. నిజంగా జరగాల్సింది అదే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతోంది. -
మే నెలలోనూ పింఛన్దారులకు కష్టాలే!
కర్నూలు(అగ్రికల్చర్): టీడీపీ నేతల కుట్రలు, కుతంత్రాల కారణంగా పింఛన్దారుల కష్టాలు తొలగిపోలేదు. మే నెలలో కూడా పింఛన్ పొందేందుకు అవస్థలు తప్పేలా లేవు. దాదాపు ఐదేళ్లుగా వార్డు, గ్రామ వలంటీర్ల ద్వారా ఇంటింటికి చేరుతున్న పింఛన్ను అడ్డుకున్నది టీడీపీ వారేనన్న విషయం అందరికీ తెలిసిందే. వలంటీర్లతో ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే అక్కసుతో టీడీపీ అధినేత చంద్రబాబు శిష్యుడు నిమ్మగడ్డ రమేష్కుమార్ కోర్టులను, ఎన్నికల కమిషన్ను ఆశ్రయించారు. పింఛన్ల పంపిణీతో సహా సంక్షేమ పథకాల అమలులో వలంటీర్లను వినియోగించరాదని, వారిని పూర్తిగా పక్కన పెట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో పింఛన్దారులకు మొదటిసారిగా ఏప్రిల్ నెలలో కష్టాలు మొదలయ్యాయి. ఎర్రటి ఎండలో ముదిమి వయస్సులో పింఛన్ కోసం రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి వచ్చింది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సమయంలోసచివాయాలకు వెళ్లాల్సి రావడంతో వడదెబ్బ, ఇతర కారణాలతో 35 మంది మృత్యువాత పడ్డారు. టీడీపీ నేతల కుట్రల ఫలితంగా మే నెలలో కూడా పింఛన్ల పంపిణీలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే మే నెల పింఛన్ల పంపిణీలో అధికారులు కొన్ని మార్పులు చేశారు.నగదు బదిలీ సాధ్యమేనా? పింఛన్ల పంపిణీలో మే నెల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానాన్ని అమలు చేస్తున్నారు.లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా పింఛన్ మొత్తం బదిలీ చేయనున్నారు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంగా బాధపడుతున్న వారు, మంచం పట్టి వీల్చైర్కు పరిమితమైన వారు, సైనిక్ సంక్షేమ పింఛన్లు పొందుతున్న వారికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటిదగ్గరే పింఛన్లు పంపిణీ చేస్తారు. మిగిలిన కేటగిరీ పింఛన్దారులకు డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ చేస్తారు. డీబీటీ పరిధిలోకి రాని వారికి మాత్రం 3వ తేదీ నుంచి నగదు రూపంలో ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేస్తారు. చాలా మంది పింఛన్దారులకు బ్యాంకు ఖాతాలు లేవు.డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ ఎంతవరకు విజయవంతం అవుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. ఠంచన్గా ఒకటో తేదీనే పింఛన్ సొమ్ము చేతితో పడితే ఆ ఆనందమే వేరు. డీబీటీ ద్వారా బ్యాంకు ఖాతాలకు జమ చేస్తే నగదు కోసం మళ్లీ బ్యాంకులకు వెళ్లకతప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అవ్వాతాతలు, వితంతువులైన అక్కచెల్లెమ్మలు, ఇతర పింఛన్దారులకు టీడీపీ నేతల కుట్రలతో కష్టాలు మొదలయ్యాయనేది బహిరంగ రహస్యమే. తమకు కష్టాలను తెచ్చి పెట్టిన వారికి ఓటుద్వారా బుద్ధి చెబుతామని అవ్వాతాతలు స్పష్టం చేస్తున్నారు. మే నెల పింఛన్ల పంపిణీ 5వ తేదీ వరకు జరగనుంది. మే నెలలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4,68,742 పింఛన్లకు రూ.139.82 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. కర్నూలు జిల్లాలో 2,46,340 పింఛన్లకు రూ.73,74,49,500, నంద్యాల జిల్లాలో 2,22,402 పింఛన్లకు రూ.66,08,47,000 పంపిణీ చేయనున్నారు.సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదు ∙ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన కర్నూలు(సెంట్రల్): లబి్ధదారులు ఎవరూ పింఛన్ కోసం గ్రామ, వార్డు సచివాయాలకు రావాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన తెలియజేశారు. సామాజిక భద్రత పింఛన్ పంపిణీ అంశంపై స్పెషల్ సీఎస్ ఆజయ్జైన్, పీఆర్ అండ్ ఆర్డీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్కుమార్ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సమీక్ష అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పింఛన్దారులు ఎవరూ పింఛన్ కోసం గ్రామ, వార్డు సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదన్నారు. దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, మంచానికే పరిమితమైన వారు, వీల్ చైర్లో ఉన్న వారు, సైనిక సంక్షేమ పింఛన్ పొందుతున్న వారు, వితంతువులకు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మిగిలిన వారికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే పింఛన్ జమ చేస్తామన్నారు. ఎవరికైనా బ్యాంకు ద్వారా చెల్లించలేని పక్షంలో ఇంటివద్దకే పింఛన్ తెచ్చి ఇవ్వడానికి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్లో ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి,జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి, డీఆర్డీఏ పీడీ సలీం బాషా పాల్గొన్నారు. -
అవ్వాతాతలకు బాబు బ్యాచ్ తెచ్చిన కష్టాలు
సాక్షి, అమరావతి: ఎన్నికల కోడ్ను అడ్డంపెట్టుకొని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు రాష్ట్రంలోని లక్షలాది అవ్వాతాతలు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. వీరికి జీవనాధారమైన ప్రభుత్వ పింఛను అందకుండా కుట్రలు పన్నుతున్నారు. సీఎం జగన్ వలంటీర్ల ద్వారా 65,49,864 మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇతర పింఛను లబ్ధిదారులకు నెలనెలా ఠంఛనుగా ఒకటో తేదీనే వారున్న చోటునే పింఛను అందిస్తున్నారు. గత ఐదేళ్లుగా నిరి్వఘ్నంగా ఇంటి వద్దే పింఛను అందుతుండటం చంద్రబాబు నేతృత్వంలోని ఎల్లో బ్యాచ్కు కంటగింపయింది. దీంతో బాబు బ్యాచ్ ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదుల కారణంగా పింఛన్ లబ్ధిదారులు గత నెలలో సచివాలయాలకు వెళ్లి పింఛను డబ్బు తీసుకోవాల్సి వచ్చింది. అయినా చంద్రబాబు బ్యాచ్ పచ్చ కళ్లు చల్లబడకపోవడంతో వీరికి మరిన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. చంద్రబాబు హయాంలో పింఛను మంజూరవడమే గగనమైతే, ఆ వచ్చే కాస్త పింఛను కోసం అవ్వాతాతలు, దివ్యాంగులను నానా అగచాట్లకు గురిచేసే వారు. అందులోనూ కమీషన్లు గుంజేవారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇతర పింఛన్దారుల అవస్థలకు చెల్లుచీటీ పాడారు. సంతృప్త స్థాయిలో అర్హులందరికీ ఎప్పటికప్పుడే కొత్త పింఛన్ల మంజూరు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.66 లక్షల మంది వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంఛనుగా పింఛను ఇంటి వద్దే అందించేవారు. సీఎం జగన్ చేపట్టిన ఈ అద్భుత కార్యక్రమంతో గత 58 నెలలుగా పింఛనుదారులు ఎటువంటి ఇబ్బందీలేకుండా వారి డబ్బులు అందుకున్నారు. ఇదే చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ లు, ఎల్లో బ్యాచ్, ఎల్లో మీడియాకు మింగుడుపడలేదు. ఎన్నికల కోడ్ నెపంతో వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఉన్న రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమే‹Ùకుమార్ తదితరులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. దీంతో పింఛన్ల పంపిణీలో వలంటీర్లను పూర్తిగా దూరంగా ఉంచాలని నెల కిత్రమే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. డీబీటీ విధానంలో లేదంటే శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్ద పంపిణీ చేయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ ఏప్రిల్ నెల పింఛను డబ్బును సచివాలయాల వద్ద పంపిణీ చేస్తూనే, విభిన్న దివ్యాంగులు, కదల్లేక మంచానికి లేదా వీల్చైర్కే పరిమితమైన వారికి, తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు వారి ఇంటి వద్దే పంపిణీ చేశారు. పింఛన్ల పంపిణీ ఈ నెల 3న మొదలుపెట్టి 8వ తేదీకల్లా పూర్తిచేశారు. సచివాలయాలకు వెళ్లి పింఛను డబ్బు తీసుకొనే క్రమంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. చల్లారని పచ్చ కళ్లు ఏప్రిల్ నెలలో పింఛను లబ్ధిదారులను నానా అగచాట్లకు గురి చేసినప్పటికీ, పచ్చ కళ్లు చల్లబడలేదు. కేంద్ర ఎన్నికల సంఘానికి మళ్లీ ఫిర్యాదులు చేయడంతో పాటు రాష్ట్రంలో ఉన్నతాధికారులందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ, వ్యక్తిగతంగా వారి ప్రతిష్ట దిగజార్చేలా టీడీపీ అనుకూల మీడియాలో పింఛన్ల పంపిణీపై రకరకాల తప్పుడు కథనాలు ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో పింఛన్ల పంపిణీపై పలు సూచనలు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికల సంఘం సూచనలకు అనుగుణంగా లబ్ధిదారులకు నేరుగా డబ్బుల పంపిణీకి బదులు బ్యాంకుల్లో జమ చేసేలా అధికారులు మళ్లీ మార్పులు చేయాల్సి వచి్చంది. 48,92,503 మంది అవ్వాతాతలు, ఇతరుల పింఛన్ డబ్బులు ఆధార్ నంబర్తో అనుసంధానమై ఉన్న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయి. మే, జూన్ రెండు నెలల పాటు వీరు కుటుంబంలో లేదా తెలిసిన వారిలో ఎవరో ఒకరి వెంట బెట్టుకొని బ్యాంకుల దాకా వెళ్లి ఆ డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. గత నెలలో సచివాలయాల్లో డబ్బు తీసుకున్న వీరికి ఇప్పుడు బ్యాంకులకు వెళ్లాలంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా ఉంటుంది. సాధారణంగా అన్ని గ్రామాల్లో బ్యాంకులు ఉండవు. బ్యాంకులో పని ఉంటే సమీపంలోని పెద్ద పంచాయతీలకో, మండల కేంద్రాలు, లేదా పట్టణాల్లోని బ్యాంకులకు వెళ్లాలి. ఈ రెండు నెలలూ పింఛను కోసం అవ్వాతాతలకు ఈ అవస్థలు తప్పవు. మండుటెండల్లో ఎవరో ఒకరిని వెంటబెట్టుకొని ఆటోలోనో, బస్సులోనో పక్క ఊరు లేదా పట్టణాల్లోని బ్యాంకులకు వెళ్లి డబ్బు తెచ్చుకోవాలి. దీని కోసం ఒక కుటుంబంలో ఇద్దరు ఒకట్రెండు రోజులు పనులు మానుకొని, డబ్బు ఖర్చు పెట్టుకొని వెళ్లిరావాల్సి ఉంటుంది. వీరు కాకుండా విభిన్న దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో పింఛను పొందే వారు, మంచం లేదా వీల్చైర్కు పరిమితమైన వారు, యుద్ధ వీరుల వృద్ధ వితంతువులతో పాటు బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం లేని వారు, అసలు బ్యాంకు ఖాతాలే లేని వారికి శాశ్వత ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2.66 లక్షల మంది వలంటీర్లు ఐదు రోజుల్లో నిర్వహించే కార్యక్రమాన్ని ఇప్పుడు అందుబాటులో ఉన్న శాశ్వత ఉద్యోగుల ద్వారా వారి ఎన్నికల విధులకు ఆటంకం కలగకుండా ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు 20 రోజుల దాకా సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి నిర్ణయం వల్ల ఒక గ్రామంలో రోజుకు కొందరికి అంది, మరికొందరికి అందకపోతే పింఛనుదారులలో అలజడి రేగే అవకాశమూ ఉందని అధికారులు అంటున్నారు. అయినప్పటికీ, సకాలంలో పింఛన్ల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.గత చంద్రబాబు ప్రభుత్వంలో పింఛనుదారులకు అన్నీ కష్టాలే.. 2014 – 19 మధ్య రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో పింఛనుదారులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అవ్వాతాతలు, దివ్యాంగులు పింఛను మంజూరు కోసం ఆఫీసుల చుట్టూ ఏళ్ల తరబడి కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఉండేది. పింఛన్ల మంజూరు మొదలు, తొలగింపులు వంటి వాటిని కూడా జన్మభూమి కమిటీలకే చంద్రబాబు అప్పగించారు. ఆ జన్మభూమి కమిటీల్లో గ్రామాల్లో ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ నేతలే పూర్తిగా ఉండడంతో వాళ్లు టీడీపీకి ఓటు వేసిన వారికి లేదా లంచాలు ఇచి్చన వారికే కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు.ప్రత్యర్ధి పార్టీల సానుభూతిపరులకు పింఛన్లు మంజూరయ్యేవే కావు. ఒకవేళ అప్పటికే ఎవరికైనా మంజూరై ఉంటే నిర్దాక్షిణ్యంగా తొలగించారన్న ఆరోపణలున్నాయి. పింఛన్లు మంజూరైన వారు కూడా ఆ డబ్బు కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. ఊరిలో ఎప్పుడు పింఛను పంపిణీ జరుగుతుందో తెలియక ప్రతి రోజూ ఆఫీసు దాకా వచ్చి ఎండలో కూర్చొని ఊసూరుమంటూ తిరిగి వెళ్లే పరిస్థితి ఉండేది. -
రాజీనామాలు వలంటీర్ల వ్యక్తిగతం
సాక్షి, అమరావతి: రాజీనామాలు వలంటీర్ల వ్యక్తిగత వ్యవహారమని, అందువల్ల వారి రాజీనామాలను ఆమోదించకుండా తాము ఆదేశాలివ్వడం సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం హైకోర్టుకు నివేదించింది. రాజీనామా చేయడానికి వీల్లేదని నియామక నిబంధనల్లో ఉంటే తప్ప ఎవ్వరినీ రాజీనామా చేయవద్దంటూ ఆదేశాలు ఇవ్వలేమని ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వివరించారు.వలంటీర్ పోస్టులో ఉన్నంత వరకే వారిపై తమకు అధికారం ఉంటుందని స్పష్టం చేశారు. రాజీనామాల తరువాత వలంటీర్లు ప్రైవేటు వ్యక్తులు అవుతారని, నచ్చిన విధంగా ఉండే స్వేచ్ఛ వారికి ఉందని వివరించారు. పిటిషనర్ అభ్యర్థన చాలా విచిత్రంగా ఉందని, వలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వాన్ని తాము ఆదేశించాలని కోరుతున్నారని, ఆ పని తామెలా చేయగలమని ప్రశ్నించారు.ఈ వివరాలన్నింటితో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ నెల 22 వరకు 62,571 మంది వలంటీర్లు రాజీనామా చేశారుఎన్నికలు పూర్తయ్యేంత వరకు వలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ బుధవారం మరోసారి విచారణ జరిపారు. కేంద్ర ఎన్నికల సంఘం తరఫున అవినాష్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. గత నెల 18 నుంచి ఈ నెల 22వ తేదీ వరకు 62,571 మంది వలంటీర్లు రాజీనామా చేశారని తెలిపారు.ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు 929 మంది వలంటీర్లను తొలగించామన్నారు. వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచుతూ ఉత్తర్వులిచ్చామని, పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించకుండా సర్క్యులర్లు జారీ చేశామన్నారు. ఇప్పుడు వారి రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వాన్ని తాము ఆదేశించాలని పిటిషనర్ కోరుతున్నారని, ఇదెలా సాధ్యమని అన్నారు.ఇప్పుడు వలంటీర్లు ఖాళీగా ఉన్నారుప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వలంటీర్లకు ఎలాంటి పనులు అప్పగించలేదన్నారు. వారు ఖాళీగా ఉన్నారని, అయినా వారికి గౌరవ వేతనం చెల్లిస్తూనే ఉన్నామన్నారు. దీని వల్ల ఖజానాపై భారం పడుతోందని వివరించారు.పిటిషనర్ తరఫున న్యాయవాది పీవీజీ ఉమేష్ వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగంలోని అధికరణ 324 కింద ఎన్నికల సంఘం ఎలాంటి ఆదేశాలైనా ఇవ్వొచ్చన్నారు. వలంటీర్లు రాజీనామా చేసి అధికార పార్టీకి సహకరిస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. -
వలంటీర్ చెప్పినవారికి ఓటేసేంత బలహీనంగా ఓటర్లు లేరు
సాక్షి, అమరావతి: వలంటీర్ల మాటలు విని.. వారు చెప్పినవారికి ఓటు వేసేంత బలహీనంగా ఓటర్లు లేరని హైకోర్టు వ్యాఖ్యానించింది. వలంటీర్, లబ్దిదారు మధ్య ఉన్న అనుబంధం వలంటీర్ రాజీనామాతో తెగిపోతుందని స్పష్టం చేసింది. అలాంటప్పుడు వలంటీర్ చెప్పినట్టు ఓటరు ఎందుకు చేస్తారని ప్రశ్నిం చింది. వలంటీర్లు తమ జేబులో నుంచి తీసి డబ్బేమీ ఇవ్వడం లేదని, అలాంటప్పుడు వారి మాటలను ఓటరు ఎందుకు వింటారని పిటిషనర్ను నిలదీసింది. ఎవరైనా కూడా ఓటరును పోలింగ్ బూత్ వద్దకు వెళ్లేంత వరకే ప్రభావితం చేయగలిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. పోలింగ్ బూత్లోకి వెళ్లాక ఓటరు తనకు నచ్చినవారికే ఓటు వేస్తారని తెలిపింది. రాజీనామా చేశాక ఎవరైన వలంటీర్ ఏదైనా ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నిం చింది. మొత్తం వలంటీర్లు ఎందరు? ఎంతమంది పనిచేస్తున్నారు? రాజీనామా చేసినవారెందరు? తదితర వివరాలను తమ ముందుంచాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకు వలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ కృష్ణమోహన్ విచారణ జరిపారు. రాజీనామా చేశాక మేమేం చేయలేం.. కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది శివదర్శన్ వాదనలు వినిపిస్తూ.. వలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారన్నారు. ఎన్నికల్లో విధుల్లో పాల్గొనకుండా, పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరించకుండా వలంటీర్లను నియంత్రిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఒకవేళ వలంటీర్ రాజీనామా చేస్తే వారిపై ఎన్నికల సంఘానికి ఎలాంటి నియంత్రణ ఉండదన్నారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు. వారికి సైతం ప్రాథమిక హక్కులున్నాయని.. ఇష్టానుసారం రాజీనామా చేసే హక్కు వారికి సైతం ఉందన్నారు. వలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు పిటిషనర్ ఎలాంటి ఉదంతాలను పొందుపరచలేదని చెప్పారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి.. విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ప్రత్యక్ష పరిచయాలతో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు.. పిటిషనర్ రామచంద్ర యాదవ్ తరఫు న్యాయవాది పీవీజీ ఉమేష్ వాదనలు వినిపిస్తూ.. అధికార పార్టీకి సహకరిస్తున్నారన్న ఆరోపణలతో వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచుతూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందన్నారు. ఆ ఆదేశాల నుంచి తప్పించుకునేందుకు వలంటీర్లు ఇప్పుడు రాజీనామాలు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్దిదారులతో వలంటీర్లు ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నారన్నారు. ఇప్పుడు రాజీనామాలు చేసి ఎన్నికల్లో లబ్దిదారులను అధికార పార్టీ వైపు తిప్పడానికి వారిని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. అందువల్ల వలంటీర్ల రాజీనామాల విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థించారు. మరి సెలబ్రిటీలు కూడా ప్రచారం చేస్తున్నారుగా.. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలపై న్యాయమూర్తి స్పందిస్తూ.. వలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేసి, ఆయా పార్టీల అభ్యర్థుల అవకాశాలను ప్రభావితం చేయడం సాధ్యమా? అని ప్రశ్నిం చారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఒకరు పెద్ద ధనవంతుడు, మరొకరు పేద వ్యక్తి అయి ఉంటే, ఆ పేద వ్యక్తి.. తాను ఎన్నికల్లో తలపడేందుకు సమాన అవకాశాలు కల్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరగలడా? అని నిలదీశారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు సెలబ్రిటీలు కూడా ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఊహల ఆధారంగా పిటిషనర్ ఈ పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. రాజీనామాలు చేశాక వలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లు ఎక్కడా కూడా పిటిషన్లో పేర్కొనలేదన్నారు. వలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారని, వరుసగా వారు మూడు రోజుల పాటు విధులకు హాజరు కాకుంటే వారిని విధుల నుంచి తొలగించవచ్చన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రభుత్వ పథకాలను అందజేసేందుకే వలంటీర్లను నియమించామని చెప్పారు. వారు కేవలం గౌరవ వేతనం మాత్రమే అందుకుంటున్నారని గుర్తు చేశారు. కొందరు తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు గౌరవ వేతనం పెంచుతామంటూ ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు చేస్తున్నారని న్యాయమూర్తి దృష్టికి తెచ్చారు. ఈ రోజుల్లో ఐఏఎస్ అధికారులు కూడా తమ ఉద్యోగానికి రాజీనామా చేసి, నచ్చిన పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్నారు. కాబట్టి రాజీనామా చేశాక ఎవరినీ నియంత్రించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. -
Fact check: అబద్ధాలు రచించెన్
సాక్షి, అమరావతి: అబద్ధం.. కుళ్లు.. భయం.. వీటికి ప్యాంటూ చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం రామోజీ మాదిరే ఉంటాయేమో! జగన్ పరిపాలనలో అవ్వాతాతలు, వితంతువులు, ఒంటరి మహిళలు ప్రతి నెలా పింఛన్లు అందుకుంటూ ఆనందంగా ఉంటే రామోజీకి కంపరంగా ఉంది. ఈ వర్గాల్లో జగన్కు పెరుగుతున్న పరపతిని చూసి తన భవిష్యత్తు భయంకరంగా కనిపిస్తోంది. అందుకే వాస్తవాలకు మసిపూసి ‘నవరత్నాలు – నయవంచన’ అంటూ మరో అబద్ధపు కథనాన్ని అచ్చేసేశారు. ఈ నిస్సిగ్గు పాత్రికేయాన్ని చూసి అక్షరాలు సిగ్గుతో తలదించుకోవాల్సిందేనేమో...!! పింఛనుదారుల సంఖ్య పెరిగింది జగన్ హయాంలోనే ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 66 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారు. ఇందులో 29.51 లక్షల మంది జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కొత్తగా పింఛన్లు అందుకున్నవారే. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో పింఛన్ల సంఖ్య ఏ మాత్రం పెరగలేదు. అప్పట్లో 43.11 లక్షల మంది పింఛనుదారులున్నారని లెక్కలు చెబుతున్నా 39 లక్షల మందికే చెల్లింపులు జరిపేది. నాలుగు నుంచి 5 లక్షల మందికి ఎగ్గొట్టేది. రామోజీ దగ్గర ఈ లెక్కలు లేవో.. లేక కావాలనే విస్మరించారో. ఇంటికో పింఛను విధానం బాబుదే కుటుంబానికి ఒక్కటే పింఛను విధానం జగన్ ప్రభుత్వం అమలు చేసినట్టు ఈనాడు ఓ అబద్ధాన్ని రాసింది. ఈ విధానం ప్రవేశపెట్టిందే చంద్రబాబు ప్రభుత్వం. 2014 సెప్టెంబర్ 18న ఆర్సీ నంబరు 1053 పేరిట జిల్లాల కలెక్టర్లకు సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఐదేళ్ల పాటు దీన్ని అమలు చేసింది. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఒకే ఇంటిలో ఇద్దరు దివ్యాంగులున్నా రెండో పింఛను ఇచ్చే విధానాన్ని అమలు చేశారు. మరో వైపు.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10 వేల చొప్పున నెలనెలా పింఛన్ అందిస్తున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమే కొత్తగా తీసుకొచి్చన ఈ మేలును బహుశా రామోజీ మరిచిపోయి ఉంటారు. కోతల్లేవు పింఛనుదారులలో మరణాల సంఖ్యను ఎక్కువగా చూపి పింఛన్లను జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం తగ్గించినట్టు ఈనాడు ఇంకో అబద్ధం ప్రచురించింది. సాధారణంగా పింఛనుదారుల్లో 0.5 శాతం మరణాలు నమోదవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఇది 0.8 శాతం ఉండొచ్చు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 2015 మేలో 0.8 శాతం మేర అంటే 36,406 మరణాలు నమోదు కావడంతో ఆ నెలలో పింఛన్లకు కోత పెట్టింది. అదే ఏడాది ఏప్రిల్లో 0.6 శాతం మేర అంటే 22,334 మంది పింఛనుదారులు మరణించినట్లు లెక్కలు వేసి వాటిని తొలగించింది. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో వాస్తవ మరణాలు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఆ మేరకే తొలగింపులు ఉంటున్నాయి. గత ఆరు నెలల గణాంకాలు తీసుకుంటే ఏ నెలలోనూ ఈ సంఖ్య 20 వేలకు మించలేదు. పింఛను విధానంలో మరెన్నో మార్పులు ► గత పాలనలో పింఛన్ కోసం వృద్ధులు, దివ్యాంగులు చాంతాడంత క్యూలో గంటల తరబడి వేచి ఉండే పరిస్థితి. ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2.6 లక్షల గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీ పొ ద్దున్నే లబ్ధిదారుల గడప వద్దనే అందిస్తోంది. ► పింఛన్ల మంజూరులో లంచాలు, వివక్ష, జన్మభూమి కమిటీల పెత్తనాన్ని జగన్ కూకటివేళ్లతో పెకలించారు. కుల, మత వర్గ, పార్టీలకు అతీతంగా లంచాలు, వివక్ష, ఆశ్రిత పక్షపాతానికి తావులేకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తున్నారు. అర్హులై ఉండి ఒకవేళ ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరో అవకాశం ఇస్తూ ప్రతి ఏటా జూన్, డిసెంబర్లలో అందజేస్తున్నారు. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో లబి్ధదారుల జాబితాలు ప్రదర్శించి, సోషల్ ఆడిట్ ద్వారా పారదర్శకంగా లబి్ధదారులను ఎంపిక చేస్తున్నారు. ► గత ప్రభుత్వంలో దివ్యాంగులకు 5 ఏళ్లలో అందిన లబ్ధి కేవలం రూ.58,500. ఈ ప్రభుత్వంలో లబ్ధి రూ.1,91,000. అంటే రూ.1,32,500 అదనం. ► పెన్షన్లపై నెలవారీ సగటు వ్యయం రూ.400 కోట్ల నుంచి రూ.1968 కోట్లకు పెంపు. ► 2014–19 మధ్య గత ప్రభుత్వంలో నెలకు పెన్షన్లపై సగటున వ్యయం రూ.400కోట్లు. -
యూటర్న్ చంద్రబాబు బాగోతం ఇది
వలంటీర్లకు పది వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పడం ద్వారా మన పాలన గొప్పగా ఉందని ఆయన సర్టిఫికెట్ ఇచ్చారు... ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్య.. రాష్ట్రం విధ్వంసం అయింది..జగన్ ఇంతకాలం ప్రజలకు కనిపించలేదు.. ఇప్పడు మళ్లీ జనంలోకి వస్తున్నారు. అది ఓట్ల మీద ప్రేమ.. జగన్ను ఎవరూ నమ్మవద్దు.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగంలో ఒక భాగం ఐదుకోట్ల మందికి ఏ ఒక్క నాయకుడో సరిపోరు. మూడు పార్టీల బలమైన నాయకత్వం కావాలి.కేంద్ర సహకారం, చంద్రబాబు అనుభవం, జనసేన పోరాట శక్తి కావాలి..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పిన కొత్త విషయం పవన్ శక్తి, చంద్రబాబు యుక్తి ,మోదీ సంకల్పం ..టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి బలం.. బీజేపీ ఎపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్య ఈ నలుగురు కొద్ది రోజుల క్రితం తణుకు వద్ద జరిగిన సభలో చేసిన ప్రసంగాలను విశ్లేషించండి. జగన్ తాను ఐదేళ్ల పాలన సమయంలో చేసిన వివిధ అబివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను సాకల్యంగా వివరించడంతో పాటు, చంద్రబాబు వలంటీర్ల వ్యవస్థపై యూ టర్న్ తీసుకున్న తీరును సమర్ధంగా వివరించగలిగారు.అంతేకాక చంద్రబాబు 2014 లో ఎన్నికల సమయంలో ప్రకటించిన హామీలు, వాటిని అమలు చేయని వైనాన్ని విపులంగా ప్రజలకు తెలియచెప్పారు. జగన్ సభ ఒక ఖాళీ ప్రదేశంలో భారీ ఎత్తున జరిగితే, కూటమి సభ ఒక రోడ్డుమీద జరిపి జనం బాగా వచ్చారని సంతోషపడడం కూటమి నేతల వంతుగా మారింది. జగన్ ఎక్కడా ఎవరిని దూషించకుండా , ప్రత్యేకించి ఆయా నియోజకవర్గాలలో పోటీచేస్తున్న టీడీపీ ,ఇతర పార్టీల అభ్యర్దుల ప్రస్తావన తేకుండా ,తన పార్టీ అభ్యర్ధులను మాత్రం పరిచయం చేసి గెలిపించాలని కోరుతున్నారు. కాని కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఎక్కడకు వెళితే అక్కడ ఉన్న వైఎస్సార్సీపీ అభ్యర్ధిపై తీవ్రమైన విమర్శలు, అడ్డగోలు ఆరోపణలు చేసి ప్రజలను నమ్మించాలని యత్నించారు. జగన్ తన స్కీముల గురించి ప్రజలకు తెలియచెప్పి, తాను ప్రతి ఇంటికి మంచి చేశానని ధైర్యంగా చెబుతున్నారు. కాని చంద్రబాబు మాత్రం అలా చెప్పలేకపోతున్నారు.పైగా వలంటీర్ల వ్యవస్థపై ఆయన యుటర్న్ తీసుకోవడంతో తెలుగుదేశం పార్టీ పరువు పోయింది.ఇంతకాలం వలంటీర్లను బండబూతులు తిట్టిన టీడీపీ నేతలు తలలు పట్టుకుని కూర్చున్నారు. చంద్రబాబు మాదిరి ఎప్పటికప్పుడు నాలుక మడతపెట్టి మాట మార్చినట్లు ఎలా చేయాలో తెలియక సతమతమవుతున్నారు. వలంటీర్లు పెన్షన్ దారుల ఇళ్లకు వెళ్లకుండా చేసిన నేపద్యంలో టీడీపీకి అది పెద్ద ఇబ్బందిగా మారింది. దానిని జగన్ తన స్పీచ్లో క్యాష్ చేసుకుంటున్నారు. చంద్రబాబు తను కూడా అధికారంలోకి వస్తే వలంటీర్ల వ్యవస్థను కొనసాగించి పదివేల వేతనం ఇస్తానని చెప్పడం ద్వారా తన పాలనకు సర్టిఫికెట్ ఇచ్చారని చెప్పి విపక్షనేతను డిఫెన్స్ లో పడేశారు. అయితే చంద్రబాబు చేసే వాగ్ధానాలు ప్రజలను మోసం చేయడానికే కాని, అమలు చేయడానికి కాదని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు తీసుకుని ప్రజలతో అవునని చెప్పించారు. ఉదాహరణకు రుణమాఫీ,నిరుద్యోగ భృతి వంటివాటిలో చంద్రబాబు మాట తప్పిన వైనాన్ని జగన్ తెలియచెప్పారు.అలాగే తన ప్రభుత్వంలో పోర్టుల నిర్మాణం, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలు, పరిశ్రమలకు పునాది పడుతున్న తీరు. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో గత మూడేళ్లుగా నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న వైనాన్ని జగన్ విరించారు. కాని అదే చంద్రబాబు,లేదా పవన్ కళ్యాణ్ లు తమ ప్రసంగాలలో ఎక్కడా స్పెసిఫిక్గా జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న స్కీములను విమర్శించలేకపోతున్నారు. పైగా వాటిని మరింతగా ఎక్కువ చేసి అమలు చేస్తామని చెప్పారు. మరి అలాంటప్పుడు రాష్ట్రం విధ్వంసం అయిందని ఆ నేతలు ఎలా చెబుతున్నారో అర్దం కాదు. మోడీ సంకల్పం ఉంది కనుక రాష్ట్రానికి ఉపయోగం అని అంటున్నారే తప్ప, కేంద్రం నుంచి ఏమి సాధిస్తామో చెప్పలేని దయనీయ స్థితి కూటమి నేతలకు ఏర్పడింది. ఉదాహరణకు ప్రత్యేక హోదా అంశాన్ని కూటమి నేతలు ప్రస్తావించలేకపోతున్నారు.ప్రత్యేక హోదా కాకుండా కేంద్రం నుంచి వీరు ఏమి సాధిస్తారో ఎవరికి వివరించలేకపోతున్నారు.రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం డ్రామాలు ఆడుతుండడం, విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ మొదలైన వాటి గురించి వీరు ఒక్క ముక్క మాట్లాడడం లేదు. గతంలో చంద్రబాబు ప్రత్యేక హోదా కావాలని అన్నప్పుడు కేంద్ర నేతలతో పాటు బీజేపీ రాష్ట్ర నేత దగ్గుబాటి పురందేశ్వరి అది ముగిసిన అధ్యాయం అని అన్నారు. అందుకు చంద్రబాబు ఒప్పుకున్నట్లేనా?బీజేపీ ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇచ్చిన నాలుగు శాతం రిజర్వేషన్ లను తొలగిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దీనిపై చంద్రబాబు అభిప్రాయం ఏమిటి? ఇలాంటివాటిపై అటు చంద్రబాబు కాని, ఇటు పవన్ కళ్యాణ్ కాని మాట్లాడకుండా ఉమ్మడి ఎజెండాతో ,ప్రజా మానిఫెస్టోతో ప్రజల ముందుకు వస్తున్నామని చెబితే ఎవరు నమ్ముతారు? అసలు ఉద్యోగాలే రాలేదని ఒకసారి, సచివాలయాలలో కొత్తగా వచ్చిన లక్షన్నర మంది ఉద్యోగుల గురించి మరోసారి చంద్రబాబు మాట్లాడుతారు. వీటిలో ఏది విద్వంసం,ఏది నాశనమో చెప్పలేరు.అప్పుల గురించి మాట్లాడతారు.రాష్ట్రం అప్పులపాలైతే సూపర్ సిక్స్ పేరుతో ఏడాదికి లక్షన్నర కోట్ల రూపాయలు కేవలం సంక్షేమ కార్యక్రమాలకు ఎలా చంద్రబాబు ఖర్చు చేస్తారో వివరించరు. జగన్ అమలు చేసిన అమ్మ ఒడిని తల్లికి వందనం పేరుతో ఎందరు పిల్లలు ఉంటే అందరికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇస్తుంటారు.అది ఎలా సాధ్యమో ఆయన చెప్పరు. ఆ పక్కనే ఉన్న పవన్ కళ్యాణ్,పురందేశ్వరిలు మాట్లాడరు.ఇవన్ని చూస్తుంటే వీళ్లకు ఒక ఎజెండా లేదు. ముగ్గురు కలిసి జనాన్ని ఎలా మభ్య పెట్టాలా అన్నదానపైనే దృష్టి పెడుతున్నట్లు అనిపిస్తుంది. అయితే జగన్ ను తిట్టడం, లేదంటే రాష్ట్రం విధ్వంసం అయిందని ఆరోపించడం,లేకుంటే జగన్ ఇచ్చిన స్కీములను మరింత ఎక్కువ ఇస్తామని బొల్లడం..జగన్ సభలకు, చంద్రబాబు సభలకు తేడా ఇంత స్పష్టంగా కనిపిస్తుంది.పురందేశ్వరి మాత్రం ఒక మాట చెప్పారు. పవర్ స్టార్ పవన్ శక్తి, చంద్రబాబు యుక్తి, మోడీ సంకల్పం రాష్ట్రానికి ఉపయోగపడతాయని అన్నారు. చంద్రబాబుదంతా కుయుక్తులేనని గతంలో ఈమె అన్నారు. ఇప్పుడేమో ఆ కుయుక్తే ఏమైనా తనకు ఎంపీ పదవి వచ్చేలా చేస్తుందేమోనన్న ఆశతో పురందేశ్వరి ఉన్నారు. పవన్ అయితే ఐదు కోట్ల మందికి ఒక్క నాయకుడు చాలడని అన్నారు. మూడుపార్టీల బలమైన నాయకత్వం కావాలి అని ఆయన చెబుతున్నారు. చంద్రబాబు అనుభవం, జనసేన పోరాట శక్తి కావాలట.కేంద్ర సహయం ఉండాలట. అంటే చంద్రబాబు ఒక్కడు ముఖ్యమంత్రిగా సరిపోడని పవన్ చెబుతున్నట్లే కదా! చంద్రబాబుకు అంత సామర్ధ్యం లేదనే కదా పవన్ ఉద్దేశం? అధికారం వచ్చాక ఈయన కూడా అందులో భాగస్వామి అవుతారా?అవ్వరా? ఎవరిమీద పోరాడుతారు?లేదంటే ఈయన బయట ఉండి మళ్లీ స్పీచ్ లు ఇస్తూ తిరుగుతారేమో తెలియదు.ఒకటి మాత్రం జనానికి చెప్పారు. రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం సరిపోదని చెబుతున్నారని అర్ధం అవుతుంది.రాష్ట్రం కొన ఊపిరితో ఉందట ఎన్డీఏ కూటమి ఆక్సిజన్ అట. అలాగైతే ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రధాని మోడీతో ఎందుకు చెప్పించలేకపోయారు.ఆయన అసలు రాష్ట్రానికి ఒక్క వరం అయినా ఇచ్చి వెళ్తారా?కేవలం తన కేసులకోసం, కొన ఊపిరితో ఉన్నటీడీపీని బతికించుకోవడం కోసం పొత్తు పెట్టుకుని అదేదో రాష్ట్రం కోసం అని చెబితే జనం చెవిలో పూలు పెట్టుకుని వినే రోజులు కావివి. వైఎస్సార్సీపీ విధ్వంసం చేస్తోందనే పొత్తు పెట్టుకున్నామని పవన్ అంటున్నారు. ఏమి విధ్వంసమో ఈ మూడు పార్టీల నేతలు చెప్పలేకపోతున్నారు. ఏదో పిచ్చి,పిచ్చి ప్రకటనలు చేసి, సినిమా డైలాగులు మాట్లాడి జనాన్ని బురిడి కొట్టించాలన్న ఉద్దేశం వారిలో కనిపిస్తోంది.తమ పార్టీలను బతికించుకోవడానికి, తాము గెలవలేమన్న భయంతో ఈ మూడు పార్టీలు కలిశాయి తప్ప ఇంకొకటి కాదు. ఓట్లు చీలకూడదని ఎప్పుడైతే అన్నారో, అప్పుడే వీరంతా ఓటమిని అంగీకరించిన్లే అనుకోవాలి.వైఎస్సార్సీపీ వెంటిలేటర్ పై ఉందని అంటున్న చంద్రబాబు దానిని నిజమని నమ్మి ఉంటే ఒంటరిగా పోటీచేసి సవాలు విసిరేవారు. ఇలా అధికారం కోసం జనసేన, బీజేపీ వంటి చిన్నపార్టీలను కాళ్లావేళ్లపడి ఎందుకు బతిమలాడుకుంటారు.ఢిల్లీ వెళ్లి పరువు పోగొట్టుకుని మరీ బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటారు. జగన్ అడిగే ప్రశ్నలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరిల వద్ద సమాధానం లేదు. అందుకే వీరు ఇలా సోది ప్రసంగాలు చేస్తూ ప్రచారం సాగిస్తున్నారనుకోవాలి. తాను గెలుస్తానన్న ధైర్యం ఉంది కనుక జగన్ ఒంటరిగా బరిలో దిగి ప్రత్యర్దులకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ఏది ఏమైనా ఏపీ ప్రజలు ఈ కిచిడి కూటమి కావాలా? లేక జగన్ సాహసవంతమైన నాయకత్వం కావాలా? అన్నది తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైంది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
ఇప్పటి నుండి సీఎం జగన్ కోసం పని చేస్తాం: ఏపీ వాలంటీర్లు
-
అట్టడుగు వర్గాలకు చేరిన కొత్త నమూనా
శరదృతువు వేకువ వేళల్లో చెట్లకు పట్టి ఉండే మంచు మాదిరిగా పైకి కనిపించకుండా, ఒక ‘ఫీల్ గుడ్’ వాతావరణం ఈ రోజున మన రాష్ట్రమంతా ప్రజల్లో వ్యాపించి ఉంది. నాలుగు కారణాల వల్ల ఈ మాన సిక స్థితి (ఫీల్) మన సమాజం అంచులలోని (మార్జినలైజ్డ్) ప్రజల వరకు చేరుతూ, క్రమంగా ఒక భావనగా వారిలోకి లోతుగా ఇప్పటికే అది ఇంకింది. ఇందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి అని చూసినప్పుడు, మొదటిది– ప్రతి యాభై కుటుంబాలకు అయాచి తంగా దొరికిన ‘గైడ్’ మాదిరిగా ‘కనెక్ట్’ అయిన ‘వాలెంటీర్లు’. రెండవది – అర్హులైన ప్రతి ఒక్కరికీ ఏదో ఒక పథకంలో అందిన ఆర్థిక సహాయం. మూడవది – ‘స్మార్ట్ ఫోన్’ వినియోగం అన్ని ఆర్థిక వర్గాలకు చేరడం. చివరిది ‘సంక్షేమరాజ్యం’ భావన స్థిరపడడానికిగాను ప్రజల సమీ పానికి పరిపాలన చేరడానికి పాత 13 జిల్లాలు 26 కావడం. మరి కొందరు దీన్ని – ‘విధ్వంసం’ అంటు న్నారు కదా అంటే, అదీ నిజమే. కాలం చెల్లిన పాతవాటిని పక్కకు నెట్టి, వాటి స్థానంలోకి వచ్చే ‘కొత్త’ ఏదైనా అలా అనిపించడం సహజమే. అయితే, కాలంలో వచ్చే మార్పులో భాగంగా వేగం కోసం ‘ఐ.టి.’ ద్వారా ‘స్మార్ట్ గవర్నెన్స్’ సాంకేతికతను పరిపాలనకు అన్వయించే మార్పు ప్రక్రియ గురించి, రేపటి తరం ఏమని అనుకుంటున్నది? అనేది ఇక్కడ ప్రధానం. భవిష్యత్తు యువతదే కనుక వర్తమానం సమీక్షకు వాళ్ళే నిజమైన న్యాయ నిర్ణేతలు. అయితే, నువ్వు ఏ కాలానికి అర్హమైన నాయ కుడివి? అనేది ఇక్కడ అతి విలువైన అంశం. ఈ ప్రభుత్వం వేటి కేంద్రితంగా ఉన్నదో చూడండి– ఒకటి ‘ప్రజలు’. రెండు ‘ప్రాంతము.’ చరిత్రలో ఈ రెండింటినీ లక్ష్యంగా చేసుకుని పరిపాలించిన రాజులు విఫలం కాలేదు. ఈ రెండింటి కోసం నీకున్న ఐదేళ్ళ కాలపరిమితిలో నువ్వు ఏమి చేశావు? అనేది ప్రజల ముందుకు వెళ్లి వాళ్లకు చెబితే చాలు. నీ నిజాయతీని ప్రజలు గమనించి మిగిలింది కూడా నువ్వే పూర్తి చెయ్యి, అని మళ్ళీ నీకే కుర్చీ అప్పగిస్తారు. మన రాష్ట్రంలోని ఆలో చనాపరులకు మన ప్రతిపక్ష నాయకుడి విషయంలో ఇక్కడే అనుమానం కలుగుతున్నది. గతంలో ‘జన్మభూమి’ నుంచి ‘విజన్– 2020’ వరకు ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలు కోసం మేధో కసరత్తు చేసిన అనుభవం పెట్టు కుని, ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయ ‘పబ్లిక్ పాల సీ’ని ప్రతిపక్షం తరఫున లేదా వారి కూటమి తరఫున గానీ ప్రకటించలేక పోవడం ఏమిటి? రాజకీయ విమర్శ కోసం సి.ఎం.ను– ‘సైకో’ అని, ప్రభుత్వ పరిపాలన ‘విధ్వంసం’ అని అన్న ప్పుడు, అ మాటలకు సవివరమైన వివరణ ఎందుకు ఇవ్వరు? మీరు అంటున్న ‘విధ్వంసం’ నిజమై, అదే అనుభవం రాష్ట ప్రజలకు కూడాఉండి ఉంటే, అదేదో వివరం చెబితే ప్రజలు కూడా వాళ్ళూ మీతో ‘కనెక్ట్’ అవుతారు కదా? మీరు చేస్తున్న ఇటువంటి ఆరోపణలు అస్పష్టంగా ఎందుకు ఉంటున్నాయి? ప్రభుత్వంపై చేస్తున్న విమర్శ విషయంలో ప్రతిపక్షం నిస్సహాయత చూశాక, ‘కూటమి’ని పక్కనపెట్టి – ‘కొత్త రాష్ట్రానికి కొత్త నమూనా పాలన అందిస్తున్న ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ ప్రభుత్వం వల్ల ప్రయోజనాలు ఏమిటి? అనే వైపు మధ్యతరగతి ఆలోచనాపరుల దృష్టి మారింది. ‘సాఫ్ట్వేర్’ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ‘కరోనా’ కాలంలో కంపెనీలు ‘వర్క్ ఫ్రం హోమ్’ అవకాశం ఇచ్చినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి రాకను ప్రోత్సహిస్తూ–‘వర్క్ ఫ్రం హోమ్ టౌన్’ నినాదంతో ‘బి టైప్’ పట్టణాల్లో ‘టవర్ల’ సామర్థ్యం పెంచి, స్థానిక ఇంజనీరింగ్, పాలి టెక్నిక్ కాలేజీల్లో వీరి కోసం ‘వైఫై’ సేవలు ఏర్పాటు చేసింది. మన రాష్ట్రానికొస్తే ఏమిటి పరిస్థితి? అనేదానికి వీరికి ఇదొక – ‘డ్రెస్ రిహా ర్సిల్స్’ అయింది. అంతేకాదు, ప్రభుత్వ ప్రాధాన్యతలుగా మారిన విద్య, వైద్యం, శాంతి భద్రతలు; ‘లీజర్’ కోసం రూపు మారుతున్న ‘పబ్లిక్ పార్కులు’, రెస్టారెంట్లు, అందుబాటులోకి వస్తున్న ‘క్యాబ్ సర్వీసులు’... ఇవన్నీ ఇక ముందు యువత మన రాష్ట్రంలో విస్తరిస్తున్న కంపెనీల్లో ఉపాధి వెతుక్కునే అంశాలు. ఇందులో వీరి అమ్మానాన్నల ‘పిల్లలు దగ్గరలో ఉద్యోగం చేసుకుంటూ అందుబాటులో ఉంటే బాగుండు’ అన్న ఆశను స్పర్శించే అంశం కలిసి ఉందనేది విడిగా చెప్పనక్కర లేదు. ఈ అంశంపై వ్యాసం రాయడం మొదలు పెట్టినప్పుడు ‘వాలంటీర్ల’ వివాదం అప్పటికి ఇంకా మొదలు కాలేదు. దీన్ని ముగించేటప్పటికిరాష్ట్రంలో మారిన సామాజిక సన్నివేశం, పైన చెప్పిన ‘ఫీల్ గుడ్’ భావనను వాస్తవం చేసింది. కొత్త రాష్ట్రానికి కొత్త నమూనా పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఒనకూరే ప్రయోజనాలు ఏమిటి? అనే వైపు మధ్యతరగతి ఆలోచనాపరుల దృష్టి ఇప్పటికే మారింది. ఇక ముందు మన అనుభవంలోకి రానున్న రాష్ట్ర అభి వృద్ధి ప్రణాళికా రచనలో ఏమున్నదీ అ పార్టీ ఎన్ని కల ‘మ్యానిఫెస్టో’లో వెల్లడి కావలసి ఉంది. జాన్సన్ చోరగుడి వ్యాసకర్త సామాజిక, అభివృద్ధి అంశాల విశ్లేషకులు -
వాలంటీర్ల సేవలపై టాలీవుడ్లో సినిమా!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ ఎంత అద్భుతంగా పని చేస్తుందో అందరికి తెలిసిందే. ఎక్కడ అవినీతి జరగకుండా.. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ నేరుగా లబ్దిదారులకు అందిచడంలో వాలంటీర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. వృద్దులకు, వికలాంగులకు నెల నెల వారి గడపవవద్దకే వెళ్లి ఫించన్లు అందిస్తున్నారు. గతంలో ప్రభుత్వ పథకాలు పొందాలి అంటే.. స్థానిక రాజకీయనేతలు, ప్రజాప్రతినిధుల చుట్టు తిరిగాల్సి అవసరం వచ్చేది. కానీ ఇప్పుడు అర్హత ఉంటే చాలు.. వాలంటీర్లు మీ ఇంటి వద్దకే వచ్చి ఆయా పథకాలను అందిస్తున్నారు. ఈ వ్యవస్థపై అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా ‘వాలంటీర్’ వ్యవస్థ గురించి చర్చ జరుగుతోంది. త్వరలోనే ఈ వ్యవస్థపై టాలీవుడ్లో ‘వాలంటీర్’ అనే సినిమా కూడా రాబోతుంది. ఈ చిత్రంలో సూర్య కిరణ్ హీరోగా నటించగా.. ప్రసిద్ధి దర్శకత్వం వహిస్తున్నారు. రాకేష్ రెడ్డి నిర్మాత. ఈ రోజు(ఏప్రిల్ 12) తిరుపతిలో ఈ సినిమా టైటిల్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నారాయణ స్వామి మాట్లాడుతూ.. ‘వాలంటీర్ల సేవలపై వస్తున్న ‘వాలంటీర్’ మూవీ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. వాలంటీర్లు స్వచ్ఛందంగా సేవ చేస్తూ ప్రభుత్వానికి తోడుగా ఉంటున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ సర్వీస్ చేస్తున్నాడు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం వాలంటీర్ వ్యవస్థను సమర్థించారు. నిజాయితీగా సేవ చేస్తున్న వాలంటీర్ వ్యవస్థను లేకుండా చేయాలని చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నాడు. నిమ్మగడ్డ రమేశ్తో ఈసీకి ఫిర్యాదు చేయించి వాలంటీర్ సేవలను నిలిపివేశారు. చంద్రబాబు చేసిన కుట్ర వల్ల ఇప్పటికే 33 మంది వృద్ధులు, వితంతువులు చనిపోయారు.పేద ప్రజలకు సీఎం జగన్ చేస్తున్న సేవలను చూసి ఓర్వలేకనే చంద్రబాబు ఇలాంటి కుట్రలు చేస్తున్నాడు’ అని విమర్శించాడు. నిర్మాత, వైఎస్సార్సీపీ నేత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘వాలంటీర్లు రియల్ హీరోలు. తమిళనాడు, కర్ణాటకతో పాటు దేశం మొత్తం ఈ వ్యవస్థపై ప్రశంసలు కురిపిస్తుంది. అలాంటి గొప్ప వ్యవస్థపై సినిమా నిర్మించడం సంతోషంగా ఉంది. త్వరలోనే వాలంటీర్ చేస్తున్న సేవలను వెండితెరపై చూస్తారు. ఎన్ని అడ్డంకులు సృష్టించిన.. సినిమాను మాత్రం విడుదల చేసి తీరుతాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వామీజీ శ్రీకృష్ణమా చార్యులు, సుమతీ రెడ్డి, సాహితీవేత్త శ్రీదేవి తదితరులు హాజరయ్యారు. -
వాలంటీర్ వ్యవస్థపై విషం కక్కి ఇప్పుడు ప్రేమ కురిపిస్తున్న చంద్రబాబు