
న్యూఢిల్లీ: ప్రస్తుతమున్న విదేశీ వాణిజ్య విధానాన్ని (2015–20) మరో ఆరు నెలల పాటు, 2023 మార్చి వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ నెల 30తో వాస్తవానికి దీని గడువు ముగియాల్సి ఉంది.
పరిశ్రమల సంఘాలు, ఎగుమతి ప్రోత్సాహకాల మండళ్ల నుంచి ప్రస్తుత విధానం కొనసాగింపుపై డిమాండ్లు వస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ అదనపు సెక్రటరీ అమిత్ యాదవ్ తెలిపారు. ప్రస్తుత తరుణంలో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావద్దన్న డిమాండ్లు ఉన్నట్టు చెప్పారు.
చదవండి: Ration Card New Rules: కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్ కార్డు కట్!