2030 నాటికి రూ.1000 కోట్లు: బ్రేక్స్‌ ఇండియా | Brakes India Will Invest Rs 1000 Crore | Sakshi
Sakshi News home page

2030 నాటికి రూ.1000 కోట్లు: బ్రేక్స్‌ ఇండియా

Published Tue, Jan 21 2025 9:25 PM | Last Updated on Wed, Jan 22 2025 9:59 AM

Brakes India Will Invest Rs 1000 Crore

బ్రేకింగ్‌ సిస్టమ్స్‌ తయారీలో ఉన్న బ్రేక్స్‌ ఇండియా వివిధ ప్లాంట్లలో సామర్థ్యం పెంపునకు 2030 నాటికి రూ.1,000 కోట్లు పెట్టుబడి చేయాలని నిర్ణయించింది. నూతన ప్లాంట్లు సైతం ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ ఎండీ శ్రీరామ్‌ విజి వెల్లడించారు.

రాబోయే 4–5 సంవత్సరాలలో పెద్ద పెట్టుబడులతో సాఫ్ట్‌వేర్, ఎల్రక్టానిక్‌ సామర్థ్యాలను మెరుగుపరుస్తామని ఆయన చెప్పారు. జపాన్‌కు చెందిన ప్రీమియం బ్రేక్‌ సిస్టమ్‌ సరఫరాదారు యాడ్‌విక్స్‌తో కలిసి జేవీ నెలకొల్పింది. ఈ జేవీలో బ్రేక్స్‌ ఇండియాకు 51 శాతం వాటా ఉంది.

తమిళనాడులోని హోసూరు వద్ద రూ.500 కోట్లతో జేవీ ప్లాంటు ఏర్పాటవుతోంది. తొలి ఉత్పాదన అయిన ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్స్‌ను 2027 నుంచి తయారు చేయనున్నారు.  సంస్థకు దేశవ్యాప్తంగా 17 ప్లాంట్లు ఉన్నాయి. 2023–24లో రూ.7,500 కోట్ల 
టర్నోవర్‌ సాధించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement