నేడు తిరుమలకు వైఎస్‌ జగన్‌ | YSRCP President YS Jagan To Visit Tirumala Today, More Details Inside | Sakshi
Sakshi News home page

YS Jagan Tirumala Visit: నేడు తిరుమలకు వైఎస్‌ జగన్‌

Published Fri, Sep 27 2024 4:09 AM | Last Updated on Fri, Sep 27 2024 10:37 AM

YSRCP President YS Jagan to Visit Tirumala Temple

రేపు శ్రీవారిని దర్శించుకోనున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోను­న్నారు. ఇందుకోసం ఆయన శుక్రవారం రాత్రికి తిరుమల చేరుకుంటారు. వైఎస్‌ జగన్‌ శుక్రవారం సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు.  

అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 7 గంటలకు తిరుమల చేరుకుని, అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం 10.20 గంటలకు గెస్ట్‌హౌస్‌ నుంచి బయలుదేరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు, అనంతరం తిరుమల నుంచి తిరుగు ప్రయాణమవుతారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement