policy
-
మస్క్కు ప్రభుత్వం ఆహ్వానం
టెస్లా(Tesla) సీఈఓ ఎలాన్ మస్క్తోపాటు ఇతర ప్రధాన ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీ సంస్థల ఉన్నతాధికారులకు దేశంలోని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆహ్వానం పంపింది. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్ల తయారీని ప్రోత్సహించే పథకం (SPMEPCI)కు సంబంధించిన మార్గదర్శకాలను ఖరారు చేసేందుకు వారికి ఆహ్వానం పంపినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం ఈమేరకు చర్చసాగనుంది.మార్చి 2024లో కొత్త ఈవీ పాలసీని ప్రతిపాదించారు. ప్రపంచ వాహన తయారీదారులను ఆకర్షించడానికి, దేశీయ తయారీ సామర్థ్యాలను పెంచడానికి దీన్ని రూపొందించినట్లు ప్రభుత్వం గతంలో తెలిపింది. స్థానిక తయారీ, సరఫరాను తప్పనిసరి చేస్తూ దేశంలో ఉత్పత్తి సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు ఈ పథకం ప్రోత్సాహకాలను అందిస్తుంది. ప్రతిపాదిత మార్గదర్శకాల ప్రకారం ఆటోమొబైల్స్, ఆటో కాంపోనెంట్స్ (పీఎల్ఐ-ఆటో) కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి అనుగుణంగా దేశీయ విలువ జోడింపు (DVA)ను లెక్కిస్తారు.ఈవీ పాలసీ నిబంధనలు ఇవే..భారతదేశంలో కనీసం 500 మిలియన్ డాలర్లు (సుమారు రూ.4,150 కోట్లు) పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉన్న వాహన తయారీదారులకు దిగుమతి సుంకాలను తగ్గించాలనే నిబంధనలున్నాయి. ఏదైనా కంపెనీ స్థానికంగా కార్యకలాపాలు ప్రారంభించిన మూడేళ్లలో 25% డీవీఏ(DVA), ఐదో సంవత్సరం నాటికి 50% డీవీఏ సాధించాల్సి ఉంటుంది. అర్హత కలిగిన తయారీదారులకు చెందిన ఉత్పత్తులు 35,000 డాలర్లు(రూ.30 లక్షలు) కంటే ఎక్కువ ధర ఉంటే దిగుమతి పన్ను సుమారు 70%గా విధిస్తారు.విభిన్న వాదనలుప్రతిపాదిత పథకానికి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఈ పథకం ద్వారా గణనీయమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నప్పటికీ టెస్లా, విన్ఫాస్ట్ వంటి వాహన తయారీదారులు కొన్ని నిబంధనలపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఏప్రిల్ 2024లో పాలసీపై ఇరు కంపెనీల నుంచి భిన్న వాదనలు వినిపించాయి. డీవీఏ లెక్కింపు పద్ధతి, అర్హత ప్రమాణాలపై ఆందోళన చెందాయి. నిర్ణీత గడువులోగా డీవీఏ లక్ష్యాలను చేరుకోవడంపై టెస్లా తన సలహాదారు ‘ది ఆసియా గ్రూప్ (TAG) ఇండియా’ ద్వారా అభ్యంతరాలు వ్యక్తం చేసింది.ఇప్పటికే విన్ఫాస్ట్ పెట్టుబడులు500 మిలియన్ డాలర్ల ప్రారంభ పెట్టుబడితో తమిళనాడులో ఎలక్ట్రిక్ వాహనాల ప్లాంటును నిర్మిస్తున్న వియత్నాంకు చెందిన విన్ ఫాస్ట్, ముందుగా కంపెనీలు చేస్తున్న ఖర్చులకు కూడా ప్రోత్సాహకాలు అందించాలని కోరుతోంది. ఈ రెండు కంపెనీలే కాకుండా ఇతర కంపెనీల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని పాలసీ మార్గదర్శకాలను సవరించడానికి ప్రభుత్వం యోచిస్తుందేమో చూడాల్సి ఉంది. రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్(ఆర్ అండ్ డీ), ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఈ పథకంలో చేర్చాలని కొన్ని వర్గాలు సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: గోవాలో హై డిమాండ్ వేటికంటే..గతంలో మస్క్ పర్యటన రద్దు2024లో మస్క్ ఇండియా పర్యటన కొన్ని కారణాల వల్ల రద్దు అయింది. అప్పటి నుంచి భారత్లో కంపెనీ పెట్టుబడి ప్రణాళికలు ప్రశ్నార్థకంగా మారాయి. తాజా పరిణామాల వల్ల ఈమేరకు తిరిగి చర్చసాగే అవకాశం ఉంటుదేమోనని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమెరికాలో రాబోయే ట్రంప్ ప్రభుత్వంలో మస్క్ కూడా కీలక పాత్ర పోషించనున్నారు. దాంతో త్వరలో జరగబోయే ఈ సంప్రదింపులకు ప్రాముఖ్యత సంతరించుకుంది. టెస్లా, హ్యుందాయ్, బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, కియా, టయోటాతో సహా టాటా మోటార్స్, మహీంద్రా, హీరో మోటోకార్ప్ వంటి భారతీయ కంపెనీలు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నాయి. -
రూ.399 కడితే.. ₹10 లక్షల బీమా: ఇదిగో ఫుల్ డీటెయిల్స్
జీవితంలో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో.. ఎవ్వరూ ఊహించలేరు. కానీ ఊహకందని ప్రమాదం జరిగినప్పుడు ఆర్థికంగా కొంత నిలదొక్కుకోవడానికి ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కార్పొరేట్ సంస్థలు, ఐపీపీబీ (ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్).. 'గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్' ప్లాన్స్ ప్రవేశపెట్టింది. వీటికి సంబందించిన పూర్తి వివరాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఐపీపీబీ రూ.399 ప్లాన్ఈ ప్లాన్ కింది మీరు ఏడాదికి రూ.399 చెల్లిస్తే.. ప్రమాదవశాత్తు మరణించినా లేదా వైకల్యం ఏర్పడినా, ప్రమాదంలో కాళ్ళు, చేతులు పనిచేయకుండా పోయినా.. రూ.10 లక్షల భీమా సౌకర్యం పొందవచ్చు.ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి ప్రమాదం వల్ల హాస్పిటల్లో చేరితే యాక్సిడెంటల్ మెడికల్ ఖర్చులు కోసం రూ.60,000 లేదా ప్రమాదవశాత్తు వైద్య ఖర్చుల కోసం రూ.30,000 అందిస్తారు. అంతే కాకుండా హాస్పిటల్లో 10 రోజులు ఉంటే రోజుకు రూ.1000 చొప్పున చెల్లిస్తారు. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తికి కుటుంబ ప్రయోజనం కింద రవాణా ఖర్చుల కోసం రూ.25,000 లభిస్తుంది. ఒకవేళ పాలసీదారు మరణిస్తే అంత్యక్రియల కోసం మరో రూ.5,000 అందుతాయి. ఈ ప్లాన్ కింద ఎడ్యుకేషన్కు సంబంధించిన ప్రయోజనాలు లభిస్తాయి.ఐపీపీబీ రూ.299 ప్లాన్ఈ ప్లాన్ ఎంచుకునే పాలసీదారు సంవత్సరానికి రూ.299 చెల్లించి.. 10 లక్షల రూపాయల ప్రమాద భీమా పొందవచ్చు. ప్రమాదవశాత్తు మరణించినా లేదా వైకల్యం ఏర్పడినా, ప్రమాదంలో కాళ్ళు, చేతులు పనిచేయకుండా పోయినా.. రూ.10 లక్షల భీమా లభిస్తుంది.ఈ ప్లాన్ ఎంచుకునే పాలసీదారుకు రూ.399 ప్లాన్లో లభించే దాదాపు అన్ని ప్రయోజనాలు లభిస్తాయి. కానీ ఎడ్యుకేషన్ బెనిఫీట్స్.. హాస్పిటల్లో 10 రోజులు ఉంటే రోజుకు రూ.1,000 చొప్పున లభించే ప్రయోజనాలు అందవు.ఇదీ చదవండి: బ్యాంకులకు ఆరు రోజులు వరుస సెలవులుదీనికి అర్హులు ఎవరంటే..18 నుంచి 65 సంవత్సరాల వయసున్న ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు.గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ దేనిని కవర్ చేయదంటే..ఆత్మహత్య చేసుకున్నా, మిలటరీ సర్విసెస్లో ఉంటూ మరణించినా, యుద్ధంలో ప్రాణాలు కోల్పోయినా, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడి కన్నుమూసినా, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఎయిడ్స్ వంటి వాటివల్ల చనిపోయినా.. ప్రమాదకరమైన క్రీడల్లో మృత్యువాత పడినా ఈ ఇన్సూరెన్స్ లభించదు. -
బ్యాంకులపై ఆధారపడొద్దు: ఐఆర్డీఏఐ
బీమా పాలసీలను విక్రయించేందుకు ఏదో ఒక సంస్థ మీదో లేదా బ్యాంకులపైనో అధికంగా ఆధారపడకూదని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్డీఏఐ) బీమా కంపెనీలకు సూచించింది. ఇందుకు ప్రత్యామ్నాయాలను వెతకాలని తెలిపింది. పాలసీలను విక్రయించేందుకు ఇతర అనువైన వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాలని పేర్కొంది.బీమా కంపెనీలు వాటి మాతృ సంస్థలుగా ఉన్న బ్యాంకుల ద్వారానే దాదాపు 90 శాతం పాలసీలను విక్రయిస్తున్నాయని బీమా నియంత్రణ సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీన్ని అరికట్టేందుకు ఐఆర్డీఏఐ మార్కెట్ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. సమీప భవిష్యత్తులో పాలసీల విక్రయానికి సంబంధించి కొత్త నిబంధనలతో ముసాయిదాను తీసుకురావాలని ఐఆర్డీఏఐ యోచిస్తోంది. ఇప్పటివరకు అధికంగా బ్యాంకుల ద్వారానే పాలసీలు విక్రయిస్తున్నందున ఒక్కసారిగా ఈ విధానంలో మార్పు రాదని, అందుకు కొంత సమయం పడుతుందని ఒక అధికారి తెలిపారు. పాలసీల విక్రయానికి సంబంధించి ఐఆర్డీఏఐ నిబంధనలు తీసుకురాబోతున్న నేపథ్యంలో కంపెనీలు ఇతర పంపిణీ వ్యవస్థలను సిద్ధం చేసుకోవాలని ఆయన తెలిపారు.ఇదీ చదవండి: పెట్రోల్, డీజిల్పై రూ.5 తగ్గింపు!బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు తమ కస్టమర్లకు మోసపూరిత బీమా పాలసీలను అంటగడుతున్నట్లు ఇప్పటికే బీమా నియంత్రణాధికార సంస్థ ఐఆర్డీఏఐ గుర్తించింది. ఇలా మోసపూరితంగా పాలసీలు విక్రయించకూడదని ఐఆర్డీఏఐ ఛైర్మన్ దేబాశీస్ పాండా గతంలో స్పష్టం చేశారు. బ్యాంకర్లు తమ ప్రధాన వ్యాపారంపైనే దృష్టి సారించాలన్నారు. దేశంలో అందరికీ బీమాను చేరువ చేయడంలో బ్యాంకులు కీలకపాత్రే పోషిస్తున్నప్పటికీ, బలవంతంగా మోసపూరిత పాలసీలను అంటగడుతున్నట్లు చెప్పారు. -
మభ్యపెట్టి అంటగట్టొద్దు
బ్యాంకులో డబ్బు డిపాజిట్, విత్డ్రా, క్రెడిట్ కార్డులు, లోన్లు జారీ.. వంటి కార్యకలాపాలు సాగిస్తుంటారు. దాంతోపాటు వివిధ బీమా పాలసీలు కూడా విక్రయిస్తారు. అయితే కొన్ని బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్లు తమ కస్టమర్లకు మోసపూరిత బీమా పాలసీలను అంటగడుతున్నట్లు బీమా నియంత్రణాధికార సంస్థ ఐఆర్డీఏఐ గుర్తించింది. ఇలా మోసపూరితంగా పాలసీలు విక్రయించకూడదని ఐఆర్డీఏఐ ఛైర్మన్ దేబాశీస్ పాండా తెలిపారు.ఈ సందర్భంగా పాండా మాట్లాడుతూ..‘బ్యాంకర్లు తమ ప్రధాన వ్యాపారంపైనే దృష్టి సారించాలి. మోసపూరిత బీమా పాలసీలు విక్రయించకూడదు. దేశంలో అందరికీ బీమాను చేరువ చేయడంలో బ్యాంకస్యూరెన్స్ (బ్యాంక్ శాఖల ద్వారా బీమా పాలసీలు విక్రయించే) మార్గం చాలా ఉపయోగపడుతోంది. అయితే దీన్ని కస్టమర్లకు అందించడంలో అప్రమత్తంగా ఉండాలి. చాలా జాగ్రత్త వహించాలి. మోసపూరిత పాలసీలను అంటగట్టకూడదు. ఆర్థిక వ్యవస్థలో బ్యాంకర్ల పాత్ర కీలకం. బీమా పాలసీలను అమ్మడాన్ని ప్రాధాన్యతగా తీసుకోకూడదు’ అని చెప్పారు.ఇదీ చదవండి: నిబంధనలు పాటించని బ్యాంకులపై చర్యలుప్రస్తుతం మార్కెట్లో చాలా బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని పాలసీలు విక్రయించినందుకు సిబ్బందికి ఇన్సెంటివ్లు ప్రకటిస్తున్నారు. దాంతో కస్టమర్లకు అధిక ప్రయోజనాలు చేకూర్చని పాలసీలను, నిబంధనలు సరిగా తెలియజేయకుండా మోసపూరితంగా అంటగడుతున్నారు. దాంతో ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ బ్యాంకులకు కొన్ని సూచనలు చేశారు. తాజాగా ఐఆర్డీఏఐ ఛైర్మన్ దీనిపై స్పందించారు. -
3600 మందికి 300 కోట్లకు టోకరా..8 మంది నిందితుల అరెస్ట్
-
సద్దుమణగని ఆందోళనలు
సాక్షి, హైదరాబాద్/సిరిసిల్ల క్రైం/ఖిలా వరంగల్: టీజీఎస్పీ పోలీసులకు సంబంధించిన సెలవుల విధానంలో మార్పు నేపథ్యంలో మొదలైన సిబ్బంది ఆందోళనలు ఆదివారం కూడా కొనసాగాయి. ఆందోళనల నేపథ్యంలో సస్పెండైన తమతోటి సిబ్బందిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని, ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నా ఖాతరు చేయడం లేదు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆందోళనలకు నాయకత్వం వహిస్తున్నారని గుర్తించిన 39 మంది టీజీఎస్పీ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ టీజీఎస్పీ అడిషనల్ డీజీ సంజయ్కుమార్ జైన్ శనివారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 3, 4, 5 17వ బెటాలియన్లలో ఆరుగురు చొప్పున, 6, 12, 13వ బెటాలియన్లలో ఐదుగురు చొప్పున సస్పెండ్ చేశారు. దీంతో కానిస్టేబుళ్లు ఆదివారం మరోమా రు ఆందోనకు దిగారు. నల్లగొండలోని 12వ బెటాలియన్ సిబ్బంది కాసేపు ఆందోళన చేశారు. సస్పెన్షన్ ఎత్తివేయాలని హైదరాబాద్ కొండాపూ ర్లోని 8వ బెటాలియన్లో కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు, పిల్లలు క్యాండిల్ మార్చ్ చేశారు. ములుగు జిల్లా చల్వాయి ఐదో బెటాలియన్కు చెందిన సిబ్బంది ఏకంగా అడిషనల్ డీజీ సంజయ్కుమార్జైన్కు లేఖ రాశారు. సస్పెండ్ చేసిన తమ తోటి సిబ్బందిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, లేదంటే అందరినీ సస్పెండ్ చేయాలని వారు ఆ లేఖలో స్పష్టం చేశారు. మరోవైపు సిరిసిల్లలోని సర్దాపూర్ 17వ బెటాలియన్ పోలీసులు కూడా సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ ఉన్నతాధికారులకు విన్నవించారు. కొద్దిసేపు బైఠాయించిన తర్వాత విధుల్లో చేరారు. అనంతరం ఆదివారం రాత్రి సిరిసిల్లలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము చేస్తున్న శాంతియుత నిరసనలను గమనించి ఉద్యోగులకు బాసటగా నిలవాల్సిన ఉన్నతాధికారులు కొందరిపై సస్పెన్షన్ వేటు వేయడం సరికాదని అన్నారు. సివిల్ డ్రెస్తో ధర్నా ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని, కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ మామునూరు టీజీ ఎస్పీ నా లుగో బెటాలియన్ గేటు వద్ద సిబ్బంది ధర్నాకు దిగారు. శనివారం బెటాలియన్ గేటు వద్ద ఆందో ళనకు దిగిన కానిస్టేబుళ్లు ఎస్.సతీష్, బి.రమేష్, డి.శ్రీనివాస్, సీహెచ్ ప్రశాంత్, పి.సంపత్ కె.వినోద్ను సస్పెండ్ చేస్తూ అదేరోజు రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉదయం విధులకు హాజరైన స్పెషల్ పోలీసులు యూనిఫాం లేకుండా సివిల్ డ్రెస్తోనే బెటాలియన్ ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. వీరికి పోలీసు కుటుంబాల సభ్యులు బాసటగా నిలిచారు. ఫోకస్ పెంచిన ఉన్నతాధికారులు టీజీఎస్పీ సర్విస్ రూల్స్ ఏంటి?, ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా ఇప్పుడు ఏక్ పోలీస్ విధానం లేకపోవడం, టీజీఎస్పీ అన్నది పారామిలిటరీ ఫోర్స్ కాబ ట్టి అందుకు అనుగుణంగానే పనిచేయాల్సి ఉంటుంది.. ఇలాంటి అనేక కోణాల్లో సిబ్బందికి నచ్చజెప్పేందుకు పోలీస్ ఉన్నతాధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన మేర సత్ఫలితాలు ఇవ్వ డం లేదు. దీంతో తదుపరి చర్యలతోపాటు..ఆందోళన మూలాలపై పోలీస్ ఉన్నతాధికారులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఆయా బెటాలియన్లలో అడిషనల్ డీజీ స్థాయి నుంచి స్థానిక ఎస్పీల వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇదే పద్ధతిలో మరింత లోతుగా యథార్థ పరిస్థితులను సిబ్బందికి నచ్చజెప్పే ప్రయత్నం కొనసాగించడంతో పాటు క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించేది లేదన్న సందేశాన్ని మరింత గట్టిగా సిబ్బందికి పంపే యోచనలో పోలీస్ ఉన్నతాధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. -
గుండె జారిపోతోంది!
సాక్షి, అమరావతి: దేశంలో గుండె జబ్బులు పెరుగుతున్నాయి. గత ఐదేళ్లలో గుండె జబ్బుల సంబంధిత ఇన్సూ్యరెన్స్ క్లెయిమ్లు దాదాపు రెట్టింపవడమే ఇందుకు నిదర్శనం. కాలుష్యం, జీవనశైలి సంబంధిత ఆరోగ్య సమస్యలు గుండె జబ్బులకు ప్రధాన కారణం. పాలసీ బజార్ సంస్థ అధ్యయన నివేదిక ప్రకారం 2019–20లో దేశవ్యాప్తంగా నమోదైన ఆరోగ్య బీమా నమోదైన క్లెయిమ్లలో గుండె చికిత్సల క్లెయిమ్ల వాటా దాదాపు 12 శాతం. ఇవి 2023–24లో 20 శాతం వరకు పెరిగాయి. గుండె జబ్బుల చికిత్స ఖర్చులు సైతం 47 నుంచి 53 శాతం మేర పెరిగినట్టు ఆ సంస్థ వెల్లడించింది. ఒక్కో క్లెయిమ్ 2019–20లో రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల ఉంటే.. 2023–24లో రూ. 12 – 15 లక్షలకు పెరిగినట్లు తెలిపింది. యువతలో పెరుగుతున్న జబ్బులు కొద్ది సంవత్సరాలుగా యువతలో గుండె జబ్బులు పెరుగుతున్నాయి. ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేని జీవన శైలి ఇందుకు కారణమని పలు అధ్యయనాలు వెల్లడించాయి. 2020లో 40 ఏళ్ల లోపు యువతకు సంబంధించిన గుండె వ్యాధుల క్లెయిమ్లు 10–12 శాతం నమోదు కాగా, 2022–23లో 15–18 శాతంగా నమోదైంది. గుండె జబ్బులకు సంబంధించిన మొత్తం క్లెయిమ్లలో 60–70 శాతం పురుషులు, 30–40 శాతం మహిళలు ఉన్నట్టు తేలింది.ప్రాంతాల వారీగా అత్యధికంగా గుండె చికిత్సల క్లెయిమ్లుఉత్తర భారతదేశం (ఢిల్లీ, పంజాబ్, హర్యానా) 20- 25%పశ్చిమ భారతదేశం (మహారాష్ట్ర, గుజరాత్) 15- 18%దక్షిణ భారతదేశం (తమిళనాడు, కర్ణాటక) 15-20%తూర్పు భారతదేశం (పశ్చిమ బెంగాల్) 10- 12%(కోల్కతా వంటి నగరాల్లో గుండె జబ్బుల రేట్లు గణనీయంగా ఉంటున్నాయి. అయినప్పటికీ బీమా పాలసీదారులు తక్కువగా ఉండటంతో తక్కువ నమోదైంది) -
తెలంగాణ వడ్డించిన విస్తరి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వడ్డించిన విస్తరి వంటిదని.. చైనా బయట పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా నిలిచేందుకు అనేక అనుకూలతలు ఉన్నాయని ముఖ్యమంత్రి ఎను ముల రేవంత్రెడ్డి చెప్పారు. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగం బలోపేతంతో వేగంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తామని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈల ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చి.. ప్రస్తుతం రూ.3 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర వార్షిక బడ్జెట్ను 2028 నాటికి రూ.7 లక్షల కోట్లకు చేర్చడం లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు. బుధవారం హైదరాబాద్ శిల్ప కళావేదికలో ‘తెలంగాణ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పాలసీ–2024’ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు, పరిశ్రమల శాఖ అధికారులు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్న ఈ భేటీలో పారిశ్రామిక ప్రగతికి సంబంధించిన పలు అంశాలను సీఎం ప్రస్తావించారు. పెట్టుబడులతో సంపద పెంచుతాం ‘‘ఏ రంగంలోనైనా పాలసీ లేకుండా పురోగతి సాధ్యం కాదు. ఎంఎస్ఎంఈలో పెట్టుబడులు రాబడుతూ సంపద పెంచడంతోపాటు దళితులు, గిరిజనులు, మహిళలను ప్రోత్సహించే వాతా వరణం సృష్టిస్తాం. భేషజాలకు పోకుండా గత ప్రభుత్వం చేసిన మంచి పనులు కొనసాగిస్తూ.. నష్టం చేసే విధానాలను తొలగిస్తాం. పారిశ్రామిక అభివృద్ధితోనే తెలంగాణ ఆర్థికంగా బలోపేతం అవుతుంది..’’ అని సీఎం రేవంత్ చెప్పారు. వ్యవసాయ రంగంపై ఎక్కువ మంది ఆధారపడటంతో రైతులకు ప్రభుత్వపరంగా ఎన్ని విధాలుగా సాయం అందించినా వారి పరిస్థితి మెరుగుపడటం లేదని పేర్కొన్నారు. వ్యవసాయ కుటుంబాలు ఉద్యోగ, ఉపాధి కల్పన, వ్యాపార రంగాల్లోనూ ఎదగాలన్నారు. గతంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎకరం అమ్మితే తెలంగాణలో పది ఎకరాలు కొనే పరిస్థితి ఉండేదని.. తెలంగాణ యువత ఐటీ రంగంలో అడుగుపెట్టి సిలికాన్ వ్యాలీని శాసించే స్థాయికి ఎదగడంతో ఇప్పుడు పరిస్థితి తారుమారైందని, ఇక్కడ ఎకరా అమ్మితే ఆంధ్రాలో వంద ఎకరాలు కొనొచ్చని వ్యాఖ్యానించారు. స్కిల్ యూనివర్సిటీకి విరాళాలు సేకరిస్తాం నైపుణ్య శిక్షణ కోసం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకోసం యూనివర్సిటీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో రూ.300 కోట్ల నుంచి రూ. 500 కోట్ల కార్పస్ ఫండ్ సేకరిస్తామని సీఎం రేవంత్ చెప్పారు. భూములు కోల్పోయే వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేస్తామన్నారు. అమెరికాలో హడ్సన్, లండన్లోని థేమ్స్ తరహాలో మూసీ నదిని అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్రంలో 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.లక్ష కోట్లను సున్నా వడ్డీపై రుణాలుగా ఇస్తామని ప్రకటించారు. శిల్పారామంలో మహిళా ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం మూడు ఎకరాలు కేటాయిస్తున్నామని చెప్పారు. సామాజిక న్యాయానికి పునాది: భట్టి విక్రమార్క కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతోనే రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ రంగం వేళ్లూనుకుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈలు మూతపడుతున్నా తెలంగాణలో ఆ రేటు తక్కువగా ఉందని పేర్కొన్నారు. చిన్న పరిశ్రమల టేకోవర్ల సమస్య కూడా తక్కువగా ఉంటోందని తెలిపారు. తాము ఎంఎస్ఎంఈ పాలసీ ద్వారా సామాజిక న్యాయానికి పునాదులు వేశామని... గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన రూ.2వేల కోట్ల సబ్సిడీని ఎంఎస్ఎంఈలకు విడతల వారీగా చెల్లిస్తామని ప్రకటించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాలసీ: మంత్రి శ్రీధర్బాబు అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఎంఎస్ఎంఈలను తీర్చిదిద్దే లక్ష్యంతో కొత్త విధానం తెస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. ఎంఎస్ఎంఈలను గ్రోత్ సెంటర్లుగా మారుస్తామన్నారు. అన్ని జిల్లాల్లో ఎంఎస్ఎంఈలు, పారిశ్రామిక పార్కులు, స్టార్టప్ల కోసం ప్రత్యేక పార్కులు ఏర్పాటు చేసి... మహిళలకు 5శాతం, ఎస్సీ, ఎస్టీ ఎంట్రప్రెన్యూర్లకు 15శాతం రిజర్వు చేస్తామని ప్రకటించారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళలను ప్రోత్సహిస్తూ ‘ఫ్లాట్ ఫ్యాక్టరీలు’, ఎస్ఎంఎస్ఈ క్లస్టర్లలో పది చోట్ల కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎంఎస్ఎంఈలకు సులభంగా ఆర్థికసాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రూ.100 కోట్లతో యంత్రాల ఆధునీకరణకు నిధి ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎంఎస్ఎంఈల ఉత్పత్తుల కొనుగోలు కోసం ‘ప్రొక్యూర్మెంట్ పాలసీ’, బహుళ జాతి కంపెనీలతో భాగస్వామ్యాలు, పాలసీ అమలు కోసం టాస్్కఫోర్స్, లీజు పాలసీ వంటివాటిని కొత్త విధానంలో పొందుపర్చామని వెల్లడించారు. కేంద్ర పథకంపై ఒప్పందం..కేంద్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) శాఖ ప్రపంచ బ్యాంకు సహకారంతో దేశంలో ఎంఎస్ఎంఈల పనితీరును మెరుగుపర్చడం, వేగవంతం చేయడం కోసం పథకాన్ని అమలు చేస్తోంది. కరోనా సమయంలో దెబ్బతిన్న ఎంఎస్ఎంఈలు తిరిగి కోలుకునేందుకు ఉద్దేశించిన ఈ పథకంలో భాగంగా.. రాష్ట్రంలో స్టేట్ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్ ఏర్పాటు కోసం బుధవారం ఎంఓయూ కుదుర్చుకున్నారు.కాగా.. పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు నిర్మల జగ్గారెడ్డి, రాయల నాగేశ్వర్రావు, ఐత ప్రకాశ్రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్రంజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పైసా ప్రీమియం లేకుండా రూ.కోటి ఇన్సూరెన్స్..
అనుకోని సంఘనలు జరిగి కుటుంబ పెద్ద లేదా సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఛిన్నాభిన్నం అవుతుంది. అదే బీమా ఉంటే కుటుంబానికి కొండంత అండగా ఉంటుంది. దీన్ని గుర్తించి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త బీమా పాలసీని ప్రకటించారు. ఇందులో ఉద్యోగులు, వారి కుటుంబీకులు ప్రమాదవశాత్తూ మరణించినా లేదా అంగవైకల్యం పొందినా ఆర్థిక సహాయం అందజేస్తారు.ఈ పథకం కింద అస్సాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి ప్రీమియం లేకుండా అంటే జీరో ప్రీమియంతో జీవిత బీమా, వైకల్య కవరేజీ అందిస్తారు. ఈ పాలసీ కింద రాష్ట్ర ఉద్యోగులకు కోటి రూపాయల వరకు బీమా కవరేజీ లభిస్తుంది.విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించే లేదా వైకల్యానికి గురయ్యే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రక్షణ కోసం ఈ పథకాన్ని రూపొందించినట్లు అస్సాం సీఎం తెలిపారు.ఈ పథకం రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, వరదలు, ఇతర విపత్తుల వల్ల సంభవించే ప్రమాదాలను కవర్ చేస్తుంది. ఈ కొత్త పాలసీలో ప్రమాదవశాత్తు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం కలిగినా బాధిత కుటుంబానికి రూ. 1 కోటి, పాక్షిక అంగవైకల్యానికి రూ.80 లక్షలు, అనారోగ్యంతో మరణిస్తే రూ.10 లక్షలు అందజేస్తామని అస్సాం సీఎంఓ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. -
70 వేల మంది విద్యార్థులపై బహిష్కరణ
టోరంటో: కెనడాలో వలసలపై పరిమితి విధించడమే లక్ష్యంగా ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ విధానాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు విదేశీ విద్యార్థులోగుబులు రేపుతున్నాయి. ఈ ఏడాది ఆఖరు నాటికి 70 వేల మంది విదేశీ విద్యార్థులు కెనడాను వదిలేసి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వారంతా ఆందోళన బాటపట్టారు. తమను బయటకు వెళ్లగొట్టడం సమంజసం కాదంటూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వైఖరి మార్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విదేశీ విద్యార్థులు శిబిరాలు ఏర్పాటు చేసుకొని, నిరసన దీక్షలకు దిగుతున్నారు. ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్, ఒంటారియో, మనిటోబా, బ్రిటిష్ కొలంబియా తదితర ప్రావిన్స్ల్లో దీక్షలు, ర్యాలీలు జరుగుతున్నాయి. కెనడాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో సింహభాగం భారతీయులే ఉన్నారు. కొత్త జీవితం నిర్మించుకోవాలని ఎన్నో ఆశలతో కెనడాలో అడుగుపెట్టిన వీరంతా ఇప్పుడు దినదినగండంగా బతుకున్నారు.స్పందన శూన్యం స్టడీ పర్మిట్లు, వర్క్ పర్మిట్ల సంఖ్యను భారీగా కుదించాలని, పర్మనెంట్ రెసిడెన్సీ నామినేషన్లను కనీసం 25 శాతం తగ్గించాలని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ విధానాల్లో ఈమేరకు ఇటీవలే మార్పులు చేసింది. 70 వేల మంది విదేశీ విద్యార్థుల వర్క్ పర్మిట్ల గడువు ఈ ఏడాది ఆఖరు నాటికి ముగిసిపోతుంది. వాటిని పొడిగించే అవకాశం కనిపించడం లేదు. దాంతో వారంతా బయటకు వెళ్లక తప్పదు. దాంతో దేశవ్యాప్తంగా విదేశీ విద్యార్థులు ఆందోళన ప్రారంభించారు. వర్క్ పర్మిట్ల గడువు పెంచాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడం లేదు. దీనిపై మాట్లాడడానికి ప్రభుత్వ అధికారులు ఇష్టపడడం లేదు.ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ శాసనసభ భవనం ఎదుట గత మూడు నెలలుగా ఆందోళనలు, ర్యాలీలు జరుగుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. విదేశీ కార్మికులపైనా పరిమితి విదేశాల నుంచి విద్యార్థులు భారీగా వచ్చిపడుతుండడంతో కెనడాలో మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెరుగుతోంది. హౌసింగ్, ఆరోగ్య సంరక్షణతోపాటు ఇతర సేవలు అందరికీ అందడం లేదు. అందుబాటులో ఉన్న వనరులు సరిపోని పరిస్థితి. అందుకే విదేశాల నుంచి వలసల తగ్గింపుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా విద్యార్థుల రాకను చట్టబద్ధంగానే అడ్డుకుంటోంది.రాబోయే రెండేళ్లపాటు ఇంటర్నేషనల్ స్టూడెంట్ పర్మిట్ అప్లికేషన్లను పరిమితంగానే జారీ చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది కేవలం 3.60 లక్షల స్టడీ పర్మిట్లకు అనుమతి ఇవ్వనున్నట్లు అంచనా. గత ఏడాది కంటే ఇది 35 శాతం తక్కువ కావడం గమనార్హం. పోస్టుగ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్ల కోసం విదేశీ విద్యార్థులెవరూ దరఖాస్తు చేసుకోవద్దని కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ సూచించారు. తక్కువ వేతనాలకు తాత్కాలికంగా పనిచేసుకోవడానికి వచ్చే విదేశీ కార్మికుల సంఖ్యపై పరిమితి విధించబోతున్నట్లు కెనడా ప్రధానమంత్రి కెనడా జస్టిన్ ట్రూడో సోమవారం వెల్లడించారు. -
Chhattisgarh: నెలసరి సెలవు విధానం అమలు
ఛత్తీస్గఢ్లోని హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ (హెచ్ఎల్యూ) విద్యార్థినులకు పీరియడ్స్ సెలవు విధానాన్ని అమలులోకి తెచ్చింది. ఈ ఏడాది జూలై ఒకటి నుంచి యూనివర్శిటీలో దీనిని అమలు చేస్తున్నట్లు పేర్కొంది.హెచ్ఎన్ఎల్యు చేపట్టిన ‘హెల్త్ షీల్డ్’ కార్యక్రమంలో భాగంగానే ఈ సెలవు విధానం అమలు చేసినట్లు యూనివర్సిటీ తెలియజేసింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వీ.సీ. వివేకానందన్ మాట్లాడుతూ యువ విద్యార్థినుల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని పీరియడ్స్ సెలవు విధానాన్ని అమలు చేయడం మెచ్చుకోదగిన విధానమని అన్నారు. దీనికి మద్దతిచ్చినందుకు అకడమిక్ కౌన్సిల్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.యూనివర్శిటీ ప్రతినిధి మాట్లాడుతూ ఈ విధానంలో విద్యార్థినులు క్యాలెండర్ నెలలో ఒక రోజు పీరియడ్స్ సెలవు తీసుకోవచ్చు. భవిష్యత్తులో పరీక్షా రోజులలో కూడా ఇటువంటి ప్రత్యేక సెలవులు మంజూరు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. క్రమరహిత ఋతు సిండ్రోమ్ లేదా పీసీఓఎస్ (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) వంటి రుగ్మతలు ఉన్న బాలికలు ఒక సెమిస్టర్లో ఆరు రోజుల వరకూ సెలవు తీసుకోవచ్చని అన్నారు.అంతకుముందు 2023 జనవరిలో కేరళలోని కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దేశంలో తొలిసారిగా పీరియడ్స్ సెలవు విధానాన్ని ప్రారంభించింది. అనంతరం పంజాబ్ యూనివర్శిటీ ఆఫ్ చండీగఢ్, గువాహటి యూనివర్శిటీ ఆఫ్ అస్సాం, నల్సార్ యూనివర్శిటీ (హైదరాబాద్), అస్సాంలోని తేజ్పూర్ యూనివర్శిటీలు కూడా ఈ విధమైన సెలవు విధానాన్ని ప్రారంభించాయి. -
‘సీబీఐ నన్ను వేధిస్తోంది’.. ఢిల్లీ హైకోర్టుకు కేజ్రీవాల్
సాక్షి,న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.మద్యం పాలసీ కేసులో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.పలు జాతీయ మీడియా కథనాల ప్రకారం.. లిక్కర్ పాలసీ కేసులో కొనసాగుతున్న దర్యాప్తుల ముసుగులో సీబీఐ తనను వేధింపులకు గురిచేస్తోందని కేజజ్రీవాల్ ఆరోపించారు. సీబీఐ అధికారుల తీరు నిరాశ, ఆందోళన కలిగించే విషయమని పిటిషన్లో పేర్కొన్నారు.ఈ సందర్భంగా 2023 ఏప్రిల్లో విచారణకు పిలిచినప్పుడు తాను సీబీఐకి సహకరించినట్లు గుర్తు చేశారు. అంతేకాదు, సీబీఐ అరెస్ట్ చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా అభివర్ణించారు. రిమాండ్ ఉత్తర్వులు చాలా సాధారణమైనవని, మొత్తం అరెస్ట్, విచారణ ప్రక్రియను నిర్విర్యం చేయడానికి దారితీస్తుందని కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్లో వెల్లడించారు.కాగా, సీబీఐ అరెస్ట్, ట్రయల్ కోర్టు తనను సీబీఐ కస్టడీకి అప్పగించడాన్ని సవాలు చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ కూడా హైకోర్టులో పెండింగ్లో ఉంది. -
ఎల్ఐసీ పాలసీ దారులకు ముఖ్యగమనిక
లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ (ఎల్ఐసీ) పాలసీ దారులకు ముఖ్యగమనిక. నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ఇండివిజువల్ సేవింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ధన్ వృద్దిని విత్డ్రా చేసుకుంటున్నట్లు ఎల్ఐసీ ప్రకటించింది.ఈ సేవింగ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ .. పాలసీ పాలసీదారులకు రక్షణ, సేవింగ్స్ను అందిస్తుంది. పాలసీ వ్యవధిలో జీవిత బీమా పొందిన వ్యక్తి దురదృష్టవశాత్తూ మరణిస్తే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్న వ్యక్తికి మెచ్యూరిటీ తేదీలో హామీ ఇవ్వబడిన మొత్తం మొత్తాన్ని కూడా అందించేది.ఈతరుణంలో ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఎల్ఐసీ ధన్ వృద్ధి పాలసీ ఫిబ్రవరి 2, 2024న పునఃప్రారంభించబడింది. ఏప్రిల్ 1, 2024 న ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఎల్ఐసీ ధన్ వృద్ధి పాలసీ ప్రత్యేకతుల • సింగిల్ ప్రీమియం ప్లాన్• పాలసీ టర్మ్, డెత్ కవర్ని ఎంపిక చేసుకోవచ్చు. • పాలసీ వ్యవధిలోపు పాలసీ దారులకు హామీ ఇచ్చినట్లు ప్రయోజనాలను అందిస్తుంది. •ఎక్కువ బేసిక్ సమ్ అష్యూర్డ్ ఉన్న పాలసీలకు అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. • మరణం లేదా మెచ్యూరిటీపై లంప్సమ్ బెనిఫిట్• మెచ్యూరిటీపై ఇన్స్టాల్మెంట్, సెటిల్మెంట్లో డెత్ బెనిఫిట్స్ను ఎంపిక చేసుకోవచ్చు.• పాలసీకి లోన్ అందుబాటులో ఉందిఎల్ఐసీ ధన్ వృద్ధి పాలసీ టర్మ్• ఎల్ఐసీ ధన్ వృద్ధి 10, 15 లేదా 18 సంవత్సరాల కాలవ్యవధికి అందుబాటులో ఉంటుంది. ఎంపిక చేసిన కాలాన్ని బట్టి కనీస ప్రవేశ వయస్సు 90 రోజుల నుండి 8 సంవత్సరాల వరకు ఉంటుంది. • ఎల్ఐసీ ధన్ వృద్ధి ప్లాన్ బేసిక్ సమ్ అష్యూర్డ్, గ్యారెంటీ రిటర్న్• పాలసీ కనీస ప్రాథమిక బీమా మొత్తం రూ. 1,25,000. • జీవిత బీమా పాలసీ వ్యవధిలో రిస్క్ ప్రారంభ తేదీ తర్వాత కానీ నిర్ణీత గడువు తేదీకి ముందు పాలసీదారులు మరణిస్తే.. నిబంధనల ప్రకారం ప్రయోజనాలు సంబంధిత పాలసీ దారుడి కుటుంబానికి అందుతాయి. -
ఏప్రిల్ నుంచి జరిగే మార్పులివే..
ఏప్రిల్ 1నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం ప్రారంభం అవుతుంది. కొత్తగా ఆర్థిక సంస్థలు అమలు చేయబోయే నిబంధనలు ఈ నెల నుంచే వర్తించనున్నాయి. ఎన్పీఎస్ లాగిన్తోపాటు క్రెడిట్ కార్డులకు రివార్డులు, బీమా రంగంలో ఈ-ఇన్సూరెన్స్, ఎస్బీఐ డెబిట్ కార్డ్ ఛార్జీల పెంపు తదితర నిబంధనలు అమల్లోకి రానున్నాయి.ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అధారిటీ (పీఎఫ్ఆర్డీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్) ఖాతాల లాగిన్ కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్ని పూర్తిగా పునర్వ్వవస్థీకరించింది. దీని ప్రకారం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 2-ఫ్యాక్టర్ ఆధార్ అథెంటికేషన్ విధానం అమల్లోకి తెచ్చింది. ఈ విధానంలోని నిబంధనల ప్రకారం ఎన్పీఎస్లోని సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ (సీఆర్ఏ)లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు 2024 మార్చి 15న పీఎఫ్ఆర్డీఏ సర్క్యులర్ జారీ చేసింది.ఎస్బీఐ డెబిట్ కార్డు ఛార్జీలు పెంపుదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు (ఎస్బీఐ) తన ఖాతాదారుల డెబిట్ కార్డు ఛార్జీలు పెంచింది. కొత్త ఛార్జీలు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. క్లాసిక్ డెబిట్ కార్డులు, సిల్వర్, గ్లోబల్, కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డులపై వార్షిక నిర్వహణ ఫీజు రూ.125 నుంచి రూ.200లకు పెంచింది. యువ, గోల్డ్, కాంబో డెబిట్ కార్డు, మై కార్డ్ నిర్వహణ చార్జీలు రూ.175 నుంచి రూ.250లకు, ప్లాటినం డెబిట్ కార్డు చార్జీ రూ.250 నుంచి రూ.325, ప్లాటినం బిజినెస్ కార్డు ఫీజు రూ.350 నుంచి రూ.425లకు పెంచింది.ఫ్రీలాంజ్ యాక్సెస్..ఐసీఐసీఐ బ్యాంకుతోపాటు, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డుల సాయంతో విమానాశ్రయాల్లో ఫ్రీ లాంజ్ యాక్సెస్ పొందడానికి కీలక నిబంధనలో మార్పులు తెచ్చాయి. క్రెడిట్ కార్డుదారులు త్రైమాసికంలో చేసిన ఖర్చును బట్టి ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్ ఆఫర్ వర్తించనుంది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డు దారులు రూ.35 వేలు, యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు దారులు రూ.10వేలు, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు దారులు రూ.50 వేలు ఖర్చు చేయాలి. ఐసీఐసీఐ బ్యాంకుకు చెందిన కోరల్ క్రెడిట్ కార్డు, మేక్ మై ట్రిప్ ఐసీఐసీఐ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ప్లాటినం క్రెడిట్ కార్డులకు ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు ఏప్రిల్ 20 నుంచి అమలవుతాయి.పాలసీ డిజిటలైజేషన్ఇన్సూరెన్స్ పాలసీకి డిజిటలైజేషన్ తప్పనిసరి చేశారు. ఇక నుంచి అన్ని రకాల ఇన్సూరెన్స్ పాలసీలను డిజిటలైజ్ చేయాల్సి ఉంటుంది. జీవిత, ఆరోగ్య, జనరల్ ఇన్సూరెన్స్ పాలసీలన్నీ ఎలక్ట్రానిక్ పద్ధతిలోనే అందించాలి. ఈ నిబంధన ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. -
పాకిస్థాన్ కోర్ పాలసీ ఇదే: జైశంకర్
ఢిల్లీ: సీమాంతర ఉగ్రవాదం ఉపయోగించి భారత్ను అంతర్జాతీయంగా చర్చకు తీసుకురావడమే పాకిస్థాన్ ప్రధాన విధానం అని భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తెలిపారు. పాక్ దుష్టవైఖరికి భారత్ అడ్డుకట్ట వేయగలిగిందని అన్నారు. 'భారత్ను అంతర్జాతీయ వేదికపై చర్చకు తీసుకురావడానికి పాక్ ఎన్నో ఏళ్లుగా ఉగ్రవాదం మార్గాన్ని ఎంచుకుంది. ఇందుకోసం అక్కడ ఉగ్రవాదాన్ని చట్టబద్దంగా చేసినట్లు కనిపిస్తోంది. పొరుగుదేశంతో భారత్ ఇలా ఎప్పటికీ వ్యవహరించదు.' అని జైశంకర్ అన్నారు. కెనడాలో వ్యాపిస్తున్న ఖలిస్థానీల ప్రభావం గురించి కూడా జైశంకర్ మాట్లాడారు. భారత్కు వ్యతిరేకంగా పనిచేయడానికి కెనడాలో ఖలిస్థానీయులకు అవకాశం ఇస్తున్నారని అన్నారు. ఇదే భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడానకి కారణమైందని చెప్పారు. ఈ విధానం ఇటు.. భారతదేశానికి గానీ, కెనడాకు గానీ ఉపయోగం కానప్పటికీ ఆ దేశ రాజకీయాలు అలా ఉన్నాయని విమర్శించారు. ఇదీ చదవండి: దేశవ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్ల ఆందోళన.. పెట్రోల్ బంక్లపై ఎగబడ్డ జనం -
ఓలా, ఉబెర్లపై ఢిల్లీ ప్రభుత్వ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: త్వరలో ఢిల్లీలో ఓలా, ఉబెర్ లాంటి యాప్ బేస్డ్ క్యాబ్ అగ్రిగేటర్లను ప్రభుత్వం నియంత్రించనుంది. ఇందు కోసం కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.ఢిల్లీ ప్రభుత్వం రూపొందించిన డ్రాఫ్ట్ పాలసీకి లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం తెలపడంతో కొత్త పాలసీని త్వరలో నోటిఫై చేస్తామని రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ తెలిపారు. కొత్త పాలసీ ప్రకారం ఓలా ఉబెర్ లాంటి యాప్ ఆధారిత క్యాబ్ సర్వీసు ప్రొవైడర్లు ఢిల్లీలో వాడే తమ వాహనాలను 2030లోగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకోవాల్సి ఉంటుంది. 25 కంటే ఎక్కువ వాహనాలున్న సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలన్నింటికీ కొత్త పాలసీ వర్తిస్తుంది. ఈ పాలసీ కింద అగ్రిగేటర్లు లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.క్యాబ్ ఆపరేటర్లు కస్టమర్ల వద్ద నుంచి పీక్ అవర్స్లో వసూలుచేసే అత్యధిక ఛార్జీలపై మాత్రం డ్రాఫ్ట్లో ఎలాంటి ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ఈ కామర్స్ సేవలందించే అమెజాన్, ఫ్లిప్కార్ట్తో పాటు ఫుడ్ డెలివరీ యాప్లు జొమాటో, స్విగ్గీలకు కూడా ఈ కొత్త పాలసీ వర్తించనుంది.వారు కూడా తమ వాహనాలన్నింటినీ గడువులోగా విద్యుత్ వాహనాలుగా మార్చుకోవాల్సి ఉంటుంది.వాహనాలన్నీ రవాణా శాఖ నిబంధనలకు అనుగుణంగానే ఢిల్లీలో తిరగాల్సి ఉంటుంది.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై లక్ష రూపాయల దాకా జరిమానాలు విధంచనున్నారు. ఇదీచదవండి..దివ్యాంగులకు రైల్వేశాఖ అందించే ప్రత్యేక సౌకర్యాలివే.. -
కాంతులీననున్న కొత్త సబ్స్టేషన్లు
సాక్షి, అమరావతి : అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా రానున్న రోజుల్లో ఏపీ గణనీయమైన వృద్ధి, పట్టణీకరణ జరిగే క్రమంలో ఎదురయ్యే విద్యుత్ డిమాండ్ను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. భవిష్యత్తులో నిరంతరం నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేసేందుకు వీలుగా విద్యుత్ రంగం బలోపేతంపై దృష్టిపెట్టింది. ఇందులో భాగంగా.. రాష్ట్ర విద్యుత్ రంగ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి 28 సబ్స్టేషన్లకు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ ట్రాన్స్కో) శ్రీకారం చుడుతోంది. వీటిలో 16 సబ్స్టేషన్ల శంకుస్థాపన, 12 సబ్స్టేషన్ల ప్రారంపోత్సవాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం వర్చువల్ విధానంలో చేయనున్నారు. రూ.3,100 కోట్ల వ్యయంతో కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, సత్యసాయి, ప్రకాశం, గుంటూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, అన్నమయ్య జిల్లాల పరిధిలోని 28 ప్రాంతాల్లో 132/33 కేవీ, 220/132 కేవీ, 400/220 కేవీ, 400/132 కేవీ సామర్థ్యాలతో ఈ సబ్స్టేషన్లు ఏర్పాటవుతున్నాయి. రెండు సోలార్ ప్రాజెక్టులు కూడా.. ఇవికాక.. కడపలో 750 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, అనంతపురంలో 100 మెగావాట్ల మరో సోలార్ ప్రాజెక్టు నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. కడప జిల్లా మైలవరం మండలంలో 1,000 మెగావాట్ల సోలార్ పార్కు అభివృద్ధికి కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) ఆమోదం తెలిపింది. ఇందులో 250 మెగావాట్లను 2020 ఫిబ్రవరి 8న ప్రారంభించారు. మిగిలిన 750 మెగావాట్లను సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ అఫ్ ఇండియా (ఎస్ఈసీఐ) ద్వారా అభివృద్ధి చేయనున్నారు. ఈ 750 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుకు రూ.3 వేల కోట్లు పెట్టుబడి అవుతుందని అంచనా. ఏడాదిలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి 1,500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ ప్లాంట్ ఏటా 1,500 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. దీనిద్వారా సంవత్సరానికి 12 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని అంచనా. అలాగే.. శ్రీ సత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లోని ఎన్.పీ.కుంట, గాలివీడు గ్రామాల వద్ద 1,500 మెగావాట్ల సోలార్ పార్క్కు ఎంఎన్ఆర్ఈ ఆమోదం తెలిపింది. వివిధ సోలార్ పవర్ డెవలపర్లు 1,400 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్రాజెక్టులను ఇప్పటికే పూర్తిచేశారు. మిగిలిన 100 మెగావాట్ల కోసం, హెచ్పీసీఎల్ ముందుకొచ్చింది. ఈ సోలార్ ప్రాజెక్టుకు రూ.400 కోట్లు పెట్టుబడి అంచనా వేయగా, ఏడాది నిర్మాణ కాలంలో 200 మందికి ఉపాధి లభించనుంది. ఈ ప్లాంట్ ఏటా 200 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. తద్వారా ఏటా 1.6 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చు. గడువులోగా ప్రాజెక్టులు పూర్తి విద్యుత్ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్ణిత సమయానికి పూర్తి చేసేందుకు పక్కాగా ప్రణాళికలు రూపొందించాలని విద్యుత్ సంస్థలను ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ట్రాన్స్కో సీఎండీ కె. విజయానంద్ ఆదేశించారు. సీఎం కార్యక్రమం ఏర్పాట్లపై విద్యుత్ సౌధలో సోమవారం ఆయన అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను తీర్చడానికి, అందుకు తగ్గట్లుగా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి రాష్ట్ర విద్యుత్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయన్నారు. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందించిన సహాయ సహకారాలతోనే వినియోగదారులకు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ను వినియోగదారులకు ఇవ్వగలుగుతున్నామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జెన్కో ఎండీ, ట్రాన్స్కో జేఎండీ కేవీఎన్ చక్రధర్బాబు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ జేఎండీ బి. మల్లారెడ్డి, డిస్కంల సీఎండీలు ఐ. పధ్వితేజ్, జె. పద్మజనార్ధనరెడ్డి, కె. సంతోషరావు, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ ఎండీ, సీఈఓ కమలాకర్ బాబు, డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
జనవరి 1 నుంచి బీమాలో కొత్త రూల్స్ - తెలుసుకోవాల్సిందే!
న్యూఢిల్లీ: బీమా సంస్థలు పాలసీలోని కనీస సదుపాయాల గురించి పాలసీదారులకు తప్పకుండా తెలియజేయాలి. పాలసీకి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని పాలసీహోల్డర్లకు ఇకపై సులువుగా అర్థమయ్యేలా ఇవ్వాల్సిందేనని బీమా కంపెనీలకు ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఐఆర్డీఏఐ సూచించింది. ఈ నూతన నిబంధన 2024, జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. సమ్ అష్యూర్డ్ (బీమా కవరేజీ), పాలసీలో వేటికి కవరేజీ ఉంటుంది, మినహాయింపులు, వెయిటింగ్ పీరియడ్, క్లెయిమ్ ఎలా చేయాలి తదితర వివరాలను తప్పకుండా వెల్లడించాలి. అలాగే, ఫిర్యాదుల ప్రక్రియ గురించీ చెప్పాలి. ఈ మేరకు కస్టమర్ సమాచార పత్రాన్ని (సీఐసీ) బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ) సవరించింది. దీనివల్ల పాలసీదారులు నియమ నిబంధనలు, షరతుల గురించి సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఈ విషయంలో పాలసీ డాక్యుమెంట్ది కీలక పాత్ర అని పేర్కొంది. కాబట్టి పాలసీకి సంబంధించి ప్రాథమిక వివరాలు, అవసరమైన సమాచారాన్ని సులువైన పదాల్లో చెప్పాల్సిన అవసరం ఉందని సర్క్యులర్లో తెలిపింది. బీమా సంస్థకు, పాలసీ హోల్డర్కు మధ్య వివరాల విషయంలో అస్పష్టత మూలంగానే అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, కాబట్టి కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ను సవరిస్తున్నట్లు ఐఆర్డీఏఐ చెప్పింది. సవరించిన సీఐఎస్ ప్రకారం.. బీమా ప్రొడక్ట్/ పాలసీ, పాలసీ నంబర్, ఇన్సురెన్స్ టైప్, సమ్ అష్యూర్డ్ వంటి ప్రాథమిక సమాచారం ఇవ్వాలి. అలాగే, హాస్పటల్ ఖర్చులు, పాలసీలో కవర్ కానివి, వెయిటింగ్ పీరియడ్, కవరేజీ పరిమితులు, క్లెయిమ్ ప్రొసీజర్, గ్రీవెన్స్/ కంప్లయింట్స్ వివరాలు వంటివీ పొందుపరచాలని ఐఆర్డీఏఐ పేర్కొంది. ఒకవేళ పాలసీ హోల్డర్ కోరితే సదరు వివరాలు స్థానిక భాషలోనూ అందుబాటులో ఉంచాలని సూచించింది. సవరించిన సీఐసీ జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఐఆర్డీఏఐ ప్రకటించింది. -
ఎల్ఐసీ పాలసీ దారులకు శుభవార్త!
లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్దరించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ క్యాంపెయిన్ అక్టోబర్ 31,2023 వరకు కొనసాగనుంది. పాలసీ ల్యాప్స్ ఎప్పుడు అవుతుంది? ఎల్ఐసీ పాలసీ హోల్డర్లు సాధారణ గడువు తేదీ లోపల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అన్వేక కారణాల వల్ల గడువు తేదీలోగా చెల్లించకపోతే మరో 15 రోజుల నుంచి 30 రోజుల లోపు (గ్రేస్ పీరియడ్) కట్టే అవకాశం ఉంది. అప్పటికీ ప్రీమియం చెల్లించకపోతే పాలసీ రద్దవుతుంది. అయితే, పాలసీదారులకు భరోసా కల్పించేలా ల్యాప్స్ అయిన పాలసీల పునరుద్ధరణ కోసం, ఎల్ఐసీ ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యాక్రమాల్ని నిర్వహిస్తుంది. తాజాగా, ఎల్ఐసీ రీవైవల్ క్యాంపెయిన్ని అందుబాటులోకి తెచ్చింది. LIC's Special Revival Campaign - An opportunity for policyholders to revive their lapsed policies. To know more, contact your nearest LIC Branch/Agent or visit https://t.co/jbk4JUmIi9#LIC #SpecialRevivalCampaign pic.twitter.com/xHfZzyrMkD — LIC India Forever (@LICIndiaForever) September 26, 2023 ఖాతాదారులకు ప్రత్యేక రాయితీలు ఈ క్యాంపెయిన్లో పాలసీదారులు రద్దయిన పాలసీలను పునరుద్దరించుకోవచ్చు. ఉదాహరణకు పాలసీదారు లక్ష రూపాయిల ప్రీమియం చెల్లించాలంటే ఈ రీవైవల్ క్యాంపెయిన్లో 30 శాతం వరకు రాయితీ పొందవచ్చు. లేట్ ఫీ ఛార్జీల కింద రూ.3,000 రాయితీ పొందే అవకాశాన్ని ఎల్ఐసీ కల్పిస్తుంది. అదే ప్రీమియం రూ.లక్ష నుంచి రూ.3లక్షల వరకు చెల్లించాలంటే 30 శాతంతో అంటే రూ.3,500 వరకు రాయితీ పొందవచ్చు. ప్రీమియం 3లక్షలు చెల్లించాలంటే అదనపు ఛార్జీలలో 30 శాతం కన్సెషన్తో రూ.4,000 రాయితీని పొందవచ్చని ఎల్ఐసీ తెలిపింది. పాలసీ ల్యాప్స్ అయిందా? లేదా అని తెలుసుకోవాలంటే? ♦ ఎల్ఐసీ పోర్ట్ల్ను ఓపెన్ చేయాలి ♦ అందులో రిజిస్టర్ యూజర్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ♦ సంబంధిత వివరాల్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వొచ్చు. ♦ లాగిన్ తర్వాత పాలసీ స్టేటస్ క్లిక్ చేయాలి ♦ స్టేటస్ క్లిక్ చేస్తే మీ పాలసీ ల్యాప్స్ అయ్యిందా? లేదా అనేది తెలుసుకోవచ్చు -
వైద్య సేవల్లో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సేవలు చాలా బాగున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ హర్ష మంగ్లా చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయమని, ఈ విధానం ద్వారా గ్రామస్థాయిలో ప్రజలకు వైద్యుల సేవలు అందించడం శుభపరిణామం అని చెప్పారు. హర్ష మంగ్లా శనివారం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్రంలో వైద్య కార్యక్రమాలు, వైద్య శాఖ పని తీరు వంటి పలు అంశాలపై ఆయన చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. వైద్య సేవలు చేరువ ఎఫ్డీసీ ఓ వినూత్న కార్యక్రమం. దీని ద్వారా ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు చేరువ అవుతాయి. రాష్ట్రంలో వంద శాతం విలేజ్ క్లినిక్స్ను హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా అభివృద్ధి చేయడం చాలా మంచి విషయం. వీటి ద్వారా ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. గ్రామాల్లోనే 12 రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు వీటిలో సేవలు అందిస్తున్నారు. వెల్నెస్ సెంటర్ల పరిధిలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి ఆరోగ్య వివరాలు, చరిత్ర వీటిలో ఉంటాయి. వీటి ఆధారంగా వైద్య సేవలు అందుతాయి. ప్రజలకు డిజిటల్ వైద్య సేవల కల్పనే లక్ష్యంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) అమలు చేస్తున్నాం. ఈ కార్యక్రమం అమలులోనూ ఏపీ ప్రభుత్వం ఉత్తమ పనితీరు కనబరుస్తోంది. అవయవ దానానికి ముందుకు రావాలి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకూ ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కేంద్రం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రజలందరికీ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ కార్డుల జారీ, అవయవ దానం క్యాంపెయిన్, రక్తదానం క్యాంప్లు వంటి నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ అవయవ దానం, రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. అవయవదానానికి ఏపీలో చాలా మంది ముందుకు వస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఉచిత వైద్యం ఆరోగ్య కార్యక్రమాల అమలులో ఏపీ మిగతా అన్ని రాష్ట్రాలకంటే ముందుంది. ప్రజలకు ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ ఉచిత వైద్యం అందించడానికి ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం అమలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ప్రతి కుటుంబానికి ఈ పథకం ఎంతో ముఖ్యమైనది. పేద, మధ్య తరగతి ప్రజలకు ఈ పథకంతో ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ కార్డుల జారీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. -
ఉచిత విద్యుత్ మా పాలసీ
సాక్షి, హైదరాబాద్: ‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్ మా ప్రభుత్వ పాలసీ. ఈ విషయానికి సంబంధించి కొందరు తెలిసీ తెలియక మాట్లాడుతున్నారు. వాటిని నేను పట్టించుకోను. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ పథకం నిలబడాలి. గ్రామీణ ప్రాంతాలు, రైతులు బాధలు తొలగిపోయి వంద శాతం బాగుండాలి..’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అన్నారు. భూముల డిజిటలైజేషన్ కోసం తెచ్చిన ధరణిని సమస్యగా చిత్రీకరించేందుకు కొన్ని దుష్టశక్తులు పనిచేస్తున్నాయని విమర్శించారు. ధరణితో భూముల మీద యజమానులకు సంపూర్ణ అధికారం వచ్చిందని చెప్పారు. ఈ అధికారాన్ని మీ వద్దే పెట్టుకుంటారా? లేక వదిలేసుకుంటారా? అనేది మీరే నిర్ణయించుకోవాలని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కుంభం అనిల్కుమార్రెడ్డి సోమవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ సమక్షంలో భారత్ రాష్ట్ర సమితిలో చేరారు. అనిల్కుమార్ రెడ్డితో పాటు ఆయన వెంట వచ్చిన అనుచరులకు కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లోతుగా ఆలోచించిన తర్వాతే.. ‘తెలంగాణ ఉద్యమంతో పాటు రాష్ట్ర సాధనను ఒక టాస్క్గా తీసుకుని పనిచేశాం. మాకు రాజకీయం ఒక టాస్క్ లాంటిది. నేను సిద్దిపేట శాసనసభ్యుడిగా పనిచేసిన నాటి నుంచి మొదలుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు కరెంటు విషయంలో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు వర్ణనాతీతం. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు అధికారులతో జరిపిన చర్చల ద్వారా సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు తదితర మౌలిక వసతుల్లో సమతుల్యత సాధించాం. ప్రభుత్వ సంపూర్ణ మద్దతు ఉంటే 24 గంటల ఉచిత విద్యుత్ సాధ్యమవుతుందనే అధికారుల వాదనకు కట్టుబడి, పూర్తిస్థాయిలో అండగా నిలిచి ఏడెనిమిది నెలల్లోనే విద్యుత్ సరఫరా లేక ఏర్పడిన దుష్పరిణామాలను సరిదిద్దాం.ఏడు గంటల పాటు ఒకేమారు వ్యవసాయ అవసరాలకు విద్యుత్ ఇవ్వడం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను దృష్టిలో పెట్టుకునే 24 గంటల కరెంటుకు మొగ్గు చూపాం. గ్రిడ్ కుప్పకూలకుండా అవసరమైన సమయంలో విద్యుత్ కొనుగోలుకు అవసరమైన విచక్షణాధికారం అధికారులకు ఇవ్వడంతో పాటు సాంకేతిక అంశాలపై అవగాహన ఉండదనే ఉద్దేశంతో ట్రాన్స్కో, జెన్కో తదితర సంస్థల నుంచి ఐఏఎస్ అధికారులను తొలగించాం. విద్యుత్ అంశంపై ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించిన తర్వాతే తొమ్మిదేళ్లుగా అమలు చేస్తున్నాం. మూడు గంటల కరెంటు అంటే రైతులు తిడుతున్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, ధాన్యం కొనుగోలు అంశంపై ఆర్థికవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా గ్రామీణ ప్రాంతాలు కుదుటపడే వరకు కొనసాగిస్తాం. దీంతో ఆర్థికాభివృద్ధి జరిగి తెలంగాణ అన్ని రంగాల్లోనూ అగ్రస్థానానికి చేరుతుంది. ధాన్యం ప్రాసెసింగ్.. జపాన్ కంపెనీతో చర్చలు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు, చెక్డ్యాంలు తదితరాలతో భూగర్భ జలాలు పెరిగి పంటల దిగుబడి పెరిగింది. తెలంగాణలో ఇసుక పండినట్లు 3 కోట్ల టన్నుల ధాన్యం వస్తుండటంతో గిర్నీల సామర్ధ్యం కూడా సరిపోవడం లేదు. 2.5 కోట్ల టన్నుల ధాన్యం ప్రాసెసింగ్ కోసం జపాన్ సటాకా కంపెనీతో మాట్లాడుతున్నాం. నేను రైతుబిడ్డగా సిద్దిపేట మార్కెట్లో పడిగాపులు పడిన రోజులను దృష్టిలో పెట్టుకుని గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేస్తున్నాం..’అని సీఎం చెప్పారు. భూములపై సర్వాధికారాలు యజమానులకు.. ‘వీఆర్వోలు భూముల వివరాలు గందరగోళం చేశారు. ధరణి ద్వారా భూముల డిజిటలైజేషన్తో వాటిపై సర్వాధికారాలు యజమానుల చేతికి వచ్చాయి. రాష్ట్రంలోని 2.76 కోట్ల ఎకరాల్లో 1.56 కోట్ల భూమి ఇప్పటికే ధరణిలోకి వచ్చింది. ధరణి మూలంగా రైతుబంధు, భూమికి రక్షణ, ధాన్యం కొనుగోలు వంటివి సులభంగా సాధ్యమవుతాయి. ఇప్పుడు రాష్ట్రంలో భూముల విలువ ఎంతో పెరిగింది. ధరణి లేకపోతే శాంతిభద్రతల సమస్యలు తలెత్తేవి. కొందరు చెప్తున్నట్లు ధరణి తీసేస్తే మళ్లీ లంచాలు మొదలవుతాయి..’అని కేసీఆర్ అన్నారు. జోడెడ్ల బండిలా ముందుకు తీసుకెళ్లండి ‘భువనగిరిలో ఇద్దరూ పోటీ పడి డబ్బులు తగలేయొద్దు. చెరి ఒక పదవి తీసుకుని జోడెడ్ల బండిలా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లండి.. అని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, అనిల్ కుమార్రెడ్డికి చెప్పా. కోడె లేగల మాదిరిగా వెలపల, దాపల సమానంగా ఉంటే కచ్చురంగా బాగా ముందుకు పోతుంది. అనిల్కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు నాదే బాధ్యత. నాకు ఫిబ్రవరిలో 70 ఏళ్లు వస్తాయి. రేపటి తెలంగాణను పాలించేది మీరే. దారి చూపించి వెళతా..’అని కేసీఆర్ అన్నారు. సమావేశంలో మంత్రులు హరీశ్రావు, జగదీశ్రెడ్డితో పాటు ప్రభు త్వ విప్లు బాల్క సుమన్, గొంగిడి సునీత, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, భూపాల్రెడ్డి, కె.ప్రభాకర్రెడ్డి, గ్యాదరి కిషోర్, భాస్కర్రావు, రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, జెడ్పీ చైర్మన్ సందీప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్రలో రెండేళ్లలో ఉచిత విద్యుత్: కేసీఆర్ మహారాష్ట్రలో రైతు ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. మహారాష్ట్రలోని వివిధ పారీ్టలకు చెందిన 76 మంది సర్పంచ్లు కూడా సోమవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వ్యవసాయంతో పాటు అనేక రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికే ఆదర్శంగా నిలిచామని సీఎం చెప్పారు. మహారాష్ట్రలో కూడా రైతులు, ప్రజల జీవన ప్రమాణాలు మారాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పరిశీలించాల్సిందిగా సర్పంచ్లకు సూచించారు. వారిని తెలంగాణ గ్రామాల పర్యటనకు తీసుకెళ్లాలని ఎమ్మెల్యే జీవన్రెడ్డిని ఆదేశించారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో మహారాష్ట్ర అమరావతి డివిజన్ నుంచి బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీతో పాటు రైతు సంఘటన, వంచిత్ బహుజన్ అఘాడీ, షెట్కారీ సంఘటనతో పాటు వివిధ పారీ్టలకు చెందిన 76 మంది సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, మహారాష్ట్ర మీడియా యూనియన్ ప్రతినిధులు ఉన్నారు. -
ఈ–కామర్స్ విధానంపై చర్చలు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ విధానాన్ని రూపొందించడంపై అంతర్–మంత్రిత్వ శాఖల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం డీపీఐఐటీ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. పరిశ్రమ సమ్మిళిత వృద్ధి సాధించడానికి అనువైన పరిస్థితులను కల్పించే వ్యూహాల రూపకల్పన అనేది ఈ విధానం ప్రధాన లక్ష్యంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దీని ద్వారా వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేలా నియంత్రణ విధానాలను క్రమబద్ధీకరించడం, కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవడం, సరఫరా వ్యవస్థలను సమగ్రపర్చడం, ఈ–కామర్స్ మాధ్యమం ద్వారా ఎగుమతులను పెంచడం తదితర అంశాలపై అంతర్–మంత్రిత్వ శాఖలు దృష్టి పెడుతున్నాయని సింగ్ వివరించారు. అటు జాతీయ రిటైల్ వాణిజ్య విధానంపై కూడా డీపీఐఐటీ కసరత్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. భౌతిక రిటైల్ రంగం వృద్ధిని ప్రోత్సహించేందుకు, క్రమబద్ధీకరించేందుకు ఉపయోగపడే మార్గదర్శకాలను ఇందులో పొందుపర్చనున్నారు. -
ఇన్సూరెన్స్ పాలసీలపై పెరిగిన అవగాహన.. రూ.3 లక్షల కోట్ల బీమా రంగ ఆదాయం
న్యూఢిల్లీ: బీమా పరిశ్రమ స్థూల ప్రీమియం ఆదాయం 2025 మార్చి నాటికి రూ.3 లక్షల కోట్లకు చేరుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. 2023 మార్చి నాటికి ఇది రూ.2.4 లక్షల కోట్లుగా ఉంది. ప్రైవేటు బీమా సంస్థల కంబైన్డ్ రేషియో మెరుగుపడుతుందని, రిటర్న్ ఆన్ ఈక్విటీ (ఆర్వోఈ) 2023–24లో 11.2–12.8 శాతానికి, 2024–25లో 12.5–13.9 శాతానికి పెరుగుతుందని పేర్కొంది. ప్రభుత్వరంగ బీమా సంస్థలు కంబైన్డ్ రేషియో అధికంగా ఉంటుందని, దీంతో వాటి నష్టాలు కొనసాగుతాయని తెలిపింది. ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలు 2024 మార్చి నాటికి సాల్వెన్సీ రేషియో (1.5 రెట్లు) చేరుకునేందుకు వీలుగా వాటికి రూ.17,500 కోట్ల నిధుల అవసరం అవుతాయని అంచనా వేసింది. పరిశ్రమ స్థూల ప్రీమియం ఆదాయం 2022–23లో వార్షికంగా చూస్తే 17.2 శాతం వృద్ధితో రూ.2.4 లక్షల కోట్లకు చేరుకున్న విషయాన్ని ప్రస్తావించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 2022–23లో నికరంగా రూ.35,000 కోట్ల మేర పెరిగినట్టు పేర్కొంది. హెల్త్ ఇన్సూరెన్స్ పట్ల అవగాహన పెరగడంతో ఈ విభాగం మెరుగైన వృద్ధిని చూసిందని, వృద్ధి చెందిన స్థూల ప్రీమియం ఆదాయంలో 50 శాతం వాటా హెల్త్ ఇన్సూరెన్స్ నుంచే వచ్చినట్టు వివరించింది. కరోనా సమయంలో లాక్డౌన్లతో దెబ్బతిన్న మోటారు బీమా విభాగం సైతం పుంజుకున్నట్టు ఇక్రా తెలిపింది. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్లు సాధారణ స్థితికి చేరినట్టు పేర్కొంది. వేతన సవరణ, అందుకు సంబంధించిన బకాయిల చెల్లింపులతో ప్రభుత్వరంగ సాధారణ బీమా సంస్థలకు నష్టాలు పెరిగినట్టు వివరించింది. -
AP: హిజ్రాల కోసం ట్రాన్స్జెండర్ పాలసీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హిజ్రాల మేలు కోసం ట్రాన్స్జెండర్ పాలసీని ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఇప్పటికే హిజ్రాలకు నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలను అందిస్తున్న ప్రభుత్వం ప్రత్యేకంగా వారికోసం మరిన్ని చర్యలు చేపట్టనుంది. ట్రాన్స్జెండర్లకు సరైన విద్య, వైద్యం అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. వారు నివసించే ప్రాంతాల్లో అందిరి మాదిరిగానే మంచినీటి సరఫరా, పారిశుధ్య సదుపాయాలు కల్పిస్తోంది. ఇళ్ల స్థలాలు, ఇళ్లు, ఆర్థిక సహాయాలు అందిస్తోంది. వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చి సాధికారత సాధించేలా తోడ్పాటు అందించనుంది. మొత్తంగా వారికి సామాజిక భద్రత కల్పించేలా ప్రభుత్వం పాలసీ అమలు చేస్తుంది. రాష్ట్రంలో ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులు జారీచేయనుంది. ట్రాన్స్జెండర్స్ హక్కులను కాపాడటంతోపాటు వారి సంక్షేమానికి, అభివృద్ధికి ప్రభుత్వ ప్రస్తుత (2022–23) బడ్జెట్లో రూ.2 కోట్లు కేటాయించడం విశేషం. చదవండి: Heart Attack: టీకాల వల్లే యువత గుండెకు ముప్పు! -
15 ఏళ్లు దాటిన వాహనాలను ఏప్రిల్ 1 నుంచి తుక్కు కింద అమ్మేయాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్: జిల్లాలో 15 ఏళ్లు దాటిన వాహనాలను ఏప్రిల్ 1 నుంచి తుక్కు కింద అమ్మాలని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్ మీరా ప్రసాద్ తెలిపారు. బుధవారం డీటీసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 15 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాలు, 20 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలు సామర్ధ్య పరీక్షల్లో విఫలం అయితే తుక్కుగా మార్చే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిందన్నారు. -
ఆభరణాల మరమ్మతుల మార్కెట్గా భారత్: జీజేఈపీసీ డిమాండ్
ముంబై: ఆభరణాల మరమ్మతుల (బాగు చేయడం/రీపేర్) సేవలకు ఔట్సోర్స్ మార్కెట్గా భారత్ అవతరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకు రావాలని జెమ్స్ అండ్ జ్యుయలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) డిమాండ్ చేసింది. విధానపరమైన ప్రోత్సాహంతో అంతర్జాతీయ జ్యులయరీ రిపేర్ మార్కెట్లో భారత్ వాటాను 10-20 శాతానికి తీసుకెళ్లొచ్చని సూచించింది. 2026 నాటికి భారత మార్కెట్ వాటా 5.75 బిలియన్ డాలర్లకు (రూ.47,150 కోట్లు) చేరుకోవచ్చని అంచనా వేసింది. ‘‘ప్రస్తుతం ఈ మార్కెట్లో అంతర్జాతీయంగా భారత్ కేవలం 3 శాతం వాటా కలిగి ఉంది. కేవలం 196.8 మిలియన్ డాలర్ల మేర విక్రయాలు ఉన్నాయి. కానీ, ఇదే మార్కెట్లో అమెరికాకు 30 శాతం వాటా ఉంటే, చైనా 9.2 శాతం వాటా కలిగి ఉంది. చేతితో తయారు చేసే ఆభరణాల్లో భారత్కు సహజ సిద్ధంగా ఉన్న నైపుణ్యాల దృష్ట్యా జ్యుయలరీ రిపేర్ రంగంలోనూ భారత్ తన సత్తా చూపించగలదు. ఇందుకు సంబంధించి తగిన విధానాన్ని తీసుకొస్తే ప్రపంచ మార్కెట్లో మన వాటాను 10-20 శాతానికి తీసుకెళ్లొచ్చు. బిలియన్ డాలర్ల పెట్టుబడులతోపాటు ఎన్నో ఉపాధి అవకాశాలను ఇది తీసుకొస్తుంది’’అని జీజేఈపీసీ చైర్మన్ విపుల్షా తెలిపారు. మరమ్మతుల విధానాన్ని ప్రకటించినట్టయితే ప్రముఖ బ్రాండ్లు భారత్లో తమ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తాయన్నారు. ప్రస్తుతం ఇవి ఎక్కువగా దుబాయి, టర్కీ, హాంగ్కాంగ్ తదితర ప్రాంతాల్లో ఉన్నట్టు చెప్పారు. అన్ని రకాల జ్యుయలరీని దిగుమతి చేసుకుని, మరమ్మతులు చేయాలంటే అందుకు దేశీయంగా ఆభరణాల తయారీ పరిశ్రమలో టెక్నాలజీ ఉన్నతీకరణ అవసరపడుతుందని జీజేఈపీసీ తెలిపింది. పెద్ద ఎగుమతిదారులు తమ కస్టమర్లకు సంబంధించిన మరమ్మతుల అవసరాలను తీర్చే అవకాశం లభిస్తుందని పేర్కొంది. -
ఎల్ఐసీ పాలసీ దారులకు ముఖ్య గమనిక
ప్రముఖ లైఫ్ ఇన్స్యూరెన్స్ ఇండియా కార్పొరేషన్ (ఎల్ఐసీ) జీవర్ అమర్, టెక్ టర్మ్ పాలసీలను విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. నవంబర్ 23 నుంచి ఆ రెండు పాలసీలు వినియోగంలో ఉండవని ఎల్ఐసీ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది. ఎల్ఐసీ 2019 ఆగస్ట్లో జీవన్ అమర్ ప్లాన్ను, అదే ఏడాది సెప్టెంబర్లో ఎల్ఐసీ టెక్ టర్మ్ ప్లాన్ను అందుబాటులోకి తెచ్చింది.అయితే తాజాగా ఆ ప్లాన్ను ఉపసంహరించుకుంటున్నట్లు ఎల్ఐసీ పేర్కొంది. అందుకు కారణం రీ ఇన్స్యూరెన్స్ ప్రీమియం ధరలు పెరగడమే కారణమని తెలుస్తోంది. కాగా, త్వరలో ఆ రెండు పాలసీలను మార్పులు చేసి మళ్లీ అందుబాటులోకి తెస్తామని సంస్థ చెబుతోంది. అర్హతలు 10 నుంచి 40 సంవత్సరాల కాలపరిమితితో పాలసీ దారుడు ఎల్ఐసీ జీవన్ అమర్ ప్లాన్ను కనీసం రూ.25 లక్షలు, ఎల్ఐసీ టెక్ టర్మ్ ప్లాన్ కనీసం రూ. 50 లక్షలు హామీ మొత్తంతో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ రెండు ప్లాన్లలో పాలసీ కట్టే సమయంలో పాలసీదారుడు మరణిస్తే హామీ మొత్తాన్ని నామినీకి అందుతుంది. ప్లాన్ తీసుకొని ఉంటే పాలసీదారులు ఇప్పటికే ఈ రెండు ప్లాన్లను కొనుగోలు చేస్తే.. ఆ పాలసీలు అలాగే కొనసాగుతాయని ఎల్ఐసీ ప్రతనిధులు తెలిపారు. కొత్తగా పాలసీ తీసుకునేవారికి మాత్రం అందుబాటులో ఉండవు. -
ఆహార స్వావలంబన విధాన దిశగా...
గత యాభై ఏళ్లలో వన్యప్రాణుల జనాభా సగానికి సగం నశించింది. ఇది పర్యావరణ ప్రళయమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లు వాతావరణ సంక్షోభం, జీవవైవిధ్య వినాశనం అని ‘డబ్ల్యూడబ్ల్యూఎఫ్’ నివేదిక చెబుతోంది. ఇవి మరింత ముదరడానికి ప్రపంచ ఆహార వ్యవస్థే కారణమని కూడా సూచిస్తోంది. దీన్ని బలపరిచే సాక్ష్యం, కుబేరుల జాబితాలోకి ఆహార రంగ వ్యాపారవేత్తలు చేరడం! విరోధాబాస ఏమిటంటే, ఈ సంక్షోభాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత పరిష్కారాలను బడా కంపెనీలు సూచిస్తుండటం! ఆహార భద్రత రైతుల చేతుల్లోంచి ఆహార కంపెనీల బోర్డు రూముల్లో కూర్చునేవారి చేతుల్లోకి మారిపోతోంది. ఈ విపరిణామాలు సంభవించకూడదంటే ఆహార వ్యవస్థ సమూలంగా మారాలి. కొన్నేళ్ల క్రితం నాటి మాట. జర్మనీలోని ఓ నేచర్ రిజర్వ్పై ససెక్స్ యూనివర్శిటీ (యూకే) ఓ అధ్యయనం నిర్వ హించింది. దాని ప్రకారం, ఆ ప్రాంతంలోని క్రిమికీటక సంతతి గణనీయంగా పడిపోయింది. ఎంతగా అంటే... పాతికేళ్ల కాలంలో ఎగిరే కీటకాలు 75 శాతం వరకూ లేకుండా పోయాయి. ఈ పరిణామం ‘పర్యావరణ ప్రళయం’ లాంటిదని శాస్త్రవేత్తలు అభివర్ణించారు. ఈ ఫలితాలకు ఆశ్చర్యపోయిన కొందరు శాస్త్రవేత్తలు కొంచెం ఎక్కువ చేసి చెప్పి ఉంటారని వ్యాఖ్యానించడమే కాకుండా... ఒకవేళ అదే నిజమైతే జీవవైవిధ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని గుర్తు చేసే మేలుకొలుపు అవుతుందని కూడా వ్యాఖ్యా నించారు. ఐదేళ్ల తరువాత... ‘వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్’ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) విడుదల చేసిన ‘లివింగ్ ప్లానెట్ రిపోర్ట్–2022’ కూడా ఇలాంటి బాంబే వేసింది. యాభై ఏళ్ల కాలంలో (1970–2018) వన్యప్రాణుల జనాభాలో దాదాపు సగం నశించిపోయిందని 32 వేల జీవజాతులను విశ్లేషించిన లివింగ్ ప్లానెట్ ఇండెక్స్ తెలిపింది. లాటిన్ అమెరికా ప్రాంతంలో అత్య ధికంగా 94 శాతం జనాభా నశించి పోయింది. మంచినీటిలో బతికే వాటిల్లో 80 శాతం వాటికి నష్టం జరిగింది. ఈ నివేదికలోని ఇతర ఆందోళనకరమైన అంశాలను కాసేపు పక్కనబెడితే భూమి ‘ఆరవ మహా వినాశనం’ ముంగిట్లో ఉందన్న విషయం చాలాకాలంగా తెలుసు. అందుకే ఇది జీవజాతి వినాశనమనీ, మానవ నాగరకతల పునాదులపై జరుగుతున్న దాడి అనీ యూఎస్ నేషనల్ అకాడమి ఆఫ్ సైన్సెస్ పేర్కొనడం అతిశయోక్తి ఏమీ కాదు. నిజానికి డబ్ల్యూడబ్ల్యూఎఫ్ నివేదిక సమాజానికి ఒక షాక్ లాంటిది. కానీ చదువుకున్నవారి చాలామంది మనఃస్థితిని బట్టి చూస్తే, ఈ నివేదిక వారిని ఇసుమంత కూడా కదిలించినట్లు కనపడదు. వీరు చెట్లను అభివృద్ధి నిరోధకాలుగా చూస్తూంటారు. రహదారులు, గనులు, పరిశ్రమల కోసం పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించడం, లేదా కావాల్సినట్టుగా మార్చుకోవడం ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు. పామాయిల్ పంటల కోసం విశాలమైన అటవీ భూములను చదును చూస్తూండటం ఈ ధోరణినే సూచిస్తుంది. అలాగే పచ్చటి అడవులను పప్పుబెల్లాల మాదిరిగా పరాయివారికి పంచేస్తూండటం చూస్తూంటేనే తెలుస్తుంది పర్యావరణానికి మనం ఏమాత్రం మర్యాద ఇస్తున్నామో! ఏటా కోటి హెక్టార్ల నష్టం... ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా మనం సుమారు కోటి హెక్టార్ల అటవీ భూమిని కోల్పోతున్నాం. కానీ ‘సీఓపీ’ చర్చల్లో దీనికి హద్దులు వేయాలన్న అంశంపై ఒక్క తీర్మానమూ జరగదు. ప్రపంచం ఎదు ర్కొంటున్న రెండు అతిపెద్ద సవాళ్లు వాతావరణ సంక్షోభం, జీవ వైవిధ్య వినాశనం అని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ నివేదిక స్పష్టం చేస్తోంది. ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న ఈ రెండు అంశాలు మరింత ముదిరేందుకు ప్రపంచ ఆహార వ్యవస్థ కారణమని కూడా సూచి స్తోంది. ఈ హెచ్చరిక ఉన్నా, వ్యవసాయ రంగంలో మార్పులన్నీ వ్యవసాయం పెద్ద ఎత్తున సాగాలన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సూచించిన విధంగా మాత్రమే మారుతున్నాయి. ‘ద యాక్షన్ గ్రూప్ ఆన్ ఎరోషన్, టెక్నాలజీ అండ్ కాన్సంట్రేషన్ (ఈటీసీ) వంటి అంతర్జాతీయ సంస్థ తయారు చేసిన ఇంకో నివేదిక కూడా ఆహార వ్యవస్థ బిగ్ ఫుడ్, బిగ్ టెక్, బిగ్ ఫైనాన్స్లకు చెందిన కంపెనీల చేతుల్లోకి జారిపోతోందని విస్పష్టంగా తెలిపింది. దీనివల్ల రైతులు, జాలర్ల హక్కులకు భంగం కలిగే ప్రమాదం ఉంది. నేలను విషతుల్యం చేయడం, నీళ్లను విపరీతంగా వాడేయడం, పర్యా వరణాన్ని కలుషితం చేయడం, జీవవైవిధ్యాన్ని నాశనం చేయడం... ఈ క్రమంలో లాభాలు ఆర్జించడమే ఈ బడా కంపెనీల లక్ష్యంగా కనిపిస్తోంది. కరోనా మహమ్మారి కబళించిన రెండేళ్లలోనే అత్యంత కుబేరుల జాబితాలోకి 62 మంది ‘ఆహార కోటీశ్వరులు’ చేరారు. ఈ కాలావధిలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ట్రేడింగ్ కంపెనీ ‘కార్గిల్’ లాభాల వాటాలో 64 శాతం వృద్ధి నమోదైంది. కొన్ని ఇతర ఫుడ్ కంపెనీలు కూడా విపరీతంగా లాభపడ్డాయి. ఈ రెండు నివేదికలూ మన వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో బోధనాంశాలుగా ఉంచాలి. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ నివేదిక చెప్పే విషయానికి వ్యవయాయ రంగంలో జరుగుతున్న వ్యవహారాలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. పలు ఉదాహరణలతో ఇచ్చిన ఈటీసీ నివేదిక... వ్యవసాయం డిజిటలైజ్ అయితే బోలెడంత సమాచారం సేకరించవచ్చుననీ, ఈ సమాచారం కాస్తా మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి పెద్ద కంపెనీల క్లౌడ్ సర్వర్లలోకి చేరిపోయి కొత్తకొత్త బిజినెస్ వ్యూహాల రూప కల్పనకు సిద్ధంగా ఉంటుందనీ చెబుతుంది. ఈ నివేదికను కొంచెం నిశితంగా పరిశీలిస్తే ఇదెలా జరుగుతోందో అర్థమవుతుంది. వాతావరణ మార్పులు, జీవవైవిధ్యంలో తరుగుదల అంశాలను చూపి బడా కంపెనీలు వాటికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన ఆధా రిత పరిష్కారాలు సూచిస్తాయి. జన్యుమార్పిడి పంటలు, హైటెక్ విత్తనాల్లాంటివన్నమాట. డిజిటల్ వ్యవసాయం వల్ల లాభాలంటూ ఊదరగొడతాయి. ఇదే క్రమంలో జీవ వైవిధ్య వనరుల పరిరక్షణ పేరు చెప్పి, కృత్రిమ ఆహారాన్ని మన ముందుంచుతాయి. రైతులు, రైతు కూలీలు కనుమరుగు... డిజిటల్ టెక్నాలజీల వల్ల వ్యవసాయ సామర్థ్యం పెరుగుతుందను కునేరు! డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ పేరుతో ఇప్పుడున్న ఆహార వ్యవస్థ విధ్వంసం మాత్రమే జరుగ నుంది. బడా కంపెనీలవన్నీ తప్పుడు పరిష్కారాలని ఈ నివేదిక ద్వారానే స్పష్టమవుతుంది. డ్రోన్లు, సెన్సర్లు, ఉపగ్రహ సమాచారం, కృత్రిమ మేధల వల్ల... రైతులు, రైతు కూలీలు క్రమేపీ మరుగున పడిపోతారు. డ్రైవర్ల అవసరం లేని ట్రాక్టర్లు, యంత్రీకరణకు అనువైన పొలాలతో బడా టెక్ కంపెనీలు బడా ఆర్థిక సంస్థల సాయంతో రైతులకు అవసరమే లేని కొత్త ప్రపంచాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి. భవిష్యత్తులో ఆహార భద్రత అనేది రైతుల చేతుల్లోంచి ఆహార కంపెనీల బోర్డు రూముల్లో కూర్చునే కొందరి చేతుల్లోకి మారిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా విత్తనాల విక్రయాల్లో 40 శాతాన్ని కేవలం రెండు కంపెనీలు నియంత్రి స్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవవచ్చు. ఈ కంపెనీలు పరోక్షంగా ఆహార సరఫరా వ్యవస్థ మొత్తాన్ని నియంత్రిస్తున్నట్లే లెక్క. ఏం పండించాలి, ఎప్పుడు పండించాలి వంటి అంశాలనూ బడా కంపెనీలే నిర్ణయించే పరిస్థితి వస్తుంది. అంతేకాదు... ఆహార కంపెనీల సహకారంతో చివరకు పంటల కోతలు ఎలా జరగాలి, మనం ఏం తినాలన్నది కూడా నిర్ణయిస్తాయి. ఈ విపరిణామాలన్నీ సంభవించకుండా ఉండాలంటే ప్రపంచ స్థాయిలో ఆహార వ్యవస్థ సమూలంగా మారాల్సి ఉంటుంది. సరికొత్త ఆహార వ్యవస్థకు మారడం కూడా వైవిధ్యత, ఆహార సార్వ భౌమత్వం అంశాల ఆధారంగా సాగాలి. అంతేకాదు... ఇది 360 కోట్ల రైతులు, రైతుకూలీలు, మత్స్యకారుల ఆధ్వర్యంలో జరగాల్సిన మార్పు. జీవ వైవిధ్య పరిరక్షణ, కనీస ఆదాయానికి భరోసా, వాతావ రణ పరంగా వీరికి న్యాయం జరగడం అప్పుడే సాధ్యమవుతుంది. దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
విదేశీ వాణిజ్య విధానం ఆరు నెలలు పొడిగింపు
న్యూఢిల్లీ: ప్రస్తుతమున్న విదేశీ వాణిజ్య విధానాన్ని (2015–20) మరో ఆరు నెలల పాటు, 2023 మార్చి వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ నెల 30తో వాస్తవానికి దీని గడువు ముగియాల్సి ఉంది. పరిశ్రమల సంఘాలు, ఎగుమతి ప్రోత్సాహకాల మండళ్ల నుంచి ప్రస్తుత విధానం కొనసాగింపుపై డిమాండ్లు వస్తున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ అదనపు సెక్రటరీ అమిత్ యాదవ్ తెలిపారు. ప్రస్తుత తరుణంలో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావద్దన్న డిమాండ్లు ఉన్నట్టు చెప్పారు. చదవండి: Ration Card New Rules: కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్ కార్డు కట్! -
ఇదేం బాలేదు.. కొందరి కోసమే గూగుల్ పాలసీ: విన్జో
న్యూఢిల్లీ: ప్లేస్టోర్లో ఎంపిక చేసిన కొన్ని ఫ్యాంటసీ, రమ్మీ గేమింగ్ యాప్స్ను ప్రయోగాత్మకంగా అనుమతించాలన్న గూగుల్ నిర్ణయాన్ని దేశీ గేమింగ్ ప్లాట్ఫాం విన్జో తప్పు పట్టింది. ఇది పూర్తిగా పక్షపాతపూరితమైన, అనుచితమైన, ఆంక్షాపూర్వక విధానమని వ్యాఖ్యానించింది. ప్లాట్ఫాంను తటస్థంగా ఉంచుతూ ఒక మధ్యవర్తిగానే వ్యవహరిస్తామనే గూగుల్ ధోరణిపై అనుమానాలు రేకెత్తుతున్నాయని విన్జో పేర్కొంది. దశాబ్దకాలంపైగా గుత్తాధిపత్యం సాగిస్తున్న కొన్ని సంస్థలకే లబ్ధి చేకూర్చేలా గూగుల్ విధానం ఉందని తెలిపింది. ఇది పోటీని దెబ్బతీయడమే కాకుండా నవకల్పనలకు చావుదెబ్బలాంటిదని విన్జో వ్యాఖ్యానించింది. గతంలో ఫ్యాంటసీ గేమింగ్ యాప్లను ప్లే స్టోర్ నుంచి తొలగించినప్పటికీ సెప్టెంబర్ 28 నుంచి ఎంపిక చేసిన కొన్నింటిని పైలట్ ప్రాజెక్ట్ ప్రాతిపదికన ఏడాది పాటు తిరిగి ప్రవేశపెట్టనున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే విన్జో అభ్యంతరాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చదవండి: అన్నింటికీ ఒక్కటే కేవైసీ -
సామాన్యులకు షాక్, రెపో రేట్లు పెంచనున్న ఆర్బీఐ?
Repo Rate Hike In September Policy: త్వరలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) తీసుకోనున్న నిర్ణయం సామాన్యులకు మరింత భారంగా మారనున్నట్లు తెలుస్తోంది. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రెపో రేట్లను పెంచనున్నట్లు సమాచారం. రిటైల్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ)ఆధారంగా ద్రవ్యోల్బణం ఈ ఏడాది జూలై లో 6.71 శాతం నుండి ఆగస్టు నాటికి 7.0 శాతం నమోదు చేసింది. పెరిగిన ద్రవ్యోల్భణానికి కారణం ఆహారం, ఇంధర పెరుగుదలే కారణమని మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 30న ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) జరగనుంది. ఎంపీసీ సమావేశంలో ఐదు నెలల పాటు ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆర్బీఐ రెపొ రేట్లు 35 - 50 బేసిస్ పాయింట్ల వరకు పెంచనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. రెపో రేటు అంటే ఏమిటి? ఆర్బీఐ..కమర్షియల్ బ్యాంకులకు వడ్డీకి రుణాలు ఇస్తుంది. ఆ రుణాల్ని రెపో రేటు అని పిలుస్తారు. ఆ రెపో రేట్లు పెరగడం వల్ల బ్యాంకులు కస్టమర్లకు ఇచ్చే పర్సనల్, హోం లోన్, వెహికల్ లోన్ల వడ్డీ రేట్లను పెంచుతుంది. దీంతో కస్టమర్లు బ్యాంకులకు చెల్లించే ఈఎంఐ భారం పెరగుతుంది. -
ఖనిజాల అన్వేషణ: ఏఐ, ఆటోమేషన్ను ప్రోత్సహించాలి
న్యూఢిల్లీ: దేశీయంగా వివిధ లోహాలు, ఖనిజాల అన్వేషణ, ఉత్పత్తికి సంబంధించిన విధానాలను సరళీకరించాల్సిన అవసరం ఉందని పారిశ్రామిక దిగ్గజం వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. మన దగ్గర లోహాలు, ఖనిజాల నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం వాటిని దిగుమతి చేసుకునేందుకు భారీగా వెచ్చించాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. స్థానికంగా ఉత్పత్తి పెరిగితే అంతర్జాతీయ సంక్షోభాల ప్రభావం మనపై అంతగా ఉండదని, దేశీయంగా ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు.. గణనీయంగా ఉద్యోగాలు కల్పించేందుకు ఇది తోడ్పడగలదని అగర్వాల్ చెప్పారు. దిగుమతి చేసుకునే ధరలో పావు వంతుకే భారత్లో ముడిచమురును ఉత్పత్తి చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయంగా కమోడిటీల రేట్లు పెరగడం, రూపాయి మారకం విలువ పతనమవడం వంటి కారణాలతో క్రూడాయిల్ తదితర దిగుమతుల భారం పెరిగిన నేపథ్యంలో అగర్వాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇంధనాలు, ఖనిజాల అన్వేషణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వంటి కొత్త టెక్నాలజీల వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. -
విధాన నిర్ణయాల్లో డేటాదే కీలక పాత్ర
ముంబై: విధాన నిర్ణయాల పటిష్టతలో గణాంకాల (డేటా) పాత్ర చాలా కీలకమని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టం చేశారు. తగిన సమాచారంతో విధాన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఫలితాలు మెరుగ్గా ఉంటాయని సూచించారు. ఇందుకు స్పష్టమైన, పారదర్శకమైన డేటా అందుబాటులో ఉండడం అవసరమని అన్నారు. తద్వారా నిర్ణయాధికారుల నుండి తగిన నిర్ణయాలు వెలువడతాయని, మార్కెట్ భాగస్వాములు హేతుబద్ధమైన అంచనాలకు రాగలుగుతారని అన్నారు. సెంట్రల్ బ్యాంక్ వార్షిక ‘స్టాటిస్టిక్స్ డే’ సదస్సులో ఈ మేరకు గవర్నర్ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► పబ్లిక్ పాలసీలో గణాంకాల ప్రాముఖ్యత ఎంతో ఉంది. కోవిడ్–19 మహమ్మారి కారణంగా ఏర్పడిన తీవ్ర అనిశ్చితి నేపథ్యంలో పారదర్శక, పటిష్ట గణాంకాల పాత్ర మరింత పెరిగింది. ► మునుపెన్నడూలేని విధంగా ఏర్పడిన ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు మానవాళి లక్ష్యాలు, దృక్పధాన్ని పరిశోధిస్తోంది. భారత్సహా వివిధ దేశాలలో విధించిన లాక్డౌన్లు... మహమ్మారి వ్యాప్తి, ఆర్థిక వ్యవస్థలపై దాని ప్రభావాలకు సంబంధించిన డేటా లభ్యత విషయంలో క్లిష్టమైన స్థితిని సృష్టించింది. మునుపెన్నడూ చూడని ఈ సమస్యకు అత్యవసరంగా పరిష్కారాలు కనుగొనడం అవసరం. ► డేటా లభ్యత విషయంలో 2020లో మహమ్మారి మొదటి వేవ్ సమయంలో దేశంలో అనేక వస్తువుల ధరల సేకరణలో అపారమైన ఇబ్బందులు నెలకొన్నాయి. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంది. ► అయితే ఈ పరిస్థితి డేటా సేకరణలో నూతన సాంకేతిక విధానాలను అవలంభించే అవకాశాలనూ మహమ్మారి సృష్టించింది. ఈ నూతన విధానాలు దీర్ఘకాలిక ప్రయోజనాలను కలిగి ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే కొత్త డేటా వనరులు అధికారిక గణాంకాల కోసం తాజా అవకాశాలను సృష్టిస్తుండగా, ఇది ఈ విషయంలో డేటా విశ్వసనీయత, క్రమశిక్షణకు సంబంధించిన సమస్యలను కూడా లేవనెత్తుతుండడం మరో ప్రతికూలాంశం. ఈ సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించాల్సి ఉంటుంది. ► సరైన డేటా నాణ్యతకు తగిన ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేయడం, డేటా గోప్యత, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని 2022 ఏప్రిల్లో జరిగిన ‘ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ కాన్ఫరెన్స్’ ఉద్ఘాటించింది. ► విధాన నిర్ణయాలు తీసుకోవడంలో, వాటి ఫలితాలను అంచనా, మదింపు వేయడంలో సెంట్రల్ బ్యాంకులకు గణాంకాలు ఎంతో కీలకం. ఇక్కడ గణాంకాలు సేకరించడం, వాటిని వినియోగించుకోవడం రెండు బాధ్యతలూ సెంట్రల్ బ్యాంకులకు సంబంధించినవే. మహమ్మారి వంటి కల్లోల సమయాల్లో సెంట్రల్ బ్యాంకులు తమ విధానాలు, చర్యల మదింపునకు సంబంధించిన డేటా సమీకరణలో పటిష్టమైన కమ్యూనికేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయా అంశాలకు సంబంధించి ఎదురయిన సవాళ్లనూ సెంట్రల్ బ్యాంకులు మహమ్మారి సమయాల్లో పరిష్కరించుకోవాల్సి వచ్చింది. మహమ్మారి సమయంలో ప్రత్యామ్నాయ సూచీలు, డేటా సమీకరణ వనరులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. భారత్లో అంతర్జాతీయ ప్రమాణాలు ఆర్బీఐ విషయానికి వస్తే, పటిష్ట గణాంకాల సేకరణ, వినియోగ వ్యవస్థలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. డేటా ప్రవాహాన్ని క్రమబద్ధీకరించడంలో ఆర్బీఐ ప్రయత్నాలు, సాంకేతికతపై పెట్టుబడులు, నియంత్రిత సంస్థలతో నిరంతర సంప్రతింపులు మంచి ఫలితాలను అందించాయి. డేటా సర్వే, సేకరణ రీతుల్లో కొంత మార్పుతో పాటు, ఆయా అంశాల్లో మరింత స్థిరత్వం నెలకొల్పడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. డేటా నాణ్యతను నిర్ధారించడానికి పునఃపరిశీలన విధానాలను అవలంభించడం జరుగుతోంది. డేటా సేకరణ, ధ్రువీకరణ, నిర్ణయాల్లో వాటి అనుసంధానం వంటి అంశాల్లో వినూత్న విధానాలకు శ్రీకారం చుట్టాం. ఆయా అంశాల్లో అంతర్జాతీయ ప్రమాణాలను సెంట్రల్ బ్యాంక్ అనుసరిస్తోంది. అంతర్జాతీయంగా మరిన్ని సూచీలు, ఉప సూచీలు, ఇతర గణాంకాలు కూడా ప్రస్తుతం తెరపైకి వచ్చాయి. దేశాలు ఉన్నత జీవన ప్రమాణాలను సాధించడానికి ఆయా సూచీలో ప్రయత్నిస్తున్నాయి. బహుళ కోణాలలో దేశాల పురోగతిని పర్యవేక్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. మానవాభివృద్ధి సూచికలు, హ్యాపీ ఇండెక్స్లు, అసమానత సూచికల వంటివి వాటిని ఈ సందర్భంలో ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. ఆయా సూచీలను ప్రస్తుతం వివిధ జాతీయ– అంతర్జాతీయ సంస్థలు నిర్వహిస్తున్నాయి. వైశాల్యం, భౌగోళిక వైవిధ్యం దృష్ట్యా భారతదేశానికి ప్రాంతీయ అంశాలను సూచించే జాతీయ సూచికల అవసరం ఉంది. రిజర్వ్ బ్యాంక్లో మేము సమాచారాన్ని ’ప్రజా ప్రయోజనకరమైన అంశం’గా పరిగణిస్తాము. వివిధ వాటాదారుల అవసరాలు, అంచనాలకు అనుగుణంగా మన సమాచార నిర్వహణ వ్యవస్థలను క్రమబద్ధం చేయాలని భావిస్తున్నాము. ఆర్బీఐ మరింతగా ప్రత్యామ్నాయ డేటా వనరులపై దృష్టి సారించాలి. ఇప్పటికే ఉన్న డేటా విశ్లేషణాత్మక ఫ్రేమ్వర్క్ విధానాలతో వాటిని అనుసంధించడానికి ప్రయత్నం జరగాలి. -
పీబీ ఫిన్టెక్ ఐపీవో నవంబర్ 1న ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ బీమా ప్లాట్ఫాం పాలసీబజార్, రుణాలకు సంబంధించిన పోర్టల్ పైసాబజార్ల మాతృ సంస్థ పీబీ ఫిన్టెక్ తాజాగా తమ పబ్లిక్ ఇష్యూ వివరాలను ప్రకటించింది. ప్రతిపాదిత ఐపీవో నవంబర్ 1న ప్రారంభమై 3న ముగుస్తుంది. షేరు ధర శ్రేణి రూ. 940–980గా ఉంటుందని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ యశీష్ దహియా వర్చువల్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ ఇష్యూ ద్వారా సుమారు రూ. 5,710 కోట్లు సమీకరించనున్నట్లు తెలిపారు. ఇన్వెస్టర్లు కనీసం 15 షేర్ల కోసం బిడ్ చేయాల్సి ఉంటుంది. ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను తమ బ్రాండ్లకు మరింత ప్రాచుర్యం కల్పించడానికి, వ్యాపార వృద్ధి అవకాశాలు మెరుగుపర్చుకోవడానికి, ఆఫ్లైన్లో కూడా విస్తరించడానికి వినియోగించుకోనున్నట్లు దహియా పేర్కొన్నారు. అలాగే వ్యూహాత్మక పెట్టుబడులు .. కొనుగోళ్లకు, విదేశాల్లోనూ విస్తరణ ప్రణాళికల కోసం కూడా కొంత మేర నిధులు ఉపయోగించుకోనున్నట్లు ఆయన వివరించారు. ఇష్యూలో భాగంగా కొత్తగా రూ. 3,750 కోట్ల విలువ చేసే షేర్లను జారీ చేయనుండగా, ప్రస్తుత షేర్హోల్డర్లు దాదాపు రూ. 1,960 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో విక్రయించనున్నారు. ఇష్యూలో భాగంగా 75 శాతం భాగాన్ని అర్హత గల సంస్థాగత ఇన్వెస్టర్లకు, 15 శాతాన్ని సంస్థాగతయేతర ఇన్వెస్టర్లకు, 10 శాతాన్ని రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించనున్నారు. -
త్వరలో కొత్త సహకార విధానం
న్యూఢిల్లీ: దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్య సాధనలో సహకార సంఘాలు కూడా కీలకపాత్ర పోషించనున్నాయని కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షా తెలిపారు. కేంద్రం త్వరలో కొత్త సహకార విధానాన్ని ప్రకటిస్తుందనీ, సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. వచ్చే అయిదేళ్లలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీ)ల సంఖ్య 65 వేల నుంచి 3 లక్షలకు పెరగనుందన్నారు. దేశంలో ప్రస్తుతం ప్రతి 10 గ్రామాలకు ఒక పీఏసీ ఉండగా రానున్న అయిదేళ్లలో ప్రతి రెండు గ్రామాలకు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తామన్నారు. జాతీయ సహకార యూనివర్సిటీ ఏర్పాటుతోపాటు ప్రభుత్వం సహకార ఉమ్మడి సేవా కేంద్రాల(కోఆపరేటివ్ కామన్ సర్వీస్ సెంటర్లు)ను, జాతీయ డేటాబేస్ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు చెప్పారు. సహకార వ్యవస్థలు రాష్ట్రాల పరిధిలోనే కొనసాగుతాయని, ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎటువంటి ఘర్షణకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. మల్టీ స్టేట్ కోఆపరేటివ్స్ చట్టాన్ని సవరించడంతోపాటు పీఏసీలను ఆధునీకరించి, డిజిటలైజ్ చేస్తామన్నారు. పీఏసీల అకౌంట్ల కంప్యూటరీకరణలో స్థానిక భాషలను వినియోగించుకోవడతోపాటు జిల్లా సహకార బ్యాంకులతో, నాబార్డుతో అనుసంధానం చేస్తామన్నారు. పీఏసీలు రైతు ఉత్పత్తి సంస్థ(ఎఫ్పీవో)లుగా, సభ్యుల నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారిస్తాయని తెలిపారు. జాతీయ సహకార సమ్మేళనం మొట్ట మొదటి సమావేశంలో అమిత్ షా శనివారం ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి వివిధ సహకార సంఘాలకు చెందిన 2,100 మంది ప్రతినిధులు హాజరు కాగా, సుమారు మరో 6 కోట్ల మంది ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. చదవండి: న్యాయమూర్తులకు నైతికతే కీలకం -
ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేవారికి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్!
హైదరాబాద్: ఏటా లక్షల్లో పెరుగుతున్న వాహనాలు.. పరిమిత సంఖ్యలో పెట్రోల్, డీజిల్ వనరులు.. దీనికి తోడు విజృంభిస్తున్న వాహన కాలుష్యం.. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు కనిపిస్తున్న ప్రత్యామ్నాయం.. విద్యుత్ వాహనాలు. అందుకే ప్రపంచం మొత్తం ప్రస్తుతం విద్యుత్ వాహన(ఎలక్ట్రిక్ వెహికల్స్-ఈవీ) తయారీ రంగంపై దృష్టి సారిస్తోంది. (చదవండి: ఐటీ ‘రిటర్న్స్’ విషయంలో జర జాగ్రత్త..!) తెలంగాణ రాష్ట్రాన్ని విద్యుత్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజీ వ్యవస్థకు కేంద్ర బిందువుగా మార్చేందుకు ప్రభుత్వం ‘తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్, ఎనర్జీ స్టోరేజీ పాలసీ 2020–2030’ని రూపొందించింది. గత ఏడాది ఈ పాలసీని తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. ఈవీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణ, పరిశోధన, అభివృద్ధి, తయారీకి ప్రోత్సాహం, వ్యక్తిగత, వాణిజ్య రంగాల్లో రవాణా ఖర్చు తగ్గింపు, ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పదేళ్ల పాటు కొత్త పాలసీ పనిచేస్తుంది. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలను కొన్న వారికి ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఎలక్ట్రిక్ అండ్ ఎనర్జీ స్టోరేజీ పాలసీ 2020-2030 కింద రాష్ట్రంలో ఎలక్ట్రిక్, బ్యాటరీ (ఈవీ) వాహనాలను ప్రోత్సహించడానికి రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ ట్యాక్స్ పూర్తిగా మాఫీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో జోరందుకున్న ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు. pic.twitter.com/StgeBHEUd6 — TRS Party (@trspartyonline) September 3, 2021 నూతన విధానంలోని ముఖ్యాంశాల్లో కొన్ని.. తొలి విడతలో తయారయ్యే రెండు లక్షల ద్విచక్ర వాహనాలు, 30 వేల ఆటో రిక్షాలు, 5వేల కార్లు (టాక్సీలు, క్యాబ్లు తదితరాలు), 500 ఎలక్ట్రిక్ బస్సులకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ చార్జీ వంద శాతం ఉచితం. వాణిజ్య అవసరాల కోసం ఉపయోగించే విద్యుత్ వాహనాల కొనుగోలుకు స్వయం ఉపాధి పథకాల కింద ఆర్థిక సాయం. విద్యుత్ ట్రాక్టర్లకు రవాణా శాఖ నిబంధనలకు లోబడి వంద శాతం రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు. నగరం నలుమూలల నుంచి హైదరాబాద్ మెట్రో స్టేషన్లకు బ్యాటరీ ఆధారిత వాహనాలు నడపడం. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో హైదరాబాద్తో పాటు ఇతర నగరాల్లో దశల వారీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు. వీటికి విద్యుత్ నియంత్రణ కమిషన్ ప్రత్యేక టారిఫ్ వసూలు చేస్తుంది. చార్జింగ్ స్టేషన్లు ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయాన్ని టీఎస్ రెడ్కో మదింపు చేస్తుంది. అవసరమైన విద్యుత్ సరఫరాపై డిస్కమ్లతో సమన్వయం చేస్తుంది. వేయికి పైగా కుటుంబాలు కలిగిన టౌన్షిప్లు చార్జింగ్ స్టేషన్ లాట్లు ఏర్పాటుకు ప్రోత్సాహం. ప్రతీ 50 కిలోమీటర్లకు ఒక చార్జింగ్ స్టేషన్, పార్కింగ్ జోన్ ఏర్పాటు. ప్రజా రవాణా రంగంలో ఎలక్ట్రిక్ వాహన వినియోగానికి ప్రోత్సహించడం. విద్యుత్ వాహనాలు, సంబంధిత పరికరాలు తయారు చేసే కంపెనీలకు ప్రోత్సాహకాలు. రూ.200 కోట్ల పెట్టుబడి, వేయి మందికి ఉపాధి కల్పించే మెగా కంపెనీలకు 20శాతం పెట్టుబడి రాయితీ. ఏడేళ్ల పాటు ఏడాదికి రూ.5 కోట్ల చొప్పున ఎస్జీఎస్టీ రీయింబర్స్మెంట్, ఐదేళ్ల పాటు గరిష్ఠ పరిమితి రూ.5 కోట్లు మించకుండా 25శాతం విద్యుత్ రాయితీ, ఐదేళ్ల పాటు విద్యుత్ సుంకం, స్టాంప్ డ్యూటీపై వంద శాతం రాయితీ. ప్రత్యేక మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లు, ఈవీ తయారీ పారిశ్రామికవాడల్లో మౌలిక వసతులు కల్పిస్తారు. ప్రభుత్వ శాఖల ద్వారా ఈవీల కొనుగోలు, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు, టీ వర్క్స్లో ప్రత్యేక ప్రోటోటైపింగ్ విభాగం ఏర్పాటు వంటివి నూతన పాలసీలో ఉన్నాయి. -
ముగ్గురు బిడ్డల విధానానికి చైనా ఆమోదం
బీజింగ్: చైనాలో ముగ్గురు బిడ్డల విధానానికి చైనా జాతీయ అసెంబ్లీ సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. దేశ జనాభాలో వస్తున్న మార్పులను గుర్తించిన చైనా కమ్యూనిస్టు పార్టీ ఈ ముగ్గురు బిడ్డల విధానానికి పచ్చజండా ఊపింది. దేశంలో జనన రేటు విపరీతంగా క్షీణిస్తూ వస్తోన్న తరుణంలో రివైజ్డ్ పాపులేషన్ అండ్ ఫామిలీ ప్లానింగ్ లాకు ఎన్పీసీ(నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్)కు చెందిన స్టాండింగ్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. త్వరలో దీన్ని ఎన్పీసీలో చర్చకు పెట్టి అధికారికంగా అమలు చేస్తారు. ఈ చట్టం ప్రకారం చైనా దంపతులు ఎక్కువ మంది పిల్లలను కంటే వారికి ప్రభుత్వం ఆర్థిక, సామాజిక సాయం అందింస్తుంది. పెరిగిపోతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకొని చైనా యువత పిల్లలపై ఆసక్తి చూపడం లేదు. దీంతో జననాల రేటు బాగా తగ్గింది. ఈ పరిస్థితి చక్కదిద్దేందుకే కొత్త చట్టం తెచ్చారు. పిల్లల పెంపకం వల్ల అయ్యే అదనపు ఖర్చును భరించడంలో, వారి విద్యాభ్యాస వ్యయంలో ప్రభుత్వం తల్లిదండ్రులకు మద్దతునిస్తుంది. అలాగే వారి పన్నులు, బీమా పథకాలు, ఇల్లు, ఉపాధి అంశాల్లో కూడా అండగా నిలుస్తుంది. మేలో పాలక కమ్యూనిస్టు పార్టీ రెండు బిడ్డల విధానం నుంచి మూడు బిడ్డల విధానానికి ఆమోదం పలికింది. అనంతరం ఈ నిర్ణయంపై స్టాండింగ్ కమిటీ చర్చించింది. వికటించిన వన్ ఛైల్డ్ విధానం గతంలో చైనాలో విపరీతంగా జనాభా పెరగడంతో కచ్ఛితమైన జనాభా నియంత్రణను అవలంబించారు. వన్ ఛైల్డ్ విధానంతో క్రమంగా చైనా జనన రేటు తగ్గుతూ వచ్చింది. ఈ తరుగుదల ప్రమాదకర స్థాయికి చేరడంతో 2016లో ఇద్దరు పిల్లల విధానం తీసుకువచ్చారు. అయినా జనన రేటు తరుగుదల ఆశించినంతగా మెరుగుపడకపోవడం, మరోవైపు 60ఏళ్ల పైబడిన జనాభాలో వృద్ధి వేగమవడంతో తాజాగా ముగ్గురు పిల్లల విధానం తెచ్చారు. చైనాలో పిల్లల పెంపకం చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. అందువల్ల ఎక్కువమంది ఒకరికి మించి పిల్లల కోసం యత్నించడం లేదు. దీన్ని చక్కదిద్దాలంటే దంపతులకు పుట్టే ప్రతి కొత్త బిడ్డకు ఏడాదికి దాదాపు పది లక్షల యువాన్లు ఇవ్వాలని ఆర్థికవేత్తలు ప్రభుత్వానికి సూచించారు. కొత్తగా తెచ్చిన ముగ్గురు పిల్లల విధానంతో కొంత మెరుగుదల ఉండొచ్చని, కానీ ప్రత్యక్ష నగదు సాయం లేకుండా ఆశించిన ఫలితాలు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. చైనాలో జనాభా తరుగుదల కారణంగా 2027 నాటికి జనాభా పరంగా చైనాను భారత్ దాటేస్తుందని ఐరాస అంచనా వేసింది. చైనా నిపుణులు సైతం 2027నుంచి చైనా జనాభాలో తరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. చైనా మహిళా జనాభాలో ఫెర్టిలిటీ రేటు సైతం వరుసగా పడిపోతూ వస్తోంది. 2025కు చైనా జనాభా వృద్ధిలో నెగిటివ్ గ్రోత్ ఉంటుందని చైనా పీపుల్స్ బ్యాంక్ సైతం అభిప్రాయపడింది. దీనివల్ల వినియోగ డిమాండ్ తగ్గిపోతుందని, ఇందుకునుణంగా విధాన నిర్ణయాలుండాలని సూచించింది. ప్రభుత్వం తన విధానాలు సమీక్షించుకోకపోతే 2050 నాటికి దేశంలో వృద్ధుల పరిరక్షణకు అమెరికా కన్నా ఎక్కువ వ్యయం చేయాల్సివస్తుందని హెచ్చరించింది. ప్రభుత్వ జోక్యం లేకపోతే జనాభా తరుగుదల తాలుకు ఆర్థిక విపరిణామాలను వెనక్కు తిప్పలేమని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ హెచ్చరికల ఫలితంగా ప్రభుత్వం క్రమంగా జనాభా విధానాలను సడలిస్తూ వస్తోంది. -
అవి చట్టాలు కాదు.. ఉరుములు లేని పిడుగులు
సాక్షి,సూర్యాపేట(నల్లగొండ): కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలు ఉరుములు లేని పిడుగుల లాంటివని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రైతాంగాన్ని కూలీలుగా మార్చేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. రైతన్న సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించి నటించిన ఆర్.నారాయణమూర్తి గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీష్రెడ్డితో భేటీ అయ్యారు. రైతన్న సినిమాను థియేటర్కు వెళ్లి చూడడంపై మంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. రైతు చట్టాలతో పాటు విద్యుత్ చట్టంలో సవరణలను ఉటంకిస్తూ కళ్లకు కట్టినట్లుగా రైతన్న సినిమా ఉందని అన్నారు. అనంతరం ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ చట్టాలు రైతుల పాలిట శాపాలుగా మారబోతున్నాయన్నారు. విద్యుత్ సవరణ చట్టం కూడా కార్పొరేట్ వ్యవస్థకు లబ్ధి్ద చేకూర్చేందుకేనన్నారు. సవరణ అంటూ జరిగితే ఉచిత విద్యుత్కు మంగళం పాడినట్లేనని ఆయన చెప్పారు. -
తుక్కుకు ఓ లెక్కుంది... ప్రభుత్వ కొత్త పాలసీ ఇదే
స్క్రాపేజ్లో పది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. సరికొత్త స్టార్టప్లు ఈ రంగంలో వెలుస్తాయని, ముఖ్యంగా దేశంలో ఉన్న మధ్యతరగతికి ఈ పాలసీ వల్ల మేలు జరుగుతుందన్నారు. గుజరాత్ పారిశశ్రామికవేత్తలతో జరిగిన వర్చువల్ సమావేశంలో స్క్రాప్ పాలసీకి సంబంధించిన విషయాలను ఆయన వెల్లడించారు. - స్క్రాప్ పాలసీ ప్రకారం కమర్షియల్ వెహికల్స్కి 15 ఏళ్లు, ప్యాసింజర్ వెహికల్స్కి 20 ఏళ్లు దాటితే తుక్కుగా పరిగణిస్తారు. ఈ కాలపరిమితి దాటిన వాహనాల గుర్తింపు ఆటోమేటిక్గా రద్దు అవుతుంది. - 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాల( 4 వీల్ ఆపై)ను తుక్కుగా పరిగణిస్తారు - ప్రభుత్వ గుర్తింపు పొందిన సెంటర్లలో వాహనాల ఫిట్నెస్ తనఖీ చేయించాలి. కాలపరిమితి తీరిన వాహనాలను తుక్కుగా ఎక్కడైనా అమ్మేయవచ్చు. - తుక్కుకు నగదు చెల్లించడంతో పాటు తమ పాత వాహనాన్ని తుక్కు కింద అమ్మేసినట్టు చూపిస్తే కొత్త వాహనం కొనుగోలులో 6 శాతం వరకు తగ్గింపు వర్తిస్తుంది. - తక్కుగా అమ్మినట్టు ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లో 5 శాతం రాయితీ లభిస్తుంది స్టార్టప్లు రావాలి కాలుష్యాన్ని తగ్గించే పనిలో భాగంగా కాలపరిమితి నిండిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు తెచ్చిన కొత్త పాలసీలో మెరుగైన అవకాశాలు ఉన్నాయని మోదీ అన్నారు. ఇకపై నిరుపయోగంగా ఉన్న వాహనాల్ని దశల వారీగా తగ్గించాలన్నారు. ఈ పని చేసేందుకు స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేయాంటూ యువతను ఆయన ఆహ్వానించారు. వెహికల్ స్క్రాపేజ్ పాలసీ మధ్య తరగతి కుటుంబాలకు అండగా నిలుస్తుందని మోదీ అన్నారు. తుక్కు తనిఖీ కేంద్రాల ఏర్పాటు, రీసైక్లింగ్ తదితర విభాగాల్లో కొత్తగా 50 వేల వరకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని ప్రధాని అన్నారు. అనంతరం కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. స్క్రాపేజ్ పాలసీ వల్ల రా మెటిరియల్ కాస్ట్ 40శాతం తగ్గుతుందని, దీనివల్ల ఇండియా ఆటోమోబైల్ మ్యాన్ఫ్యాక్చరింగ్ సెక్టార్కి మనదేశం ఇండస్ట్రియల్ హబ్గా మారుతుందన్నారు. వెహికల్ స్క్రాపేజ్ పాలసీ ప్రారంభం ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలో వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం, ఆర్ధిక ప్రయోజనాలతో పాటు ఉపాధి కల్పన దిశగా వెహికల్ స్క్రాపేజ్ పాలసీని ప్రతిపాదించారు.ఈ పాలసీ వల్ల దేశంలో నిరుపయోగంలో ఉన్న వాహనాలు తుక్కుగా మారిపోన్నాయి. దేశంలో ప్రస్తుతం ఉన్న 20 ఏళ్లు దాటిన 51 లక్షల వాహనాలు, 15 ఏళ్లు దాటిన 34 లక్షల వాహనాలు తుక్కుగా మారుతాయి. దీని వల్ల 25 శాతం వాహన కాలుష్యం తగ్గుతుంది. స్క్రాప్ చేసిన వాహనాలు రీసైకిల్ చేసిన తరువాత ముడి పదార్థాలను అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి : ఇకపై ఎంచక్కా..ఫ్లైట్ జర్నీలోనే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు -
ఈ–కామర్స్ అనుచిత విధానాలకు కళ్లెం
రాజ్యసభలో.. సాక్షి, న్యూఢిల్లీ: ఈ–కామర్స్ అనుచిత వ్యాపారం విధానంపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని సంబంధిత ప్రభుత్వ విభాగాలను కోరినట్లు కేంద్రం తెలిపింది. ఈ–కామర్స్ కంపెనీల అనుచిత వ్యాపార విధానాలకు కళ్లెం వేయడానికి వినియోగదారుల సంరక్షణ నిబంధనలను మరింత కఠినతరం చేయబోతున్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి సోమ్ప్రకాశ్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. వినియోగదారుల పరిరక్షణ (ఈ–కామర్స్) నిబంధనల సవరణకు ముందుగా వ్యాపారవర్గాల సలహాలు, సూచనలు కోరినట్లు చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ పథకం కింద గత ఏడాది మే, జూన్ నెలల్లో వలస కార్మికులు, వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుక్కున్న వలస కార్మికులు, రేషన్కార్డులు లేనివారికి ఉచితంగా పంపిణీ చేసేందుకు 8 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను వివిధ రాష్ట్రాలకు కేటాయించినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీశాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి జవాబిచ్చారు. 2015–16 నుంచి కేంద్ర ప్రభుత్వం సేంద్రియ సాగును ప్రోత్సహిస్తోందని, పంట దిగుబడి నుంచి సర్టిఫికేషన్, మార్కెటింగ్ వరకు రైతులకు సహకరిస్తోందని ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో 6 వేల సముద్రపు పాచితెప్పలు, 1,200 ట్యూబ్నెట్లు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు రూ.1.86 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించిందని వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వేజోన్, రాయగఢ డివిజన్ పనులకు రూ.170 కోట్లు అవుతుందని అంచనా వేయగా, 2021–22 బడ్జెట్లో రూ.40 లక్షలు కేటాయించినట్లు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు జవాబుగా రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ చెప్పారు. లోక్సభలో.. సెప్టెంబర్ కల్లా మంగళగిరి ఎయిమ్స్ పూర్తి మంగళగిరి ఎయిమ్స్ సెప్టెంబర్కల్లా పూర్తవుతుందని కేంద్రం తెలిపింది. ఈ ఎయిమ్స్కు రూ.1,618 కోట్లు మంజూరుకాగా రూ.922.01 కోట్లు విడుదల చేశామని, రూ.880.15 కోట్లు ఖర్చయిందని వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి భారతి పవార్ చెప్పారు. దేశంలో 26 మిలియన్ హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని పునరుద్ధరిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీలు మిథున్రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్లుగా మలేరియా మరణాల్లేవని వైఎస్సార్సీపీ ఎంపీ ఎన్.రెడ్డెప్ప అడిగిన ప్రశ్నకు జవాబుగా కేంద్ర ఆరోగ్యమంత్రి మాన్సుఖ్ మాండవీయా చెప్పారు. ఆయుష్–64 సాంకేతికతను దేశవ్యాప్తంగా 37 సంస్థలకు బదిలీ చేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీలు ఆదాల ప్రభాకర్రెడ్డి, బెల్లాన చంద్రశేఖర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. కోవిడ్–19 నివారణ చర్యల్లో భాగంగా గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్కు రూ.459.78 కోట్లు విడుదల చేసినట్లు ఎంపీలు వంగా గీత, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి, మన్నె శ్రీనివాస్రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. -
ఈ–వాహనాలకు ఆకర్షణీయమైన సబ్సిడీలు
ముంబై సెంట్రల్: రాష్ట్రంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈ–వాహనాలు) ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు నూతన ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పాలసీని అమలు చేయడం ప్రారంభించింది. ఈ కొత్త విధానంలో భాగంగా, ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి సబ్సిడీలు ఇవ్వనుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి రూ. 15 వేలు, నాలుగు చక్రాల వాహనాలు(ఫోర్ వీలర్స్)కొనేవారికి ఒక లక్ష రూపాయల వరకు సబ్సిడీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2021 డిసెంబర్ 31వ తేదీ లోపు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసినట్లయితే కొనుగోలుదారులకు అదనంగా మరో రూ. 10 వేల నుంచి రూ. 50 వేల వరకు అదనపు సబ్సిడీ లభిస్తుందని దీనిపై అవగాహన ఉన్న కొందరు అధికారులు తెలిపారు. ఏ కంపెనీకి చెందిన వాహనాలను కొనుగోలు చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఈ సబ్సిడీ అందించనుంది. రాబోయే నాలుగు సంవత్సరాలలో రాష్ట్రంలోని మొత్తం వాహనాల్లో పది శాతం ఎలక్ట్రిక్ వాహనాలే ఉండేలా నూతన ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పాలసీని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ నూతన విధానం ప్రకారం ముంబై, పుణె, నాగ్పూర్, ఔరంగాబాద్, అమరావతి, నాసిక్ లాంటి నగరాల్లో నడిచే మొత్తం పబ్లిక్ వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను 25 శాతం వరకు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం 2025 వరకు రాష్ట్రంలోని ఏడు నగరాల్లో 2,500 ఛార్జింగ్ సెంటర్లను నెలకొల్పాలని అనుకుంటోంది. అంతేగాక, వచ్చే ఏప్రిల్ నుంచి కేవలం విద్యుత్ వాహనాలు మాత్రమే కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డీజిల్, పెట్రోల్ ధరలతో పోల్చితే విద్యుత్ ధర చాలా తక్కువ. అంతేగాక ఈ ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణానికి ఏ మాత్రం హాని కలిగించవు. దీంతో అనేక మంది వినియోగదారులు సైతం ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు అందించే ప్రోత్సాహాకాల్లో భాగంగా రాబోయే ఆరు నెలల్లో కొనుగోలు చేసే లక్ష వాహనాలకు 25 వేల వరకు సబ్సిడీ లభించనుంది. మొదటి పది వేల నాలుగు చక్రాల వాహనాల కొనుగోలుపై రూ. 2 నుంచి రూ. 2.5 లక్షల వరకు సబ్సిడీ దక్కనుంది. రిక్షా, గూడ్స్ వాహనాలు, టెంపో లాంటి వాహనాల కొనుగోలుపై కూడా ప్రభుత్వం ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు ప్రకటించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఈ ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం ప్రత్యేక సబ్సిడీలను ప్రకటించింది. స్లో చార్జింగ్, ఫాస్ట్ చార్జింగ్ విభాగాల్లో రూ. 10 వేల నుంచి రూ. 5 లక్షల వరకు సబ్సిడీ ఉండనుంది. స్లో చార్జింగ్లో వాహనాలు 6 నుంచి 8 గంటల్లో, ఫాస్ట్ చార్జింగ్లో 2 నుంచి 3 గంటల్లో చార్జింగ్ పూర్తి చేసుకుంటాయి. కాగా, ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ నూతన ఎలక్ట్రిక్ వాహనాల విధానాన్ని మహారాష్ట్ర ఫిక్కీ, ఈ–వాహనాల విభాగ టాస్క్ఫోర్స్ సభ్యురాలు సులజ్జ ఫిరోదియా–మోట్వాణీ, మరాఠా చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్ విభాగ ఉపాధ్యక్షుడు దీపక్ కరండీకర్ స్వాగతించారు. -
మీకు ఎంత జీవిత బీమా అవసరం..! ఇలా తెలుసుకోండి...
కోవిడ్-19 మహమ్మారి రాకతో చాలా మంది జీవితాలు చిద్రమైపోయాయి. కరోనా చూపిన ప్రభావం చాలా మంది జీవితాలను నాశనం చేసింది. కరోనా మహమ్మారితో చనిపోయిన వారి కుటుంబాల్లో బీమా పాలసీలు తీసుకున్న వారికి కాస్త ఉపశమనం కల్గింది. కాగా కరోనా రాకతో ఇప్పుడు చాలా మంది పాలసీలను తీసుకోవడానికి సన్నద్దమవుతున్నారు. ఏలాంటి పాలసీలను తీసుకోవాలనే సందిగ్ధంలో నెలకొని ఉన్నారా..! అయితే ఇది మీకోసమే. ఎజెంట్లు చెప్పే మాయమాటలకు నమ్మకుండా మీ సొంతంగా ఏ పాలసీ మీకు సరిపోతుందో తెలుసుకోండి. బీమా తీసుకోవడంతో అనుకొని దురదృష్టకర సంఘటనల నుంచి మనల్ని మనం కాస్త కాపాడుకున్నా వాళ్లం అవుతాం. మీ జీవిత బీమాను తెలసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. జీవిత బీమా ముందుగా మీకు వచ్చే వార్షిక ఆదాయంపై ఆధాపడి ఉంటుంది. అంతేకాకుండా మీ ప్రస్తుత వయసు, పదవీ విరమణ పొందే వయసుపై కూడా ఆధారపడి ఉంటుంది. ఎంత తక్కువ వయసులో పాలసీ తీసుకుంటే అంతా మంచింది. మీకు ఎంత బీమా అవసరం.. అనే అంచనాలను ఇలా వేయండి. మీరు తీసుకునే వ్యక్తిగత జీతం నుంచి మీ వ్యక్తిగత ఖర్చులను తగ్గించడం ద్వారా మీ కుటుంబ నెలవారీ గృహ ఆదాయానికి మీరు ఎంతవరకు సహకరిస్తారో లెక్కించండి. మీ కుటుంబానికి మీరు రిటైర్మెంట్ అయ్యే లోపు ఎంతమేరకు ఆదాయాన్ని సంపాదిస్తారో లెక్కించండి. రిటైర్మెంట్లోపు వచ్చే ఇంక్రిమెంట్లతో సహా మొత్తాన్ని లెక్కించండి. మీరు ఆశించే మొత్తం ఆదాయం ప్రస్తుత విలువను కనుగొనండి. అంతేకాకుండా మారుతున్న కాలానికి తగ్గట్లుగా పాలసీలను ఎంపిక చేసుకోవడం మంచింది. జీవిత బీమాలు, ఆరోగ్య బీమాలు వేరవేరుగా ఉంటాయి. ఆరోగ్య బీమా పాలసీని ఎంత మొత్తానికి తీసుకోవాలో నిర్ణయించుకునే ముందు వయసు ను పరిగణలోకి తీసుకోవడం మర్చిపోవద్దు. ఎంత చిన్న వయసు లో పాలసీ తీసుకుంటే అంత మంచిది. ఆరోగ్య బీమాలను ప్రతి సంవత్సరం 10 నుంచి 15 శాతం పెంచుకుంటూ వెళ్లాలి. ఫామిలీ ఫ్లోటర్ పాలసీ ద్వారా మొత్తం కుటుంబాన్ని ఆరోగ్య బీమా పరిధి లోకి తీసుకురావచ్చు. కుటుంబం లోని ప్రతి వ్యక్తికీ వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం కన్నా..ఒకే పాలసీ తో అందరికి బీమా రక్షణ కల్పించడం ఉత్తమమైన మార్గం. -
యులిప్లకు మళ్లీ ఆదరణ
న్యూఢిల్లీ: యూనిట్ ఆధారిత బీమా పథకాలకు (యులిప్/ఈక్విటీలతో కూడిన) ఇన్వెస్టర్ల నుంచి మళ్లీ ఆదరణ పెరిగింది. కరోనా సంక్షోభ సమయంలో యులిప్ల్లో పెట్టుబడులు పెరిగినట్టు బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. యులిప్లలో పెట్టుబడుల నిర్వహణ సౌకర్యంగా ఉండడం కారణమని ఈ సంస్థ పేర్కొంది. సర్వే వివరాలను శుక్రవారం విడుదల చేసింది. ప్రతీ ముగ్గురిలో ఇద్దరు రానున్న సంవత్సరంలో యులిప్లలో ఇన్వెస్ట్ చేసే ఉద్దేశ్యంతో ఉన్నట్టు సర్వేలో చెప్పారు. కరోనా మొదటి దశ తర్వాత యులిప్ల పట్ల తమకు ఇష్టం పెరిగినట్టు 92 శాతం మంది చెప్పారు. యులిప్ ప్లాన్లు ఒకవైపు జీవిత బీమా రక్షణ కల్పిస్తూ, మరోవైపు ఈక్విటీ, డెట్ సాధనాల్లో పెట్టుబడులకు వీలు కల్పిస్తుంటాయి. ప్రీమియంలో కొంత బీమా రక్షణకు పోగా, మిగిలిన మొత్తాన్ని పాలసీదారు ఎంపిక చేసుకున్న సాధనాల్లో బీమా సంస్థ పెట్టుబడులు పెడుతుంది. నీల్సన్ ఐక్యూ సాయంతో బజాజ్ అలియాంజ్ లైఫ్ ఈ సర్వే నిర్వహించింది. మెట్రో, నాన్ మెట్రోల్లో 499 మంది నుంచి అభిప్రాయాలు స్వీకరించింది. ‘‘యులిప్లలో పెట్టుబడుల పురోగతిని సమీక్షించుకోవడం సులభంగా ఉంటుంది. వ్యయాలు తక్కువగా ఉంటాయి. రైడర్ లేదా టాపప్ జోడించుకోవడం, నిధులను వెనక్కి తీసుకోవడం సులభం’’ అని సర్వే తెలిపింది. ఆకర్షించే సదుపాయాలు.. మధ్యాదాయ వర్గాల వారు యులిప్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణకు వీలుండడాన్ని ఇష్డపడుతున్నారు. 21–30 సంవత్సరాల్లోని వారు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్/క్రమానుగత పెట్టుబడుల సాధనం) రూపంలో యులిప్లలో ఇన్వెస్ట్ చేసేందుకు సుముఖంగా ఉన్నారు. అదే 50 ఏళ్లకు పైన వయసులోని వారు యులిప్లో ఒకే విడత (సింగిల్ప్రీమియం) ఇన్వెస్ట్ చేసే ఆప్షన్ను ఇష్టపడుతున్నారు. రూపాయి ఖర్చు లేకుండానే యులిప్లలో పెట్టుబడులను ఒక విభాగం నుంచి మరో విభాగానికి మార్చుకునే సదుపాయం కూడా ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది. మ్యూచువల్ ఫండ్స్లో ఈ సౌకర్యం లేదు. ఎక్కువ మందికి నచ్చే అంశం బీమా రక్షణకుతోడు, పెట్టుబడుల అవకాశం ఉండడం. అన్ని వర్గాలకూ నచ్చే సాధనం.. ‘‘అన్ని రకాల వయసులు, ఆదాయ వర్గాలు, భౌగోళిక ప్రాంతాల్లోనూ యులిప్ల పట్ల ఆదరణ ఉన్నట్టు ఈ సర్వే రూపంలో తెలుస్తోంది. దీర్ఘకాలంలో మెరుగైన రాబడులకు అవకాశం ఉండడంతోపాటు, పెట్టుబడుల్లో సౌకర్యం, బీమా రక్షణ, ఉపసంహరణకు వీలు ఇవన్నీ యులిప్ల కొనుగోలుకు దారితీసే అంశాలు’’ అని బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ ముఖ్య మార్కెటింగ్ అధికారి చంద్రమోహన్ మెహ్రా తెలిపారు. తమ దీర్ఘకాల లక్ష్యాలకు బీమా ప్లాన్లు కూడా ప్రాధాన్య సాధనంగా ఎక్కువ మంది పరిగిణిస్తున్నట్టు ఆయన చెప్పారు. -
H1-B, వీసాల తిరస్కరణ: భారీ ఊరట
వాషింగ్టన్: ముందస్తు నోటీసు ఇవ్వకుండా వీసాలను అధికారులు తిరస్కరించేందుకు వీలు కల్పించే ట్రంప్ పాలనా కాలపు విధాన నిర్ణయాన్ని తొలగించనున్నట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ (యూఎస్సీఐఎస్) వెల్లడించింది. ఈ నిబంధన తొలగింపుతో లీగల్ ఇమ్మిగ్రేషన్కు ఉన్న అడ్డంకులు మరింతగా తగ్గనున్నాయి. జోబైడెన్-హారిస్ నేతృత్వంలో తీసుకున్న విధాన చర్యలు దేశ చట్టపరమైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు అనవసరమైన అడ్డంకులను తొలగించడానికి ఉపయోగపడుతుందని యుఎస్సీఐఎస్ డైరెక్టర్ ట్రేసీ రెనాడ్ చెప్పారు. అలాగే ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలకు సంబంధించి వలసదారులపై భారాన్ని తగ్గించాలన్న లక్ష్యానికనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ట్రంప్ 2018లో తెచ్చిన ఈ నిబంధన హెచ్1బీతో సహా ఎల్1, హెచ్2బీ, జే1, జే2, ఎఫ్, ఓ తదితర వీసా అప్లికేషన్లపై పడింది. తాజాగా ఆర్ఈఎఫ్, ఎన్ఓఐడీ నిబంధనలను మారుస్తున్నట్లు, కొన్ని రకాల ఎంప్లాయ్ ఆధరైజేషన్ డాక్యుమెంట్ల కాలపరిమితిని పొడిగిస్తున్నట్లు ఏజెన్సీ తెలిపింది. 2013లో తీసుకువచ్చిన నిబంధనలనే తిరిగి అమలు చేస్తామని, 2018లోతెచ్చిన నిబంధనను తొలగిస్తామని తెలిపింది. తాజా నిర్ణయంతో అప్లికేషన్లలో తప్పులను సవరించుకునే వీలు వీసా దరఖాస్తుదారులకు కలగనుంది. 2018 నిబంధన ప్రకారం ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా వీసాలు తిరస్కరించేందుకు ఏజెన్సీ అధికారులకుఅవకాశం ఉండేది. దీని ప్రభావం పలు ఐటీ కంపెనీల ఉద్యోగులపై పడింది. చట్టపరమైన ఇమ్మిగ్రేషన్ సజావుగా కొనసాగేందుకు తాము తగిన నిర్ణయాలు తీసుకుంటున్నామని హోమ్లాండ సెక్యూరిటీ కార్యదర్శి అలెజాండ్రో తెలిపారు. చదవండి : Petrol Price: రూ.102 దాటేసింది! -
ఏ పీ లో మరింత పారదర్శకంగా ఇసుక పాలసీ
-
పాతబండిపై ఇక కొత్త బాదుడు!
హైదరాబాద్: పాత బండ్లపై కొత్త బాదుడుకు రంగం సిద్ధమవుతోంది. పదిహేనేళ్లు దాటిన వాహనాలను మరోసారి రిజిస్ట్రేషన్ చేసుకొంటే భారీగా హరితపన్ను చెల్లించాల్సిందే. దీనికిగాను అధికారులు త్వరలో విధివిధానాలను ఖరారు చేయనున్నారు. వాహనాల జీవితకాల పన్నులో ఇది మూడోవంతు వరకు ఉండొచ్చని తెలుస్తోంది. వాహన కాలుష్యాన్ని నియంత్రించేందుకు, కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు కేంద్రం ప్రత్యేక పాలసీని తెచ్చింది. స్వచ్ఛందంగా వదులుకొనేవారికి కొత్త వాహనాలపై రాయితీ ఇస్తూనే పాతవాటిని పునరుద్ధరించుకొనేవారికి భారీగా వడ్డించనున్నారు. మొదటి దశలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాహనాలను స్క్రాప్ చేస్తారు. వాటి స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతారు. రెండోదశలో రవాణా, వ్యక్తిగత వాహనాలపై దృష్టి కేంద్రీకరించనున్నారు. ఏడాదికోసారి హరితపన్ను చెల్లించి రిజిస్ట్రేషన్ను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. గ్రేటర్లో 2006 నుంచే హరితపన్ను పాత వాహనాలపై గ్రేటర్లో 2006 నుంచే హరితపన్ను వసూలు చేస్తున్నారు. వాహనాల రద్దీని, కాలుష్యాన్ని తగ్గించేందుకు భూరేలాల్ కమిటీ సిఫారసుల మేరకు రవాణాశాఖ ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇప్పటివరకు రూ. 250–350 వరకు గ్రీన్ట్యాక్స్ చెల్లించి చాలా మంది బండ్లను పునరుద్ధరించుకుంటున్నారు. అయితే ఇది వ్యక్తిగత వాహనాల జీవితకాల పన్నులో మూడోవంతు వరకు విధించడం వల్ల వాహన ధరల శ్రేణికి అనుగుణంగా కనిష్టంగా రూ. 6 వేల నుంచి రూ. లక్ష వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్లో గ్రీన్ట్యాక్స్ విధానాన్నే కేంద్రం దేశమంతా అమలు చేయాలనుకుంటోంది. గ్రేటర్లో 14 లక్షలపైనే... జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 60 లక్షల వరకు వాహనాలు ఉన్నాయి. ఏటా సుమారు 2 లక్షల వాహనాలు కొత్తగా నమోదవుతున్నాయి. వ్యక్తిగత వాహనాలు విస్ఫోటన స్థాయికి చేరుకోగా, ప్రజారవాణా వాహనాల వినియోగం తగ్గుముఖం పడుతోంది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సుమారు 23 లక్షల మేర కాలం చెల్లిన వాహనాలున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల పరిధిలో 14 లక్షల వరకు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. -
కాలుష్యంపై పోరుకు ‘తుక్కు’ సంకల్పం
మెరుగైనది అందిపుచ్చుకోవాలి. తరుగైనది వదిలించుకోవాలి. వాహనాలకు సంబంధించి ఇది అత్యావశ్యం. బీఎస్–1 ప్రమాణాల వాహనంతో పోలిస్తే బీఎస్–6 ప్రమాణాల వాహనం 36 రెట్లు తక్కువ కాలుష్యాన్ని వెదజల్లుతుంది. అలాంటప్పుడు లక్షలాది పురాతన వాహనాలను వదిలించుకోవడమే శరణ్యం. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన స్క్రాపేజీ పాలసీ ముసాయిదా కీలకమైనదేగానీ, ఇంకా ప్రభావవంతమైన ఆలోచనలతో రావాల్సి వుంది. వాహనశ్రేణిని మార్చే బాధ్యత రాష్ట్రాల మీద ఉంచడం ఇందులో లోటు. కొత్త వాహనాలు కొనడానికీ, విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచడానికీ ప్రోత్సాహకాలు కల్పించాల్సి వుంది. విష ఉద్గారాలను తీవ్రంగా తగ్గించుకునే ప్రయత్నం చేస్తేనే కాలుష్య రహిత ప్రపంచాన్ని సాధించుకోగలం. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న స్క్రాపేజ్ విధాన ముసాయిదా ఎట్టకేలకు అందుబాటు లోకి వచ్చింది. వాయుకాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో 20 ఏళ్ల పైబడ్డ వాహనాలను తుక్కు కింద ఇచ్చేసి కొన్ని ప్రోత్సాహకాలతో కొత్త వాహనాల కొనుగోలుకు వీలు కల్పించే ఈ విధానం కీలకమైందే. కానీ ఈ విధానం ద్వారా గరిష్ట ప్రయోజనాలు పొందడం కష్టసాధ్యం. కాలం చెల్లిన వాహనాలను వదిలించుకున్న వారికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలూ, కంపెనీలే ప్రోత్సాహకాలు ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ ‘సలహా’, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన భారీ వాహనాల మార్పిడికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ లేకపోవడం విధాన లోపాలుగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి కోవిడ్ అనంతర పరిస్థితుల్లో ఆర్థిక ఉద్దీపనలో భాగంగా కేంద్రం తగిన సాయం చేయడం ద్వారా వాయుకాలుష్యాన్ని గణనీయంగా తగ్గించేందుకు ఈ విధానం ఆలంబనగా నిలిచే అవకాశం ఉండేది. విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు లేదా భారత్–4 ప్రమాణాలున్న వాహనాల స్థానంలో కొత్తవాటిని ప్రవేశపెట్టేందుకు ఈ విధానాన్ని ఉపయోగించుకుని ఉంటే మెరుగైన ఫలితాలు ఉండేవి. వాహనశ్రేణి ఆధునికీకరణ లేదా స్క్రాపేజీ పాలసీగా కేంద్రం చేస్తున్న ప్రతిపాదన ఏమిటంటే, దశలవారీగా కాలుష్యకారక వాహ నాల స్థానంలో కొత్తవాటిని ప్రవేశపెట్టాలి. ఇంధన సామర్థ్యం పెంపు, రహదారులపై ప్రమాదాలను తగ్గించడం, స్క్రాపింగ్ పరిశ్రమను అసంఘటిత రంగం నుంచి తప్పించడం, ఆటోమోటివ్, స్టీల్, ఎలక్ట్రానిక్ రంగాలకు అవసరమైన పదార్థాలను తుక్కు నుంచి తక్కువ ఖర్చుతో సేకరించడం వంటివి కూడా ఈ విధానపు లక్ష్యాలు. వ్యక్తిగత వాహనాల స్క్రాపేజీకి 25 శాతం, వాణిజ్య వాహనాలకు 15 శాతం రోడ్ట్యాక్స్ మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసు కోవాలని కేంద్రం సలహా ఇచ్చింది. రిజిస్ట్రేషన్ చార్జీల మాఫీని కూడా ప్రతిపాదించింది. స్క్రాపేజీ సర్టిఫికెట్ ఆధారంగా కొత్త వాహనం ధరలో ఐదు శాతం డిస్కౌంట్ ఇవ్వాలని కంపెనీలకు సూచించింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో అధీకృత స్క్రాపింగ్ సెంటర్లు, వాహనాల జీవిత కాలాన్ని నిర్ణయించే ఫిట్నెస్ సెంటర్ల ఏర్పాటుకే సహకరిస్తామని కేంద్రం పేర్కొంది. ఈ ఏడాది అక్టోబరుకు స్క్రాపింగ్ నిబంధనల రూపకల్పన, 15 ఏళ్లకంటే పురాతనమైన ప్రభుత్వ రంగ సంస్థల వాహనాలను వచ్చే ఏడాది అక్టోబరుకల్లా తుక్కుగా మార్చాలని కేంద్రం సంకల్పించింది. 2023 అక్టోబరు కల్లా హెవీడ్యూటీ వాహనాలన్నింటికీ ఫిట్నెస్ టెస్టింగ్ను తప్పనిసరి చేయనున్నారు. వాహన్ డేటాబేస్ ఆధారంగా స్క్రాపింగ్ కేంద్రాలన్నీ వాహనాల రికార్డులు, యజమానుల వివరా లను ఎప్పటికప్పుడు నమోదు చేస్తుంటాయని కేంద్రం చెబుతోంది. అగ్ని ప్రమాదాలు, ఆందోళనలు, ఇతర ప్రమాదాలు, లోపాలున్నవిగా తయారీదారులు ప్రకటించినవి, పోలీసు, తదితర వర్గాల వారు జప్తు చేసిన వాహనాలన్నింటినీ తుక్కుగా మార్చేస్తారు. దేశవ్యాప్తంగా 20 ఏళ్ల కంటే పురాతనమైన తేలికపాటి వాహనాలు దాదాపు 51 లక్షల వరకూ ఉన్నాయనీ, 15 ఏళ్ల కంటే పురాతనమైనవి మరో 34 లక్షలు ఉన్నాయనీ కేంద్రం అంచనా వేసింది. మధ్యతరహా, భారీ వాహనాల విభాగాల్లో 15 ఏళ్లు దాటినవి 17 లక్షల వరకూ ఉన్నాయి. ఇతర వాహనాలతో పోలిస్తే ఇవి పది నుంచి 12 రెట్లు ఎక్కువ విష ఉద్గా రాలను వెలువరిస్తాయి. వాహనాలను తుక్కుగా మార్చేందుకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న పద్ధతులు నేల, నీరు, గాలిని కలుషితం చేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని రకాల సౌకర్యాలు, పరికరాలతో, తగిన రక్షణ చర్యలు తీసుకుంటూ వాహనాలను వ్యవస్థీకృతంగా తుక్కుగా మార్చే కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కొత్త విధానం సాయపడుతుంది కూడా. కానీ ఈ విధానం ద్వారా వాయుకాలుష్య పరంగా గరిష్టమైన లబ్ధి మాత్రం చేకూరే అవకాశాలు తక్కువ. వాహనశ్రేణిని మార్చే బాధ్యత మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలపై మోపడం, రోడ్ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల్లో అధిక శాతాన్ని మాఫీ చేయాలన్న సిఫారసు అంత ప్రోత్సాహకరంగా ఏమీ లేవు. ఈ రెండింటి ఆదాయంపై ఆధారపడ్డ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధానంపై ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. కోవిడ్ తదనంతర పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఉద్గారాల తగ్గింపు లక్ష్యంగా పలు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నాయి. కేంద్రం కూడా వాహనాలను మార్చుకునే వారికి జీఎస్టీలో సబ్సిడీ ఇవ్వడం ద్వారా ఈ విధానాన్ని మెరుగ్గా ఉపయోగించుకోవచ్చు. కాలుష్యం ఎక్కువగా వెదజల్లే వాహనాల స్థానంలో బీఎస్–6 ప్రమా ణాలతో కూడిన వాహనాలు కొనేవారికి నేరుగా ప్రోత్సాహకాలు ఇచ్చే విషయాన్ని కూడా కేంద్రం పరిగణించాలి. బీఎస్–1 ప్రమాణాల వాహనంతో పోలిస్తే బీఎస్–6 ప్రమాణాలున్న వాహనం 36 రెట్లు తక్కువ కాలుష్యాన్ని వెదజల్లుతుంది. కొత్త వాహనాలను కొనకుండా పాతవాటిని తుక్కుగా మార్చేందుకు మాత్రమే ఇష్టపడే వారికి స్క్రాపేజీ కేంద్రాలిచ్చే సర్టిఫికెట్ల ఆధారంగా రిబేట్లు కల్పించడం, తుక్కుగా మార్చడంతోపాటు కొత్త వాహనాలను కొనేవారికి ఎక్కువ స్థాయిలో ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ఎక్కువ ప్రయోజనం జరుగుతుంది. మొత్తమ్మీద పాత వాహనం స్థానంలో బీఎస్–6 ప్రమాణాలున్న వాహనాన్ని కొనుగోలు చేసే వినియోగదారుడికి వాహనం ధరలో కనీసం 15 శాతం ప్రయోజనం కలిగేలా చూడటం ముఖ్యం. పాతబడినప్పటికీ ఆర్థికంగా విలువ ఉన్న వాహనాలకు ఎక్కువ ప్రయోజనాలు కల్పించాలి. వ్యక్తిగత వాహనాల విషయంలో విధానం వేరుగా ఉండాల్సిన అవసరముంది. ద్విచక్ర వాహనాలతోపాటు కార్లకూ స్వచ్ఛంద విద్యుత్ వాహనాల కొనుగోలుకూ మధ్య లింకు ఏర్పరచడం మేలు. వ్యక్తిగత వాహనాల సంఖ్య చాలా ఎక్కువ. భారీ వాహనాల మాదిరి గానే వీటికీ రాయితీలిస్తే కేటాయించిన బడ్జెట్ వీటికే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే స్వచ్ఛందంగా విద్యుత్తు వాహనాలు కొనుగోలు చేసేవారికే రాయితీలు ఇవ్వడం మేలు. ఇలా చేయడం ద్వారా వాయు కాలుష్యం తగ్గింపులో గరిష్ట ప్రయోజనాలు పొంద వచ్చు. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ క్లీన్ ట్రాన్స్పోర్టేషన్ జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, పురాతన వాహనాల స్థానంలో కొత్త విద్యుత్తు వాహనాల వాడకం ద్వారా ఉద్గారాల తగ్గింపు ఎక్కువ ఉంటుంది. వ్యక్తిగత వాహనాలకు ఇచ్చే ప్రోత్సాహకాలను పరిమితం చేయడం ద్వారా ప్రజలు స్వచ్ఛందంగా విద్యుత్తు వాహనాల కొనుగోలుకు ముందుకొచ్చే అవకాశాలు పెరుగుతాయన్నమాట. 2030 నాటికి వ్యక్తిగత వాహనాల్లో 30–40 శాతం విద్యుత్తు వాహనాలు ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరేందుకూ ఇది దోహద పడుతుంది. తుక్కుగా మార్చేసే వాహనాల నుంచి అత్యధిక ప్రయోజనం పొందేందుకు తయారీదారులపై బాధ్యత మోపేలా కొత్త పాలసీ ఉండాలి. 2015లో తయారు చేసిన ఆటోమోటివ్ ఇండస్ట్రియల్ స్టాండర్డ్–129 (ఏఐఎస్–129)ను కంపెనీలు సమర్థంగా అమలు చేసేలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏఐఎస్–129 ప్రకారం వాహన తయారీలో ఎంత మోతాదులో పదార్థం ఉపయోగించారో అందులో 89–85 శాతం రికవరీ, రీసైకిల్, రీయూజ్ చేయాల్సి ఉంటుంది. సీసం, పాదరసం, కాడ్మియం, హెక్సావెలెంట్ క్రోమియం తదితర భార లోహాల వాడకంపై కూడా ఈ ఏఐఎస్–129 పరిమి తులు విధిస్తుంది. స్క్రాపేజీ విధానంలో దీన్ని తప్పనిసరి చేసి, గూడ్స్ వాహనాలను ఎన్1 కేటగిరీకి చేర్చడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. రీసైకిల్ చేయాల్సిన పదార్థాలను 85–95 శాతానికి చేర్చడం, వాడేసిన ఆయిళ్లు, రబ్బర్ల నుంచి ఇంధనాలను ఉత్పత్తి చేయడం, యూరోపియన్ నిబంధనల్లాగే తయారీదారులపై ఎక్స్టెం డెండ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఉండేలా చూడటం అవసరం. అనుమిత రాయ్ చౌదరి వ్యాసకర్త సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ శాస్త్రవేత్త -
భారత సంతతి మహిళకు కీలక పదవి
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ భారత సంతతికి చెందిన మరో మహిళకు కీలక పదవిని కేటాయించారు. భార్య జిల్ బైడెన్కు పాలసీ డైరెక్టర్గా భారత సంతతికి చెందిన మాలా అడిగాను నియమించారు. ఈమె గతంలోనూ జిల్ బైడెన్కు సీనియర్ సలహాదారుగా, బైడెన్- కమలా హ్యారిస్ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాలసీ సలహాదారుగానూ, బైడెన్ ఫౌండేషన్ డైరెక్టర్గానూ సేవలందించారు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనూ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్కి మాలా డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేశారు. ఆ తర్వాత డిఫెన్స్లో చీఫ్ ఆఫ్ స్టాఫ్కి సీనియర్ సలహాదారుగానూ సేవలందించారు. (ట్రంప్ లాయర్ తింగరి చర్యలు.. నెటిజనుల రియాక్షన్) ఇల్లినాయిస్కు చెందిన మాలా అడిగా మిన్నెసోటా స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. న్యాయవాదిగా శిక్షణ పూర్తిచేసి చికాగోలో పనిచేసిన మాలా 2008లో అధ్యక్షుడు బరాక్ బబామా క్యాంపెయిన్లోనూ ముఖ్యపాత్ర పోషించారు. తర్వాత అటార్నీ జనరల్కు సలహాదారుగానూ వ్యవహరించారు. జో బైడెన్ తాజాగా వైట్హౌస్లో నలుగురు అధికారులను నియమించారు. వారిలో లూయిసా టెర్రెల్ వైట్ హౌస్ లెజిస్లేటివ్ అఫైర్స్ డైరెక్టర్గా వ్యవహరించనుండగా, కార్లోస్ ఎలిజోండో వైట్ హౌస్ సామాజిక కార్యదర్శిగా పనిచేయనున్నారు. తన బృందంలోని సభ్యులు అమెరికన్ ప్రజలకు మరింత సేవ చేస్తారని బైడెన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడంలో మరింత అంకితభావంతో పనిచేస్తారని బైడెన్ అన్నారు. (జూనియర్ ట్రంప్కి కరోనా..) -
‘సీమ’లో ప్లాంట్ల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ఇంధన ఎగుమతి విధానం (ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీ) కోసం లక్ష ఎకరాలను గుర్తించగా పవన, సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేసే సంస్థలకు వీటిని ఇవ్వనున్నారు. రాయలసీమ జిల్లాల్లో ఇందుకు అపార అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పి విద్యుత్ను దేశంలో ఎక్కడైనా విక్రయించుకునేందుకు ఎక్స్పోర్ట్ పాలసీ వీలు కల్పిస్తుంది. ఈ విధానం కింద ముందుకొచ్చే సంస్థలకు సంప్రదాయేతర, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్కాప్) మౌలిక వసతులు కల్పిస్తోంది. లీజుకు భూమి సోలార్, విండ్ ప్లాంట్లు నెలకొల్పే సంస్థలకు ప్రభుత్వమే భూమి సమకూరుస్తుంది. 25 ఏళ్ల పాటు లీజుపై ఇస్తారు. ఎకరాకు రూ.31 వేలు లీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రైవేటు భూమి అయితే ఎకరాకు రూ.25 వేలు చెల్లించాలి. ఏటా లీజు మొత్తాన్ని 5 శాతం పెంచుతారు. మెగావాట్కు రూ. లక్ష చొప్పున ప్రభుత్వానికి రాయితీ చెల్లించాలి. ఏపీలో ప్లాంట్లు స్థాపించినా విద్యుత్ను ఇతర ప్రాంతాల్లో అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది. పవర్ గ్రిడ్ లైన్తో పాటు ఏపీ ట్రాన్స్కో లైన్ను వినియోగించుకుంటే ఆయా సంస్థలకు నిర్ణీత ధర చెల్లించాలి. ఎక్స్పోర్ట్ పాలసీని దృష్టిలో ఉంచుకుని నెడ్క్యాప్ ఇప్పటికే 1,00,611.85 ఎకరాలను గుర్తించగా ఇందులో చాలావరకూ ప్రభుత్వ భూమే ఉంది. పెద్ద సంస్థలు రెడీ ఏపీలో సోలార్, పవన విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పేందుకు పెద్ద సంస్థలు ముందుకొస్తున్నాయి. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెకీ) 4 వేల మెగావాట్ల సోలార్ ప్లాంటు ఏర్పాటుకు ముందుకొచ్చింది. మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) 5 వేల మెగావాట్ల సోలార్ ప్లాంటు ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. జాతీయ కంపెనీలు, అంతర్జాతీయ సంస్థలతో కలసి సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఆసక్తి చూపుతున్నాయని నెడ్క్యాప్ తెలిపింది. (చదవండి: రూ. 4,095 కోట్లతో విశాఖ పోర్టు విస్తరణ) సోలార్ ప్లాంట్ల కోసం గుర్తించిన భూమి జిల్లా ఎన్ని ఎకరాలు? అనంతపురం 29,982.92 కడప 29,548.79 ప్రకాశం 9,630 కర్నూలు 31,450.14 మొత్తం 1,00,611.85 -
ఇసుక విధానం.. మరింత సరళం
సాక్షి, అమరావతి: కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్రంలో మెరుగైన ఇసుక విధానానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నూతన విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇకపై ఆఫ్లైన్లోనే ఇసుక పొందే అవకాశం కల్పించనుంది. రాజకీయ జోక్యానికి తావులేకుండా పారదర్శకంగా ఈ విధానాన్ని అమలు చేయనుంది. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మూడున్నర గంటల పాటు సుదీర్ఘంగా కేబినెట్ సమావేశం జరిగింది. నూతన ఇసుక విధానంపై చర్చిస్తూ.. రాష్ట్రంలోని ఇసుక రీచ్లను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎనిమిది ప్రభుత్వ రంగ సంస్థలను, ఎన్ఎండీసీ వంటి వాటిని సంప్రదించామని, ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకు రాకుంటే 13 జిల్లాలను మూడు భాగాలుగా విభజించి, పారదర్శక పద్ధతిలో టెండర్లు నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చింది. ఇందులో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి ఓ భాగం.. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం రెండో భాగం.. నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు మూడో భాగంగా టెండర్లు జరుగుతాయి. ఇసుక సరఫరా కూడా పూర్తి పారదర్శకంగా జరగాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో మొత్తంగా 33 అంశాలపై చర్చ జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మీడియా సమావేశంలో వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఎడ్ల బండ్ల ద్వారా తీసుకెళ్లొచ్చు ► ఎడ్ల బండ్ల ద్వారా ఇసుక తీసుకెళ్లవచ్చు. ఇందుకు గ్రామ సచివాలయాల్లో కూపన్లు పొందాలి. బోట్స్మెన్ సొసైటీలు తదితరాలకు నిబంధనలు పూర్తిగా అమలు చేస్తారు. ► బలహీన వర్గాల కాలనీలు, రీచ్లకు దగ్గర్లోని గ్రామాలు, ఆర్అండ్ఆర్ గ్రామాలకు సబ్సిడీపై ఇసుక ఇస్తారు. ► మద్యం, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటైన స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ను మరింత బలోపేతం చేస్తారు. మత్తు పదార్థాలు, నిషేధిత గుట్కా విక్రయాలు, ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగ్, డ్రగ్స్ నిర్మూలన పూర్తిగా ఎస్ఈబీ పరిధిలోకి తీసుకువస్తూ నిర్ణయం తీసుకున్నారు. ► ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టేందుకు ఏర్పాటైన్ టాస్క్ఫోర్స్ను ఎస్ఈబీకి అనుసంధానం చేస్తారు. ఎస్ఈబీని బలోపేతం చేసేందుకు ఔట్ సోర్సింగ్లో 71 పోస్టులు, డిప్యుటేషన్పై 31 మంది అధికారుల నియామకానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. జనవరి 1 నుంచి ఇళ్ల వద్దే రేషన్ బియ్యం ► జనవరి 1 నుంచి లబ్ధిదారుల ఇంటికే నాణ్యమైన (సార్టెక్స్) రేషన్ బియ్యం సరఫరా చేస్తారు. ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇంటికి నాణ్యమైన బియ్యం చేర్చేందుకు 9,260 మొబైల్ వాహనాలు సిద్ధం చేశారు. మొబైల్ వాహనాల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, 20 శాతం ఈబీసీలకు కేటాయిస్తారు. ఆరేళ్లకు వాహనం లబ్ధిదారుడికి సొంతమవుతుంది. ► బియ్యం బస్తాలు దారి మళ్లకుండా ప్రతి బస్తాపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. వాహనాలకు జీపీఎస్ అమరుస్తాం. ప్రతి లబ్ధిదారుడికి రెండు రీ యూజ్డ్ బ్యాగులు అందజేస్తాం. ప్రస్తుతం ఈ విధానం శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలవుతోంది. పాడి పరిశ్రమ బలోపేతం ► సహకార రంగంలో మహిళల స్వావలంబనకు రూ.1,362.22 కోట్లతో సమగ్ర ప్రాజెక్టు రూపొందించాం. 500 లీటర్ల కన్నా ఎక్కువ పాల సేకరణ జరిగే 9,899 గ్రామాల్లో బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ► రాష్ట్రంలో పాల విప్లవం వెల్లి విరియనుంది. అమూల్తో ఎంఓయూ కుదిరింది. పశువుల దాణా, మందులు అన్నీ రైతు భరోసా కేంద్రాల ద్వారా సరఫరా చేస్తాం. ఇక్కడే మహిళలు నిర్వహించేలా పాల ఉత్పత్తి కేంద్రాలు ప్రారంభిస్తాం. ఆర్బీకేకు అనుసంధానంగా ఇవి పనిచేస్తాయి. ► ‘వైఎస్సార్ చేయూత’ ద్వారా పాడి పశువుల కొనుగోలుకు ప్రణాళిక రూపొందించాం. ‘భూమి రక్ష’ పేరుతో సమగ్ర భూసర్వే సమగ్ర భూసర్వే జనవరి 1న ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 4,500 సర్వే బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 15 వేల మంది సర్వేయర్లు ఉంటారు. ఒక్కో మండలంలో నాలుగు నెలలు చొప్పున సర్వే కొనసాగుతుంది. 2023 జూన్ నాటికి సర్వే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అక్కడికక్కడే భూ వివాదాలను పరిష్కరించేలా ప్రత్యేక మొబైల్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నాం. ► సర్వే చేసిన ప్రతి భూమికి యునిక్ నంబర్ కేటాయిస్తారు. ఈ నంబర్ ద్వారా పట్టాదారుడు తన భూమి వివరాలు పూర్తిగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. అన్ని లావాదేవీలకు ఈ నంబర్ వర్తిస్తుంది. ► వ్యవసాయ భూములతో పాటు గ్రామ కంఠాలు, మున్సిపాల్టీలలోని నివాసిత స్ధలాలకు సంబంధించి పక్కా పాస్బుక్, లీగల్ టైటిల్ కల్పించడమే లక్ష్యం. గ్రామ సచివాలయం కేంద్రంగా రిజిష్ట్రారు కార్యాలయం ఉంటుంది. భూ రక్షణకు సంబంధించి ఇదో విప్లవం. ఆక్వా కల్చర్ సీడ్ యాక్ట్–2020కి ఆమోదం ► 2006లో రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ సీడ్ (క్వాలిటీ కంట్రోల్) యాక్ట్ –2006 కు సవరణలు చేస్తూ రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ సీడ్ యాక్ట్–2020కి కేబినెట్ ఆమోదం తెలిపింది. తద్వారా ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్, మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంతో పాటు, వినియోగదారులకు నాణ్యతతో కూడిన ఉత్పతులు అందుబాటులో ఉంటాయి. ►ఆక్వా రైతులకు నాణ్యమైన ఫిష్ ఫీడ్ అందించేందుకు రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫీడ్ (క్వాలిటీ కంట్రోల్) యాక్టు –2020ని కూడా కేబినెట్ ఆమోదించింది. వైద్య కళాశాలకు స్ధలాల కేటాయింపు ► నూతన వైద్య కళాశాలల కోసం కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం చిలకలపూడిలో 29.6 ఎకరాలు, విజయనగరం మండలం గాజులరేగలో 80 ఎకరాలు, విశాఖ జిల్లా పాడేరు మండలం తలారిసింగి వద్ద 35.01 ఎకరాలు, అనంతపురం జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం పెనుకొండలో 48.49 ఎకరాల స్థలం కేటాయించారు. ► రాజమండ్రిలో 12.57 ఎకరాలు, నంద్యాల మండలం నూనెపల్లిలో 50 ఎకరాలు, విశాఖ జిల్లా అనకాపల్లిలో 50 ఎకరాలు, గుంటూరు జిల్లా బాపట్ల మండలం జమ్ములపాలెంలో 51.07 ఎకరాలు, గుంటూరు జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి విస్తరణ కోసం 6 ఎకరాలు కేటాయించారు. ► తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల విస్తరణ కోసం కాకినాడ అర్బన్ మండలం రమణయ్యపేట వద్ద 15.76 ఎకరాలు కేటాయింపు. ► విజయవాడ కృష్ణలంకలో నిర్మల శిశుభవన్ (అనాథ శరణాలయం)కు మిషనరీ ఆప్ ఛారిటీస్కు 2 వేల గజాల స్థలాన్ని గజం రూపాయి చొప్పున 99 ఏళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ► విజయవాడ బందరు కాలువ పక్కన 2,266 గజాల స్థలాన్ని మిషనరీ ఆప్ ఛారిటీస్కు నిర్మల హృదయ భవన్ (వృద్ధాశ్రమం) ఏర్పాటు కోసం దీర్ఘకాలిక లీజుకు అనుమతించింది. ఏ సీజన్లో పంట నష్టానికి ఆ సీజన్లోనే చెల్లింపు ► నవంబరు 17న ప్రారంభించనున్న వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ► 2019–20 ఖరీఫ్ నాటి నుంచి అమలయ్చే ఈ పథకం వల్ల 14.58 లక్షల రైతులకు ప్రయోజనం ఉంటుంది. దీని కోసం సుమారు రూ.510 కోట్లు కేటాయించారు. ► గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.1,050 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశాం. దీంతోపాటు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ సీజన్లో జరిగిన పంట నష్టాన్ని ఆ సీజన్లో చెల్లిస్తున్నాం. అక్టోబర్లో జరిగిన పంట నష్టాన్ని ఈ నెలలోనే చెల్లించాలని నిర్ణయించాం. క్రికెట్ స్టేడియంల ఏర్పాటుకు లీజు ► శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం జగ్గుశాస్త్రులపేటలో క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్కు 7.66 ఎకరాలను 30 ఏళ్ల పాటు లీజుకు ఇస్తారు. ఏడాదికి రూ.2 లక్షలు లీజు ధర కాగా.. ఏటా 12.5 శాతం లీజు పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ► వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మండలం కేవీ పల్లెలో క్రికెట్ స్టేడియం ఏర్పాటుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్కు 11 ఎకరాలను 30 యేళ్లపాటు లీజుకు కేటాయిస్తారు. ఏడాదికి రూ.2 లక్షల లీజు ధర కాగా.. ఏటా 12.5 శాతం లీజు పెంపునకు కేబినెట్ ఆమోదించింది. వ్యవసాయానికి నాణ్యమైన నిరంతర విద్యుత్ ► వ్యవసాయానికి పగటి పూట తొమ్మిది గంటల పాటు నాణ్యమైన నిరంతర ఉచిత విద్యుత్ను సరఫరా చేసేందుకు వీలుగా ప్రతిపాదించిన 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్–18, జీవో ఎంఎస్ నెంబర్–19లలో సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ► తద్వారా ఉచిత విద్యుత్కు అయ్యే ఖర్చు ఏటా రూ.8 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్లకు తగ్గనుంది. ► ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సంస్థ (ఏపీఎస్డీసీ)ను బలోపేతం చేయడంతో పాటు ఆ సంస్థకు చట్టబద్దత కల్పించడం కోసం శాసనసభలో ప్రవేశపెట్టనున్న ముసాయిదా బిల్లుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ► ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన నూటికి నూరు శాతం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఏపీఎస్డీసీ. ఇది సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రాజెక్టులకు ఇది ప్లానింగ్, ఫండింగ్ చేస్తుంది. మచిలీపట్నం పోర్టుకు రూ.5,835 కోట్లు ► మచిలీపట్నం పోర్టు మొదటి దశ పనులకు రైట్స్ రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఆమోదించడంతో పాటు ఆ ప్రాజెక్టు మొదటి దశ పనులకు పరిపాలనా అనుమతులకూ కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం రూ.5,835 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయాలన్నది లక్ష్యం. ► మొదటి దశ పనులకు అవసరమైన 225 ఎకరాల భూసేకరణ కోసం ఏపీ మారిటైం బోర్డు రూ.90 కోట్లు కేటాయించనుంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మారిటైం బోర్డు మొత్తం రూ.4,745 కోట్లు సేకరించనుంది. రూ.1,050 కోట్లతో ఏటీసీ టైర్ల తయారీ కంపెనీ రూ.700 కోట్ల పెట్టుబడితో ఇంటిలిజెంట్ సెజ్ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో పాదరక్షల తయారీ యూనిట్, రూ.1,050 కోట్లతో ఏటీసీ టైర్ల తయారీ కంపెనీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ కంపెనీల వల్ల 36,900 మందికి ఉపాధి లభిస్తుంది. మరిన్ని నిర్ణయాలు ఇలా.. ► వైఎస్సార్ కడప జిల్లాలో ఏర్పాటు చేస్తున్న డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో కొత్తగా 224 పోస్టుల మంజూరుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో 138 టీచింగ్, 86 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. ► హోం శాఖ పరిధిలో రాష్ట్రంలోని 8 జిల్లా జైళ్ల (పురుషులు)లో డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులను అడిషనల్ సూపరింటెండెంట్గా అప్గ్రేడ్ చేయడంతో పాటు నాలుగు కేంద్ర కారాగారాల్లో 4 అడిషనల్ సూపరింటెండెంట్ పోస్టుల భర్తీకి ఆమోదం. ► అగ్నిమాపక శాఖలో జోనల్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ పునర్ వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పుడున్న రెండు జోన్లు నాలుగు జోన్లుగా మార్పు. ► కొత్తగా రీజనల్ ఫైర్ ఆఫీసర్ పోస్టు –1, అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ పోస్టులు–2 మంజూరు. ► వైద్య, ఆరోగ్య శాఖలో టీచింగ్ ఫ్యాకల్టీకి ఏడో వేతన సంఘం సిఫార్సుల ప్రకారం యూజీసీ తరహాలోనే జీతాలివ్వాలన్న నిర్ణయం. దీని వల్ల ఏటా రాష్ట్ర ప్రభుత్వంపై రూ.400 కోట్లు అదనపు భారం పడుతుంది. సుమారు 3,500 మంది మెడికల్ టీచింగ్ ఫ్యాకల్టీకి ప్రయోజనం కలుగుతుంది. ► ఐదు సంవత్సరాల జైలు శిక్ష పూర్తి చేసుకున్న మహిళా ఖైదీలను విడుదల చేయాలన్న కేబినెట్ నిర్ణయంతో 48 మంది మహిళా ఖైదీలు విడుదల కానున్నారు. ► కాపు నేస్తం, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, వైఎస్సార్ వాహనమిత్ర, జగనన్న చేదోడు, చేయూత పథకాల్లో మిగిలిపోయిన అర్హులకు నవంబర్ 6వ తేదీ నుంచి పథకాలు వర్తింప చేయాలన్న నిర్ణయానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. విశాఖలో రూ.14,634 కోట్లతో సుమారు 25 వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఆదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, ఇంటిగ్రేటెడ్ ఐటీ అండ్ బిజినెస్ పార్కు, స్కిల్ వర్సిటీ, రిక్రి యేషన్ సెంటర్కు కేబినెట్ ఆమోదం తెలి పింది. 2018లో అదాని సంస్థ ప్రతిపాదించిన భూమి కంటే తక్కువ భూమి కేటాయిస్తూ అప్పటి కంటే ఎక్కువ మందికి ఉపాధి లభిం చేలా నిర్ణయం తీసుకున్నారు. 2018లో చేసిన ప్రతిపాదనల ప్రకారం 500 ఎకరాల్లో డేటా సెంటర్ నిర్మాణం ద్వారా 6,000 మందికి ఉపాధి లభించనుండగా, ప్రస్తుతం మంత్రి మండలి ఆమోదించిన ప్రతిపా దన ద్వారా 130 ఎకరాల్లో ప్రాజెక్టు చేపట్టడం ద్వారా 24,990 మందికి ఉపాధి లభించనుంది. చిన్న, వీధి వ్యాపారాలు చేసుకునే వారు, చేతి వృత్తుల కళాకారులకు వడ్డీ లేకుండా ‘జగనన్న తోడు’ పథకం కింద రూ.10 వేల వడ్డీ లేని రుణం ఇస్తారు. రూ.వెయ్యి కోట్లు కేటాయించిన ఈ పథకం నవంబర్ 24న ప్రారంభం అవుతుంది. ఈ పథకం కింద 9.18 లక్షల మంది నమోదయ్యారు. బ్యాంకుల ద్వారా 5.60 లక్షల మందిని టై అప్ చేశారు. డ్రోన్లు, రోవర్లు, 70 బేస్ స్టేషన్లు (కంటిన్యూస్ ఆపరే టింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ కోర్స్) ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్ట నున్న సమగ్ర భూ రీసర్వే ప్రాజెక్టుకు పరిపాలనాపరమైన అనుమతులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రూ.987.46 కోట్లతో సమగ్ర భూ రీసర్వే చేపట్టనున్నారు. ప్రతి ఇసుక రీచ్ దగ్గర 20 వాహనాలు ఏర్పాటు చేస్తారు. ఇసుక రీచ్ల వద్దే ధర నిర్ణయిస్తారు. అధిక ధరలకు అమ్మితే స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్కు ఫిర్యాదు చేయొచ్చు. కావాల్సిన వాహనాన్ని బుక్ చేసుకుని ఇసుక తీసుకెళ్లొచ్చు. వినియోగదారుడు సొంత వాహనంలోనైనా తీసుకెళ్లొచ్చు. పట్టా భూముల నుంచి ఇసుక తీసుకునే విధానాన్ని రద్దు చేశారు. -
కోవిడ్–19 చికిత్స: సెప్టెంబర్లో పెరిగిన బీమా క్లెయిమ్స్
న్యూఢిల్లీ: కోవిడ్–19 చికిత్సకు సంబంధించి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ సంఖ్య సెప్టెంబర్లో పెరిగింది. సమీక్షా నెలలో మొత్తం ఆరోగ్య బీమా క్లెయిమ్లను పరిశీలిస్తే, వీటిలో కోవిడ్–19 చికిత్స సంబంధిత క్లెయిమ్స్ 40 శాతానికి ఎగశాయని తమ గణాంకాల విశ్లేషణలో వెల్లడైనట్లు ఈ రంగంలో దిగ్గజ అగ్రిగేటర్ పాలసీబజార్ డాట్ కామ్ పేర్కొంది. నెలల వారీగా ఈ శాతాలు క్రమంగా పెరుగుతూ వస్తున్నట్లు వెల్లడించింది. దీనిప్రకారం, మేలో ఈ రేటు కేవలం 8 శాతం ఉంటే, జూలై, ఆగస్టుల్లో వరుసగా 23, 34 శాతాలకు చేరింది. పాలసీబజార్ డాట్ కామ్లో ఆరోగ్య బీమా విభాగం చీఫ్ అమిత్ ఛబ్రా వివరించిన అంశాల్లో ముఖ్యమైనవి పరిశీలిస్తే... ► కోవిడ్–19 చికిత్స క్లెయిమ్స్ దాఖలు చేసిన వారిలో అత్యధికులు 60 సంవత్సరాలవారు ఉన్నారు. తరువాతి శ్రేణిలో 41 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు్కలు ఉన్నారు. చదవండి: ఆ నష్టం రూ.1.25 లక్షల కోట్లు ►కరోనా కేసుల సంఖ్య కొన్ని రాష్ట్రాల్లోనే భారీగా పెరిగింది. రికవరీ కూడా అధికంగా ఉంది. ►ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ మధ్య చూస్తే, మొత్తం ఆరోగ్య బీమా క్లెయిమ్స్లో కోవిడ్–19 చికిత్స క్లెయిమ్స్ వాటా 26 శాతంగా ఉంది. నాన్–కోవిడ్–19 విషయంలో ఈ రేటు 74 శాతంగా ఉంది. ఈ విభాగంలోకి గుండె, ఊపిరితిత్తులు, నాడీ సంబంధ సమస్యలు వచ్చాయి. ►క్లెయిమ్లకు సంబంధించి విలువ సగటున రూ.1,18,000గా ఉంది. అయితే ఒక్క 46–50 మధ్య వయస్సువారి విషయంలో క్లెయిమ్ విలువ గరిష్టంగా రూ.2.19 లక్షలుగా ఉంది. ►బీమా రెగ్యులేటరీ సంస్థ– ఐఆర్డీఏఐ కోవిడ్–19 ప్రత్యేక పాలసీలకు అనుమతినిచ్చిన తొలి నెలల్లో వీటి కొనుగోలుకు డిమాండ్ ఉంది. అయితే ఇప్పుడు సమగ్ర హెల్త్ కవర్ అవసరాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోవిడ్–10 బీమాల వైపు నుంచి మరింత సమగ్ర ప్రణాళికలవైపు మారడానికి ప్రజలకు అనుమతినిస్తూ, ఐఆర్డీఏఐ ఇచి్చన అనుమతులు హర్షణీయం. ►నెలవారీ ప్రీమియం పేమెంట్ విధానానికి అనుమతించడం హర్షించదగిన మరో కీలకాంశం. ఇప్పుడు 35 సంవత్సరాల ఒక వ్యక్తి రూ.1,000 నుంచి రూ.1,500 నెలకు చెల్లించి కోటి రూపాయల వరకూ బీమా కవర్ పొందగలుగుతున్నాడు. ►నాన్–కోవిడ్–19 క్లెయిమ్స్ విషయానికి వస్తే, ఆసుపత్రుల్లో బెడ్ల వినియోగం ఇప్పుడు గణనీయంగా పెరిగింది. లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన రోగులు ఇప్పుడు చికిత్స, ఆపరేషన్లకోసం పెద్ద ఎత్తున ఆసుపత్రుల్లో చేరుతుండడమే దీనికి కారణం. ►పెద్దల్లో కంటి సంబంధ ఇబ్బందులు ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. 61 సంవత్సరాలు పైబడి ఆరోగ్య బీమా ఉన్న సీనియర్ సిటిజన్లలో దాదాపు 20 శాతం కంటి సంబంధ చికిత్సలకు బీమా సౌలభ్యతను వినియోగించుకుంటున్నారు. తగ్గనున్న ఆసుపత్రుల లాభం :క్రిసిల్ కరోనా కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు ఆసుపత్రుల నిర్వహణ లాభం సుమారు 35–40% తగ్గనుందని క్రిసిల్ నివేదిక పేర్కొంది. వైరస్ భయంతో ప్రజలు ఆసుపత్రులకు వెళ్ళకపోవడం,చికిత్సలను వాయిదా వేసుకోవడం దీనికి ప్రధాన కారణంగా తెలిపింది. ఏజెన్సీ.. రేటింగ్ ఇచి్చన 36 ఆసుపత్రులతో కలిపి మొత్తం 40 హాస్పిటల్స్ను విశ్లేషించి రూపొందిన ఈ నివేదిక ప్రకారం.. కోవిడ్ కేసులు ఎక్కువగా వచి్చనప్పటికీ వీటి ద్వారా పొందిన మార్జిన్ తక్కువగా ఉంది. అయితే ఈ కేసుల నుంచి అదనంగా 15–20 శాతం ఆదాయం సమకూరింది. లాక్డౌన్, ప్రయాణ సడలింపులతో జులై నుంచి రోగుల రాక క్రమంగా మెరుగు పడుతూ వచి్చంది. -
ఏపీ: పోలీసులకు శుభవార్త
సాక్షి, అమరావతి: బుధవారం నుంచి పదిరోజులపాటు పోలీసు అమర వీరుల సంస్మరణ దినాలుగా జరపనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా సహజ మరణానికి ఇచ్చే బీమా మొత్తం రూ. 1.5 లక్షల నుంచి రూ. 3లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పోలీసుల కోసం ఎస్బీఐ జీవన్ జ్యోతి బీమా, సురక్ష బీమా ఎంఓయూలపై ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ సంతకం చేయించారు. ప్రతి పోలీసు స్టేషనుకు వెళ్లి రేపటి నుంచి పాలసీలు అందించనున్నారు. ఈరోజు లాంఛనంగా లా అండ్ ఆర్డర్ ఏడీజీ శివశంకర్, కానిస్టేబుళ్ళు డి.రజని, దుర్గా ప్రసాద్లకు పాలసీలు అందించారు. ఈ సందర్భంగా ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ మాట్లాడుతూ, పోలీసుల అద్భుత సేవలకు సెల్యూట్ చేశారు. వారికి 40లక్షల వరకూ యాక్సిడెంటల్ పాలసీ , 3లక్షల వరకు సహజమరణం పాలసీ అందించనున్నట్లు తెలిపారు. సంవత్సరానికి 12 రూపాయలు కడితే రెండు లక్షల బీమా లభిస్తుందని తెలిపారు. సుకన్య సమృద్ధి యోజనను కూడా అందరూ వినియోగించుకోవాలి అని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పోలీస్ సిబ్బందికి వీక్లీ ఆఫ్ ఏపీ లో అమలు జరుగుతోందని పేర్కొన్నారు. మహిళల రక్షణ కొరకు దిశ యాప్, దిశ పోలిస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులో ఉండే విధంగా 87 రకాల సేవలతో పోలీస్ సేవా యాప్ అందుబాటులోకి తెచ్చామన్నారు. రికార్డు స్థాయిలో దేవాలయాలకు సంబంధించిన 306 కేసులను ఏపీ పోలీసు శాఖ చేధించిందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 57,270 ఆలయాలు ,ప్రార్థనా మందిరాలకు జియో ట్యాగింగ్ తో మ్యాపింగ్ చేశామని, అంతర్వేది రధం ఘటన అనంతరం దేవాలయాలకు సంబంధించి 33 కేసులు నమోదు అయ్యాయని ప్రకటించారు. అందులో 27 కేసులు చేధించి తరచుగా నేరాలకు పాల్పడుతున్న 54 మంది పాత నేరస్ధులను గుర్తించామని పేర్కొన్నారు. 130 మందిని అరెస్టుచేసి , 1196 మందిని బైండ్ ఓవర్ చేసినట్లు చెప్పారు. దిశా అప్లికేషన్ను 11 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. ఎస్ఓఎస్ యాప్ ద్వారా 79,648 వినతులు వచ్చాయని, వీటిలో 604 కాల్స్ పై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. 122 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయని, రాష్ట్రంలో జీరో ఎఫ్ఐఆర్ లు 2019లో 62 నమోదు కాగా, 2020 ఇప్పటి వరకూ 279 నమోదు అయినట్లు వెల్లడించారు. రాష్ట్రం లో నేరాల సంఖ్య 18 శాతం తగ్గిందని గౌతం సవాంగ్ ప్రకటించారు. చదవండి: ఏపీ పోలీసులు మంచి నిర్ణయం తీసుకున్నారు.. -
ఆటోమొబైల్ రంగానికి గడ్కరీ గుడ్ న్యూస్
ముంబై: ఆటోమొబైల్ రంగానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు. కరోనా నేపథ్యంలో ఆటోమొబైల్ రంగం వృద్ధి చెందేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. త్వరలోనే ఆటోమొబైల్ రంగం పుంజుకునేందుకు అక్టోబర్ చివర నాటికి వాహన పాలసీ రూపొందనుందని గడ్కరీ పేర్కొన్నారు. వాహన పాలసీ రూపకల్పనలో చివరి దశలో ఉన్నట్లు తెలిపారు. ఈ పాలసీ ద్వారా ఆటోమొబైల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. వాహన పాలసీపై కేంద్ర ప్రభుత్వ ముఖ్య విభాగాలు అధ్యయనం చేయనున్నాయని తెలిపారు. కాగా వాహన పాలసీలో వినియోగదారులకు లాభం జరగనుందని, పాత వాహనాలను మార్చుకునే కస్టమర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే పాత వాహనాల కోనుగోలు వల్ల వాటిని రీసైక్లింగ్ చేయడానికి ఉపయోగపడనుందని ముడి విభాగాల దిగుమతి తగ్గి ఖర్చు తగ్గుతుందని అన్నారు. మరోవైపు స్వదేశీ పరికరాలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం విదేశీ దిగుమతులకు అధిక పన్నులు విధించనున్నట్లు గడ్కరీ పేర్కొన్నారు. అయితే ఎగుమతులను ప్రోత్సహించడానికి కేంద్రం ఇప్పటికే పలు కీలక చర్యలు తీసుకున్నదని, అలాగే ఎంఎస్ఎంఈలపై కేంద్రం నుంచే అన్ని ప్రోత్సాహకాలను అందిపుచ్చుకోవాలని నితిన్ గడ్కరీ సూచించారు. (చదవండి: ఆర్టీసీ లిక్విడేషన్కు కేంద్రం అనుమతి అవసరం) -
‘వ్యాక్సిన్’ పాలసీ సిద్ధం చేయండి
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ త్వరలో మార్కెట్లోకి వచ్చే అవకాశమున్నందున అందరికీ అందుబాటులో ఉండే లా కేంద్ర ప్రభుత్వం ‘వ్యాక్సిన్ ప్రొక్యూర్మెంట్ పాలసీ’ని సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. వ్యాక్సిన్ తయారీ సంస్థకు పీఎం కేర్స్ నుంచి రూ.100 కోట్లు కేటాయించిన నేపథ్యంలో మార్గదర్శకాలు రూపొందించడంతోపాటు, వ్యాక్సిన్ తయారీలో ముం దు వరుసలో ఉన్న కంపెనీలకు మరింత ఫండింగ్ కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్ధన్కు గురువారం కేటీఆర్ లేఖ రాశారు. వ్యాక్సిన్ రాజధానిగా.. ‘ప్రపంచ వ్యాక్సిన్ రాజధాని గా ఉన్న హైదరాబాద్ ఏటా 5 బిలియన్ డోసులు తయారీ ద్వారా ప్రపంచంలో మూడో వంతు వ్యాక్సిన్ ఉత్పత్తి చే స్తోంది. కోవిడ్ వ్యాక్సిన్ తయారీకి స్థానికంగా మూడు కంపెనీలు చేస్తున్న ప్రయత్నాలు త్వరలో ఫలితాన్నిస్తాయి. కరోనా చికిత్సలో ఉపయోగిస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ను స్థానిక ఫార్మా కంపెనీలు తయారు చేస్తున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ ప్రక్రియకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఎఫ్డీఏఏ వంటి సంస్థలు చేసిన మార్గదర్శకాలు, ప్రమాణాలకు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందించడం ద్వారా దేశంలో వ్యాక్సిన్ తయారీ వేగవంతమవుతుంది’ అని కేటీఆర్ అన్నారు. అలాగే, భారత్లో వ్యాక్సిన్ల తయారీ కోసం ఆరు కేంద్ర ప్రభుత్వ శాఖలతోపాటు, రాష్ట్ర స్థాయిలో అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. అనుమతులు, క్లియరెన్సుల కోసం నిబంధనలు సరళతరం చేస్తూ కొత్త విధానం రూపొందించాలి. అనుమతులు, ట్రాకింగ్ వ్యవస్థను మరింత వికేంద్రీకరిస్తే క్లినికల్ ట్రయల్స్, వ్యాక్సిన్ల తయారీ మరింత సులభతరమవుతుంది. హిమాచల్ప్రదేశ్లోని కసౌలీలో ఉన్న సెంట్రల్ డ్రగ్ లేబొరేటరీకి శాంపిళ్లను పంపేందుకు బయోటెక్ పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. హైదరాబాద్లో ఈ జోనల్ కార్యాలయం ఏర్పాటు చేయడం హర్షనీయం అని కేటీఆర్ అన్నారు. -
కోటి ఉద్యోగాల కల్పన
న్యూఢిల్లీ: నూతన జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానానికి కేంద్ర క్యాబినెట్ మంగళవారం ఆమోదముద్ర వేసింది. దేశీయంగా కోటి మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు, 2025 నాటికి 400 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ సంబంధ వ్యవస్థను తీర్చిదిద్దేందుకు ఇది తోడ్పడగలదని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ క్యాబినెట్ సమావేశం అనంతరం తెలిపారు. మొబైల్స్ తయారీని సుమారు రూ. 13 లక్షల కోట్ల విలువ చేసే 100 కోట్ల యూనిట్ల స్థాయికి చేర్చాలని జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానం 2019లో నిర్దేశించుకున్నారు. ఇందులో రూ. 7 లక్షల కోట్ల విలువ చేసే 60 కోట్ల యూనిట్స్ ఉండనున్నాయి. అలాగే, రక్షణ శాఖ, ఇతర వ్యూహాత్మక విభాగాల ఎలక్ట్రానిక్స్ తయారీ అవసరాలను కూడా తీర్చడంపై దృష్టి సారించాలని ఈ విధానంలో నిర్దేశించుకున్నారు. 2012లో తొలిసారిగా జాతీయ ఎలక్ట్రానిక్స్ విధానం అమల్లోకి వచ్చింది. మరోవైపు, పోంజీ స్కీముల్లాంటి అనియంత్రిత డిపాజిట్ స్కీములను నిషేధించడం కోసం ఉద్దేశించిన ఆర్డినెన్స్కి కూడా కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. గతేడాది జూలైలో ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. అటు కంపెనీలు సొంత అవసరాల కోసం తీసుకున్న గనుల (క్యాప్టివ్ మైన్స్) నుంచి ఉత్పత్తి చేసే బొగ్గులో 25 శాతాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించుకునే వెసులుబాటును ఇస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. -
గ్రేట్ ఛేంజ్
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త ఏడాదిలో సరికొత్త రూట్లో వెళ్లనుంది. గ్రేటర్లో ఇంతకాలం వివిధ పనుల్లో జరుగుతున్న దుబారాను అరికట్టేందుకు వీలుగా పాలసీని రూపొందించింది. ఇప్పటిదాకా తక్షణ మరమ్మతు బృందాల కోసం ఇష్టానుసారం ప్రతిపాదనలు చేసేవారు. చేస్తున్న పనులకు, నియమిస్తున్న బృందాలకు పొంతన ఉండేది కాదు. పనులు లేకున్నా బృందాలను నియమించి నిధులను పక్కదారి పట్టించేవారు. కాగితాల్లో తప్ప వాస్తవంగా కనపడని బృందాలు అనేకం ఉండేవి. వీటి వల్ల ఎంతపని జరుగుతుందో తెలిసేది కాదు. పైగా ఈ పనులపై ఎవరికీ జవాబుదారీతనం లేదు. నిధులు మాత్రం కరిగిపోయేవి. ఈ పరిస్థితులను నివారించేందుకు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు తగిన పాలసీతో ‘వార్షిక క్యాలెండర్’ను రూపొందించారు. సంవత్సరంలో ఏ బృందాలు ఎప్పటి వరకు ఉండాలో, ఏ పనులు ఎప్పడు చేయాలో నిర్ధారిస్తూ అందులో పొందుపరిచారు. రోడ్లు, వరద కాల్వల నిర్వహణ, పూడికతీత వంటి పనులకు తక్షణ మరమ్మతు బృందాలు (ఐఆర్టీ), వర్షాకాల అత్యవసర బృందాల(ఎంఈటీ)ను ఏ సీజన్లో నియమించాలి.. అవి ఎంతకాలం పనిచేయాలి అనే అంశాలతో పాటు గతేడాది అవి చేసిన పనితనంతో ఈ కొత్త పాలసీ ఉంటుంది. పలు నిబంధనలతో పకడ్బందీగా రూపొందించిన ఈ విధానం ఎంతమేర సఫలీకృతమవుతుందనేది వేచి చూడాలి. కాగా, కొత్త పాలసీలోని విధివిధానాలు ఎలా ఉన్నాయంటే.. తక్షణ మరమ్మతు బృందాలు (ఐఆర్టీ).. త్వరలో ప్రారంభం కానున్న కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి మే 31 వరకు ఈ బృందాలు రంగంలో ఉం డాలి. ఈమేరకు సర్కిళ్లలోని ఇంజినీర్లు సంబంధిత ఉన్నతాధికారి నుంచి పరిపాలన అనుమతి పొందాలి. భవిష్యత్లో నవంబర్ నుంచి మే వరకు ఈ బృందాల ను నియమించుకోవాలి. ఈ బృందాల్లో ట్రాలీతో కూడి నడీసీఎం/ట్రాక్టర్, వాహన డ్రైవర్ కాక నలుగురు కార్మి కులతో పాటు తగిన ఉపకరణాలు కూడా ఉండాలి. ♦ రోడ్లపై గుంతల పూడ్చడం, మ్యాన్హోల్ కవర్ల మూ తలు, రోడ్డు కట్టింగ్ల పూడ్చివేత, సీసీరోడ్ల స్వల్ప మరమ్మతులు, రోడ్ల పక్కనున్న పూడిక తొలగింపు వంటి పనులు చేయడం ఈ బృందాల విధిగా నిర్ణయించారు. వర్షాకాల అత్యవసర బృందాలు(ఎంఈటీ) ఈ సీజన్లో ఎదురయ్యే వరద సమస్యల పరిష్కారానికి ఈ బృందాలు పనిచేస్తాయి. నీటినిల్వ ప్రాంతాల్లో నీటి తొలగింపు, నీట మునిగిన బస్తీలు, కాలనీల్లో నీటిని తోడివేయడం వంటి పనులు ఎప్పటికప్పుడు చేయాలి. జూన్ నుంచి అక్టోబర్ వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. ఈ బృందాల నియామకాలకు ఏప్రిల్లోనే మంజూరు పొంది టెండర్లు పూర్తిచేసి జూన్ నుంచి విధుల్లో ఉండేలా ఈఈలు చర్యలు తీసుకోవాలి. ఐఆర్టీ, ఎంఈటీ బృందాల మంజూరు కోసం ప్రతిపాదనలు పంపేటప్పుడు గత సంవత్సరం ఈ బృందాల వల్ల జరిగిన పని ఎంతతో చెబుతూ ఆ వివరాలతో అవసరమైనన్ని బృందాలకే ప్రతిపాదనలు పంపించాలి. జీహెచ్ఎంసీలోని అన్ని డివిజన్లకు నిర్ణీత కాలానికే ఈ బృందాల నియామాకాలకు మంజూరు పొందాలి. వాహనం, అవసరమైన సామగ్రితో పాటు ఒక్కో షిఫ్టులో నలుగురు కార్మికులు బృందంలో ఉండాలి. కార్మికులకు రేడియం జాకెట్, రెయిన్కోటు, షూ, గొడుగు, టార్చి తదితర సదుపాయాలుండాలి. వర్షాలు కురిసే సమయంలో అందే ఫిర్యాదులను ప్రాధాన్యతతో పరిష్కరించడంతో పాటు వర్షాలు లేనప్పుడు గుంతల పూడ్చివేత, రోడ్లపై పూడిక, చెత్త తొలగింపు తదితర పనులు చేయాలి. బీటీ మిక్స్కూ పక్కా లెక్క గుంతల పూడ్చివేత, రోడ్ల మరమ్మతులకు ఎంత బీటీ మిక్స్ పంపిణీ చేసిందీ సంబంధిత ఈఈ ఏ నెలకానెల వివరాలను చీఫ్ ఇంజినీర్కు ఇవ్వాలి. అంతేకాకుండా డిపార్ట్మెంటల్ స్టోర్ నుంచి బీటీమిక్స్, రోడ్బాండ్, షెల్మాక్ వంటివి ఎంత మేర వినియోగించిందీ ఈఈలు తమ ఎస్ఈలకు నెలనెలా వివరాలు అందజేయాలి. వాటిని ఎస్ఈలు సీఈ ద్వారా కమిషనర్కు నివేదించాలి. తద్వారా మెటీరియల్ దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు బృందాలు ఎంత పనిచేసేదీ సరిగ్గా తెలుస్తుందని భావిస్తున్నారు. వరద కాలువల్లో పూడికతీత నాలాల్లో పూడికతీతకు సంబంధించి కూడా గ్రేటర్ అధికారులు తగిన విధివిధానాలు రూపొందించారు. మే నెలాఖరు వరకు వర్షాకాలానికి ముందు పూడిక తొలగించడమే కాక డిసెంబర్ నెలఖారు దాకా ఆ పనులు కొనసాగించాలి. ఏటా జనవరి 1 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు కొత్త కాంట్రాక్టు ఒప్పందం అమలులో ఉండాలి. స్థానికులు, కార్పొరేటర్ల భాగస్వామ్యం తమ పరిధిలో పూడిక తీయాల్సిన నాలాలెన్నో సంబంధిత ఈఈలు జాబితా రూపొందించాలి. వాటిని గుర్తించడంలో, అంచనాలు రూపొందించడంలో స్థానికులతో పాటు కార్పొరేటర్లను భాగస్వాములను చేయాలి. అంచనాలు రూపొందించేందుకు ముందే నాలా పొడవెంత.. ఎంత పూడిక ఉంటుంది? అనే అంశాలతో పాటు కార్మికులతోనే పూడిక తీయించవచ్చా, లేక యంత్రాలను వినియోగించాలా అనేది అంచనా వేయాలి. పూడిక తీయడానికి ముందు, తీస్తున్నప్పుడు, పూర్తిగా తీశాక ఫొటోలను సంబంధిత బిల్లులతో పాటు జతచేయాలి. చేసిన పనులకు కనీసం ఐదుగురు స్థానికుల సంతకాలతో పాటు, వారి ఫోన్ నంబర్లు ఇవ్వాలి. రోడ్డుపై గుంతకు వెంటనే రిపేర్ ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 79 అత్యవసర బృందాలు పనిచేస్తున్నాయి. రోడ్లపై ఎక్కడైనా గుంత కనిపించినా, డ్రైన్లు పొంగిపొర్లినా ఫిర్యాదు చేసిన వెంటనే పరిష్కరిస్తాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. న్యాక్ ద్వారా ఔట్ సోర్సింగ్పై తీసుకున్న ఇంజినీర్ల సేవలను ఈపనులకు వినియోగించుకుంటున్నారు. -
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మెంబర్లకు పాలసీ
ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజమైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) సుప్రీం కోర్టు బార్ అసోసి యేషన్ (ఎస్సీబీఏ) సభ్యులకు గ్రూపు పాలసీని ప్రారంభించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) దీపక్ మిశ్రా చేతుల మీదుగా ఈ పాలసీ విడు దలైంది. పాలసీలోని సభ్యులకు రూ.20 లక్షల కవరేజీ ఉంటుందని, 64 ఏళ్ల వయస్సులోపు ఎస్సీబీఏ మెంబర్లు పాలసీకి అర్హులని వెల్లడించింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాట్లాడుతూ.. ‘క్లైమ్ల పరిష్కారంలో ఎల్ఐసీ కచ్చితత్వం పాటిస్తుంది. సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ సభ్యులకు గ్రూప్ పాలసీ ఏర్పాటుచేసిన విధంగా జిల్లాలు, ఇతర స్థాయిల్లోని బార్ అసోసియేషన్ సభ్యులకు కూడా ఎల్ఐసీ గ్రూప్ పాలసీలను అందించాల్సిన అవసరం ఉంది.’ అని వ్యాఖ్యానించారు. -
కొత్త టెలికాం పాలసీ : 40 లక్షల ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ: టెలికాం రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుడుతూ కొత్త టెలికాం విధానానికి కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. జాతీయ టెలి కమ్యూనికేషన్ పాలసీ 2018ని బుధవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. నేషనల్ డిజిటల్ కమ్యూనికేషన్స్ పాలసీ(ఎన్డీసీపీ) 2018 త్వరలోనే అమల్లోకి తీసుకురానుంది. 40 లక్షల ఉద్యోగాలను సృష్టించే లక్ష్యంతో ఈ కొత్త విధానాన్ని రూపొందించామని కేంద్ర కమ్యూనికేషన్ మంత్రి మనోజ్ సిన్హా వెల్లడించారు. సెకనుకు 50 మెగా బిట్స్(ఎంబీపీఎస్) వేగం, అందరికీ సె బ్రాడ్ బాండ్ సేవలను అందించేలా ఈ కొత్త విధానాన్ని డిజైన్ చేసినట్టు చెప్పారు. కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వవ్యాప్తి, స్థితిస్థాపకంగా, సురక్షితమైన, సరసమైన డిజిటల్ కమ్యూనికేషన్ సేవలను అందించాలనేది తమ లక్ష్యమని కేంద్ర సమాచార మంత్రి తెలిపారు. అంతేకాదు టెలికాంరంగంలో పెట్టుబడులను పెంచడంతో పాటు 5జీ టెక్నాలజీ సాయంతో హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ సేవలను మెరుగుపర్చడం, అందుబాటు ధరల్లో సేవలను తీసుకురావడమే లక్ష్యమన్నారు. 2020నాటికి అన్ని గ్రామ పంచాయతీల్లో ఒక మెగా బిట్స్(ఎంబీపీఎస్)వేగంతో, 2022నాటికి 10మెగా బిట్స్ వేగంతో బ్రాడ్బాండ్ సేవలను విస్తరించనున్నామన్నారు. డిజిటల్ కమ్యూనికేషన్స్ రంగంలో 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించనున్నట్టు సిన్హా వెల్లడించారు. తద్వారా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారత్ను టాప్ 50దేశాల్లో ఒకటిగా నిలపాలని యోచిస్తున్నట్లు సిన్హా పేర్కొన్నారు. 2017లో 134 దేశాలతో అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్ యూనియన్ ఆవిర్భవించింది. -
ట్రంప్ జీరో టాలరెన్స్కి భారతీయులూ బలి
పసిపిల్లల ఆక్రందనల్ని కూడా పట్టించుకోకుండా అమెరికాలో ట్రంప్ సర్కార్ కఠినంగా అమలు చేస్తున్న వలస విధానానికి భారతీయులూ బలైపోతున్నారు. కేవలం ఒక్క నెలలోనే 50 మందికి పైగా భారతీయులను అదుపులోనికి తీసుకొని ఒరెగాన్లో షెరిడాన్ ఫెడరల్ జైలుకి తరలించినట్టు స్థానిక పత్రిక ది ఒరెగోనియన్ ఒక కథనంలో వెల్లడించింది. కొంత మంది భారతీయుల పిల్లల్ని కూడా తల్లిదండ్రుల నుంచి వేరు చేసినట్టు కూడా తెలుస్తోంది. గతనెలలో 123 మంది దక్షిణాసియా నుంచి ఆశ్రయం కోరి వస్తే, వారిని నిర్బంధించి జైలుకి తరలించారు. వారిలో 52 మంది భారతీయులని వారంతా పంజాబీ, హిందీ మాట్లాడుతున్నారని , మిగిలిన వారు చైనా, మెక్సికో, నేపాల్, పాకిస్థాన్, ఉక్రెయిన్ తదితర దేశాల నుంచి వచ్చారని ఆ కథనం పేర్కొంది. డెమొక్రాటిక్ పార్టీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధుల బృందం ఈ జైళ్లను సందర్శించినప్పుడు అక్రమ వలసల పేరుతో భారతీయుల్ని కూడా నిర్బంధిస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. శరణార్థులందరినీ ఏకాకిలను చేసి, ఎవరితోనూ మాట్లాడడానికి కూడా వీలు లేకుండా చేస్తున్నారు. కనీసం లాయర్ని సంప్రదించే అవకాశం కూడా వారికి ఉండడం లేదు. అలా నిర్బంధించిన భారతీయుల్లో సిక్కులు, క్రిస్టియన్లు ఎక్కువగా ఉన్నారు. భారత్లో మతపరమైన వేధింపులు తట్టుకోలేక తాము దేశం విడిచి వచ్చినట్టు వారు చెబుతున్నారు. ‘ రోజుకి 22 నుంచి 23 గంటల పాటు నాలుగ్గోడల మధ్యే ఉంచుతున్నారు. ఒక సెల్లో ముగ్గురేసి చొప్పున ఉన్నాము. భార్యలు ఎక్కడున్నారో తెలీదు. పిల్లల్ని ఏం చేశారో ఆందోళనగా ఉంది. కనీసం లాయర్తో మాట్లాడే అవకాశం కూడా మాకు ఇవ్వడం లేదు. ఏం చేయాలో తెలీక బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నాం‘ అంటూ వారంతా డెమొక్రాటిక్ పార్టీ నేతలతో మొర పెట్టుకున్నారు. 7 వేలకు పైగా భారతీయుల దరఖాస్తులు : యూఎన్ అమెరికాని ఆశ్రయం కోరి వస్తున్న వారి సంఖ్య ఏడాదికేడాది పెరిగిపోతోంది. 2017లో 7 వేలకు మందికి పైగా భారతీయులు అమెరికాలో ఆశ్రయం కావాలంటూ దరఖాస్తు చేసుకున్నట్టుగా ఐక్యరాజ్య సమితికి చెందిన శరణార్థి సంస్థ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 2017 చివరినాటికి 6.85 కోట్ల మంది నిరాశ్రయులుగా మారారని, వారిలో కేవలం గత ఏడాది 1.62 కోట్ల మంది నిరాశ్రయులు ఉన్నారని ఆ నివేదిక వెల్లడించింది. ప్రతీ రోజూ సగటున 44 వేల 500 మంది నిరాశ్రయులుగా మారుతున్నట్టు యూఎన్ అంచనా వేసింది. యుద్ధాలు, హింసాత్మక ఘటనలు, రాజకీయ అనిశ్చితి కారణంగా నిరాశ్రయులవుతున్న వారి సంఖ్య ఎక్కువైపోతోంది. కాంగో సంక్షోభం, దక్షిణ సూడాన్ యుద్ధం, మయన్మార్ నుంచి రోహింగ్యా శరణార్థులు ఇలా వివిధ దేశాల నుంచి వలసలు ఇటీవల కాలంలో పెరిగిపోవడంతో గత ఏడాది అత్యధికంగా 49,500 మంది అమెరికాకు శరణార్థులుగా వెళ్లడానికి దరఖాస్తు చేసుకున్నారు. వెనిజులా నుంచి 63 శాతం వరకు శరణార్థుల సంఖ్య పెరిగిపోవడం చూస్తే ఆ దేశంలో ఎంత దుర్భర పరిస్థితులు నెలకొన్నాయో అర్థమవుతోంది. మెక్సికో నుంచి 26,100, చైనా (17,400), హైతి (8,600), భారత్ (7,400) మంది పొట్ట చేత పట్టుకొని దేశం విడిచి వెళ్లిపోవడానికి సిద్ధమైనట్టు ఆ నివేదిక వెల్లడించింది. 2017 చివరి నాటికి భారత్లో లక్షా 97వేల 146 మంది దేశం విడిచి వెళ్లడానికి సిద్ధమయ్యారు. వీరిలో 10,519 మంది శరణార్థుల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇక 2013 సంవత్సరం నుంచి సిరియా నుంచి అత్యధికంగా వలస వెళ్లిపోతున్నారని ఆ నివేదిక వివరించింది. -
ఇక అటవి భూములను అడ్డంగా కొనుక్కోవచ్చు.!?
సాక్షి, న్యూఢిల్లీ : మనం తినే తిండీ, తాగే నీరు, పడుకునే మంచం, కూర్చునే సోఫా....ఇలా అన్నీ కార్పొరేట్ పరమవుతున్న నేటి పరిస్థితుల్లో చివరకు మనం పీల్చే గాలి కూడా కార్పొరేట్ పరం కాబోతోంది. ఎందుకంటే, మానవులు పీల్చే ఆక్సిజన్ను అమితంగా అందిస్తూ పర్యావరణ పరిరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తున్న అడవులు కార్పొరేట్ రంగం కబంధ హస్తాల్లోకి పోనున్నాయి. ఈ మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త ‘జాతీయ అటవి విధానం’ పేరిట ఓ ముసాయిదా బిల్లును రూపొందించింది. దీనిపై ప్రజాభిప్రాయాలను తెలుసుకునేందుకు వీలుగా బిల్లు ప్రతిని కేంద్ర అడవులు, పర్యావరణం, వాతావరణ మంత్రిత్వ శాఖ తన వెబ్సైట్లో పొందుపరిచింది. ఈ బిల్లు ముసాయిదాపైనా ప్రజలు, నిపుణులు తమ అభ్యంతరాలను ఏప్రిల్ 14వ తేదీలోగా తెలపాల్సిందిగా కూడా కోరింది. ఇంతవరకు మీడియా ప్రతినిధులు వ్యక్తం చేసిన సందేహాలకు మాత్రం సదరు మంత్రిత్వ శాఖ నుంచిగానీ, కేంద్ర ప్రభుత్వం నుంచిగానీ ఎలాంటి సమాధానాలు రాలేదు. వచ్చే సూచనలు కూడా కనిపించడం లేదు. ముసాయిదా బిల్లును యథాతధంగా అమలు చేయాలనే ఆలోచనతోనే ప్రభుత్వం కనిపిస్తోంది. వాస్తవానికి 2015 సంవత్సరంలోనే దేశంలోని అడవులను కార్పొరేట్ రంగానికి ధారాదత్తం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నించింది. అందుకు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరింది. ఈ మార్గదర్శకాలు అమల్లోకి రాకుండా 1988లో పార్లమెంట్ ఆమోదించిన ‘జాతీయ అటవి విధానం’ అడ్డుపడింది. 1988 నాటి విధానంలో పేర్కొన్న మార్గదర్శకాలకు బీజేపీ రూపొందించిన మార్గదర్శకాలు పూర్తి భిన్నంగా ఉండడంతో ప్రభుత్వ అటవి భూములను ప్రైవేటు కార్పొరేట్ రంగానికి అప్పగించాలంటే కొత్త బిల్లు తీసుకరావడం తప్పనిసరి అయింది. అందుకనే ఇప్పుడు ఈ కొత్త బిల్లు ముసాయిదా ప్రజల ముందుకు వచ్చింది. అడవుల పరిరక్షణ, నిర్వహణ, అడవుల వినియోగానికి సంబంధించిన సమస్త చట్టాలు జాతీయ అటవి విధానం పరిధిలోకే వస్తాయి. ఇక్కడ అడవుల వినియోగం అంటే అడవుల నుంచి కలపను ఎంత ఉపయోగించుకోవాలి ? ఎలా ఉపయోగించుకోవాలి ? అడవులపై ఆధారపడి బతుకుతున్న గిరిజనుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి? తదితర అంశాలన్నీ వస్తాయి. అడవులను ప్రైవేట్పరం చేయాలని, వాటికి కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఎప్పటి నుంచో ఒత్తిళ్లు వస్తున్నాయి. మొదటి సారి 1998లో, రెండోసారి 2008లో గట్టిగా కేంద్ర ప్రభుత్వం ముందుకు ఈ ప్రతిపాదనలు రాగా, వాటిని అప్పటి ప్రభుత్వాలు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాయి. లాభాపేక్ష కలిగిన కార్పొరేట్ సంస్థలు సహజసిద్ధంగా పెంచే చెట్లకన్నా కొట్టేసే చెట్ల సంఖ్య ఎక్కువగా ఉంటుందన్న భయంతోనే నాటి ప్రభుత్వాలు ఈ ప్రతిపాదనలను పక్కన పడేశాయి. ఈ దేశంలో ఏ అభివృద్ధి అయినా ప్రభుత్వ సంస్థలకన్నా కార్పొరేట్ సంస్థల వల్లనే అవుతుందని భావించే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు అందుకు శ్రీకారం చుట్టింది. అటవులపై ఆదివాసీలయిన ట్రైబల్స్కు మరిన్ని హక్కులు కల్పిస్తూ 2006లోనే అప్పటి యూపీఏ ప్రభుత్వం కొత్తగా అటవి హక్కుల చట్టాన్ని తీసుకొచ్చింది. జాతీయ అటవి విధానాన్ని ఎందుకు సవరించాలంటే: కేంద్రం 1988 రూపొందించిన అటవి విధానానికి నేటికి పరిస్థితుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. సహజ అడవుల ఉత్పత్తులు గుణాత్మకంగానే కాకుండా పరిణామాత్మకంగా బాగా తగ్గిపోయాయి. వాతావరణ మార్పుల ప్రభావం పెరిగింది. మానవులు, వన్యప్రాణుల మధ్య సంఘర్షణ పెరిగింది. నీటి కొరత పెరిగింది. ముఖ్యంగా ఈ అటవి రంగంపై పెట్టుబడులు భారీగా తగ్గుతూ వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ అటవి విధానాన్ని సవరించి, కార్పొరేట్ రంగానికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం వచ్చిందని ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది. ఈ పరిస్థితిని ఎప్పుడో గుర్తించిన గత కేంద్ర ప్రభుత్వాలు అడవుల అభివద్ధికి మార్గదర్శకాలను విడుదల చేశాయి. కానీ వాటిని సంక్రమంగా అమలు చేయలేకపోయాయి. డీగ్రేడెడ్ అడవులనే... అడవులను కార్పొరేట్ రంగానికి అప్పగించాల్సి వస్తే దేశంలోని ‘డీగ్రేడ్’ అడవులనే ఇవ్వాలంటూ గత ప్రభుత్వాలకు నిపుణులు సూచించారు. అయితే అవికూడా తక్కువేమీ లేవు. దేశంలో 3.40 కోట్ల హెక్టార్లు డీగ్రేడ్ అడవులు ఉన్నాయి. ఫారెస్ట్ కనోపీ (చెట్ల పైభాగంలో దట్టంగా గుబురుగా ఉండే కొమ్మలు) 40 శాతం కన్నా తక్కువగా ఉన్న అడవులను డీగ్రేడెడ్ ఫారెస్ట్గా గుర్తిస్తున్నారు. పది శాతం ఫారెస్ట్ కనోపి కలిగిన అటవి భూములతో మొదలుపెట్టి 40 శాతం ఫారెస్ట్ కనోపి కలిగిన అటవి భూములను కార్పొరేట్ రంగానికి బిడ్డింగ్ రేట్పై ఇవ్వాలని నిర్ణయించినట్లు 2015లో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్గదర్శదర్శకాల్లో ఉంది. కానీ నేటి జాతీయ ముసాయిదా బిల్లులో ఆ స్పష్టత కనిపించడం లేదు. సహజ అడవులు, ప్రభుత్వ నియంత్రణ అడవులు, ప్రైవేటు ప్లాంటేషన్లను కలుసుకొని మొత్తం దేశంలోని అడవుల్లో ఈ డీగ్రేడెడ్ అడవులు 40 శాతం వరకున్నాయి. ఆగ్రో ఫారెస్ట్ అడవులు కూడా వీటి పరిధిలోకే వస్తాయి. రైతులు వ్యవసాయం చేసుకుంటూనే పొలాల చుట్టూ చెట్లను పెంచడాన్ని ఆగ్రోఫారెస్ట్ అని అంటాం. దేశవ్యాప్తంతా ఆగ్రోఫారెస్ట్పై ఆధారపడి బతుకుతున్న రైతులు దాదాపు రెండున్నర కోట్ల మంది ఉన్నారు. ఇక అడవులపై ప్రత్యంగానూ, పరోక్షంగానూ ఆధారపడి బతుకుతున్న ట్రైబల్స్ దేశవ్యాప్తంగా 30 కోట్ల మంది ఉన్నారు. అడవులను కార్పొరేట్పరం చేస్తే వారంతా ఏమవుతారు? వారికి ఎలా పునరావాసం కల్పిస్తారు? వారు కూలీలవుతారా? కర్షకులవుతారా? ఇలాంటి మీడియా ప్రశ్నలకే ప్రభుత్వం నుంచి సమాధానం రావడం లేదు. అడవులను ప్రవేటుపరం చేస్తే అడవిబిడ్డలు ఆగమ అవుతారని, వారి జీవితాలు ఆగమాగవుతాయని ట్రైబల్స్ హక్కుల కోసం పోరాడుతున్న సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. -
పాలసీకి ప్రాణం పోస్తారా!
(సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం) : ప్రతి కుటుంబానికీ జీవిత బీమా అంటే రక్షణ కవచం లాంటిదే. మరి ఆ కవచం తుప్పుపట్టకుండా ఉండాలంటే... పాలసీ తీసుకున్న వారు సకాలంలో ప్రీమియం చెల్లిస్తూ దాన్ని యాక్టివ్గా ఉంచుకోవడం తప్పనిసరి. ప్రీమియం చెల్లించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరవకూడదు. ఒకవేళ మీరు మీ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని ఏదైనా కారణంతోఆపేద్దామనుకుంటే..!! అలా చేయటం చాలా ఈజీయే కానీ... అది మీ కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేయటమేననుకోవాలి. సకాలంలో ప్రీమియం చెల్లించకపోతే ఏ పాలసీ అయినా ల్యాప్స్ అయిపోతుంది. దీంతో ఏదైనా జరిగితే వ్యక్తి కుటుంబానికి పరిహారం అందకుండా పోతుంది. అందుకే... పాలసీ ల్యాప్స్ అయిందని వదిలేయకుండా ఓ సారి దాన్ని పరిశీలించి, అవకాశం ఉంటే పునరుద్ధరించుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ల్యాప్స్ అయితే ఏంటి పరిష్కారం టర్మ్ పాలసీ తీసుకుంటే జీవితాంతం నిర్ణీత ప్రీమియం చెల్లిస్తూ ఉండాలి. అప్పుడే అది యాక్టివ్గా (చెల్లుబాటు) ఉంటుంది. ఏవో కొన్ని కారణాల రీత్యా గడువులోపు ప్రీమియం చెల్లించలేదనుకోండి. అప్పుడు అదనపు గడువు (గ్రేస్ పీరియడ్) ఉంటుంది. ఆ లోగా కూడా ప్రీమియం చెల్లించకుంటే పాలసీ ల్యాప్స్ అవుతుంది. అంటే మురిగిపోతుంది. ఇన్సూరెన్స్ పరిభాషలో నుంచి చూస్తే ల్యాప్స్ అయిన పాలసీ విషయంలో అన్ని రకాల ప్రయోజనాలూ ముగిసిపోయినట్టే. దాదాపు అన్ని బీమా కంపెనీలూ వార్షిక ప్రీమియానికైతే 30 రోజులు, అర్ధ సంవత్సరం, నెలవారీ ప్రీమియంలపై 15 రోజులు గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాయి. అంటే ఈ లోపైనా ప్రీమియం చెల్లించి పాలసీ ల్యాప్స్ కాకుండా చూసుకోవచ్చు. ఇక కంపెనీలను బట్టి గ్రేస్ పీరియడ్లో మార్పులుండొచ్చు. అందుకని టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్, నియమ, నిబంధనలు చూడాలి. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే గ్రేస్ పీరియడ్లోనూ బీమా రక్షణ కొనసాగుతుంది. అంటే గ్రేస్ పీరియడ్లో పాలసీదారుడికి ఏదైనా జరిగితే పరిహారం చెల్లించాల్సిన బాధ్యత బీమా సంస్థపై ఉంటుంది. ఉదాహరణకు ఓ వ్యక్తి గడువులోపు టర్మ్ పాలసీ ప్రీమియం చెల్లించకుండా, గ్రేస్ పీరియడ్ పూర్తయ్యేలోపు ప్రమాదం కారణంగా మరణించాడనుకుంటే... ఈ సందర్భంలో బాధితుని కుటుంబం పరిహారం కోసం క్లెయిమ్ దాఖలు చేస్తే బీమా కంపెనీ కచ్చితంగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ గ్రేస్ పీరియడ్ ముగిశాక ప్రమాదం జరిగి మరణం చోటు చేసుకుంటే పరిహారం చెల్లింపు బాధ్యత కంపెనీపై ఉండదు. గ్రేస్ పీరియడ్ తర్వాత...? గ్రేస్ పీరియడ్ లోపు కూడా ప్రీమియం చెల్లించకుంటే పాలసీ ల్యాప్స్ అయిపోతుంది. అపుడు పాలసీదారుడికి ఏం జరిగినా అతనిపై ఆధారపడిన వారికి కంపెనీ ఎలాంటి పరిహారం చెల్లించదు. ఒకవేళ పాలసీని పునరుద్ధరించుకోవాలని భావిస్తే అందుకు వీలుంటుంది. ఒకవేళ బీమా సంస్థ పాలసీ పునరుద్ధరణకు అంగీకరిస్తే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ పునరుద్ధరణ విషయంలో నిబంధనలన్నవి కంపెనీని బట్టి మారొచ్చు. సాధారణంగా టర్మ్ పాలసీలు ల్యాప్స్ అయితే, బకాయి ఉన్న ప్రీమియంను వడ్డీతో కలిపి చెల్లించడం ద్వారా పునరుద్ధరించుకోవచ్చు. కాకపోతే తమ ఆరోగ్య స్థితి బాగానే ఉందని ధ్రువీకరణ ఇవ్వడం లేదా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి రావచ్చు. అయితే, బీమా సంస్థ అంగీకరిస్తేనే పాలసీ పునరుద్ధరణ సాధ్యం. ఇందుకు నిర్ణీత ప్రక్రియ ఉంటుంది. కీలకాంశాలివీ... అన్ని కంపెనీలు సకాలంలో ప్రీమియం చెల్లించాలంటూ ముందు నుంచే ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ ద్వారా అలర్ట్ చేస్తుంటాయి. ప్రీమియం చెల్లించేందుకు ఎన్నో ఆప్షన్లు కూడా ఉన్నాయి. ప్రీమియం చెల్లింపు ఆప్షన్లను పరిశీలించి... పాలసీదారుడు తన బ్యాంకుకు స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్టయితే సకాలంలో (నిర్ణీత తేదీన) బ్యాంకు నుంచి ప్రీమియం బీమా కంపెనీకి వెళ్లిపోతుంది. ఇందుకోసం బీమా సంస్థలు బ్యాంకులతో ఒప్పందం చేసుకుంటున్నాయి. దీంతో పాలసీదారులు ప్రీమియంను బ్యాంకు ద్వారా చెల్లించొచ్చు. బీమా సంస్థ ఆఫీసుకు వెళ్లి చెల్లించొచ్చు. లేదా తన దగ్గరకే వచ్చి రెన్యువల్కు సంబంధించిన చెక్ తీసుకెళ్లాలని కోరొచ్చు. కొన్ని బ్యాంకులు ఏటీఎం నుంచే ప్రీమియం చెల్లింపు సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఇపుడు ఆన్లైన్ చెల్లింపులూ అందుబాటులోకి వచ్చాయి. చివరిగా చెప్పేదేమంటే బీమా పాలసీని ఎట్టి పరిస్థితుల్లోనూ ల్యాప్స్ కాకుండా చూసుకోవడమే మంచిది. పాలసీ కాల వ్యవధి ముగిసేదాకా ఏటా ప్రీమియం చెల్లించడం ద్వారా మీ కుటుంబానికి రక్షణ కల్పించడాన్ని మర్చిపోవద్దు. అలాగే, ఆదాయపన్ను సెక్షన్ 80సీ కింద పాలసీకి చెల్లించే ప్రీమియానికి పన్ను మినహాయింపు పొందొచ్చు. పాలసీ ల్యాప్స్ అయితే ఈ ప్రయోజనం కోల్పోతారు. టర్మ్ పాలసీ అన్నది మీ కోసం కాదు. మీ కుటుంబం కోసం. ఆత్మీయుల సంరక్షణ దృష్ట్యా పాలసీ తీసుకుని దాన్ని మనుగడలో ఉంచేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. -
కొత్త వాహన పాలసీ 2 నెలల్లో!!
గ్రేటర్ నోయిడా: కేంద్ర ప్రభుత్వం రాబోయే రెండు నెలల్లో కొత్త వాహన పాలసీ ముసాయిదాను ప్రకటించనుంది. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేలా పాలసీని రూపొందిస్తామని భారీ పరిశ్రమల మంత్రి అనంత్ గీతే తెలిపారు. 14వ ఆటో ఎక్స్పో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాలసీ రూపకల్పనలో సియామ్, ఏసీఎంఏ సహా పరిశ్రమ ప్రతినిధుల సూచనలు, సలహాలు పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారాయన. ‘ఎఫ్ఏఎంఈ స్కీమ్ తొలి దశ మార్చిలో ముగియనుంది. దీంతో రెండో దశపై దృష్టి కేంద్రీకరించాం. దీన్ని మరింత విజయవంతం చేయాలని భావిస్తున్నాం’ అని తెలిపారు. వివిధ వాహన విభాగాలపై పన్నును సవరించాలనే పరిశ్రమ డిమాండ్పై స్పందిస్తూ.. ‘పరిశ్రమ నుంచి పలు విజ్ఞప్తులు అందాయి. కొత్త పాలసీ విధానంలో వీటిని పరిష్కరిస్తాం’ అని హామీనిచ్చారు. కొత్త పాలసీ విధానం పరిశ్రమకు, వినియోగదారులకు స్నేహపూరితంగా ఉంటుందన్నారు. పరిశ్రమ కొత్త టెక్నాలజీలను ఒడిసి పట్టుకోవాలని, బీఎస్–6 నిబంధనల అమలు విషయంలో సవాళ్లను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం పరిశ్రమకు మద్దతుగా ఉంటుందన్నారు. ఇక పన్ను సంబంధ సమస్యలను ప్రభుత్వం తప్పనిసరిగా పరిష్కరించాల్సి ఉందని సియామ్ ప్రెసిడెంట్ అభయ్ ఫిరొడియా కోరారు. వాహన పరిశ్రమలో పలు మంత్రిత్వ శాఖల ప్రమేయం ఉందని, అలాకాకుండా ప్రతిపాదిత నోడల్ వ్యవస్థ ‘నేషనల్ ఆటోమోటివ్ బోర్డు’ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 2020 ఏప్రిల్ తర్వాత కూడా బీఎస్–4 వాహన విక్రయాలకు ప్రభుత్వం అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. కాగా వాహన పరిశ్రమ ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ రేటు 5%గా ఉండాలని డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం ఇది 12%. అలాగే ప్యాసింజర్ వాహన విభాగంలో కేవలం రెండు జీఎస్టీ శ్లాబ్లు మాత్రమే ఉండాలని కోరుతోంది. యూఎం లోహియా: యూఎం లోహియా టూవీలర్స్ తాజాగా ప్రపంచంలోనే తొలి ఎలక్ట్రిక్ క్రూయిజర్ ‘రెనెగెడ్ థార్’ను ఆవిష్కరించింది. దీని ధర రూ.4.9 లక్షలు (ఎక్స్షోరూమ్). కంపెనీ అలాగే రెనెగెడ్ డ్యూటీ ఎస్, రెనెగెడ్ డ్యూటీ ఏస్ బైక్స్ను ప్రదర్శకు ఉంచింది. వీటి ప్రారంభ ధర రూ.1.9 లక్షలు. ఈ రెండింటిలో 223 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. సుజుకీ మోటార్సైకిల్: సుజుకీ మోటార్సైకిల్ తాజాగా 125 సీసీ అడ్వాన్స్డ్ లగ్జరీ స్కూటర్ ‘బర్గ్మ్యాన్ స్ట్రీట్’ను ఆవిష్కరించింది. అలాగే సహా సబ్ 1,000 సీసీ విభాగంలో జీఎస్ఎక్స్–ఎస్750 బైక్ను ప్రదర్శించింది. కంపెనీ హయబుసా తర్వాత భారత్లో తయారు చేస్తోన్న రెండో పవర్ బైక్ ఈ జీఎస్ఎక్స్–ఎస్750నే. ఇన్ట్రూడర్ బైక్లో కొత్త వేరియంట్ను ప్రదర్శనకు ఉంచింది. పినాకిల్: పినాకిల్ స్పెషాలిటీ వెహికల్స్ తాజాగా కస్టమైజ్డ్ లగ్జరీ ఎక్స్పాండబుల్ మోటార్హోమ్ ‘ఫినెట్జా’ను ఆవిష్కరించింది. దీని ధర రూ.15–50 లక్షల శ్రేణిలో ఉండొచ్చు. కంపెనీ అలాగే మోడిఫైడ్ ఎగ్జిక్యూటివ్ బిజినెస్ వ్యాన్ ‘ఒపిసియా’, కస్టమైజ్డ్ టూరర్ ‘మాగ్రిఫిసియా’, మోడిఫైడ్ ప్రొడక్ట్ డిస్ప్లే వ్యాన్ ‘ఎగ్జిబికా’లను ప్రదర్శనకు ఉంచింది. ఎంఫ్లుక్స్ మోటార్స్: ఎంఫ్లుక్స్ మోటార్స్ తాజాగా ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ ‘ఎంఫ్లుక్స్ వన్’ నమూనాను ఆవిష్కరించింది. ఇది 2019 ఏప్రిల్లో భారతీయ రోడ్లపై పరిగెత్తనుంది. దీని గరిష్ట వేగం గంటకు 200 కిలోమీటర్లు. యూనిటి: స్వీడన్కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ యూనిటి తాజాగా 5 సీటర్ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. దీని ధర రూ.7.1 లక్షలు. ఇది 2020లో మార్కెట్లోకి రానుంది. కంపెనీ అలాగే 2 సీటర్ ఎలక్ట్రిక్ కారు ‘యూనిటి వన్’ను ప్రదర్శనకు ఉంచింది. ఈ కార్ల అసెంబ్లింగ్, మార్కెటింగ్ కార్యకలాపాల కోసం బర్డ్ గ్రూప్తో భాగస్వామ్యం కూడా కుదుర్చుకుంది. ట్వంటీ టూ మోటార్స్: ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ ట్వంటీ టూ మోటార్స్ తాజాగా స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ‘ఫ్లో’ను ఆవిష్కరించింది. దీని ధర రూ.74,740. దీన్ని 5 గంటలు చార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు వెళ్లొచ్చని కంపెనీ తెలిపింది. వీటి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఇవి 2018 రెండో అర్ధభాగంలో కస్టమర్లకు డెలివరీ అవుతాయి. (ఆటోషోను ప్రారంభిస్తున్న సియామ్ డైరెక్టర్ జనరల్ విష్ణు మాథుర్. ) (టీవీఎస్ అపాచీ ఆర్ఆర్310తో మోడల్) (బీఎండబ్ల్యూ మినీ కూపర్ కన్వర్టబుల్ ఎస్) -
త్వరలో గోల్డ్ పాలసీ
సాక్షి, న్యూడిల్లీ: బంగారాన్ని అసెట్ క్లాస్గా అభివృద్ధి చేయాలనే దిశగా ఆలోచిస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ గురువారం నాటి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. బంగారాన్ని ఒక ఆస్తిగా పరిగణించేందుకు ఒక గోల్డ్ పాలసీకి త్వరలోనే రూపకల్పన చేయనున్నామని ప్రకటించారు. గోల్డ్ మానిటైజేషన్ పథకం గురించి మాట్లాడుతూ అసెట్ క్లాస్గా విలువైన లోహం బంగారాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఒక సమగ్ర గోల్డ్ పాలసీని తీసుకురానుందని అరుణ్ జైట్లీ తెలిపారు. పరిశ్రమలో ప్రామాణిక నిబంధనలను నెలకొల్పడానికి దీర్ఘకాలిక గోల్డ్ పాలసీని రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. తద్వారా ప్రజలకు అవాంతర రహిత గోల్డ్ డిపాజిట్ ఖాతా తెరవడానికి వీలు కల్పించనున్నట్టు ఆయన పునరుద్ఘాటించారు. -
హెచ్1 బి వీసా కొత్త ప్రతిపాదన అత్యంత చెత్త పాలసీ
సాక్షి, న్యూఢిల్లీ: హెచ్ 1 బి వీసాల తాజా కఠిన నిబంధనలపై అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యుఎస్ఐబిసి) స్పందించింది. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్1బి వీసాలకు గడవు పొడిగించక పోవడం, నిబంధనలు కఠినతరం చేస్తుండడం పట్ల భారతీయ ఐటి సంస్థల నుంచి పెద్దఎత్తున ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా నిబంధనలపై యుఎస్ఐబిసి నిరసన వ్యక్తం చేసింది. ఇది అమెరికాలోని నిపుణులైన భారతీయ ఉద్యోగుల పాలిట అత్యంత చెత్త పాలసీగా నిలుస్తుందని పేర్కొంది. అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్కార్డుకు దరఖాస్తు చేసుకున్నవారు ఇక హెచ్1 బి వీసాను పొడిగించుకునే అవకాశం లేకుండా చేయాలన్న ప్రతిపాదన ఐటీ ఉద్యోగులకు ఇది నష్టకరమని వ్యాఖ్యానించింది. గత కొన్నేళ్లుగా అమెరికాలో సేవలందిస్తున్న అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు అలాంటి అవకాశాన్ని దూరం చేయడం సరైంది కాదంది. వారు అమెరికాలో అనేక సంవత్సరాల పాటు పనిచేస్తున్నారని యుఎస్ఐబిసి ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విధానం అమెరికన్ వ్యాపారాన్ని, తమ ఆర్థిక వ్యవస్థకు నష్టం చేకూర్చడంతోపాటు దేశానికి హాని చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా మెరిట్-ఆధారిత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ లక్ష్యాలకు భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొన్న నిర్ణయాల ప్రభావం ఇండియన్లపై తీవ్రంగా కన్పిస్తోంది. వేలాది మంది ఇండియన్లు ఇంటిముఖం పట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. హెచ్ 1 బీ వీసా నిబంధనలు కఠినతరం కావడం, గ్రీన్ కార్డు అప్లికేషన్లు పెండింగ్లో ఉండడంతో వేలాది మంది ఇండియన్ టెక్కీలు ఆందోళనలో పడ్డారు. బై అమెరికన్, హైర్ అమెరికన్ నినాదంతో హెచ్ 1 బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఫారిన్ ట్రేడ్ పాలసీ రివ్యూ: ఈజీ బిజినెస్, ఎగుమతులే లక్ష్యం
సాక్షి, న్యూఢిల్లీ: 2015-20కిగాను ఫారిన్ ట్రేడ్ పాలసీ రివ్యూను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వస్తువులు, సేవల ఎగుమతులను పెంచడానికి, దేశంలో ఉపాధి అవకాశాలు, విలువలను పెంచుకోవడానికి, విధాన పరమైన చర్యలు చేపట్టే లక్ష్యంతో, విదేశీ వాణిజ్యం పాలసీ మధ్యంతర సమీక్ష మంగళవారం కేంద్రం విడుదల చేసింది. 2020 నాటికి సుమారు 900 బిలియన్ డాలర్ల మేర రెట్టింపు వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐదు సంవత్సరాల విదేశీ వాణిజ్య విధానంలో ఏప్రిల్ 2015 ప్రత్యేక ఆర్ధిక మండలాలలో ఎగుమతిదారులు , విభాగాలకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. దాదాపు రూ. 8,500 కోట్ల కొత్త ప్రోత్సాహకాలను ప్రకటించింది. ముఖ్యంగా మైక్రో, చిన్న, మధ్య తరహా పరిశ్రమల, కార్మిక-ఇంటెన్సివ్ విభాగాలు, వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టింది. ఫారిన్ ట్రేడ్ డైరెక్టర్ జనరల్ అలోక్ చతుర్వేది మాట్లాడుతూ వ్యాపారాన్ని సులభతరం చేయనున్నామని పేర్కొన్నారు. ఈ క్రమంలో జీఎస్టీని గేమ్ చేంజర్ గా అభివర్ణించారు. వార్షిక ప్రోత్సాహకాలను 34శాతం పెంచి రూ.8,450కోట్లుగా నిర్ణయించామన్నారు. ఎఫ్టీపీ డైనమిక్ పత్రం.. దీని ద్వారా దేశంలో విలువలను పెంచుకోవడానికి, మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించడానికి , ఎగుమతులను పెంపు లక్ష్యంమని చెప్పారు. వస్తువుల ఎగుమతుల కోసం రూ. 4,567 కోట్లు, సేవల ఎగుమతులు రూ. 1,140 కోట్ల ఇంటెన్సివ్లను అందించనుంది. ఇటీవల రెడీమేడ్ దుస్తులపై ప్రకటించిన ప్రోత్సాహకాలు ఇవి అదనం.డ్యూటీ-ఫ్రీ దిగుమతుల కోసం స్వీయ ధృవీకరణ పథకాన్ని ప్రకటించింది. జీఎస్టీ నెట్వర్క్ పరిధిలో ఈ గడువును 18నెలలకు 24 నెలలకు పొడిగించింది. మర్చండైస్ ఎగుమతుల యొక్క ప్రోత్సాహక రేట్లు ప్రతి ఒక్కరికి 2శాతం పెంచింది. తోలు మరియు పాదరక్షల కోసం రూ .749 కోట్లు, వ్యవసాయం, సంబంధిత వస్తువులకు రూ. 1354 కోట్లు, మెరైన్ ఎగుమతులకు రూ .759 కోట్లు, టెలికాం మరియు ఎలక్ట్రానిక్ వస్తువులకు రూ .369 కోట్లు, హ్యాండ్ మేడ్ కార్పెట్లకు 921 కోట్లు, మెడికల్ అండ్ సర్జికల్ పరికరాలకోసం రూ. 193 కోట్లు, వస్త్రాలకు , రెడీమేడ్ వస్త్రాలకు రూ .1140 కోట్లు కేటాయించింది. -
మీ బీమా 'పాలసీ' సరైనదేనా!!
తక్కువ ప్రీమియంతో అత్యధికంగా జీవిత బీమా కవరేజీనిచ్చేవి టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు. అయితే, ఏ టర్మ్ ప్లాన్ తీసుకోవాలి.. కవరేజీ ఎంత ఉండాలి.. ఎక్కడ తీసుకోవాలి.. ఏమేం జాగ్రత్తలు పాటించాలి వంటి విషయాల్లో సందేహాలు ఉంటూనే ఉంటాయి. అలాంటివి నివృత్తి చేసే ప్రయత్నమే ఈ కథనం... 1. ఎంత ముందుగా తీసుకుంటే అంత మేలు.. ఈ వయస్సులోనే తీసుకోవాలంటూ టర్మ్ పాలసీకి ప్రత్యేకమైన పరిమితులేమీ లేవు. అయితే, వీలైనంత ముందుగా తీసుకుంటే మంచిది. ఎందుకంటే వయస్సు పెరిగే కొద్దీ కట్టాల్సిన ప్రీమియం కూడా పెరుగుతుంది. పై పెచ్చు.. ఇతరత్రా అనారోగ్యం లాంటివేమైనా వచ్చినా.. తర్వాత కాలంలో పాలసీ రావడం కూడా కష్టం కావొచ్చు. కనుక మీకు ఉండాల్సిన కవరేజీపై స్పష్టత వచ్చిన తర్వాత .. సాధ్యమైనంత త్వరగా తీసేసుకోవడం ఉత్తమం. 2. రిటైర్మెంట్ దాకానే.. టర్మ్ పాలసీ తీసుకోవాలని నిర్ణయించుకున్నాక.. ఇంతకీ ఎన్నేళ్ల వ్యవధికి తీసుకోవాలనే సందేహం తలెత్తవచ్చు. ప్రస్తుతం ముప్పై ఏళ్లున్న వ్యక్తి ఎనభై ఏళ్ల వ్యవధికి తీసుకోవాలా అంటే.. లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే..యవ్వనంలో ఉన్నప్పుడు ఆర్థిక బాధ్యతలు కాస్తంత ఎక్కువగానే ఉంటాయి.. కాబట్టి అధిక కవరేజీ అవసరమవుతుంది. అదే, వయస్సు పెరిగే కొద్దీ క్రమంగా మన అసెట్స్ పెరగవచ్చు. అలాగే.. రిటైర్మెంట్ తర్వాత మనపై ఆర్థికంగా ఆధారపడే కుటుంబ సభ్యుల సంఖ్య పెద్దగా ఉండకపోవచ్చు. 3. చౌక ప్రీమియం లెక్కల మాయలో పడొద్దు.. ఈ మధ్య చాలా మటుకు బీమా కంపెనీలు పాలసీ ప్రీమియంలను రోజువారీ లెక్కలు వేసి చాలా చౌకైనవిగా చూపే ప్రయత్నం చేస్తున్నాయి. రోజుకి పాతిక రూపాయలకే 1 కోటి రూపాయల పాలసీలంటూ పలు సంస్థలు ఊదరగొడుతున్నా యి. అయితే, ఈ లెక్కల మాయలో పడొద్దు. కారణమేంటంటే.. ఈ లెక్కం తా నిర్దిష్ట వయస్సుల్లో ఉన్నవారికి.. నిర్దిష్ట వ్యవధికి మాత్రమే వర్తిస్తుంది. చాలా మటుకు పాతికేళ్ల వయస్సు గల వారు ఓ నలభై ఏళ్లకు తీసుకునే పాలసీల్లాంటివి మాత్రమే ఇంత చౌకగా ఉంటాయి. కనుక.. మన వయస్సు, కాల వ్యవధి మొదలైనవన్నీ పరిగణనలోకి తీసుకునే ముందడుగు వేయాలి. 4. సింగిల్ ప్రీమియం పాలసీలకు దూరం.. జీవిత బీమా పాలసీ తీసుకునేటప్పుడు సింగిల్ ప్రీమియం అనీ విడతల వారీగా సాధారణ ప్రీమియం చెల్లింపులనీ రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి. కట్టగలిగే స్థోమత ఉంది కదా అని కొందరు వన్టైమ్ ప్రీమియంని ఎంచుకుంటే బాగుంటుందని అనుకుంటారు. ఏవో కొన్ని సందర్భాల్లో తప్ప అన్ని వేళలా ఇది సరికాదు. ఉత్తమమైన ఆప్షన్ ఏదైనా ఉందంటే.. అది వార్షిక ప్రీమియం విధానం. ఖర్చులు తగ్గుతాయనే కారణంతో వన్టైమ్ పేమెంటు ఆకర్షణీయంగా కనిపించినా దాన్ని ఎంచుకోకపోవడమే మంచిది. 5. ప్రీమియం పెరిగిందని ఆందోళన వద్దు.. టర్మ్ ప్లాన్ (ఆ మాటకొస్తే.. హెల్త్ ఇన్సూరెన్స్ అయినా సరే) తీసుకునేటప్పుడు ప్రీమియంలు.. ముందు అనుకున్న దానికన్నా వైద్య పరీక్షల తర్వాత మరికాస్త పెరగొచ్చు. మీ ఆరోగ్యపరమైన అంశాల ఆధారంగానే ఇది జరుగుతుంది. ఉదాహరణకు సిగరెట్స్, మద్యపానం లాంటి అలవాట్లతో పాటు గతంలో ఇతరత్రా తీవ్ర అనారోగ్య సమస్యలు మొదలైనవేమైనా ఉన్నా హై రిస్క్ కేటగిరీలోకి వస్తారు. కంపెనీ ముందుగానే దీన్ని గుర్తించి దానికి తగ్గట్లుగా ప్రీమియంలు తీసుకోవడం ఒక రకంగా మంచిదే. ఎందుకంటే తర్వాత దశలో ఏదైనా జరిగితే ఇలాంటి కారణాలు చూపించి క్లెయిమ్ను తిరస్కరించడానికి ఉండదు. 6. రైడర్స్పై అత్యుత్సాహం వద్దు... టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లకు అదనంగా కొన్ని రైడర్స్ కూడా లభిస్తాయి. ఇవి అందుబాటులో ఉన్నాయి కదాని తీసుకోవడం కాకుండా.. నిఖార్సుగా అవసరమైతేనే తీసుకోవడం మంచిది. ఉదాహరణకు.. ఎక్కువగా పర్యటనలు చేసే వారై ఉండి.. ప్రమాదాలకు అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చు అనుకున్నప్పుడు యాక్సిడెంటల్ రైడర్ను కూడా తీసుకోవడంలో అర్థం ఉంటుంది. అంతే తప్ప.. బీమా కంపెనీ ఆఫర్ చేస్తోందికదా అని తీసుకోవడంలో అర్థం లేదు. అలాగే భవిష్యత్లో తీవ్ర అనారోగ్యాలకేమైనా కవరేజీ కావాలనుకుంటే ప్రత్యేకంగా మరో పాలసీ తీసుకోకుండా..క్రిటికల్ కవర్ తీసుకోవచ్చు. వివిధ రకాల టర్మ్ ప్లాన్స్ రైడర్లేమిటంటే.. ♦ యాక్సిడెంటల్ డెత్ రైడర్ ఊ శాశ్వత, పాక్షిక అంగవైకల్యం ♦ క్రిటికల్ ఇల్నెస్ ఊ ప్రీమియం వెయివర్ ఊ ఇన్కమ్ బెనిఫిట్ రైడర్ 7. బేసిక్ పాలసీ శ్రేయస్కరం .. ప్రస్తుతం టర్మ్ ప్లాన్లలోనూ అనేక వెరైటీలు ఉంటున్నాయి. సాధారణంగా బేసిక్ పాలసీ విషయం తీసుకుంటే.. పాలసీదారు మరణానంతరం కుటుంబానికి ఏకమొత్తంగా క్లెయిమ్ లభిస్తుంది. అలా కాకుండా.. ప్రధాన కవరేజీతో పాటు పదేళ్లు.. ఇరవై ఏళ్లు స్థిరంగా ఆదాయాలు కూడా ఇస్తామనో.. లేదా వచ్చే పది, ఇరవై ఏళ్ల పాటు ఆదాయమిస్తూ.. క్లెయిమ్ సమయంలో కేవలం కొంత మొత్తం మాత్రమే వచ్చేలాగానో కొన్ని పాలసీలు ఉంటున్నాయి. ఇలాంటివి ఏవో కొన్ని సందర్భాలకు తప్ప అందరికీ పనిచేయవు. కనుక.. చాలా పరిస్థితుల్లో బేసిక్ పాలసీనే ఎంచుకోవడం శ్రేయస్కరం. 8. సిగరెట్స్, మద్యం అలవాటుంటే దాచొద్దు.. సిగరెట్లు, మద్యం సేవించడం మొదలైన అలవాట్లు ఉంటే.. జీవిత బీమా పాలసీ తీసుకుంటున్నప్పుడు దాచిపెట్టకుండా కచ్చితంగా వెల్లడించడమే మంచిది. ప్రీమియం పెరిగిపోతుందేమోనన్న భయంతో చెప్పకుండా ఊరుకుంటే.. తీరా ఏదైనా జరిగితే.. ఇదే విషయంపై క్లెయిమ్ తిరస్కరణకు గురికావొచ్చు. ఫలితంగా పాలసీ ఉన్నా ప్రయోజనం లేకుండా పోతుంది. అప్పుడప్పుడు ఏదో ఒకటో రెండో సిగరెట్లు కాలుస్తాను.. కనుక నాన్–స్మోకర్ కిందికే వస్తాను అనుకోవద్దు. ఎప్పుడో ఓసారైనా సరే రెండు కాల్చినా.. ఒకటి కాల్చినా కంపెనీ స్మోకర్ కిందే పరిగణిస్తుంది. మందు విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. ఏజెంటు కాకుండా సాధ్యమైనంత వరకూ మీ పాలసీ దరఖాస్తు మీరే నింపండి. అందులో కచ్చితంగా విషయాలన్నీ వెల్లడించండి. 9. ఆరోగ్య సమస్యలేమీ దాచిపెట్టొద్దు.. సాధారణంగా ప్రీమియంలు పెరిగిపోతాయేమో అన్న భయంతో కొన్ని సందర్భాల్లో కీలకమైన ఆరోగ్యపరమైన అంశాలను వెల్లడించకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇదే ఆ తర్వాత బైటపడిందంటే క్లెయిమ్ తిరస్కరణకు కూడా గురికావొచ్చు. కనుక ఏదైనా తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నా.. కీలకమైన ఆపరేషన్లు గట్రా చేయించుకున్నా.. పాలసీ దరఖాస్తులో ఆ విషయాలన్నీ పొందుపర్చడమే మంచిది. కుటుంబసభ్యుల అనారోగ్యాలూ వెల్లడించాలి.. పాలసీ విషయంలో కుటుంబ సభ్యుల ఆరోగ్య చరిత్ర కూడా ముఖ్యమే. ఒకవేళ తల్లిదండ్రులు గానీ తోబుట్టువులకు కానీ ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్న పక్షంలో అవి కూడా వెల్లడించడమే మంచిది. ప్రీమియం తగ్గించుకుందామనే భావనతో దాచిపెట్టొద్దు. ఉదాహరణకు పేరెంట్స్కి మధుమేహం ఉన్నా.. తమకు దానివల్ల సమస్య ఉండదనుకుంటారు. కానీ అది తప్పు. అరకొర కవరేజీ వద్దు.. మన దేశంలో సాధారణంగా పాలసీల సమ్ అష్యూర్డ్ పరిమాణం సగటున కేవలం రూ. 90,000– రూ. 1,00,000 దాకా మాత్రమే ఉంటోంది. చాలా మందికి ఆ మాత్రం బీమా కవరేజీనిచ్చే పాలసీలు కూడా ఉండటం లేదు. అది వేరే సంగతనుకోండి. అయితే, పాలసీ తీసుకుంటున్నవారు కూడా అరకొర కవరేజీ తీసుకోవడమే ప్రధాన సమస్య. ప్రస్తుతం అందరికీ రూ. 1 కోటి కవరేజీ ఫేవరెట్గా ఉంటోంది. కానీ .. ఖర్చులు పెరిగిపోతున్న పరిస్థితుల్లో రేప్పొద్దున్న ఇది ఏ మూలకూ సరిపోకపోవచ్చు. అందరికీ ఇదే స్థాయి సరిపోతుందనుకోవడానికి లేదు. సాధారణంగా లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ లెక్కింపునకో ఫార్ములా ఉంది. ఇందుకోసం మన అప్పులన్నింటినీ లెక్కేసుకుని, నెలవారీ ఖర్చులకు మూడు వందల రెట్లు దానికి జోడిస్తే.. ఎంత కవరేజీ అవసరమవుతుందన్నది ఒక అంచనాకు రావొచ్చు. దానికి మరికాస్త అదనంగా కలిపి పాలసీ కవరేజీ ఎంచుకోవడం మంచిది. ఉదాహరణకు మీకు రూ. 1.3 కోట్ల కవరేజీ అవసరం పడుతోందనుకుంటే.. రూ. 1 కోటికి కాకుండా రూ. 1.5 కోట్లకు పాలసీ తీసుకోవడం శ్రేయస్కరం. మరీ నాన్చొద్దు.. పాలసీ తీసుకుందామని నిర్ణయించుకున్నప్పటికీ.. బెస్ట్ పాలసీ తీసుకోవాలనే ఆలోచనతో, దాన్ని అన్వేషిస్తూ కాలయాపన చేస్తుంటారు మరికొందరు. అనేకానేక కంపెనీల పాలసీలను పోల్చి చూసుకుంటూ గడిపేస్తుంటారు. తీరా తీసుకునే సమయానికి పుణ్యకాలం కాస్త గడిచిపోవచ్చు. కాబట్టి పాలసీలో ఫీచర్లు, ప్రీమియంలు మొదలైన వాటి గురించి మరీ ఎక్కువగా విశ్లేషించుకుంటూ కూర్చోకుండా కీలకమైన అంశాల గురించి అధ్యయనం చేసి ముందుగా ఒక మెరుగైన పాలసీ తీసుకోవడం మంచిది. అసలే కవరేజీ లేకపోవడం కన్నా ఏదో ఒక కవరేజీ ఉండటం శ్రేయస్కరం కదా. ఆన్లైన్ బ్రోకింగ్ సంస్థలనూ పరిశీలించవచ్చు.. ప్రస్తుతం బీమా రంగంలోనూ పాలసీబజార్, కవర్ఫాక్స్ వంటి ఆన్లైన్ బ్రోకింగ్ సంస్థలు వచ్చాయి. కస్టమరుకు ఎటువంటి అదనపు ఖర్చులూ లేకుండా వేగవంతమైన సర్వీసులు, క్లెయిమ్ సెటిల్మెంట్ సహాయం మొదలైనవి అందిస్తున్నాయి. ఇందుకోసం ఆయా బీమా కంపెనీల నుంచి వాటికి కొంత మొత్తం లభిస్తుంది. అందుకే కస్టమరుకు భారం కాకుండా ఇవి సర్వీసులు అందించగలుగుతున్నాయి. పాలసీని నేరుగా కంపెనీ నుంచి కొన్నా.. లేదా ఈ బ్రోకింగ్ సంస్థ నుంచి తీసుకున్నా ప్రీమియం ఒకే రకంగా ఉండగలదు. కాబట్టి వీటినీ ఒకసారి ప్రయత్నించి చూడొచ్చు. లేదా సాంప్రదాయ పద్ధతిలోనే కంపెనీ నుంచే కొనుక్కోనూవచ్చు. నామినీ పేరు మరవొద్దు.. బీమా ఫాం నింపేటప్పుడు నామినీ పేరు కచ్చితంగా పేర్కొనాలి. జీవిత భాగస్వామి, పిల్లలతో పాటు ఇతరత్రా ఎవరికైతే టర్మ్ ప్లాన్ సొమ్ము చెందాలనుకుంటున్నారో వారి పేర్లను పొందువర్చవచ్చు. వీలైనంత వరకూ వయోవృద్ధులను నామినీలుగా ఎంచుకోకపోవడం మంచిది. ఇక వీలునామా లాంటిదేదైనా ఉంటే.. అందులో కూడా ఈ వివరాలను పొందుపర్చాలి. టర్మ్ ప్లాన్ గతంలో ఎప్పుడో తీసుకున్నదైనా.. తాజాగా ప్రాధాన్యతలు మారిన పక్షంలో ఆ మేరకు నామినీలను కూడా మార్చుకోవాలి. పాత పాలసీ గురించి చెప్పాలి.. సాధారణంగా జీవిత బీమా పాలసీ తీసుకునేటప్పుడు మనం అప్పటికే తీసుకున్న పాత బీమా పాలసీలు, వాటి కవరేజీ గురించి కూడా తెలియజేయడం తప్పనిసరి. అదనంగా ఎంత కవరేజీ ఇవ్వొచ్చనే దానిపై బీమా కంపెనీ సరైన అంచనా వేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ ఇప్పటికే పాత పాలసీల గురించి చెప్పకుండా తీసుకున్న టర్మ్ పాలసీ ఉన్న పక్షంలో.. ఆ వివరాలను ఇప్పటికైనా కంపెనీకి తెలియజేయడం శ్రేయస్కరం. ఒకటో.. రెండో చాలు.. జీవిత బీమాకు సంబంధించి ఒక టర్మ్ ప్లాన్ చాలు. కావాలనుకుంటే గరిష్టంగా రెండు చాలు. పాలసీల సంఖ్య అంతకు మించొద్దు. రూ. 2 కోట్ల ఇన్సూరెన్స్ కవరేజీని.. రూ. 50 లక్షల చొప్పున నాలుగు పాలసీలుగా తీసుకునే వారూ ఉన్నారు. దానికి బదులుగా పెద్ద మొత్తానికి ఒకటే తీసుకోవచ్చు. అలా కాదనుకుంటే గరిష్టంగా రెండింటి కింద తీసుకోండి. చాలు. పత్రాలు పరిశీలించాలి.. పాలసీ వచ్చిన తర్వాత తక్షణమే అన్ని కీలకమైన వివరాలు సరిగ్గా పేర్కొన్నారో లేదో పరిశీలించుకోవాలి. పేరు, వయస్సు, బ్లడ్ గ్రూపు, చిరునామా మొదలైనవన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఒకవేళ తేడాలేమైనా ఉంటే తక్షణమే కంపెనీ దృష్టికి తీసుకెళ్లి సరిచేయించుకోవాలి. మార్కెటింగ్ గిమ్మిక్కులకు పడొద్దు.. మన వార్షికాదాయానికి పది రెట్లు కవరేజీ ఉండాలంటూ కాల్ సెంటర్ మార్కెటింగ్ వాళ్లు చెప్పే మాటల్లో పడొద్దు. నికార్సుగా చెప్పాలంటే.. మన ఖర్చులు, అప్పులే కవరేజీ లెక్కింపునకు ప్రామాణికం కావాలి. నెలవారీ ఖర్చులకు మూడు వందల రెట్లు లెక్కించి.. దానికి అప్పులను కూడా కలిపి కూడితే.. కావాల్సిన కవరేజీ తెలుస్తుంది. ఇతరత్రా ఆర్థిక లక్ష్యాల సాధన కోసం (పిల్లల చదువు వగైరా) కూడా కలిపి మరి కాస్త జోడిస్తే.. ఎంత మొత్తానికి పాలసీ తీసుకోవాలనేది తెలుస్తుంది. ఉదాహరణకు నెలకు రూ. 50,000 ఖర్చులు, రూ. 60 లక్షల రుణబకాయి ఉందనుకుంటే.. 300 ్ఠ 50,000+ 60 లక్షలు కింద లె క్కిస్తే కనీసం రూ. 2.1 కోట్లు అవసరమవుతాయి. అలాం టప్పుడు కాస్త అటూ ఇటూగా రూ. 2.5 కోట్లకు కవరేజీ తీసుకోవచ్చు. కవరేజీకి ఖర్చులు, అప్పులే ప్రాతిపదిక కావాలి తప్ప ఆదాయం కాదు. మంచి బ్రాండ్ని ఎంచుకోవాలి.. ప్రస్తుతం దేశీయంగా ఇరవై నాలుగు పైచిలుకు జీవిత బీమా కంపెనీలు ఉన్నాయి. ఆయా సంస్థల క్లెయిమ్ సెటిల్మెంట్ తీరుతెన్నులు, క్లయింట్లతో వ్యవహరించే విధానం, వైద్య పరీక్షల నిర్వహణ శైలి, వ్యాపార నిర్వహణ తీరుతెన్నులు మొదలైనవన్నీ పరిశీలించాలి. ఇందుకోసం ఆన్లైన్లో డేటా చూడొచ్చు.. వాటిపై రివ్యూలు చదివి తెలుసుకోవచ్చు. కంపెనీ పెద్దదే కావాలనేమీ లేదు.. సర్వీసులు మెరుగ్గా అందించేదిగా పేరొందిన బ్రాండ్ని ఎంచుకోవచ్చు. ఇంట్లో చెప్పాలి.. టర్మ్ పాలసీ తీసుకున్నప్పుడు ఆ విషయం ఇంట్లో వారికి తప్పనిసరిగా చెప్పాలి. పాలసీ పత్రాలు, బీమా కంపెనీ కాంటాక్టు నంబరు మొదలైనవి ఇవ్వాలి. సంతోషపర్చే విషయం కాకపోయినప్పటికీ .. క్లెయిమ్ ప్రక్రియలో కీలకాంశాల గురించి అవగాహన కల్పించాలి. కావాలంటే ఈ ప్రక్రియ మొత్తం ఒక పేపరులో రాసి, ఎక్కడో ఒక దగ్గర భద్రపర్చి ఆ విషయాన్ని కుటుంబసభ్యులకూ చెప్పాలి. ఆన్లైన్లో టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ కొనుగోలు ఇలా .. ♦ ఎంత కవరేజీ అవసరమవుతుందో ముందే లెక్కగట్టుకోవాలి. ♦ ఆన్లైన్లో వివిధ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం కాలిక్యులేటర్స్ ఉపయోగించుకుని ప్రీమియం అమౌంటును లెక్కించుకోవాలి. ♦ ప్రీమియం మీ బడ్జెట్లోబడే ఉంటే.. టర్మ్ ప్లాన్కి అప్లై చేయొచ్చు. ♦ ప్రాథమికంగా ప్రీమియం చెల్లించి, డాక్యుమెంటేషన్ ప్రక్రియ ప్రారంభించవచ్చు. ♦ బీమా కంపెనీయే వైద్య పరీక్షల ఏర్పాట్లు చేస్తుంది. సమయం లోగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలి. ♦ అన్నీ సరిగ్గా ఉన్న పక్షంలో బీమా కంపెనీ మీకు పాలసీ జారీ చేస్తుంది. -
లక్ష్యం.. మద్యాంధ్రప్రదేశ్
జిల్లా బీజేపీ అధ్యక్షుడు మాలకొండయ్య కొత్తపేట : మద్యం దుకాణాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు గమనిస్తుంటే రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్గా మార్చేందుకా అనే అనుమానం కలుగుతోందని జిల్లా బీజేపీ అధ్యక్షుడు వై.మాలకొండయ్య వ్యాఖ్యానించారు.శుక్రవారం ఆయన కొత్తపేటలో ఆ పార్టీ కిసాన్మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాలూరి సత్యానందం స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. మద్యం దుకాణాల కోసం రాష్ట్ర ప్రభుత్వం జాతీయ, రాష్ట్ర రహదారుల స్థాయిని తగ్గించేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల రేపు జాతీయ రహదారులకు కేంద్రం నుంచి నిధులు తగ్గిపోవడం, అసలు వచ్చే పరిస్థితి లేకపోవడం జరుగుతాయన్నారు. రాష్ట్ర ఆదాయం పెంచుకోవడానికి మద్యం తప్ప మరే మార్గం లేదా అని ప్రశ్నించారు. ఒక ప్రక్క నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని కాంక్షిస్తూ స్వచ్ఛభారత్ వంటి పథకాలు అమలు చేస్తుంటే మరో పక్క రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం మద్యాన్ని ఏరులై పారించి ప్రజల అనారోగ్యానికి బాటలు వేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రహదారుల పక్కన మద్యం షాపుల విదానంపై పునరాలోచన చేయాలని కోరారు. కాపులకు ఇచ్చిన హామీకి కట్టుబడాలి ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీకి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేయాలని మాలకొండయ్య సూచించారు. ఇది సున్నితమైన అంశమని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవలసింది పోయి ఓటు బ్యాంకుల కోసం ఒకరిపై ఒకరిని రెచ్చకొట్టి పబ్బం గడుపుకునేలా వ్యవహరించడం తగదన్నారు. కాపు రిజర్వేషన్లు విషయంలో కమిటీ నిర్ణయానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. వివిధ కుల కార్పొరేషన్ రుణాల విషయంలో జన్మభూమి కమిటీల ప్రమేయంతో ఎంతో మంది అర్హులకు అన్యాయం జరుగుతోందన్నారు. స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ను తొలగించారన్నారు. ఎవరి డిమాండ్ల కోసం వారు పోరాడే హక్కు రాజ్యాంగం కల్పించిందని, ఇచ్చిన హామీని నెరవేర్చాలనే డిమాండ్తో కాపు ఉద్యమ నేత ముద్రగడ తలపెట్టిన పాదయాత్రను అడ్డుకోవడం తగదన్నారు. అవసరమైతే కాపు నాయకలతో చర్చించి సంతృప్తి పరిచేందుకు ధైర్యం చేయాలని మాలకొండయ్య సూచించారు. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లా పవన్కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు పాలాటి మాధవస్వామి, జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షుడు పాలూరి జయప్రకాష్నారాయణ, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు దొడ్డిపట్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
సెప్టెంబర్ నాటికి కొత్త పారిశ్రామిక విధానం
న్యూఢిల్లీ: నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించేందుకు కేంద్ర వాణిజ్య శాఖ ఆరు బృందాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 1991 నాటి పారిశ్రామిక విధానాన్ని సమూలంగా సంస్కరించే నూతన విధానం తయారీ బాధ్యతను వాణిజ్య శాఖ పరిధిలోని పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం(డీఐపీపీ) చేపట్టనుంది. కొత్తగా ఏర్పాటైన బృందాల్లో ప్రభుత్వ అధికారులతోపాటు విద్యావేత్తలు, కంపెనీల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. సెప్టెంబర్ నాటికి కొత్త పాలసీ ముసాయిదా సిద్ధం కానుంది. సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థలు (ఎంఎస్ఎంఈ), కొత్త ఆవిష్కరణలు, పన్నులు, టెక్నాలజీతోపాటు మౌలికవసతులు, మేథోసంపత్తి హక్కులు, సులభంగా వ్యాపార నిర్వహణ, భవిష్యత్తు ఉద్యోగ సామర్థ్యాలపై నివేదికలను ఈ బృందాలు రూపొందించనున్నాయి. 1991 నాటి పారిశ్రామిక విధానాన్ని పూర్తిగా సంస్కరించాల్సి ఉందని.. ఈ నూతన విధానం ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాలపై భారత్లో తయారీ, నైపుణ్య భారత్, స్టార్టప్ ఇండియాలకు ఊతమిచ్చేలా ఉంటుందని ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. -
ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు యథాతధం
ముంబై: భారతీయ కేంద్ర బ్యాంకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ద్రవ్యపాలసీని ప్రకటించింది. రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో రెండు రోజుల భేటీ అనంతరం ద్రవ్యవిధాన కమిటీ వడ్డీరేట్లపై తమ నిర్ణయాన్ని వెల్లడించింది. అంచనాలకు కనుగుణంగానే ఆర్బీఐ స్టేటస్ కో వ్యూహాన్నే అనుసరించింది. మానిటరీ పాలసీ కమిటిలో అయిదుగురు సభ్యులు యథాతధ పాలసీకే ఓటు వేసారు. బుధవారం ప్రకటించిన రివ్యూ పాలసీలో రెపో రేటు, రివర్స్ రెపో రేటును యథాతధంగానే ఉంచింది. రెపో రేటును 6.25 శాతం వద్ద, రివర్స్ రెపో రేటును వద్ద ఎలాంటి మార్పులేకుండా ఉంచింది. రెపో రేటు లేదా కీలక రుణాలపై 6.25 శాతం వడ్డీ రేటును కొనసాగించింది. రివర్స్ రెపో 6 శాతం వద్దే కొనసాగనుంది. దీంతో కీలక వడ్డీరేటు 6 సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరింది. అయితే ఎస్ఎల్ఆర్ 50 బీపీఎస్ పాయింట్లను కట్ చేసింది. -
మద్య నిషేధం ఏదీ బాబు?
- ఐద్వా రాష్ట్ర మహాసభల్లో అధ్యక్షురాలు ప్రభావతి ప్రశ్న అమలాపురం రూరల్: ఎన్నికలకు ముందు దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తామని..బెల్ట్ షాపులను పూర్తిగా తొలగిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం చేపట్టాక ఆ హామీలే మరిచారని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు డి.ప్రభావతి అన్నారు. అమలాపురం రూరల్ మండలం భట్లపాలెం బీవీసీ ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం ప్రారంభమైన రాష్ట్ర స్థాయి ఐద్వా శిక్షణ తరగతులకు ఆమె అధ్యక్షత వహించి ప్రసంగించారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ శిక్షణా తరగతులను జ్యోతి ప్రజ్వలనచేసి ఆమె ప్రారంభించారు. రాష్ట్రంలో రోజు రోజుకు మద్యం అమ్మకాలు పెంచేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని...మహిళలు మద్య నిషేధం కోసం మరోసారి ఉద్యమించాల్సిన అవసరం ఉందని ప్రభావతి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఊరూ వాడా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తూ గ్రామాలను మద్యం మయం చేస్తోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 1993–94 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మద్య నిషేధాన్ని అమలు చేశారని గుర్తు చేశారు. బాబు పాలనలో దానికి విరుద్ధంగా మద్యం అమ్మకాలను విచ్చల విడి చేసి ఖాజానా నింపుకుంటున్నారని ఆరోపించారు. జాతీయ రహదారులపై మద్యం దుకాణాలు తొలగించాలని సుప్రీం కోర్టు ఆదేశించినా ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ మద్యం వల్ల మహిళల బతుకులు అస్తవ్యస్తంగా మారాయని, భర్త సంపాదనలో అధిక శాతం మద్యానికే ఖర్చు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రొయ్యల పరిశ్రమల్లో సరైన భద్రత లేకే మహిళలు ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యూటీఎఫ్ జిల్లా నాయకురాలు అరుణకుమారి, ఐద్వా జిల్లా కార్యదర్శి సీహెచ్ రమణి, జిల్లా ఉపాధ్యక్షురాలు కుడుపూడి రాఘవమ్మ, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకుడు కేవీవీ సత్యనారాయణ, మద్యం వ్యతిరేక కమిటీ నాయకులు డాక్టర్ సూర్యనారాయణ, ఐద్వా లీగల్ కార్యదర్శి శిరోమణి తదితరులు పాల్గొన్నారు. -
మోదీ కొత్త ప్లాన్.. 2,3 నెలల్లో
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఉద్గారాలను నిరోధించి, ఇ- వెహికల్స్కు ప్రోత్సాహమిచ్చే క్రమంలో మోదీ ప్రభుత్వం కొత్త సమగ్ర వాహన పథకాన్ని తీసుకొచ్చేందుకు యోచిస్తోంది. ఈ పథకం ద్వారా 2030 నాటికి దేశంలోఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకు రావాలని ప్రయత్నిస్తోంది. బ్యాటరీలతో నడిచే రెండు, మూడు చక్రాల, బస్సుల పరిచయానికి ఉద్దేశించిన ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టబోతోంది. తద్వారా కంపెనీలకు రాయితీలను నిలిపివేసి, బ్యాటరీ లీజింగ్ వ్యూహంపై ఆధారపడి ఈ పథకం ఉండనుంది. జపాన్,చైనా లాంటి దేశాలు బ్యాటరీ లేని వాహనాలపై దృష్టిపెడుతుంటే, దానికి విరుద్ధంగా వాహన విధానాలను రూపొందించనుంది. రెండు మూడునెలలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నారని, ఆటో కంపెనీలకు పరిమిత పన్నులను ఆఫర్ చేస్తారని ది ఎకనామిక్ టైమ్స్ మంగళవారం తెలిపింది. ఈ పథకం డ్రాఫ్ట్ చివరి దశల్లో ఉందని ప్రయివేటు వాహనాలను కూడా ఓకే గొడుగు కిందకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదిస్తుందని రిపోర్ట్ చేసింది. 2030 నాటికి ఎలక్ర్టిక్ ఇతర ప్రత్యామ్నాయ ఇంధనంతో కలిపి హైబ్రిడ్ టెక్నాలజీతో వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు యోచిస్తోంది. ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ అశోక్ ఝున్ఝున్వాలా ఆధ్వర్యంలో నడిచే ఈ చర్యకు భారతీయ ఆటో కంపెనీలు ఆసక్తి చూపించగా, గ్లోబల్ కంపెనీలు ఇతర రకాల హైబ్రీడ్ టెక్నాలజీకి అనుకూలంగా ఉన్నాయని ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి పేర్కొన్నారు. బ్యాటరీ రీచార్జ్ చేసుకునేందుకువీలుగా బ్యాటరీ లీజింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చ్తేఆరు. తద్వారా వాహనదారుడికి బ్యాటరీ రీచార్జ్ చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఇది నాన్ ఎయిర్ కండీషన్డ్ వాహనాలకు పరిమితం. ఈ నేపథ్యంలో రోడ్డు రవాణా, శక్తి, పెట్రోలియం, భారీ పరిశ్రమలు తో లింక్ అయి వున్న ఈ పథకానికి నీతి ఆయోగ్ తుది రూపునిస్తోందని సమాచారం. దీని ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల ఇంధన ఖర్చలు తగ్గించుకోవాలనిది ప్లాన్ అని నివేదించింది. సెడాన్ వాహనానికి , కిలోమీటరుకు రూ.7ఖర్చు అవుతుండగా ఎలక్ట్రిక్ కి.మీ1 రూపాయి మాత్రమే ఖర్చవుతుందని పేర్కొంది. దీంతో వాహన ధరలు 70శాతం దిగివచ్చే అవకాశం ఉందని అంచనా వ్యక్తమవుతోంది. -
బీమాకు డిజిటల్ ఊతం
⇒ డిజిటల్ లావాదేవీలతో పాలసీదార్లకు మేలు ⇒ కంపెనీలు సైతం దీనిపై ఫోకస్ చెయ్యాలి ఇన్సూరెన్స్ గురించి అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఊహించని ప్రమాదాలేవైనా ఎదురైనప్పుడు కలిగే ఆర్థిక ఇబ్బందుల నుంచి బీమా (ఇన్సూరెన్స్) మనను కాపాడుతుంది. జీవిత బీమా కావొచ్చు.. ఆరోగ్య బీమా కావొచ్చు.. ఏ బీమా పాలసీలైనా మనల్ని విపత్కర పరిస్థితుల నుంచి కొంత మేర గట్టెక్కిస్తాయి. ప్రజల అవసరాలకు అనువైన పాలసీలను అందించడం బీమా కంపెనీల విధి. కాగా కొంతకాలంగా ఈ రంగం కొంచెం నెమ్మదించింది. ఉత్తేజానికి కొన్ని చర్యలు అవసరం. ఇందులో డిజిటలైజేషన్దే కీలక పాత్ర. స్తబ్దతకు కారణాలు అన్వేషించాలి.. గత కొన్నేళ్లుగా బీమా రంగంలో వృద్ధి మందగించింది. దేశంలో వృద్ధికి చాలా అవకాశాలు అందుబాటులో ఉన్నా కూడా ఇన్సూరెన్స్ వ్యాప్తి తక్కువగానే ఉండటం ఆశ్చర్యకరం. దీనికి కారణాలేంటన్నది బీమా కంపెనీలు కచ్చితంగా అన్వేషించుకోవాలి. భారత్లో ఇన్సూరెన్స్ పాలసీలు చాలా మందికి ఇంకా చేరటం లేదు. పాలసీల విలువను కస్టమర్లకు అర్థమయ్యేలా వివరించేందుకు తగిన చర్యలు చేపట్టకపోవటమూ దీనికి కారణమే. ఇందుకోసం బీమా కంపెనీలు టెక్నాలజీని విరివిగా ఉపయోగించుకోవాలి. ప్రజలకు, బీమా కంపెనీలకు మధ్య ఉన్న దూరాన్ని భర్తీ చేయగలిగేది టెక్నాలజీనే. దేశంలోని పరిస్థితులిపుడు ఇందుకు అనుకూలంగా కూడా ఉన్నాయి. యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా నిర్వహించే డిజిటల్ లావాదేవీల గణనీయంగా పెరుగుతున్నాయి. ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ ఏర్పాటవుతోంది. మరీ ముఖ్యంగా దేశంలో ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో భవిష్యత్లో లావాదేవీలన్నీ క్రమంగా డిజిటల్ ప్లాట్ఫామ్లోకి మారతాయి. ఇది ఇన్సూరెన్స్ రంగానికి బాగా కలిసొచ్చే అంశం. డిజిటలైజేషన్తో కీలక మలుపు.. డిజిటలైజేషన్ వల్ల ఇన్సూరెన్స్ రంగంలోని పలు పనులు సరళంగా, సమర్థవంతంగా జరుగుతాయి. టెక్నాలజీ వాడటం వల్ల పాలసీలను మార్కెట్లోకి తీసుకురావడం, వాటిని విక్రయించడం, పేమెంట్ చెల్లింపులు, సర్వీసులు వంటి వాటిని సమర్థంగా నిర్వహించవచ్చు. కంపెనీలు ఇప్పటికే డిజిటలైజేషన్ వైపు అడుగులేశాయి. ప్రొడక్ట్ విక్రయం, కస్టమర్ వివరాల నమోదు వంటివి ఇప్పటికే డిజిటలైజ్ అయ్యాయి. ఇక్కడ పేమెంట్ చెల్లింపులపై దృష్టి కేంద్రీకరించాలి. డిజిటల్ లావాదేవీల వల్ల వీటి సమస్య కూడా సమసిపోతుంది. కస్టమర్ నుంచి కంపెనీకి డాక్యుమెంట్స్ చేరాక జరిగే తదనంతర కార్యకలాపాల్లో గత రెండేళ్ల నుంచి మంచి పురోగతి కనిపిస్తోంది. టెక్నాలజీ ద్వారా కన్సూమర్లలలో అవగాహన పెంచాలి. డిజిటలైజేషన్ వల్ల తగ్గే వ్యయాలను కస్టమర్లకు బదిలీ చేస్తే.. అప్పుడు వారికి తక్కువ విలువతో మంచి ప్రొడక్ట్ను అందించొచ్చు. -
మీ ఆరోగ్యం విలువెంత?
ఎంత బీమా అవసరమో తెలుసుకోండి తీసుకునేటపుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి ఒకవైపు కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తుంటే.. మరొకవైపు ఎప్పటి నుంచో ఉన్నవి మరింతగా విస్తరిస్తూ వాటి తడాఖా చూపిస్తున్నాయి. రోగం వచ్చి ప్రాణం బాగులేక ఆసుపత్రికి వెళితే.. అక్కడ వారి బిల్లులు చూశాక గుండె గుభేలుమంటోంది. ఇలాంటి సమయాల్లో అందరికీ ఆరోగ్య బీమా తప్పనిసరి. దురదృష్టవశాత్తూ ఇది కొందరికే ఉంటోంది. కర్ణుడి చావుకి కారణాలనేకం అన్నట్లుగా.. దీనికి కూడా చాలా కారణాలున్నాయి. ఏదేమైనా ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య బీమా తీసుకుని తీరాల్సిందే. అపుడేమైనా జరగరానిది జరిగితే అది మనకు ఆర్థికంగా కొంత బాసటగా నిలుస్తుంది. మన కుటుంబానికి అండగా ఉంటుంది. మరి ఎంత మొత్తానికి ఆరోగ్య బీమా తీసుకోవాలి? ఈ ప్రశ్న చాలా మందికి వచ్చి ఉంటుంది. దీనికి సమాధానమే ఈ కథనం. ప్రీమియం చెల్లింపే ఆధారం... మార్కెట్లో పలు బీమా సంస్థలున్నాయి. అవి అనేక రకాల పాలసీలను విక్రయిస్తున్నాయి. అందుకే మన అవసరాలకు, ప్రాధాన్యాలకు అనువైన పాలసీలను ఎంచుకోవాలి. ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలనే అంశం.. మీరు ఎంత మేరకు ప్రీమియం చెల్లించగలరనే విషయంపై ఆధారపడి ఉంటుంది. అందుకే మనం ముందుగా అందుబాటు ప్రీమియం చెల్లింపుల్లో అనువైన పాలసీలు ఏమైనా ఉన్నాయేమో చూడాలి. అంతేకానీ ఆరోగ్య బీమా తీసుకోవడంలో ఎప్పుడూ ఆలస్యం చేయకూడదు. స్వల్ప బీమా కవరేజ్కైనా సరే బీమాను వెంటనే తీసుకోవాలి. తర్వాత కావాల్సి వస్తే కవరేజ్ను పెంచుకోవచ్చు. చిన్న వయసులోనే బీమా ఎంత త్వరగా బీమా తీసుకుంటే అంత మంచిది. చిన్న వయసులో ఆరోగ్య సమస్యలు తక్కువగా వస్తాయి. అప్పుడు బీమా తీసుకోవడం వల్ల ప్రీమియం కూడా తక్కువగా ఉంటుంది. గత మూడేళ్లలో హాస్పిటల్ ఖర్చులకు మనం ఎంత వెచ్చించామో ఒకసారి లెక్కించాలి. వార్షిక వేతనంలో సగభాగాన్ని, మూడేళ్లలో అయిన హాస్పిటల్ ఖర్చులను కలిపితే వచ్చే మొత్తానికి సమానంగా మన బీమా కవరేజ్ ఉండాలి. ఉదాహరణకు రాము అనే వ్యక్తికి వార్షిక వేతనం రూ. 5,00,000గా ఉంది. అతని మూడేళ్ల వైద్య ఖర్చులు రూ.50,000గా ఉన్నాయి. అప్పుడు రాము బీమా కవరేజ్ రూ.3,00,000గా ఉండాలి. ఇక్కడ హాస్పిటల్ను బట్టి కవరేజ్ మొత్తం మారుతుంది. అలాగే భార్యకు, పిల్లలకు, తల్లిదండ్రులకు కూడా కవరేజ్ తీసుకోవాలనుకుంటే.. అప్పుడు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలను ఎంచుకోవడం మంచిది. కుటుంబంలోని ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిగత పాలసీ తీసుకోవడం కన్నా అందరికీ కలిసి ఫ్లోటర్ ప్లాన్ని తీసుకోవడం ఉత్తమం. దీని వల్ల ఖర్చు తగ్గుతుంది. ఇక కంపెనీలు కూడా ఉద్యోగులకు ఆరోగ్య బీమాను ఆఫర్ చేస్తుంటాయి. అయితే ఇవి సమగ్రమైన కవరేజ్ను అందిస్తాయో లేదో తెలియదు. వ్యక్తిగత ఇన్సూరెన్స్ పాలసీ సరిపోదు అనుకుంటే.. టాప్–అప్ ప్లాన్స్ను తీసుకోవాలి. ఇవి అదనపు కవరేజ్ను అందిస్తాయి. కొత్త పాలసీ తీసుకోవడానికి లేదా ఉన్న పాలసీని అప్గ్రేడ్ చేసుకోవడానికయ్యే ఖర్చు కన్నా టాప్–అప్ ప్లాన్స్ చౌకే. ఈ విషయాలు మరవొద్దు ♦ రీయింబర్స్మెంట్ పాలసీ కన్నా క్యాష్లెస్ పాలసీని తీసుకోవడానికి మొగ్గుచూపండి. అప్పుడే వైద్యానికి డబ్బు ముందు చెల్లించి, దాన్ని తిరిగి తర్వాత తీసుకోవాల్సిన పని తప్పుతుంది. ♦ హాస్పిటల్లో రూమ్ అద్దె ఖర్చు, డాక్టర్ ఫీజు, మందులకయ్యే వ్యయం వంటివి పాలసీ కవరేజ్లో భాగమో కాదో తెలుసుకోండి. అన్ని పాలసీలు అన్ని వ్యయాలను భరించవనే విషయాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ♦ ఇన్సూరెన్స్ కంపెనీ భాగస్వామ్య హాస్పిటల్లోనే వైద్యం చేయించుకోవాలా? లేదా ఏ హాస్పిటల్లో చేయిం చుకున్నా రీయింబర్స్మెంట్స్ చెల్లిస్తారా? అనే అంశాలను మీరు క్షుణ్ణంగా తెలుసుకోండి. -
నగదు విత్డ్రాయల్స్పై ఆంక్షలు ఎత్తివేత!
-
ఆర్బీఐ కీలక నిర్ణయం
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆరవ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లకు ఎలాంటి సర్ ప్రైజ్ లేకుండా వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించింది.. ఫిబ్రవరి 8 బుధవారం ఆర్బీఐ నిర్వహించిన క్రెడిట్ పాలసీ రివ్యూలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు తెలిపింది. రెపో(బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు)ను 6.25శాతంగా, రివర్స్ రెపో రేటు(ఆర్బీఐ వద్ద ఉంచే నిధులపై బ్యాంకులకు లభించే వడ్డీ రేటు)ను 5.75 శాతంగా ఉంచుతున్నట్టు పేర్కొంది. బ్యాంకు రేటు 6.75 శాతంగా అమలుకానుంది. ఆర్బీఐ గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో జరుగుతున్న మూడవ సమీక్ష ఇది. మెజారిటీ ప్రాతిపదికన రేట్ల నిర్ణయం తీసుకోడానికి ఆరుగురు సభ్యులతో పరపతి విధాన కమిటీ (ఎంసీపీ) ఏర్పడిన తరువాత నిర్వహిస్తున్న 3వ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. కాగా వడ్డీ రేట్ల తగ్గింపుపై అనేక సెక్టార్లు ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. వారి ఆశలు అడియాసలు చేస్తూ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని మానిటరీ కమిటీ ఈ నిర్ణయం వెలువరచగానే, మార్కెట్లో నష్టాలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 114 పాయింట్ల నష్టంలో 28,220 వద్ద, నిఫ్టీ 28 పాయింట్ల నష్టంతో 8,739వద్ద కొనసాగుతున్నాయి. -
విధి వక్రించి.. వీధినపడి..
బీమా సొమ్ము ఇవ్వని టీడీపీ సభ్యత్వం అక్కరకు రాని అమ్మ బ్యాంకు ఖాతా సొమ్ము అనాథలుగా మారిన చిన్నారులు బలభద్రపురం(బిక్కవోలు) : ఆటపాటలతో తల్లిదండ్రుల మధ్య గడపాల్సిన చిన్నారులు చిన్నతనంలోనే అండను కోల్పోయారు. ఆదుకోవలసిన ప్రభుత్వం మొండి చెయ్యి చూపగా, అండగా ఉండాలనుకున్న పిన్నమ్మ అవిటిదై మంచానికి పరిమితమైంది. దీంతో ఆ చిన్నారులు అనాథలయ్యారు. మండలంలోని బలభద్రపురం గ్రామానికి చెందిన మామిడి అప్పారావు, సూర్యకుమారి దంపతులు కూలీపనులు చేసుకుని జీవనం సాగిస్తూ వారి ఇద్దరు కుమార్తెలను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. 2014వ సంవత్సరంలో అప్పారావు తన పొలంలో క్రిమి సంహారక మందు పిచికారీ చేస్తూ విషప్రభావానికి గురై ఇంటికి వచ్చాకా కుప్పకూలిపోయాడు. ఆ విషాదంనుంచి కోలుకోకుండానే తల్లి సూర్యకుమారి వ్యవసాయ పనులకు ఆమె మరిది తోడికోడలు వెంకటలక్షి్మతో కలసి బైక్పై వెళ్తుండగా పిఠాపురం సమీపంలో జల్లూరు వద్ద లారీ ఢీకొని అక్కడికక్కడే చనిపోయింది. ఈ ప్రమాదంలో వెంకటలక్షి్మ ఒక కాలు కోల్పోయి మంచానికే పరిమితమయింది. దీంతో ఆ చిన్నారుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆదుకోని ప్రధాన మంత్రి బీమా యోజన చిన్నారుల తల్లి సూర్యకుమారి అసంఘటిత కార్మికురాలు కావడంతో ఆమె పేరున అనపర్తి ఆంధ్రాబ్యాంక్లో ఖాతా తెరిచారు. ప్రధాన మంత్రి బీమా యోజన పథకంలో భా గంగా ఏటా రూ.12 ఆమె ఖాతా నుంచి తీసుకుని బీమా కల్పించాల్సి ఉంది. ఈ పథకం కింద లబ్ధిదారు చనిపోతే రూ.2లక్షలు అ కుటుంబానికి అందచేయాల్సి ఉంటుంది. కాని ఇంత వరకు ఆ సొమ్ము అందలేదు. ఇద్దరు చిన్నారులను వెంటబెట్టుకుని వారి తాత ఏడాదిగా బ్యాంకు చుట్టూ తిరగుతున్నా పని మాత్రం కావడం లేదని వాపోయాడు. బయటపడిన టీడీపీ సభ్యత్వంలోని డొల్లతనం రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయి అంగవైకల్యంతో బాధపడుతున్న వెంకటలక్ష్మి టీడీపీ వీరాభిమాని. దీంతో 2014లో రూ.100లు చెల్లించి పార్టీ సభ్యత్వం కూడా తీసుకుంది. పార్టీ నిబంధనల ప్రకారం సభ్యులు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చేరితే, ప్రత్యేక రాయితీలతో పాటు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.50వేల వరకు తక్షణ సహాయంగా అందించాలి. కానీ నేటికీ పైసా కూడా ఇవ్వకపోడంతో ఆమె కన్నీటి పర్యంతమైంది. నిజమైన నిరుపేదలకు పార్టీలో న్యాయం జరగడం లేదని పైరవీకారులకు మాత్రమే పనులు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి బీమా కల్పనతో పాటు కష్ట కాలంలో ఆర్థిక సహాయం అందచేస్తున్నామన్న నేతల మాటలు నీటి మూటలేనని మామిడి వెంకటలక్ష్మి విషయంలో మరోసారి రుజువైంది. -
బ్యాంకు, రియాల్టీలకు ఉర్జిత్ షాక్!
పెద్ద నోట్ల రద్దు అనంతరం వెలువరించే మొదటిపాలసీపై భారీగా ఆశలు పెట్టుకున్న రేట్ సెన్సిటివ్ రంగాల షేర్లకు ఆర్బీఐ షాకిచ్చింది. కీలక వడ్డీరేట్లు రెపోను, రివర్స్ రెపోను యథాతథంగా ఉంచుతున్నట్టు ప్రకటించడంతో ఆ రంగాల షేర్లన్నీ కుప్పకూలాయి. ముఖ్యంగా బ్యాంకు షేర్లలో కొనసాగుతున్న లాభాలన్నీ ఈ ప్రకటనతో తుడిచిపెట్టుకుపోయాయి. ఆర్బీఐ పాలసీ ప్రకటన ముందు వరకు లాభాల్లో నడిచిన కెనరా బ్యాంకు, ఐడిబీఐ, ఓబీసీ, పీఎన్బీ, కొటక్ మహింద్రా, సిండికేట్, యూనియన్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా, ఎస్బీఐలు నష్టాల్లోకి జారుకున్నాయి. వీటిలో అత్యధికంగా బ్యాంకు ఆఫ్ బరోడా, ఎస్బీఐలు పడిపోయాయి. దీంతో నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్ 1 శాతం క్షీణించి 17,953 పాయింట్లకు దిగజారింది.. అయితే డిసెంబర్ 10 నుంచి పెంచిన ఇంక్రిమెంటల్ సీఆర్ఆర్ను ఉపసంహరించుకోనున్నట్టు ఆర్బీఐ వెల్లడించింది. మరోవైపు రియల్ ఎస్టేట్ సెక్టార్ షేర్లు హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్, డీఎల్ఎఫ్, గోద్రెజ్ ప్రాపర్టీస్ 1శాతం నుంచి 3 శాతం వరకు పడిపోయాయి. అయితే నిఫ్టీ ఆటో ఇండెక్స్ మాత్రం ఆర్బీఐ ప్రకటనకు తన లాభాలను చేజార్చుకోలేదు. ఈ ఇండెక్స్ 0.56 శాతం లాభాల్లోనే నడుస్తోంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం నిఫ్టీ రియాల్టీ(16శాతం), నిఫ్టీ ఆటో(11శాతం), నిఫ్టీ బ్యాంకు(5.5శాతం)లు పడిపోయాయి. కాగ, ఆర్బీఐ నేడు వెలువరించిన పాలసీ సమీక్షలో రెపోను 6.25గా, రివర్స్ రెపోను 5.75గా ఉంచుతున్నట్టు ప్రకటించింది. ఈ ప్రకటన మార్కెట్లన్నీ దెబ్బకొట్టింది. -
బేరియాట్రిక్ సర్జరీకీ ఓ పాలసీ..
మీ ఎత్తు అయిదడుగుల ఆరంగుళాలు.. బరువు 120 కేజీల పైనే ఉందా? మీ సమాధానం అవును అయితే.. దీన్ని కచ్చితంగా చదవాల్సిందే. ఒకవేళ మీ ఎత్తూ, బరువూ గణాంకాలు దాదాపు ఇవే కాకపోయినా.. ఊబకాయం ఉన్న వారికి సైతం ఇది ఉపయోగకరమైనదే. ఎందుకంటే అధిక బరువున్న వారికి డయాబెటిస్ మెలిటస్ టైప్ 2 వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ తరహా మధుమేహం వచ్చిన వారి శరీరం ఇన్సులిన్ను సరిగ్గా వినియోగించుకోలేదు. పెపైచ్చు.. చికిత్సకూ ఇది ఓ పట్టాన లొంగదు. చివరికి రెటీనా, గుండె, మూత్రపిండాల సమస్యలకు కూడా దారితీసే ప్రమాదముంది. ఇది కాకుండా అధిక రక్తపోటు, కొలెస్టరాల్ లాంటివి ఉంటే మరిన్ని సమస్యలు చుట్టుముట్టక తప్పదు. వీటి చికిత్స ఖర్చులూ అసాధారణంగా ఉంటాయి. పరిస్థితిని బట్టి కేవలం మధుమేహం చికిత్స ఖర్చే నెలకు రూ.5,000-9,000 స్థాయిలో ఉంటోంది. డయాబెటిస్కి గుండె, కిడ్నీల సమస్యలూ తోడైతే చికిత్స వ్యయాలు నెలకు రూ. 20,000 పైనే కావొచ్చు. ఇవన్నీ అధిక బరువు వల్ల వచ్చే అదనపు సమస్యలే. అలాగని, దీని గురించి మరీ బెంగపడనక్కర్లేదు. ఎందుకంటే.. గణనీయంగా బరువును తగ్గించే బేరియాట్రిక్ సర్జరీ లాంటివి అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం. ఈ విధానంలో శస్త్రచికిత్సతో ఉదర పరిమాణం తగ్గించడం ద్వారా తీసుకునే ఆహార పరిమాణాన్ని నియంత్రణలోకి తెస్తారు. ఫలితంగా బరువు అదుపులోకి వస్తుంది. కానీ ఇలాంటి సర్జరీలు బాగా ఖర్చుతో కూడుకున్నవి, బీమా కవరేజీ లేకపోవడం మొదలైన కారణాల వల్ల దేశీయంగా వీటివైపు వెళ్లే వారి సంఖ్య తక్కువగానే ఉంటోంది. కవరేజీ ఇలా.. ప్రస్తుతం సమస్య తీవ్రత, సంద ర్భం, కేసును బట్టి కొన్ని బీమా కంపెనీలు బేరియాట్రిక్ సర్జరీకి కూడా కవరేజీ ఇవ్వడం మొదలుపెట్టాయి. ఈ శస్త్రచికిత్సపై ఆసక్తిగా ఉన్న వారికి ఇది శుభపరిణామమే. అయితే, సదరు పాలసీ తీసుకునే ముందు ప్రి, పోస్ట్ హాస్పిటలైజేషన్ వ్యయాలకు కూడా కవరేజీ ఇచ్చే పాలసీలను ఎంచుకోవడం మంచిది. అలాగే, క్యాష్లెస్ ప్రాతిపదికన బేరియాట్రిక్ సర్జరీ క్లెయిమ్కు కవరేజీ ఇచ్చే వాటిని చూసుకోవాలి. దీనివల్ల మళ్లీ మన జేబునుంచి అదనంగా చెల్లించాల్సి వస్తుందేమోనన్న భయాల్లేకుండా, సర్జరీకి మానసికంగా సిద్ధం కావొచ్చు. సాధారణంగా బేరియాట్రిక్ సర్జరీ కింద గ్యాస్ట్రిక్ బైపాస్, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, అడ్జస్టబుల్ గ్యాస్ట్రిక్ బ్యాండ్ మొదలైనవి ఉంటున్నాయి. శరీరంపై మరీ ఎక్కువగా కోతలు, కుట్లు లేకుండా చిన్న గాటు మాత్రమే పడేలా ల్యాప్రోస్కోపిక్ సర్జరీ విధానంలో ఈ శస్త్రచికిత్స చేస్తుంటారు. అయితే, ఏ ప్రక్రియను అనుసరించి సర్జరీ చేశారు, ఆస్పత్రి వంటి అంశాల మీద చికిత్స వ్యయం ఆధారపడి ఉంటుంది. దేశీయంగా సగటున ఈ చికిత్స వ్యయాలు సుమారు రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల దాకా ఉంటున్నాయి. జీవితాంతం మధుమేహం, గుండె జబ్బులు, కొలెస్టరాల్, రక్త పోటు మొదలైన వాటిని భరిస్తూ, వాటిక య్యే చికిత్స వ్యయాలతో పోలిస్తే ఈ వన్టైమ్ ఖర్చు వల్ల ప్రయోజనాలు గణనీయంగానే ఉంటాయని చెప్పవచ్చు. పైగా మెరుగైన జీవితం గడిపేందుకు ఇది తోడ్పడగలదు. ఊబకాయం ఉన్న వారు సాధ్యమైనంత వరకు చిన్న వయస్సులోనే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే.. భవిష్యత్లో బేరియాట్రిక్ సర్జరీ వంటి శస్త్రచికిత్స వ్యయాలు, ప్రీమియాల భారం తగ్గించుకోవచ్చు. కాబట్టి సరైన పాలసీ ఎంచుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగించండి. -
ఎయిర్పోర్ట్స్ విభాగంలో6 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్లు!
న్యూఢిల్లీ: ఎయిర్పోర్ట్స్ విభాగంలోకి వచ్చే ఐదేళ్ల కాలంలో దాదాపు 6 బిలియన్ డాలర్లమేర (దాదాపు రూ.40,000 కోట్లు) పెట్టుబడులు రావొచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇదే సమయంలో విమాన ప్రయాణికులు సంఖ్యలో 30 శాతం వృద్ధి నమోదు కావొచ్చని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్.ఎన్.చౌబే అభిప్రాయపడ్డారు. అపార వృద్ధి అవకాశాలున్న దేశీ విమానయాన రంగాన్ని బలోపేతం చేయడం కోసం కేంద్రం ఇటీవల కొత్త పౌరవిమానయాన పాలసీని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే వృద్ధికి నోచుకోని, నిరుపయోగంగా ఉన్న విమానాశ్రయాల అభివృద్ధి సహా రీజినల్ ఎయిర్ కనెక్టివిటీని పెంచడానికి తగిన చర్యలు తీసుకుంది. ఆయన ఇక్కడ జరిగిన జీఏడీ ఆసియా కార్యక్రమ ప్రారంభోత్సవంలో మాట్లాడారు. వచ్చే పెట్టుబడుల్లో 1 బిలియన్ డాలర్లను ఎయిర్పోర్ట్ల పునరుద్ధరణకు ఉపయోగిస్తామని చెప్పారు. ఇక ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు చెందిన ఎయిర్డ్రోమ్స్ అప్గ్రేడింగ్కు 3 బిలియన్ డాలర్లను వినియోగిస్తామన్నారు. కాగా గతేడాది జనవరి-జూలై మధ్య కాలంతో పోలిస్తే ఈ ఏడాది అదే సమయంలో దేశీ విమాన ప్రయాణికులు సంఖ్య 23 శాతం పెరిగిన విషయం తెలిసిందే. ఇక జూలై నెలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే.. ప్రయాణికుల రద్దీ అత్యధికంగా 26 శాతంమేర ఎగసింది. -
ఆసుపత్రిని, డాక్టర్ని మార్చినట్టే...హెల్త్ పాలసీనీ మార్చేయొచ్చు!
♦ బీమా పోర్టబిలిటీతో కంపెనీ మారే అవకాశం ♦ అదే కంపెనీలో వేరే పాలసీకి కూడా మారొచ్చు ♦ కొన్ని పరిమితులతో ప్రయోజనాలన్నీ బదలాయింపు ♦ పాత పాలసీ ప్రీమియానికి 45 రోజుల గడువుంటే చాలు ♦ 15 రోజుల్లోపు పోర్టబిలిటీపై కొత్త కంపెనీ తేల్చాల్సిందే మారిన పరిస్థితుల్లో ఎప్పుడు ఏ కారణంతో ఆసుపత్రి పాలవ్వాల్సి వస్తుందో చెప్పలేం. ఒకవేళ ఆసుపత్రిలో చేరటమంటూ జరిగితే... ఎంత బిల్లు చెల్లించాల్సి వస్తుందో కూడా ఊహించటం కూడా కష్టం. అందుకని ప్రతి ఒక్కరికీ ఇపుడు ఆరోగ్య బీమా ఉండి తీరాల్సిందే. కాకపోతే ఇక్కడో విషయం. ఆసుపత్రిలో చేరాక సరైన సేవలు లభించకపోవటమో, మంచి వైద్యులు లేకపోవటమో జరిగిందనుకోండి!! ఏం చేస్తాం? ఆసుపత్రిని మార్చేస్తాం. మరి ఎన్నో అంచనాలతో బీమా పాలసీ తీసుకున్నాక ప్రీమియం, సదుపాయాలు, సేవల విషయంలో అసంతృప్తి ఎదురైతే..? సర్దుకుపోవాల్సిన అవసరం అక్కడ కూడా లేదు. ఇన్సూరెన్స్ పోర్టబిలిటీతో మంచి సేవలందిస్తున్న మరో పాలసీకి, లేదంటే మరో బీమా కంపెనీకి ఎంచక్కా మారిపోవచ్చు. దానిపై అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం... - సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం బీమా పోర్టబిలిటీతో అన్నిటికన్నా ప్రధానమైన ప్రయోజనమేంటంటే... ప్రస్తుత పాలసీ ద్వారా అందుతున్న ప్రయోజనాలు, దాన్లోని మినహాయింపులు అన్నీ పోర్టబిలిటీ ద్వారా వేరే పాలసీకి బదలాయించుకునే హక్కు పాలసీదారులకుంటుంది. ఉదాహరణకు ఒక పాలసీ తీసుకున్నాక మూడేళ్లు కొనసాగించిన తరవాతే ముందు నుంచీ ఉన్న కొన్నిరకాల వ్యాధులకు కవరేజీ లభిస్తుంది. మరి పాలసీ తీసుకున్న రెండేళ్లకే అది నచ్చక పాలసీ పోర్టబిలిటీకి దరఖాస్తు చేసుకున్నారనుకోండి!! కొత్త పాలసీలో మరో మూడేళ్లు కొనసాగాల్సిన అవసరం లేదు. ఒక ఏడాది కొనసాగితే మూడేళ్లూ పూర్తవుతాయి. ఇక మూడేళ్లు దాటిన తరవాత వేరే పాలసీకో, కంపెనీకో బదిలీ అయితే... ముందు నుంచీ ఉన్న వ్యాధులకు అక్కడ ఆరంభం నుంచీ కవరేజీ లభిస్తుంది. అంటే బీమా కాలం కూడా బదిలీ అవుతుందన్న మాట. ఏ పాలసీలకు పోర్టబిలిటీ..? అన్ని వ్యక్తిగత, ఫ్యామిలీ ఫ్లోటర్, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలకు పోర్టబిలిటీ సదుపాయం ఉంది. అయితే, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్లో పోర్టబిలిటీ అన్నది పూర్తి స్థాయిలో ఉండదు. అదే బీమా కంపెనీ అందిస్తున్న వ్యక్తిగత ప్లాన్కు మాత్రం మారిపోవచ్చు. పోర్టబిలిటీ ఎప్పుడు కావాలి..! ⇔ ప్రస్తుత ఆరోగ్య బీమా కంపెనీ సేవలు, చెల్లింపుల చరిత్ర సంతృప్తికరంగా లేకపోయినా... ⇔ప్రస్తుత కవరేజీ అన్ని వ్యాధులకూ సరిపోదని భావించి కవరేజీ పెంచుకోవాలని భావించారనుకోండి. కోరుకున్న మేర కవరేజీ పెంచేందుకు ప్రస్తుత బీమా కంపెనీ అంగీకరించకపోతే.. ⇔ ప్రస్తుత ఆరోగ్య బీమా పాలసీ కంటే అధిక ప్రయోజనాలతో కాస్త తక్కువ ప్రీమియానికే మరో మంచి పాలసీ అందుబాటులో ఉంటే... ముందుగా తెలియజేయాలి... పోర్టబిలిటీ ద్వారా పాలసీ మార్చుకోవాలని అనుకుంటే... ప్రస్తుత పాలసీ ప్రీమియం చెల్లించడానికి కనీస గడువు 45 రోజులుండాలి. ఈ గడువు 60 రోజులకు మించకూడదు. ఆ లోపే దరఖాస్తు చేసుకోవాలి. మిగిలిన కాల వ్యవధిలో పోర్టబిలిటీకి అనుమతించరు. దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచి ప్రీమియం చెల్లించాల్సిన తేదీకి మధ్య వ్యవధి 45 రోజుల కంటే తక్కువగా ఉంటే పోర్టబిలిటీ దరఖాస్తు తిరస్కరణకు గురవుతుంది. వ్యక్తిగత పాలసీ టు ఫ్లోటర్ పాలసీ ప్రస్తుతం ఒంటరి వ్యక్తిగా ఇండివిడ్యువల్ పాలసీ తీసుకుని ఉన్నారనుకోండి. త్వరలో వైవాహిక జీవితంలోకి ప్రవేశించబోతున్నారు!!. అలాంటప్పుడు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ అవసరం. ఇండివిడ్యువల్ పాలసీ ఆ అవసరాలను తీర్చలేదు కనుక పోర్టబిలిటీ ద్వారా ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీకి మారిపోవచ్చు. అయితే, వ్యక్తిగత పాలసీలో అప్పటి వరకు ఉన్న ప్రయోజనాలు ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీకి బదిలీ కావు. పోర్టబిలిటీ పెండింగ్లో ఉంటే? ప్రస్తుత పాలసీ ప్రీమి యం చెల్లింపు తేదీకి 45 రోజుల ముందే పోర్టబిలిటీకి దరఖాస్తు చేసుకున్నారు. కానీ, కొత్త కంపెనీ దాన్నింకా ఆమోదించలేదు. మరోవంకేమో ప్రస్తుత పాలసీ చెల్లింపు గడువు సమీపిస్తోంది. అప్పుడు ప్రస్తుత పాలసీ గడువును పొడిగించాలని కోరవచ్చు. అయితే, ఈ పెంపు 30 రోజుల వరకే పరిమితం. ప్రీమియం కూడా 30 రోజులకే వసూలు చేస్తారు. ఒకవేళ ఈ 30 రోజుల్లో ఏదైనా అనుకోని సందర్భం ఎదురై క్లెయిమ్ అవసరం ఏర్పడితే నిబంధనల మేరకు కంపెనీ పరిహారం చెల్లిస్తుంది. అయితే, అప్పుడు పూర్తి ఏడాదికి ప్రీమియం చెల్లించి, ఆ ఏడాదంతా అదే కంపెనీలో కొనసాగాల్సి ఉంటుంది. కావాలంటే ఏడాది తర్వాత పోర్టబిలిటీకి మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త కంపెనీ పోర్టబిలిటీ దరఖాస్తును ఆమోదించే వరకూ ప్రస్తుత పాలసీ రద్దు కాదు. ఇలా అయితే పోర్టబిలిటీకి అడ్డంకే... ప్రస్తుతం కొనసాగిస్తున్న పాలసీకి ప్రీమియం సకాలంలో చెల్లించడంలో విఫలమైన సందర్భాలున్నాయనుకోండి. అపుడు పోర్టబిలిటీ కష్టమే. అంటే సాధారణ చెల్లింపు తేదీతోపాటు, 30 రోజుల గ్రేస్ పీరియడ్ లోపల కూడా చెల్లించడంలో విఫలమైతే (బ్రేక్) పోర్టబిలిటీకి అనర్హుల కిందే లెక్క.