MEIL group company bags Rs 500 crore order from defence ministry - Sakshi

మేఘా కంపెనీకి రూ.500 కోట్ల ఆర్డర్‌

Jun 16 2023 7:27 AM | Updated on Jun 16 2023 11:06 AM

MEIL 500 crore order for Megha company - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మేఘ ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ (ఎంఈఐఎల్‌) అనుబంధ కంపెనీ ఐకామ్‌ టెలి తాజాగా భారత రక్షణ శాఖ నుంచి రూ. 500 కోట్ల ఆర్డర్‌ చేజిక్కించుకుంది. ఇందులో భాగంగా 5/7.5 టన్నుల రేడియో రిలే కమ్యూనికేషన్‌ ఎక్విప్‌మెంట్‌ కంటైనర్స్‌ 1,035 యూనిట్లు సరఫరా చేయనుంది. రక్షణ శాఖతో ఈ మేరకు ఒప్పందం కుదిరిందని ఐకామ్‌ టెలి గురువారం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే డెలివరీలు ప్రారంభం అవుతాయని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement