ఈ ఏడాదే చిప్‌ ప్లాంటు నిర్మాణం షురూ | Government approves 3 semiconductor units in India | Sakshi
Sakshi News home page

ఈ ఏడాదే చిప్‌ ప్లాంటు నిర్మాణం షురూ

Mar 1 2024 4:28 AM | Updated on Mar 1 2024 4:28 AM

Government approves 3 semiconductor units in India - Sakshi

టాటా ఎల్రక్టానిక్స్‌ వెల్లడి

న్యూఢిల్లీ: పీఎస్‌ఎంసీ భాగస్వామ్యంతో గుజరాత్‌లోని ధోలెరాలో తలపెట్టిన రూ. 91,000 కోట్ల సెమీకండక్టర్‌ ఫ్యాబ్రికేషన్‌ మెగా యూనిట్‌ నిర్మాణం ఈ ఏడాదే ప్రారంభమయ్యే అవకాశం ఉందని టాటా ఎల్రక్టానిక్స్‌ తెలిపింది. దీనితో ఆ ప్రాంతంలో 20,000 పైచిలుకు ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల కల్పన జరగగలదని పేర్కొంది.

సెమీకండక్టర్‌ ఫ్యాబ్రికేషన్‌ విభాగంలో భారత్‌ ఎంట్రీకి సారథ్యం వహించగలగడం తమకెంతో గర్వకారణమని టాటా ఎల్రక్టానిక్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సెమీకండక్టర్ల ప్లాంటులో పవర్‌ మేనేజ్‌మెంట్‌ ఐసీలు, డిస్‌ప్లే డ్రైవర్లు, మైక్రోకంట్రోలర్లు మొదలైన వాటికి అవసరమైన చిప్స్‌ తయారు చేయనున్నారు. నెలకు సుమారు 50,000 వేఫర్ల తయారీ సామర్ధ్యంతో ప్లాంటును ఏర్పాటు
చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement